Thursday, 21 January 2021

 


 

మధురిమలు . .. బుద్ధి   (221--234)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


పొయ్యే తెల్వి రావచ్చు

ఉండే తెల్వి పోవచ్చు

మధ్యే తెల్వి నల్గొచ్చు

దైవం తీర్పు అవ్వచ్చు


 కాలం నీది కావొచ్చు

ప్రేమా నీవు పొందొచ్చు

సేవా చేసి ఉండొచ్చు

దైవం నీవు అవ్వచ్చు


 ఘర్షణ లేక పోవచ్చు

viజేత కాక పోవచ్చు

జయమ్ము లేక పోవచ్చు

దైవం ఆదు కోవచ్చు


శబ్దం నాద మవ్వచ్చు       

పుడమియె వికసించ వచ్చు 

సంకల్ప బల మవ్వచ్చు 

ధైర్యం తోడు ఉండొచ్చు 


మనసును మూయ చేరొచ్చు  

మూలన నిను పెట్ట వచ్చు    

మమతలన్నీ  మరవ వచ్చు  

మమకారం వదల వచ్చు 


మనసులు కలుపుకో వచ్చు 

మనసును దోచు కొనవచ్చు     

మూటను  తీసు కోవచ్చు 

మళ్ళి వెనుకకు రావచ్చు 


కంటికి విందు  కావచ్చు 

మనిషిని నమ్మి బతకొచ్చు  

మంచిని పంచి బతకొచ్చు  

మౌనంగా కూర్చొ వచ్చు 


మూగగా నటించ వచ్చు 

మాటలు వినకుండ వచ్చు 

మత్తులొ తూగ కుండొచ్చు 

మాట లన్ని పంచ వచ్చు 


కళ్లు కనపడకుండొచ్చు 

కన్నీరునే కార్చొచ్చు   

కలలను కల్ల లవ్వచ్చు 

కరుణను చూపకుండొచ్చు 


కలసి ముందుకు సాగచ్చు 

పరిచయాన్ని మరవ వచ్చు 

ప్రేమే తెంచుకోవచ్చు 

పెళ్ళికి ఒప్పు కోవచ్చు 


పరితాపం గడప వచ్చు 

పరిస్కారం తెలపొచ్చు  

సమయం ఇవ్వ మనవచ్చు 

సత్యం తెలుసుకోవచ్చు 


సంజయషీ వినిన వచ్చు 

సమాధానం చెప్పొచ్చు 

సంధి చేసు కొనుట మెచ్చు 

ఉంటే చాల నియు వచ్చు 

 

ఓటమిని ఒప్పుకో వచ్చు 

అనుభవమ్ము పెరగవచ్చు 

గెలుపుమాట నిదవ్వచ్చు

బాధ్యత గుర్తు అవ్వచ్చు


 --(())--

ऊँ! Him

----

"సీ.

----

ఏమయ్య .మోహన...యేమిటీ..చోద్యము ?

      కఱవేమియున్నది..

కన్న..యిచట?

వెన్నమీగడలన్న..వెన్నుఁడ..మక్కువే

      నీకనునదరయ నిత్యకథయె. !

పొరుగిండ్ల వారికి మోదమునీయవా ?

     పాలనుఁజౌర్యము పాడియౌనె ?

నినుఁగొట్టఁగఁజేయినెప్పుడు రాదులే

  దండించలేనయ..దానవారి..!


గీ.

--

అనుచుచెవినులిమెనుతల్లి..యార్ద్రహృదయ..


నేనెరుగనన్న కొమరుని..నీరజాక్షి..


మాతజన్మధన్యముగద మౌనిపూజ్య


కృష్ణ ! నీలీలఁజూచుచు కేలుముడుతు !!! "

llapragada: ✍️...నేటి చిట్టికథ

           ---  మహాభారతం నుండి.. 

చాలా ఏళ్ళ క్రితం బాలదిహి అనే ఒక ముని ఉండేవాడు.

 ఆయన చాలా గొప్పవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు.

 పాపం ఆ కొడుకు కాస్తా ఉన్నట్టుండి చనిపోయాడు. దాంతో ఆ ముని చాలా దఃఖపడ్డాడు. 

ఈ సారి చావు లేని కుమారుణ్ణి పొందాలనుకుని ఘోర తపస్సు చేసాడు.

" మనిషై పుట్టాకా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవల్సిందే. అసలు చావే లేకుండా వరం పొందటం కుదరదు. అందుచేత ఈ సారి నీకు పుట్టబోయే కొడుకు ఎన్నాళ్ళు జీవించాలనుకూంటున్నావో చెప్పు, అన్నేళ్ళు ఆయుష్షు ఇస్తాం" అన్నారు దేవతలు.

" సరే! అలాగైతే - అదిగో ఆ ఎదురుగా కొండ ఉందే- అది ఉన్నంతకాలం నా బంగారుకొండ బతికుండాలి" అని బాలదిహి కోరుకున్నాడు.

 దేవతలు అలాగే వరం ఇచ్చారు. 

తరువాత వరప్రభావంతో మునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి "మేధావి" అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు ముని.

' నా ప్రాణానికి ముప్పు లేదు. కొండలాగా స్థిరంగా ఎంత కాలమైనా బతకొచ్చు ' అనే గర్వం కలిగింది మేధావికి.

 దాంతో పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా అందరితోనూ పొగరుగా ప్రవర్తించేవాడు.

ఒకరోజు ధనుసాక్షరి అనే మహాత్ముణ్ణి మేధావి తూలనాడాడు. అతని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. 

ధనుసాక్షరి భగ్గున మండిపడి, " నీవు భస్మమైపోతావు పో!" అని శపించాడు.

కాని మేధావికి శాపం తగల్లేదు.

కొండలా ఉన్నాడు.

అప్పుడు ధనుసాక్షరి మేధావికి గల వరాన్ని జ్ఞాపకం తెచ్చుకుని వెంటనే తపోమహిమ వల్ల తానొక అడవి దన్నుగా మారిపోయి కొండను దభీమని ఢీకొట్టి దాన్ని బద్దలు చేసాడు.

 కొండ చీలిపోతూనే మేధావి తల కూడా రెండు ముక్కలైంది.

ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి.

వరాలు పొందామని ఎప్పుడూ గర్వపడకూడదు ;

పెద్దల్ని యిష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు.

 అందర్నీ గౌరవించడం నేర్చుకోవాలి.

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, సాఠ్యం సదా దుర్జనే ।

ప్రీతిః సాధుజనేనయోః నృపజనే, విద్వజ్జనేచార్జవం  ।

శౌర్యం శతృజనే, క్షమా గురు జనే, నారీజనే ధృష్టతా  ।

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ।।

బంధువుల యెడ దాక్షిణ్యముతోనుండుటయు, సేవకుల యెడ దయతోనుండుటయు, దుర్జనుల యందు కఠినముగా వ్యవహరించుటయు, సజ్జనులయందు ప్రీతి పాత్రమై మెలగుటయు, రాజులయందు నీతితో వారికి అనుగుణముగా వ్యవహరించుటయు, విద్వాంసులయందు క్రమ ప్రవర్తనము లేదా ఋజు ప్రవర్తనము కలిగియుండుటయు, శత్రువులయందు పరాక్రమమును, పెద్దలయందు ఓర్పును, స్త్రీల యందు ద ధృఢచిత్తము కలవారుగానూ యే పురుషులు కనపఱుతురో అట్టివారలే లోకస్థితికి, లోక మర్యాదకి, లోకము యొక్క అస్తిత్వానికీ   కారణభూతులు.

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

[22/01, 11:22 am] . Mallapragada: వాల్మీకి రామాయణ కాలంనాటి అయోధ్యా పుర వర్ణన

వనం జ్వాలా నరసింహారావు


సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను, మనువు స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను, పన్నెండామడల పొడవు, మూడామడల వెడల్పు, వంకర టింకర లేని వీధులతోను, ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను, దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో వుండేది. 


చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతోను, తలుపులతోను, వాకిళ్లముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన స్తంబాలతోను, నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోను, శత్రువులను ఎదుర్కొనేందుకు కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన భవనాలతోను, శిల్ప కళాకారుల సమూహాలతోను, వందిమాగధులు, సూతుల జాతివారితోను, శ్రీమంతులైన పండితులతోను, ఎత్తైన మండపాల పై కట్టిన ధ్వజాలతోను, భయంకర శతఘ్నుల ఆయుధాలతోను, నాట్యమాడే స్త్రీ సమూహాలతోను, తియ్య మామిడి తోపులతోను, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించేదిగా వుండేది. 


"అయోధ్యా పురి" అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డాణంలా వున్న ప్రాకారం, అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో వున్న గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా దేశ వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది. 


నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోను, ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు, మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను, ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోను, ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను, నాలుగు దిక్కులా వ్యాపించిన రాచ బాటలతోను, వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరం జూదపు బీటలా వుండేది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు, గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం). 


నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తియ్యగా, తేలిగ్గా, మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల కాలి అందియలు, వీటివల్ల కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి. 


ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు పోయేటప్పుడు, సింహాలను, అడవి పందులను, ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో-శస్త్ర బలంతో, ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ, ఆయుధం లేకుండా, సహాయం చేసేవారు లేకుండా, ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో దాగిన వారినికూడా వదిలి పెట్తారు. 


అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే. శమ దమాది గుణ సంపన్నులే. ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే. సత్య వాక్య నిరతులే. వేలకొలది దానాలు చేసిన వారే . గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా, నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు సమానమైన వారు. 


భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం. ఆయన సేవే మోక్షం. అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు.

అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. ఆయన ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు, అగ్రగణ్యుడు. సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు. 

రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు, కీర్తిమంతుడు. వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై, ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. 


అయోధ్యాపురంలోని బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. 


అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల మనసున్నవారే, ధర్మాన్నెరిగినవారే. శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే. దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే ఆవులను, గుర్రాలను, సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి, తండ్రి, భార్య-ఇద్దరు కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు. కొడుకులకు, భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు. అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ, చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు.

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే. ప్రేమ స్వరూపులే. 

ఇంద్రియ నిగ్రహం కలవారే. మంచి స్వభావం వున్న వారే. 

దోషరహితమైన నడవడిక గల వారే. ఋషితుల్యులే. నిష్కళంకమైన మనసున్నవారే. ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే. అందచందాలున్న వారే. కురూపులు కాని వారే. మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే. ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే. అన్న దాతలే. అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే. అగ్నిహోత్రాలు కలవారే. వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే. బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే, దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.


తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై, వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. 


అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు. సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు. బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.


వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన, చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.


సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే 

రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు.


ఇన్ని సద్గుణాలకు, సంపదలకు, సనాతన ధర్మానికి ఆలవాలమైనది కాబట్టే ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా, యుగాలు మారినా అయోధ్య శోభ అలాగే నిత్యనూతనంగా వర్ధిల్లి, రామజన్మ భూమి తరతరాలకు ఆదర్శం కాబోతున్నది....


*పరిష్కారం*


ప్రమధ్వర రాజ్యాన్ని చంద్రశేఖరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.ఆ రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. రాజు ప్రత్యేక శ్రద్ద తీసుకుని పహరా పెంచి చాలా మంది దొంగలను బంధించాడు. కాని దొంగతనాలు ఆగలేదు.ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. ఒక్కడే దొంగ దొంగతనం చేస్తున్నట్లు బాధితుల విచారణలో తెలిసింది.ఈ దొంగతనాలు గంగులు అనే గజదొంగ చేస్తుండేవాడు. కాపలా భటుల కళ్ళు కప్పి ఇంటి దగ్గరకు చేరుకోవటంలో, తాళాలు తీయటంలో, కిటికీలు తొలగించడంలో, నేర్పుగా దోచుకోవటంలో, చాకచక్యంగా కళ్ళు కప్పితప్పించుకోవటంలో వాడిది అందె వేసిన చెయ్యి. ముసుగు ధరించటం వల్ల వాడి ముఖాన్ని ఇంతవరకూ చూసిన వాళ్ళు లేరు. ఏ రాత్రి ఎక్కడ ఏ దిక్కున దోచుకుంటాడో తెలియదు.కాబట్టి భటులు

బంధించలేకపోయారు.

ఒక రోజు రాజు తన జన్మదినం సందర్భంగా తనకిష్టమైన చదరంగం పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. పోటీలో పాల్గొనేవారు రాజాస్థానంలో ఉన్న చదరంగంలో ఆరితేరిన నలుగురు మేధావులను ఓడించాలి. అలా ఓడించి విజేతగా నిలిచిన వారికి రాజు రెండు వందల వజ్రాలను బహుమతిగా ఇస్తాడు. ఈ విషయం రాజ్యమంతటా ప్రకటించారు.

చదరంగంలో నైపుణ్యమున్న వాళ్ళు వారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని పేరు నమోదు చేయించుకున్నారు. వారి వంతు వచ్చినప్పుడు పోటీకి వెళ్తున్నారు. చదరంగం ఆటకు ఏకాగ్రత ముఖ్యం కాబట్టి ఇతరులెవరూ లేకుండా ప్రత్యేకమైన గదిలో మంత్రి ఆధ్వర్యంలో పోటిలు జరుపుతున్నారు.కానీ చదరంగంలో తలలు పండిన నలుగురిని ఓడించడం మాటలు కాదుకదా!ఎవరూ గెలవలేదు.

ఆ రాజ్యంలో చతురుడనేపండితుడున్నాడు. చతురుడు కూడా పేరు నమోదు చేయించుకున్నాడు. పోటీలో పాల్గొన్నాడు. నలుగురినీ ఓడించి విజేతగా నిలిచాడు. రాజు సభలో చతురుడిని ఘనంగా సన్మానించి, రెండువందల వజ్రాలు అందజేశాడు. చతురుడి పేరు రాజ్యమంతటా మార్మోగింది. ఈ సంగతి గంగులు చెవిన పడింది. చతురుడి వద్ద నుండి వజ్రాలు దొంగిలించాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అదే రోజు సాధారణ పౌరుడిగా చతురుడి ఇంటి చుట్టూ తిరిగి,

ఆ ఇంటిని పరిశీలించి ఆ ఇంటిలో ప్రవేశించి దొంగలించడం సులభమనే నిర్ణయానికొచ్చాడు.

అర్ధరాత్రి నల్లని దుస్తుల్లో ముసుగు దొంగగా మారి, చతురుడి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చెట్టు కొమ్మ సాయంతో ఇంటి చుట్టూ ఉన్న గోడను దూకి తలుపు వద్దకు చేరుకున్నాడు. అక్కడ గోడ చాటున చీకట్లో దాగి దొంగ రాకకోసం ఎదురుచూస్తున్న రాజభటులు చుట్టుముట్టి బంధించి కారాగారంలో వేశారు. రాజు వాడికి జీవిత ఖైదు విధించారు.

చదరంగం పోటీలు ఏర్పాటు చేయటం పోటీలో గెలవకున్నా గెలిచినట్లు విజేతగా చతురుడిని ప్రకటించి, రెండు వందల వజ్రాలనిచ్చి రాజ్యంలో అందరికీ తెలిసేలా చేయటం, రాజుతో కలిసి చతురుడు పన్నిన పథకం.

ఈ విషయం దొంగ చెవిలో పడుతుందని వజ్రాలకోసం దొంగ ఏదో ఒక రోజు చతురుడి ఇంటికి దొంగతనానికి వస్తాడని రాత్రి వేళ చతురుడి ఇంటి వద్ద కాపలాభటులను ఉంచారు.దొంగ చతురుడు పన్నిన వలలో పడ్డాడు.

తర్వాత ఒక రోజు చతురుడు రాజును కలుసుకుని "మహారాజా!ప్రస్తుతానికి దొంగల బెడద తగ్గినా, భవిష్యత్తులో కొత్త దొంగలు పుట్టుకు రావచ్చు. చేతినిండా పని ఎంతో కొంత సంపాదన లేకుంటే మరో మార్గం లేనప్పుడు కఠిన శిక్షలకు కూడా భయపడక దొంగలుగా మారుతారు. కాబట్టి అందరికీ పని దొరికేలా చేతి వృత్తుల్లో శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేయండి. వ్యవసాయాన్ని,పరిశ్రమలను అభివృద్ది చేయండి.నిరుపేదలకోసం సంక్షేమపథకాలు ప్రవేశపెట్టండి.సమస్యపరిష్కారమవుతుంది"అన్నాడు.

రాజు చతురుడిని సలహాదారుడిగా నియమించుకున్నాడు.

Seksrans

✍🏻సేకర

మధురిమలు .. మూర్తి
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మాతృగర్భ మాతృ మూర్తి
మమకారంతో చూపును
తరగని తలపులతొ మూర్తి
సంతోషమునే పంచును

తరంగాలవలెను మూర్తి
 నవ నూతన హేల తోను  
పురిటి నొప్పులలో మూర్తి
ప్రసవ వేదన భరించును

బిగువున బంధించి మూర్తి
తన తనువంత నొప్పులను  
మనసు తల్లడిల్లె మూర్తి
తన మనస్సులొ నిప్పులను

సర్వం ధారపోసె మూర్తి
కుంపటి పై మూర్చిల్లెను
భాదా సంతోష మూర్తి
ప్రేమ సమ్మిళిత మ్మనెను

సమ్మేళన సమయ మూర్తి
తన చుట్టూ ఏమున్నను
ఎవరున్నా లోక మూర్తి
తెలియని స్థితిలొ ఉండును

హృదయమ్ము పంచే మూర్తి
కదిలిక కన్న పిల్లకును
వ్యధ భరిత చరిత మూర్తి
 హీన స్థితిలో ఉండును

తనలోకంలో న మూర్తి,
అనుభూతుల్ని  పంచేెను
దుఃఖాతి శయాలమూర్తి
సంతోషానందాల ను

నవ శిశువుకు మాతృ మూర్తి
నూతన  ఉషోదయమ్మును
 రాగం వినిపిస్తూ మూర్తి
 పంచూ వెలుగు లన్నియును

సంధ్యా పొద్దులో మూర్తి
ఉదయభాను సహనమును
వెచ్చని కిరణాల మూర్తి
నవ ఉషోదయ రాగమున

ఈ లోక అందము మూర్తి
పంచే సుఖదుఃఖాలను
సర్వ బంధ జన్మ మూర్తి
ఓర్పు ఓదార్పు పంచేను

--(())--
 

హ *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 69* 🕉

*అంతా సంశయమే శరీరఘటనంబంతా విచారంబె లోనంతా*

*దుఃఖపరంపరానివితమె మేనంతా భయభ్రాంతమే*

*యంతానంతశరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్*

*జింతన్ నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీ*  *కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! 

ఆలోచించగా అంతయూ సత్యమా కాదా, ఇది శాశ్వతమా అశాశ్వతమా, ఇది ఉచితమా అనుచితమా అను సంశయములతో నిండిన విషయమే కాని నిశ్చితముగ ఇది యిట్టిదని చెప్ప శక్యము కాదు. 

🌹ఈ శరీర నిర్మాణమంతా విచారము, దుఃఖము కలిగించునదియే. మనస్సులలో అంతయు దుఃఖపరంపరలతో నిండినదే కాని ఆనందకరమగునది ఏదియు లేదు. 

🌹ఈ శరీరమంతయు వ్యాధులు ఆపదలు మొదలైనవాని వలన కలుగు భయములతోభ్రాంతులతో నిండినదియే. 

🌹జీవన గమనములో ప్రతి అంశము మానవుని శరీరమును అనంతముగ శోషింపజేయు నదియే, అంతయు దుర్వ్యాపారములతోనే కాని సద్వర్తనముతో సరిగ జరుగదు. 

🌹ఇంత కనబడుచున్నను మానవులు ధ్యాన నిష్ఠతో నిన్ను తలంచి నీ యనుగ్రహమును పొంద యత్నించకున్నారు కదా!

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

🌻 *వైజయంతి మాల* 🌻

లక్ష్మీ దేవి అనుగ్రహానికి ధనాభివృద్ధికి వైజయంతి మాల

వైజయంతి విత్తనాలు శ్రీ కృష్ణుని జన్మస్ధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ అరణ్య ప్రాంతంలో లబిస్తాయి.వైజయంతి విత్తనాలు రాధ కృష్ణుల ప్రేమకు ప్రతిరూపమని భావిస్తారు.

క్షీరసాగర మథనంలో క్షీరసముద్రంలో లక్ష్మీదేవి మొదలైన ఎన్నో వస్తువులు పుట్టడం మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.

*"కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె*

*మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చె*

లక్ష్మీదేవికి సముద్రుడు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు.

వైజయంతి మాల లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజు పూజ చేసి బీరువాలోగానీ,మెడకు గాని ధరించవచ్చును. 

వైజయంతి మాలను దీపావళి రోజు గాని,శుక్రవారం రోజుగాని లక్ష్మీదేవి పటానికి గాని,శ్రీచక్రమేరువుకి గాని అలంకరించి లలితా సహస్త్రనామంతో గాని,లక్ష్మీ అష్టోత్తరంతో గాని కుంకుమార్చన చేసి వైజయంతీ మాలను మెడకు దరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 

వైజయంతిమాలను లక్ష్మీ దేవి అలంకరణలో గాని,పూజలో గాని తప్పనిసరిగా ఉపయోగించాలి.

(సేకరణ)

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం  - 70* 🕉

*ఆలుం బిడ్డలు మిత్రులున్ హితులు నిష్టర్ధంబు లీనేర్తురే*

*వేళ న్వారి భజింపఁ జాలిపడ కావిర్భూత మోదంబునం*

*గాలంబెల్ల సుఖంబు నీకు నిఁక భక్తశ్రేణి రక్షింపకే* *శ్రీలెవ్వారికిఁ గూడంబెట్టెదవయా శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! 

నీకుగల అపార ఐశ్వర్యములతో నీవు నీ భార్య, బిడ్డలను, హితులకు వారి వారి ఇష్ట సంపదలుచ్చి  వారిని సుఖపెట్టదలుచుచున్నావేమో....

🌹కాని వీరు అందరును నీకు ఆవశ్యకమయినప్పుడు ఇష్థప్రయోజనములను కూర్చి నిన్ను సుఖింపజేయుదురా. నీవు ఆనందస్వరూపుడవు. 

🌹అఖండానందము అఖండసుఖములకు నీకు ఎప్పుడును లోటు రాదు. అవి నీకు యితరులు ఇచ్చుఅవసరము రానేరాదు కదా... 


🌹కనుక నీ ఐశ్వర్యములతో భక్తుల సమూహమును రక్షింపుము. నీ ఐశ్వర్యములు నీ ఆలుబిడ్డలు కొరకు కూడబెట్టవలసిని పనిలేదు.

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼


 🚩 *భగవద్గీత గురించి* 🚩

*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది.*

*ఒక రోజు , ఆ  గుడిలో నుంచి ఒక సాధువు  గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందిన వారు, మీ కొడుకు చాలా మంచివాడు కదా.*

*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :-  బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు.*

*నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.*

*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు.*

*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది.*

*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను.*

*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను.*

*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు:- మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ?* 

*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను.*

*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించు కుంటారు.*

*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు.*

*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి. ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు.*

*ఆ ముసలావిడకు చదువు రాదు. అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు.*

*మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే.*

*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది.*

*కానీ, మనకు భగవద్గీత  ఎంత విలువైన సంపదో అర్థం కాలేదు.*

*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండ వాళ్ళం.*

*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీతను ఎప్పుడో ఒక సారి ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన Show Case లో భద్రంగా పెడుతున్నాం.*

*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం.*

*సనాతన ధర్మం భూమిపై  అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత.*

*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతితో అతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత.*

*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత.*

*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ,మహాభారత భగవద్గీత లలో ఉన్నాయి.*

*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*

*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా (దైవమునకు విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత.*

*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడ్డ గ్రంథం భగవద్గీత.*

*ఈ ప్రపంచంలో  ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించ బడుతున్న గ్రంథం భగవద్గీత.*

*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత.*

 *దేవుడు  మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి, అర్థం చేసుకొని, దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.

*ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా పంపించి భారతదేశ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియ జేయండి.....!*

   💐 *సర్వే జనాః సుఖినో భవంతు మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

మీకు తెలుసా... ఇలాంటి పుస్తక సంపద 90 లక్షల గ్రంథాలను భక్తియార్ ఖిల్జీ నలందలో తగులబెట్టాడని... అవి అన్నీ కాల్చేందుకు వారికి ఒక సంవత్సర కాలం పట్టిందట... అన్ని గ్రంథాలు.... విజ్ఞాన సంపద ఉన్నాయి.. మన భారతీయుల దగ్గర..

(ఇతని పేరు మీద ఇప్పుడు ఒక ఊరు భక్తియార్ పూర్ అని ఉంది...దాని పేరు మారిస్తే బావుండు)

 నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వ గ్రంథ శాస్త్ర రాజములు:

 నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండా పోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.*

1.అక్షర లక్ష: ఈ గ్రంథం ఒక ఎన్‌సైక్లోపీడియా గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణంలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.*

2. శబ్ద శాస్త్రం: రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి), వేగాలను కొలవడం వివరించారు.*

3. శిల్ప శాస్త్రం: రచయిత కశ్యప ముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. 307 రకాల శిల్పాల గురించి, 101 రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజ భవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు, మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.*

4. సూప శాస్త్రం: రచయిత సుకేశుడు. ఇది పాక శాస్త్రం, ఊర గాయలు, పిండి వంటలు, తీపి పదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయాలు, వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.*

5. మాలినీ శాస్త్రం: రచయిత ఋష్యశృంగ ముని. పూల మాలలను తయారు చేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోఅలంకరణలు, రహస్య భాషలో పూవుల రేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.*

6. ధాతు శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రలోహాలు, లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.*

7. విష శాస్త్రం: రచయిత అశ్వినీ కుమార. 32 రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.*

8. చిత్ర కర్మ శాస్త్రం (చిత్ర లేఖన శాస్త్రం): రచయిత భీముడు. ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్ర లేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తల వెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.*

9. మల్ల శాస్త్రం: రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.*

10. రత్న పరీక్ష: రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కల్గి ఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.*

11. మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్య స్వామి స్వామి శిష్యుడైన వీర బాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.*

12.అర్థ శాస్త్రం: రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మ బద్ధమైన 82 ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.*

13. శక్తి తంత్రం: రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన 64 రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.*

14. సౌధామినీ కళ: రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం చెప్పభదింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయా చిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.*

15. మేఘ శాస్త్రం: రచయిత అత్రి ముని. 12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు, 64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.*

16. స్థాపత్య విద్య: అదర్వణ వేదంలోనిది. ఇంజనీరింగ్, ఆర్కితెక్చర్, కట్టడాలు, నగర ప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.*

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వ శాస్త్రం, కుమారస్వామి రచించిన గజ శాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్ర శాస్త్రం మొదలగునవి, ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.*

నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద. వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవ

2 comments:

  1. ధన్యవాదాలు మీకు అనేక కధలు.శిస్త్రాలు ,రామజన్మ భూమి వివరాలు కాళహస్తీశ్వరా అంటూ చక్కగా సేకరించి అందించినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete