Saturday, 9 January 2021

11-01-2021

Jai Mata Lakshmi ki jai

 మధురిమల ... స్థితి
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

చిరునగవుల  శ్రీమతి
చిర్రు బుర్రు శ్రీపతి
సమ్మోహ చలనస్థితి
కలయిక సృష్టి
స్థితి  
 
మనసు రమణీయ ప్రకృతి
చీకటి వెలుగుల ప్రగతి
హృదయ ముందున్న జాగృతి
రస రమ్యమైన ఆకృతి

పద్యముకు ప్రాసయతి
గద్యముకు వచన యతి
మోహమునకు భజనయతి
తాపముకు దేహమతి

తప్పులనే తెల్పు రీతి
ఓప్పులను మన్ననే గతి  
నొప్పులను భరించు రీతి  
ముప్పులు రాకండ గతి
 
శ్రమ గూర్చి తెలుపు శ్రీమతి ..
ఫలితము కోరని స్థితి ..
కష్ట పడుటే పరిస్థితి ..
విజయం తధ్యమగు రీతి ..

తినుపదార్ధంతయు కలితి
మనిషి మనసుచూడ వెలితి
ధనముకొరకుచెలిమి కలితి
ప్రేమకు లేకుండు వెలితి
 
--(())--


మహాభారతం ఆదిపర్వం 9వ భాగం
 !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!?!!!!!!!
           🌼🙏🙏🙏🌼
      చేది రాజ్యాన్ని పాలిస్తున్న వసువు ఒక నాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న మునులను చూసి ముచ్చట పడి తాను కూడా తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అది చూసిన ఇంద్రుడు రాజా ! రాజ్యపాలన చేయవలసిన నీకు ఈ తపసేమిటి నాతో స్నేహం చేస్తే నేను నీకు ఓ దివ్య విమానమును ఇస్తాను. దానితో ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు, యుద్ధంలో ఏ ఆయుధంతో దెబ్బ తగలకుండా చేసే ఎప్పటికి వాడని వైజయంతి అనే పూల మాలనూ,సర్వకోరికలను తీర్చి రక్షించే సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి (వెదురు కర్ర)ను ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్ర లోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించ సాగాడు. చేది రాజ్యానికి సమీపంలో కోలాహలము అనే పర్వతాన్ని ఆనుకుని శుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. శుక్తిమతి కోలాహలునికి జన్మించిన గిరిక అనే ఆడపిల్లను వసుపదుడు అనే మగ పిల్ల వాడిని శుక్తిమతి వసువుకు బహూకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేసాడు. ఒక రోజు వేటకు వెళ్ళిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్య పతనం జరుగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్ధమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మ శాప వశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న"  అద్రిక " అనే అప్సరస నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. ఒకనాడా చేప దాశరాజు అనే పల్లీయుడికి  లభించింది . జాలరి వారు ఆ పెద్ద చేపను కోసి చూడగా అందులో నుండి ఒక బాలుడు ఒక బాలిక ఆవిర్భవించారు ప్రసవానంతరం శాపవిమోచన చెప్పబడి ఉండటం వల్ల ...ఆ చేప దివ్యనారీగా మారి దివి కెగసి పోయింది. ఆ బాలబాలికలను వసురాజు కు కానుకగా దాశరాజు సమర్పించారు .వసురాజు మగ శిశువు ను గ్రహించి స్త్రీ శిశువును దాశరాజు కు ఇచ్చేశాడు ఆ మగ శిశువు వసురాజు ఇంట్లో పెరిగి మత్స్య దేశాధీశుడు అనే  పేరుపొందాడు ... ఆడ శిశువు మాత్రం దాసరాజు ఇంట్లో సత్యవతి అనే నామధేయం తో పెరుగుతూ ఉంది. పెంపుడు తండ్రికి చేదోడువాదోడుగా - వేట లోనూ... పడవ నడపడం లోనూశిక్షణ పొంది అలరారుతోంది . చేప కడుపులో పుట్టడం వలన ఆమె దేహం నుండి చేపల వాసన వస్తూ ఉండడం వలన ఆమె మత్స్యగంధి అని కూడా పిలువబడింది.
ఒక నాడు వశిష్ట మహర్షి యొక్క మనవడైన పరాశరుడు యమునా తీరానికి వచ్చి నావ కోసం ఎదురు చూడ సాగాడు.( వశిష్ట మహర్షి యొక్క కుమారుడు శక్తి మహర్షి. అయితే వశిష్టుని శాపానికి గురియై రాక్షస రూపం పొందిన ఇక్ష్వాకు వంశము  రాజు కల్మాషపాదుడు అనేవాడు  వశిష్ఠుడి మీద పగ పెంచుకొని అతని వంద మంది కుమారులను బక్షించాడు ఆ వందమంది కుమారులలో శక్తి మహర్షి ఒకరు. ఈయన కుమారుడే పరాశర మహర్షి. ఈయన తన తాతగారైన వశిష్టుని నుండి తన తండ్రి ఒక రాక్షసుని వలన భక్షించ బడ్డాడు అని తెలుసుకుని రాక్షసులపై పగబట్టి..... రాక్షసుల అనేవారు ఉండకూడదని ఒక  మారణహోమం చేశాడు ఆ హోమం వలన ఎంతో మంది రాక్షసులు చనిపోయారు వశిష్ఠుడు అతనిని శాంతింపజేశారు శాంతి పొందిన పరాశరుడు తపస్సు కోసం హిమాచలం వెడుతూ గంగాతీరానికి వస్తాడు. ఈ మహర్షి తన తండ్రి అయిన వశిష్టుని అంతటివాడు ఈయన దయవల్లనే జ్యోతిష్యశాస్త్రం ప్రఖ్యాతిగాంచింది. ఇతనిని జ్యోతిష్య పితామహుడు అని పెద్దలు చెబుతారు పరాశర హోరా అనేటువంటి గొప్ప గ్రంథాన్ని ఈయన రాశాడు. పరాశరసంహిత మొదలైన ఎన్నో గ్రంథాలు ఈయన రాసినవి ఉన్నవి... సరే పరాశరమహర్షి యమునా తీరంలో నావ కోసం ఎదురుచూస్తున్నాడు అటు తర్వాత) ఆ సమయానికి సత్యవతి ఆయన దృష్టిలో పడింది ఆమె యందు మనస్సు కలిగింది ......
.ఆశ్చర్యం....అసాధారణమైన తన కామ ప్రకోపానికి పరాశరుడు ఆశ్చర్యపోయి
పరమేశ్వరుని ఇలా తలచుకున్నాడు ......
స్వామి !
నేను నియమ జీవితం గడుపుతున్నాను
ఇలా జీవితం గడపడం లో ....
నా స్వయం శక్తి ఉంది అనుకున్నాను. .....
కానీ ఇప్పుడు తెలిసింది ...
నన్ను కూడా ఆడించే పరమాత్మ నీవు ఉన్నావు........
జ్ఞాపకం వచ్చింది నన్ను మన్నించు
హే సూత్రధారి !  .......
నీ నాటకం లో నా పాత్ర ఏమిటో.....
 తెలిసి వచ్చింది ......🌸👃
ఆ కన్య పై  నా మనసు పోయింది ....
ఇది నీ సంకల్పం...
 ఇది నా కోరిక అనే అజ్ఞానాన్ని.......
 నా నుండి దూరం చెయ్...
 హే విష్ణో....పరమాత్మ    .......
ఏకీభూతం గా.ఉన్న వేదరాశిని నేను విభజించ లేక పోయాను.
నా సంతానంగా నీవు జన్మించి లోకానికి మహోపకారం చేయవలసిందిగా మనవి..... అని పరమేశ్వరుడిని ధ్యానించాడు...... అటు తర్వాత
తనకు తెలియకుండానే తన పాత్రలో లీనమై పోయాడు
తనను అంతగా చెలింప జేసిన ఆ యువతి ఎవరా అని దివ్యదృష్టితో చూసి.... ఆమె ఒక  వీర సంజాత గా గుర్తించి సంతోషించాడు. తన మనసును ఆ మత్స్యగంధి కి  చెప్పగా ఆమె అంగీకరించింది కానీ చాలా శరతు పెట్టింది.
" ఆ గట్టున జనం అసలు తున్నారు చూస్తారేమో" ఉంది మంచు పొర సృష్టించాడు మహర్షి....
 " పగటిపూట సంగమం మంచిది కాదు కదా " అని నవ్వింది ఆబాల......
 మసక చీకట్లు కల్పించడా...ఋషి...
 " నా కన్యత్వం చెడిపోతుంది కదా ?! ...అమాయకంగా... చూసింది....
కన్యాత్వం చెడకుండా వరమిచ్చాడు తాపసి
" అయ్యో !నా ఒళ్ళంతా చేపల కంపు - మీరేమో బామ్మర్లు... ఎలా వస్తావు "  చిలిపి చూపులతో పలికింది...
తాకవచ్చు లే మోహనాంగి నీవు రాచకన్యవే కానీ బేస్త పడచువు  కాదు లే...అంటూ ఆమెను కౌగలించి ఈ క్షణం నుండి నీ చేపల కంపు మాయం అని ఆమెతో కలిసి పోయాడు తాపసి.....
యమునా నది నడుమ ఇసుకతిన్నెలపై ముని కల్పితమైన మసక చీకట్లో చిరు కాంతుల మధ్య అనుపమాన జ్యోతిశ్శాస్త్ర నిర్మాతలలో ఒకరైన పరాశరుడు అద్భుతమైన ముహూర్తంలో సత్యవతితో ఆ దాన కార్యక్రమం నిర్వర్తించాడు .....
తత్ఫలితంగాసత్యవతి సద్యోగర్భాన పురుష శిశువు  ప్రభవించినది ... పుట్టీ పుట్టగానే ఆ శిశువు12 సంవత్సరాల వయసుగల వాడిగాపెరిగిపోయాడు..... నీలి వర్ణపు మేని డాలుతో పుట్టిన ఆ నిసుగు కృష్ణ నాము డయ్యాడు... నది ద్వీపంలో ప్రభవించడంవల్ల ద్వైపాయన నామ మిళుతుడై  " కృష్ణద్వైపాయనుడు " గా ఖ్యాతి వహించాడు.
 పరాశరుడి వీర్యం వలన ఆ గర్భ జ్ఞానిగా అవతరించాడు. అవతరించిన ఆ మహాపురుషుడు తల్లికి ప్రణామములు ఆచరించాడు నీవెప్పుడూ తలచిన  సరే ..... అప్పుడే వచ్చి నీ దర్శనం చేసుకుంటాను.... అంతవరకు నన్ను తపస్సు కు  అనుగ్రహించు అని ప్రార్థించి తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్ళిపోయాడు.....
మంచు పొరలు తొలగాయి చీకటి తెరలు కరిగాయి  సత్యవతి పురుషుడినీ - తన పుత్రుడిని కూడా వీడ్కొలిపి..... తాను ఇంటికి వెళ్ళిపోయింది.
పరాశరుని అనుగ్రహం వలన ఆమెనెవరు శంకించి  లేదు... కానీ  ఆమె మేని సుగంధాల కు మాత్రం ఆశ్చర్య పోయారు. ఇది ఋషి ప్రసాదం అని చెప్పింది ఆమె.ఎప్పటిలా తాను మ వారితో పలిసి జీవనం సాగించింది ఆమె తన వారితో జీవించ సాగింది.ఆమె తనూ పరిమళం వల్ల ఆమెకు గంధవతి అని యోజనగంధి అనే పేర్లు కలిగాయి.
అప్పుడలా తల్లిని విడిచి వెళ్ళిన కృష్ణద్వైపాయనుడు తపోదీక్ష నెరపి లోకహితార్థం ....ఏకంగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు. అష్టాదశ పురాణాలను. ఆవిష్కరించాడు... ఇప్పుడు చెప్పబోతున్న మహాభారతాన్ని ప్రకటించాడు .జనమేజయ మహారాజా ! అత్యంత పవిత్రమైన మీ కౌరవ  వంశం ....పాండవులు మొదలైన అపూర్వ రత్న సంభరితమై అలరారుతోంది. వినిపిస్తాను వినండి.... అని కథ చెప్పడం మొదలుపెట్టాడు వైశంపాయనుడు.
మిత్రులందరికీ శుభసాయంత్రం
 నమస్కారములు    



రాధ మధురిమల పలుకు

మాయను చూప వద్దు
మనసును మరవ వద్దు
చులకన చేయ వద్దు
మాటను మార్చ వద్దు.....మాధవా.... ఓ మాధవా..

మద్దు లొలికే చిలక
మనసు దోచె మోలక
హృదయమున్నా పలక
నన్ను మరువకే ఇక........రాధా.... ఓ రాధా

వేణువు ఊదు మాధవా
నృత్య మాడెద మాధవా
అను రాగంతొ మాధవా
అలక లొద్దు మాధవా.... మాధవా.....మాధవా

ఎఱ్ఱ పెదవికి ముద్దు
తీపి మిఠాయి ముద్దు
పెదవి పెదవికి ముద్దు
ముద్దుతో పొందు ముద్దు... రాధా....రాధా

ఉన్నదున్నది చెప్పనా
లేనిదన్నది చెప్పనా
ఉన్న లేదని చప్పనా
ఉన్నదందుకో నననా.....మాధవా.....మాధవా

కళ్ళలో ఉన్నావే
కధలన్నీ చెప్పవే
కళలన్నీ తెల్పవే
హాయిని అందించవే....రాధా......రాధా

ఎట నుండి వీచెనో
మృధుల సమీరమ్మూ
మధురంగ ఉండెనో
మమతల హృదయమ్మూ...... మాధవా......మాధవా

నడుముపై నర్తించే
నాజూకు జడకుప్పెలు
గుబ్బల ఊపులుంచే
హృదయమే దోచు చూపులు.....రాధా...రాధా.

లోకాలన్ని దాచుకొని
నీబొజ్జలో ఉంచుకొని
ప్రేమయంతా పంచమని
మనసు దోచి ముద్దు అనే ..... మాధవా..మాధవా

--(())--
 


 మధురిమల ..సంక్రాంతి
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సంక్రాంతి వచ్చింది
సంబరం తెచ్చింది
స్నేహన్ని  నిల్పింది
బిడ్డల్ని కల్పింది

కష్టాలు ఆపింది
ఇష్టాలు చూపింది
బంధువులు కలిపింది
కలసియె బతకమంది

తగు ఓర్పు నేర్పింది
ధైర్యాన్ని నేర్పింది
అడుగులు వేయమంది
ఆనందం ఇదంది

ప్రకృతి గాలి పంచింది
ధరణి పులకరించింది
అల్లుల్ల పండగైంది
కోడీ పందా లంది

గగన సుందర మైనది
పక్షుల కలకల మైంది
కొత్త బట్టల కధయిది
పాలు పొంగిచ్చ మంది

నమ్మకం బతుకంది
విశ్వాసం చూపేది
బతుకులకు కళైంది
కలల పండు గైనది

మనలోని మాధుర్య మిది
ప్రతి  హృదయ కదిలికే ఇది
మన మంచి సందేశ మిది
అంతట వెలుగు పంచేది

రంగుల ముగ్గులంది
సంక్రాంతి సొగసంది
కమ్మని పంటలంది
మధురిమ పండ గైంది

సుఖాలను పంచాలంది
సోమరిగా ను వద్దంది
కష్టాల్కి లొంగద్దంది
ఇష్టం ప్రేమ అవుతుంది

--(())--

ఓం శ్రీ రాం - శ్రీ మాత్రేనమ:
ఓ శ్రీమతి ఇది ప్రేమా - సాధింపా 

ఏమండోయి మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి అన్నీ తలుపులు వేసారో లేదో చూడండి, టీవి ప్లగ్ తీసేయండి, మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకొచ్చాను, మీరు కష్ట పడతారని ఆపని చెప్పలేదు. అన్న మాటలకు భర్త మాధవ్ అట్లాగే నీవు ఏమిచెప్తే అదే చేయాలిగా, ఒక్కటి ఆటో ఇటో అయ్యేందనుకో ఇక పస్తే నాకు, ఏమిటండి ఆమాటలు మనమే మన్న చిన్న పిల్లలమా మనవళ్లు ఎత్తుకొనే వయసు మనది. ఆమ్మో ఆపని మాత్రం నాకు పెట్టకు, నాకు అంత ఓపిక లేదు, పిల్లలను మోయటం, వాళ్ళ ఏడుపుని తగ్గించడం నావళ్ల కాదు, ఇది నాకు చాలా కష్టమైన పని, నీవు చెప్పిన పనులే చేయుట చాలా తేలిక అంటూ మంచం చేరాడు.

ఏమిటో అప్పుడే అలసి పోయిన్ది,  ఉషోదయం నుండి బొంగరం తిరిగినట్లు తిరుగుతూ, ఎవరో తాడు పెట్టి ఆడించి నట్లుగా ప్రతిదీ శుభ్రం చేస్తూ ఇంటిని అందంగా ఉంచాలి అని పదే పదే అరుస్తూ, చెప్పులు సర్దుతూ పడిన మట్టిని తుడుస్తూ, అన్నీ ప్రత్యేకంగా ఉండాలని సర్దుతూ ఉంటుంది శ్రీమతి రాధ . భార్యని మెచ్చుకుంటున్నాడు మాధవ్ .

అప్పుడే ఏవండీ ఏమిటి ఆలోచిస్తున్నారు నన్ను గట్టిగా పట్టుకోండి, నాకు పాడు కలలు వస్తున్నాయి, భయంగా ఉన్నది అంటూ కౌగలించుకొని పడుకున్నది. ఇదండీ నిత్య సత్య కాపురం ఎప్పుడు ఏమి జరుగునో ఎవరూ చెప్పలేరు, కానీ శ్రీమతి జరగబోయే వాటిని ఊహించుకుంటూ దానిలో కష్ట నష్టాలు వర్ణించు కుంటూ భాదను సంతోషం వ్యక్త పరుస్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు మేల్కొంటుందో నేను మాత్రం గమనించలేను.

ఒకసారి నేను నవ్వు కుంటూ ఉన్నాను, శ్రీమతి నిద్ర పోతున్నది కదా అని, మేల్కొంటు ఏమిటండి ఆ నవ్వుకు అర్ధం చెప్పండి, మీరు చెపితే గాని నాకు నిద్రరాదు, ఆ ఏమి లేదే మనపెళ్ళి విషయం గుర్తు కొచ్చి నవ్వు కుంటున్నాను, 30 ఏళ్ల తర్వాత ఎం వేషాలేద్దా మను కుంటున్నారు నిద్రపోతూ అన్నది, అమ్మతోడు ఎటువంటి దురాలోచన లేదు, వద్దులేండి మీమీద అమాత్రం నమ్మకం నాకున్నది నాతొ మాట్లాడే టప్పుడు అమ్మతోడులు, ఓట్లు మనమధ్య తేకండి, నవ్వుకు కారణం చెప్పండి చాలు, అసలు విషయం చెప్పనీయకుండా నీవంతు నీవు మాట్లాడు తున్నావు, సరేలేండి ఇక చెప్పండి
             
వినండి నామాట వినండి  ఉన్నారంటే మనసు ఊరుకోదు, మనసులో ఉన్న విషయాన్ని నోటితో కక్కేయండి, అలా కక్కలేదనుకో మనసు వాదనకు గురి అవుతుంది, దీపం చుట్టూ తిరిగే పురుగౌతుంది,    అందుకే  స్త్రీ - పురుషులమధ్య అవగాహనం, మౌనం ఉండాలి తెలుసుకోండి . 

మౌనంగా పొరాడటం అంటే, మాట కట్టేసి మనసుతో సంఘర్షణ పడటమే..అది చాలా కష్టతరమే..వేరెవరితోనో పోరాడటం ఒక ఎత్తు..స్వీయంగా మనసుతో పోరాడటం మరో ఎత్తు..ఇక్కడ మౌనం నెగ్గుతుందా మనసు నెగ్గుతుందా అనే అంశం ఆలోచిస్తే ..ఎటూ తేల్చలేని స్థితి.. అవి రెండూ ఒకరి లో జరగటమే ఈ సంఘర్షణకు కారణం.. ఎక్కువ సార్లు మౌనమే గెలవొచ్చు..మనసు ఓడిపోవడం వెనకాల రహస్యం పెద్దగ ఏమీ లేదు..మనసు మాట ను వినక పోవడమే కొన్నిసార్లు మౌనానికి గెలుపునిస్తుంది.. మౌనంగా ఉండటమే గెలుపు..ఆ గెలుపుకు సహకరించిందే  వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అర్ధం చేసుకోవటం ఎవరి తరం కాదు, కాలాన్ని బట్టి, ఉషోగ్రత బట్టి, ఆకలి బట్టి మౌనం వీడి మనసు అవగాహన అర్ధం చేస్కోవటానికి ప్రతిఒక్కరు ప్రయత్నం చేయటమే మానవజన్మ సార్ధకం, మనసుని బట్టి అర్ధం చేసుకొని ఒకరికొకరు బ్రతకటమే జీవితం. 

ఏమిటండి నవ్వు ఆపేసారు నీమాటలకు నా బుర్ర గిర్రమని తిరిగింది, ఇక నవ్వేక్కడొస్తుంది మౌనం గురించి నిద్రబోతు చెప్పావు, ఇక నాకు నిద్ర వస్తున్నది పడుకుంటా, అదే నేను చెప్పింది గురక పెట్టకుండా మౌనంగా పడుకోండి నాకు నిద్రపట్టదు .. అది ఇట్లాగే ఏమో నాకు తెలియదు ప్రయత్నం చేస్తే సాధింపలేనిది లేదన్నారుగా ప్రయత్నం చేయండి అంటూ నిద్రకు ఉప క్రమించింది రాధ, ఎప్పుడు ఘర్కా వస్తుందో అని భార్యకు భాధ కలిగించ కూడదని తెల్లవార్లూ నిద్రపోకుండా మేల్కొన్నాడు మాధవ్ .         

--(())-- 

సమ్మోహనాల శ్రీ శ్రీ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

డియవేలుగు రచయత
రచయతలో సాంద్రత
సాంద్రత తోను వెన్నెల శ్రీశ్రీ ఈశ్వరా  

రచయితగ మణిపూస
మణిపూస ప్రశంస
ప్రశంసలతొ రచయతగా సాగె ఈశ్వరా

కల మార్పులు బట్టి
రచన శ్రీ శ్రీ చుట్టి
శ్రీ శ్రీ యువహృదయాలలోనే ఈశ్వరా
 
మరోప్రపంచ సృష్టి
సృష్టి తొ పర్య వేష్టి
పరివేష్ఠిగా అద్భుత రచయత సృష్టి ఈశ్వరా
 
అగ్గిపుల్ల వెలుగులు
వెలుగు కుక్క పరుగులు
పరుగుల సబ్బు బిళ్ళల రచయత ఈశ్వరా

జగతి ప్రగతి కొరకు
ప్రగతి కృషిగ చినుకు
చినుకు నదిలా సాగే శ్రీ  శ్రీ ఈశ్వరా
 
కవిత్వం పటుత్వం
పటుత్వం సమత్వం
సమత్వం ప్రజా హృదయత్త్వమ్ము ఈశ్వరా

సంఖ్యా కాదు లెక్క
లెక్క మన్నన లెక్క
లెక్క రచయితగాను  గుర్తింపు ఈశ్వరా
 
సినీ గేయ రచయత
రచయత చూపు మమత
మమతల చీకటివెలుగులే కధ ఈశ్వరా

మహాప్రస్థానముగ
స్థానము దశ దిశలుగ  
దిశ దేశాలు వరకు రచయతగ ఈశ్వరా

--(())--

 *మహా భారతం*

కీచకవధ

నర్తనశాల పదఘట్టనలతో కంపిస్తోంది. తోక తొక్కిన పాముల వలె భీమ కీచకులు బుసలు కొడుతున్నారు. చీకటికి భయాందోళనలు తోడుకాగా, మాలిని నిలువెల్లా చలించిపోతోంది. పిడికిలి పోట్లు వురుములు లేని పిడుగుల వలె మందిరం నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి. 

        సింహబలుని శక్తి క్షీణించ సాగింది. ప్రత్యర్థి మరింత బలం పుంజుకున్నాడు. కీచకుడు డస్సిపోయి. పెనుగులాటలో పడ్డాడు. ప్రాణాలు దక్కించుకుని పారిపోయే ప్రయత్నమని భావించిన భీమసేనుడు మరింత శక్తిని కూడదీసుకుని లేడిపైకి దుమికిన సింహంలా లంఘించాడు. 

        భీకర ముష్టి ప్రహారాలతో కీచకుని దేహాన్ని కుళ్లబొడిచాడు. ఆ కముకు దెబ్బలకు సింహబలుడు, విలవిల తన్నుకోవడం మొదలు పెట్టాడు. వాని దేహభాగాలు క్రమక్రమంగా చైతన్యరహితమై, కుప్పకూలాడు. అయినా, భీముని కసి తీరలేదు. కీచకుని వక్ష స్థలాన్ని చీల్చి పాదాలను, చేతులను, తలను వాని గుండెలోనికి చొప్పించాడు. 

        సింహబలుని వెన్నుముక పుచ్చిన విల్లువలె పూసకొక్కటిగా విరిగింది. వలలుడు వంటవానిగా సిద్ధహస్తుడు. అంతటితో ఆగక, చుట్టచుట్టిన కీచకుని దేహాన్ని నేలపై పదేపదే మోదాడు. రొట్టెలపిండిని మర్దించినట్టు మర్దించి, మాంసపు ముద్దగా తయారు చేశాడు.

        వాడు రాజవీధిలో ద్రౌపదికి చేసిన అవమానం గుర్తుకు రాగా, రోషావేశుడై భీముడు ఆ మాంసపుబంతిని తనివితీరా కాళ్లతో తన్నాడు. చేతులు దులుపుకున్నాడు. అంతచీకటిలో కూడా భీముని అరచేతులు విచ్చిన కమలాలవలె ఎర్రగా, రక్తసిక్తాలై కనిపించాయి.

        భీముడు సవ్వడి చేయక బయటకు నడిచి, చిన్నచిన్న చితుకులు తెచ్చాడు. ఆ మాంసపుబంతికి దగ్గరలో వాటిని పేర్చాడు. చెకుముకిలను రాపాడించి, నిప రాజేశాడు. చితుకుల మంట వెలుగులో కీచకుని దేహం స్పష్టంగా కనిపిస్తోంది. ద్రౌపది నాలుగు అడుగులు దగ్గరకు వేసి, కీచకుని కళేబర ఆకృతిని చూసి, సంభ్రమాశ్చర్యాలతో ముక్కున వేలేసుకుంది. 

        ఆ దృశ్యం చూసిన భీముడు శ్రమ మరిచి సేదతీరాడు. ‘‘దేవీ, నీ మనసులో రగులుకున్న రోషజ్వాలలు ఆరినవి కదా. చూశావుగా వీడికెట్టి దుర్గతి పట్టిందో. దుస్సంకల్పంతో మన జోలికి ఎవరు వచ్చినా యిదే గతి’’ అన్నాడు. 

        ద్రౌపది మరింత చేరువగా వచ్చి, ‘‘మహావీరా! నాడు విరటుని కొలువులో ఆగ్రహాన్ని ఎంతగా అణచి పెట్టుకున్నావో నాకిపడు అర్థమైంది. అంతటి మహాబలుని, యిపడు నిరాయుధుడవై, వొంటరిగా మట్టుపెట్టావు. నీ శక్తి సామర్థ్యాలను ప్రశంసించగల మాటలు నా దగ్గర లేవు’’ అన్నది. 

        ఆమె పలుకులు అమృతపు చినుకులై భీమసేనుని మనసులో వర్షించాయి. ఒక్క క్షణం తన్మయుడై, వులిక్కిపడి ‘‘నడిరేయి దాటి చాలా సేపు అయింది. జాములు యీ చీకటి పొద్దున కదిలిపోతున్నాయి. ఆనందిస్తూ యిక్కడే నిలబడడం క్షేమం కాదు’’ అంటూ బయలుదేరాడు. 

        నాలుగు అడుగులు వేసి, వెనుతిరిగి మాంసపు ముద్దను, పాంచాలిని మార్చి మార్చి చూసి సంతృప్తిగా వంటశాలకు దారితీశాడు వలలుడు.తగినంత వ్యవధి యిచ్చి, పాంచాలి నర్తనశాల ప్రాంగణంలోకి పరుగున వచ్చి, భయాందోళనలతో గొంతెత్తి అరవసాగింది. ‘‘నా గంధర్వపతులు సింహబలుని సంహరించారు. రండి, వచ్చి వీని దుస్థితి గమనించండి’’ అని నాటకీయంగా భయాన్ని అతిగా నటించడం మొదలు పెట్టింది.

        ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆమె కేకలు నగరమంతా ప్రతిధ్వనించాయి. కేకలు విన్న రాజభటులు పెద్దపెద్ద దివిటీలతో నర్తనశాలకు చేరారు. క్షణాలలలో వార్త నగరమంతా సోకింది. ఉపకీచకులు కొందరు ఆత్రుతగా పరుగున నిద్రముఖాలతో వచ్చారు. అక్కడ తమ అగ్రజుని ఆకృతి చూసి నిశ్చేష్టులైనారు. 

        ఆ మాంసపు ముద్దపై పడి, గొంతెత్తి విలపించారు. రాజబంధువులు, రాజాధికారులు కీచకుని దుస్థితిని చూసి నిర్ఘాంతపోయారు. వారికి నోటమాట రాలేదు. ఇటువంటి ఘాతుకాన్ని తాము యింతవరకు కనీవినీ యెరుగమనుకున్నారు. పైకి కీచకుని దుశ్చర్యలను ప్రస్తావించగల ధైర్యము ఎవరికీ లేకపోయింది. 

        ఇంతటి ఘనకార్యమును సాధించగల వారు మానవమాత్రులు కాజాలరు. వారు కచ్చితంగా గంధర్వులే అయి వుండాలని వచ్చిన వారంతా నిర్థారించుకున్నారు. మాలిని జోలికి వెళితే ఎట్టి దురవస్థ కలుగుతుందో అనడానికి యిదొక మచ్చుతునక కాబోలని కూడా ప్రజలు గుసగుసలాడుకున్నారు. ఒక్క కీచకునికి తప్ప రాజ్యమంతటికీ పొద్దు పొడిచింది.

        మహారాజు, సుధేష్ణాదేవి వచ్చి, ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. ‘‘తరువాత జరగాల్సిన కార్యక్రమం సంగతి చూడండి. ఎంత విలపించినా పోయిన వాడు రాడు కదా’’ అని ఉపకీచకులను వోదార్చి వెళ్లారు. కీచకుని దహన విధులకు సిద్ధమవుతున్న సోదరులకు దూరంగా మాలిని కనిపించింది. 

        వారిలో కోపోద్రిక్తాలు తిరిగి మేల్కొన్నాయి. ‘‘ఈ పాపాత్మురాలి వల్లనే మన అన్నకు యీ దుర్గతి దాపురించింది. సహగమనమే మన సోదరుని ఆత్మకు శాంతి కలిగించగలదు. ఆమె పెడరెక్కలు విరిచి కట్టండి. సజీవంగా సైరంథ్రిని చితిపైకి ఎక్కించి బూడిద చెయ్యాలి’’- అనే నిర్ణయానికి వచ్చారు ఉపకీచకులు. పాకశాలలోని పనివారందరూ కీచక వృత్తాంతం కథలు కథలుగా చెపకుంటున్నారు. 

        సింహబలుని సంహరించిన మహాబలుని మహాశక్తిని వారంతా వేనోళ్ల పొగుడుతుంటే, దానినాలకిస్తున్న భీముని తనువు, మనసు దూదిపింజకంటె తేలికై గాలిలో తేలిపోతున్నాయి. ఉపకీచకులు అనుమతి కోసం రాజును దర్శించారు. ‘‘మా సోదరుని దుర్మరణానికి హేతుభూతమైన సైరంథ్రిని బూడిద చేయడానికి నిశ్చయించాం. 

        మీకు తెలియజేయడానికి వచ్చాం-’’ అన్నారు. ఈ దశలో వారిని ఆపినా ఆగరని విరటునికి అర్థమైంది. ‘‘మీకు తోచిన విధంగా చేయండి’’ అన్నాడు రాజు ముక్తసరిగా. కంకుభట్టు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఉచిత సలహాలకు అది సమయమూ కాదు, సందర్భమూ కాదు- అనుకుని, ఆందోళనను కప్పిపుచ్చుకుని మిన్నకున్నాడు.

om sri raam ... sri matre nama:

     *ఓం నమో భగవతే వాసుదేవాయ*

      *శ్రీ భాగవతం - 107 వ భాగం* *చదువుకుందాం భాగవతం*     *బాగుపడదాం మనం అందరం* *దశమ స్కందము* *శ్రీకృష్ణ లీలలు - 37*

 *ధర్మజుని రాజసూయ యాగము* 

        రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజులందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. 

        కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. 

పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. 

         వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారు చేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. 

        వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యత కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు.

        యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. 

        వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. 

        భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా అంత అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది. 

        అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. 

        ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందఱో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందఱో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. 

         అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి ‘అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశాములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి’ అన్నాడు.

        ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. 

        కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. 

        సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అపుడు శిశుపాలుడు లేచి “ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది యితడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది యితడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో. ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను యిప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను’ అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.

        కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట యిచ్చాడు. ఇప్పుడు శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తి అయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. 

        తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు.

        ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు. 

 *శ్రీకృష్ణుడు సాళ్వుని, దంతవక్త్రుని చంపుట* 

        ఈలోగా సాళ్వుడు అనబడే రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుని గురించి ఘోరమయిన తపస్సు చేశాడు. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది. పరమశివుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు. అపుడు సాళ్వుడు తన యిష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరశివుని కోరాడు. అపుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానమును నిర్మింపజేసి సాళ్వునికి యిచ్చాడు. ఆ విమానమునకు *సౌభకము* అని పేరు. ఆ విమానమును ఎక్కి ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపుర కుడ్యములను, గోపురములను తన గదా దండంతో తొలగదోస్తూ నానా అల్లరి ప్రారంభించాడు. 

        వెంటనే అక్కడ ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు యుద్దమును ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనపడ్డాయి. 

        రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్లు సాళ్వుడు కూడా మాయా వసుదేవుడిని సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళ ఎదుటే ఆ మాయా వసుదేవుడిని సంహరించాడు. కృష్ణ పరమాత్మ అంతటివారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలా ఖిన్నులయారు. కానీ మిగలిన వాళ్ళు ‘ఇది జరిగేది కాదు – వసుదేవుడు లోపలే ఉన్నాడు’ అని చెప్పారు. అప్పుడు ఆయన సుదర్శన చక్రమును ప్రయోగిస్తే సాళ్వుడు కూడా మరణించాడు. అతని విమానం తుత్తునియలు అయిపొయింది. 

        తదనంతరం దంతవక్త్రుడు వచ్చాడు. వీడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించాడు. శిశుపాల దంతవక్త్రులు ఇద్దరూ మరణించిన తరువాత వారిలో వున్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. 

        గతంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులయిన జయవిజయులకు ఇవ్వబడిన శాపం చేత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో వారు శిశిపాల దంతవక్త్రులుగా జన్మించి వారిరువురూ శ్రీకృష్ణ పరమాత్మచే సంహరింపబడి ఆయనలో లీనమయిపోయారు.

                          *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......*

                                                *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*

*నాగ సుబ్                బయ్య పైడి*  (సశేషం.....)


Mindful 俳句 – Penumbra Haiku

 

మధురిమల .... కవిత  

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   


విలువైన మాట వినుము  

నిన్ను బతికించు చుండు   

మరచియు  మారబోకుము 

ఆశకు చిక్కక ఉండు 


వయసు ఉడుకు తప్పదు  

మనసును త్రిప్పు చుండు 

చదువు మనకు  తప్పదు  

దారిని  చూపు చుండు 


పెళ్లి మనిషికి తప్పదు   

బుద్ధిని మారుస్తూ ఉండు 

పగటి వెలుగు మారదు

శ్రమించి మనసును చూడు 


తేనే లొలుకే ఆకు 

తేట తెల్లగా నుండు 

లేత చిగురేటి ఆకు  

తినగ తీపిగా ఉండు

 

లేత పెదవి రుచి ఆకు 

అతి మధురంగావుండు 

మనసు మాయ మరవ బోకు   

ఆశకు చిక్కక ఉండు 


మంచి మాట తలకెక్కు 

అది చేదు తీపి గుండు  

కొందరి మాట విని చిక్కు  

అది కోపము అగు చుండు 

  

రాత్రి వెన్నెల మారదు  

చీకటి దోహద ముండు 

తరువుల గాలి మారదు

ప్రాణులతొ కలసివుండు  

--((*))--


నేటి కవిత్వం

రాత్రి కురిసింది చిరు జల్లుల వాన
ధాత్రి తడిసింది మరి మల్లెల బాట
మైత్రి కలిపింది జల బిందువు ఆట
అత్రి విరిసింది మది పొంగుల వాట

దుమ్ము దులిపింది గిరి కాంతుల వాన
సొమ్ము చెదిరింది విరి బంతుల బాట
చిమ్ము కొననుంది వరి కంకుల ఆట
నమ్ము కొనిఉంది మది హంగుల మాట

వచ్చె నిదురంది వల వాంతుల వాన
నచ్చె తలపంది కల జాజుల బాట
విచ్చె వలపంది అల గెంతుల ఆట
తచ్చె సొగసంది మది తీగల మాట

దివ్యె వెలిగింది ఒక రవ్వల వాన
భవ్య సడలింది ఒక పువ్వుల బాట
నవ్య నడిచింది ఒక నవ్వుల ఆట
సవ్య పలికింది ఒక మనస్సు మాట

స్వాతి చినుకంది ధన ముత్యపు వాన
ఖ్యాతి పెరిగింది నవ సత్యపు బాట
జ్యోతి పెరిగింది భవ బంధపు ఆట
శృతి అనిగింది మది తత్వపు మాట

--((**))--

నోట్లు చూసి ఓట్లనిచ్చి
కలలలోన తేలుతారు
అవివేకికి పదవినిచ్చి
పాలనలో మగ్గుతారు

అమ్మయె మమతల కొమ్మ
ముద్దు మురిపాల గుమ్మ
ప్రేమలే పూసిన కొమ్మ
అభినవ బ్రహ్మయె అమ్మ.

కనులు కలబడు చూపు
చూపుల చురక ఊర్పు
ఊపుల ఉయ్యాల పిలుపు ప్రేమ ఈశ్వరా
 
చీకటి వెలుగు పిలుపు
పిలుపుల మనసు తలపు
తలపులు నిండి ఉన్నట్టు ప్రేమ ఈశ్వరా
 
విరిసేను రవి కనులు
కనులేలు  కమలములు  
కమలాలు పంచెను సౌందర్యం ఈశ్వరా

రమ్ము ప్రియ సుందర
సుందర మదినివ్వర
మదినిచ్చి ప్రేమ పంట చూడర ఈశ్వరా
 
మోసకారి ప్రేమ
ప్రేమ విధి ప్రాప్తమ
వధిబలీయమైనది తప్పదే.ఈశ్వరా

వచ్చి వెళ్ళే ప్రేమ
ప్రేమ చుట్టు కాలమ
కాలము కన్నెర్ర చేయించే ఈశ్వరా

మరవాలను కన్నను
ఉన్న ప్రేమ ఉన్నను
ప్రేమ జీవిగా మరువలేనులె ఈశ్వరా

నీకు ప్రేమ లెందుకు
 ప్రేమ బతుకు ఎందుకు
ఎందుకో నీలో ఉండు ప్రేమ ఈశ్వరా

వెన్నె లాంటి మనసుకు     
మనసు పంచు మమతకు
మమతల ప్రేమ ఇచ్చి పుచ్చే ఈశ్వరా

సుందరా0గుని చూపు
చూపు మేలు కొలుపు
మేలుకొలుపు తెలుపు సూర్య తేజ ఈశ్వరా   

--(())--




1 comment: