Sunday, 17 January 2021

19--01-2021

 

🌺 OM NAMAH SHIVAYA ॐ

 మధురిమల .. గెలుపు (191-200)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

మనిషికి ఉండాలి గెలుపు
తెచ్చే మనిషిలో మలుపు
చదువు సంధ్యతోను గెలుపు
ప్రతి ఒక్కరిలోను మలుపు

సమయానికి పనికొచ్చే
మనిషి విలువే గుర్తించు
ఆరోగ్యమునే ఇచ్చే
తల్లి గెలుపు గుర్తించు

కష్టాల్లో అధైర్యము
బాధల్లో బంధుత్వమె
నష్టాల్లొ అప నమ్మకము
లేకపోతె గెలుపు ఖాయమె

సూర్య కాంతి అద్భుతమగు
యోగ చైతన్యము పెరుగు   
మనసుయే అభ్యుదయమగు .
మనకు గెలుపే సాధ్యమగు

మనలొ ఉన్న ప్రాణశక్తి   
బలమును కూర్చుకొను యుక్తి
ఇరువురి మధ్య గల  రక్తి
గెలుపు దిశగ కలిగు ముక్తి

ఊర్ద్వముఖంగా పయనము
కల్గించు దివ్య తేజము
మనిషికి ఇది ఒక మార్గము
మార్గాన గెలుపు సాధ్యము

మన బుద్ధి ప్రచోదనము
గావించుటయే సత్యము .
మనస్సుకు ప్రక్షాళనము    
అదియే గెలుపు స్వభావము

కాంతి కిరణ మిస్తరించు
అశుభములన్నియు హరించు   
అవి మనిషికి సహకరించు
గెలుపే సాధ్య మనిపించు

అందరి లోను ధైర్యమ్ము
ఎదురులేని మోహమ్ము
గెలిపించు విశ్వాసమ్ము
హృదయములోన దేవమ్ము

నిస్వార్థ పరత లక్ష్యము
మనుషుల్లో నిత్య జపము
తల్లితండ్రులో సహనము
సహకారం గెలుపు మయము

--(())--  

నేటి కవిత ..: మానవత్వం అంటే  
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మానవత్వం నీలో ఉంది
పాలు పంచదార  కలసిఉంది
కల్తి అనేది లేని మతమ్మిది
మనసు మనసున  మానవత్వమిది

డబ్బుతొ కొత్త రోగముంటుంది
అడ్డగోలు డబ్బు మారుతుంది  
కుళ్ళు బుధ్ధితో లేని మతమిది
మనసు మనసున  మానవత్వమిది

తల్లి తండ్రుల మాట నమ్మేది
భార్య పిల్లలూ కోరుకొనేది
మనసు విలాసానికి మేలైనది
మనిషి మనిషికి మానవత్వమిది
   
మాతాలకు అతీతం అయినది   
ఐకమత్యానికి  మూలమైనది
అంధకారాన్ని తరిమేసేది   
ఆణిముత్యమ్ము మానవత్వమిది

కష్టాల్లోను స్నేహ హస్త మిది
మార్గ నిర్దేశిత క్షేమమిది
శాంతీ సౌఖ్యాల తత్వమిది
క్షమా గుణంతొ మానవత్వమిది
 
==))__==
 

 





ఈనాటి ముచ్చటైన మూడుకధలు


చిన్న మాట


నాది ఒక చిన్న మాట గురు.....
ఎందుకు మనమందరం మనాలి నచ్చనిదానిని అలలుగా చూసి భయపడటం????
ఏమిజరిగినా మన స్వభావాలు  దృష్ట్యా మన మంచికే అనుకోలేకున్నాం???
ఎండలు మండుతున్నాయి అన్నారు... ఇది వేసవికాలం... మనలో కొంతమంది వారి స్వార్ధ ప్రయోజనాలకోసం మనకందిరికి ఎటువంటి లాభం ఆలోచించేసకుండా సాయం చేసే చెట్లను(trees) నరికేసి ఆనందపడ్తున్నాం... ఇది ఒక reason...
మానసికంగా అన్నారు...
దీనికి reason మీరే చెప్పారు... మనందరిలో కలిమాయ,అలా చేస్తోంది...
ఆత్మీయంగా అన్నారు...
స్వార్ధంతో బ్రతికేవారిని మనమందరం మహనీయులుగా గుర్తించి సహాయపడ్తున్నాం....దానివలన ఆత్మీయతను మన సొంతవారిలో కోల్పోయి, అదేదో పెద్ద ఘనత/లోపంగా గుర్తిస్తున్నాం....
మనసుకి శాంతి చేకూరాలంటే, మనలో వున్నా స్వార్ధం/negitivity ని దూరం చేయాలి అని నా విన్నపం...
.
.
నీకేమి తెలుసు మా బాధ, అలా లేకుండా ప్రశాంతంగా బ్రతకలేం, అని నన్ను మీరు గేలి చేయచ్చు....
అది మీ తప్పుకాదు, మీలోని కలిమాయ అలా మాయచేస్తున్నది అని గుర్తించలేరు....
.
ఇప్పుడు నేనేమి చెప్పదలిచానంటే..
గడుస్తున్నది వేసవి కాలం.. బ్రతుకున్నది మనలోని కలి....
దీనికి ఒకటే విరుగుడు...
మన జాగ్రత్తలో మనం ఉంటూ, సహాయం కోరినవారికి సహాయం చేయటం@అన్నీ సరిపోయే విధంగా...
దేవుడు అనేవాడు మనకు సహాయం చేయటానికి ఉన్నాడు@మన ప్రవర్తనలు/స్వభావాలకనుగుణంగా...
.
ఏమి జరిగినా/జరుగుతున్నా/జరగపోతున్నా, అంతా మన మంచికే అనుకుని@మన తప్పులు ఏమైనా ఉంటే, వాటిని సరిచేసుకుని, జాగ్రత్తగా  బ్రతకడం...
అప్పుడు మన మనసులో శాంతి@మనసశాంతి  ఎక్కడో ఉండదు, మనలోనే తిష్టవేసుకుని బ్రతికిస్తుంది మనలను....
ఆ దేవునికి కూడా, మనందరి ప్రవర్తనలు చూసి,'దెబ్బ తగిలితేకాని, మనకు నొప్పి తెలీదు' అని భావించిఉండచు...
పర్యావరణాని ప్రేమిస్తే, మనకు శాంతి లభిస్తుంది అని నా భావన....
.
నాకు తెలిసీ, ఇలా చెప్పి మిమ్మల్ని సముదాయించడం కష్టం.... ఎవరికి వారే తెలుసోకోవాలి.. స్వయం పరిశీలనతో అని నా అభిప్రాయం....
.
అంతా మన మంచికే అని జాగ్రత్తగా వ్యవహరిస్తే... 'సర్వేజనా సుఖినోభవంతు' అనే పదానికి అర్ధం లభిస్తుంది... 👍🙏🕉️
--(() ) --

[
*స్పందించే తీరు*
🌹🍃🌸🌹🍃🌸🌹

నమస్కార్ 🙏🏻
నలభై ఏళ్ల వయసులో..
ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే.
సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.

యాభై ఏళ్ల వయస్సులో..
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం.
ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.

అరవై ఏళ్ల వయసులో..
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే.
పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.

డెబ్బై ఏళ్లవయస్సులో..
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...
కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.

ఎనభైఏళ్ల వయస్సులో..
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు.
ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.

తొంభైఏళ్ల వయస్సులో..
నిద్ర మెలుకువ రెండూ ఒకటే.
సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.

అందంతో వచ్చే మిడిసిపాటు...
ఆస్తులతోవచ్చే అహంకారం...
పదవులతో గౌరవాన్ని ఆశించటం...
కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.

సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.

అందుకే.. ఒత్తిడి
లకు దూరంగావుంటూ...
అనుబంధాలను  పదిలపరుచుకుంటూ...
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!

నాకు చాలా బాగా నచ్చింది. మీతో పంచుకో వలనిపించి పంపిస్తున్న.మీకూ నచ్చితే అందరిక పంపండి ఎందుకంటే ఇది జీవత సత్యo         

🙏🙏🙏🙏

 *ఒకసారి సుందర్ పిచాయ్  (గూగుల్ CEO) స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు మహిళలు కూడా కూర్చున్నారు.*

 *ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక  ఆ ఇద్దరు మహిళల్లో ఒకామె మీదకు ఎగిరింది* .

 *అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో మహిళ మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు.*

 *ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి!*

 *మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి* .

 *మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం!*

 *కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ మహిళలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి? బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా!*
 *అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు?*
 *అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరు మహళలు ఒకలా, అతనొకలా స్వీకరించారు. అప్పుడు నాకర్థమైంది... ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీదఅరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను.*
 *రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.*
 *సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే...*
 *సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం. బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా,* *సమస్యను అధిగమించాడు.*
 *స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను* *అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.*

 *ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.''*

 *సమస్యకు  స్పందించే  విధానం  వల్లే  పరిష్కారం  లభిస్తుంది.*

 *దిని అనుబంధం గా మహాభారతం లో మరో చిన్న సంఘటన....*

 *ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చింది. గంగానదిని అడిగాడు, నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మొసుకొస్తుంటావు కదా, గడ్డి పరకల్ని ఎందుకు తీసుకురావు అని. అప్పుడు గంగానది ఇలా సమాధానం చెప్పింది. చెట్లు వంగవు. అవి కఠినంగా ఉంటాయి. అందుకే వాటిని వేళ్ళతో సహా పెళ్ళగిస్తూ ఉంటాను. గడ్డిపరకలు వేరు. వాటికి ఆణుకువ తెలుసు. నేను మహోధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి, బలానికీ అవి వినయంగా తలవంచుతాయి. అప్పుడు నా వేగమూ, శక్తీ ఓడిపోతాయి. నా వరద తగ్గిన వెంటనే గడ్డిపరకలు మళ్ళీ తలెత్తుతాయి.అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారంతో, అతిశయంతో మిడిసిపడేవారు తమకంటే బలమైన శక్తులకు ఓడిపోయి నశిస్తారు. వినయంతో, ఇతరులతో సామరస్యభావనతో జీవించేవారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పదికాలాల పాటు జీవిస్తారని చెబుతుంది మహాభారతంలోని ఈ ఉదాహరణ.*

🌹🍃🌸🌹🍃🌸🌹
 రామకృష్ణ పరమహంస సమాధి ఐన తరువాత వివేకానందుడు అమెరికా వెళ్ళి భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి విప్పి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకు మాతృ సమానురాలయిన రామకృష్ణ పరమహంస భార్య ఐన శారదాదేవి ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళాడు. ఆమె యింట్లో వంట చేస్తూ వుంది. వివేకానందుడు ఆమెకు నమస్కరించి ‘అమ్మా! నేను అమెరికా వెళుతున్నాను. భారతీయ ధర్మాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పడానికి వెళుతున్నాను. మన ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలుపడానికి ఈ ప్రయాణం పెట్టుకున్నాను. యింత పవిత్ర కార్యాన్ని నిర్వర్తించే ముందు మాతృమూర్తి ఐన మీ ఆశీర్వచనం నాకు అనివార్యం. మీరు నన్ను ఆశీర్వదించందే నా యాత్రకు సంపూర్ణత, సమగ్రత చేకూరదు’ అన్నాడు.

శారదాదేవి వంట పనిలో వుంది. వివేకానందుడు చెప్పినవన్నీ విన్నది. వెంటనే స్పందించలేదు.

వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. నేనేం తప్పు చేశాను? అనుకున్నాడు. శారదాదేవి కాసేపటికి ‘నేను ఆ విషయం గురించి కొంత ఆలోచించి కానీ చెప్పలేను’ అంది.
వివేకానందుడు విస్తుపోయాడు. ఆశీర్వదించడానికి ఆలోచించడమా?’ అనుకున్నాడు. పరిస్థితి చిత్రంగా వుంది. వింతగా అనిపించింది.

శారదాదేవి వంట పనిలో వుంటూనే వివేకానందుణ్ణి గమనించింది. కాసేపటికి ‘నాయనా! కూరగాయలు తరగాలి. అక్కడ వున్న కత్తిని కాస్త అందివ్వు అంది.

వివేకానందుడు కత్తినిచ్చాడు. ఆమె కత్తి తీసుకుని చిరునవ్వుతో ‘నాయనా! నిన్ను హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. నీవల్ల అందరికీ మేలు జరుగుతుంది. నీ ప్రయాణం విజయవంతమవుతుంది. వెళ్ళిరా’ అంది.

వివేకానందుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! నీ ఆశీర్వాదానికి, ఈ కత్తికి వున్న సంబంధమేమిటి?’ అన్నాడు.

శారదాదేవి ‘వుంది నాయనా!   నేను కత్తిని అడిగినపుడు నువ్వెలా యిస్తావో పరిశీలించాను. కత్తి పిడిని పట్టుకుని యిస్తావా? లేదా కత్తి కొనను పట్టుకుని పిడిని నావేపు పెట్టి అందిస్తావా? అని గమనించాను.

కత్తి కొనను నీ చేతిలో పట్టుకుని పిడిని నాకు అందించావు. దాన్ని బట్టి నీ తత్వం గ్రహించాను.
నీలో అనురాగముంది, అధికారం లేదు, ఆత్మరక్షణ లేదు, ప్రతీకారం లేదు. నువ్వు కత్తి కొనను పట్టుకొన్నావు. దానివల్ల నీ వేలు తెగే వీలుంది. కానీ దాన్ని నువ్వు లక్ష్యపెట్టలేదు. నీ కన్నా నా భద్రతే నువ్వు ముఖ్యంగా భావించావు. యిది చిన్ని విషయమే కావచ్చు. కానీ ఇది నీ మనస్తత్వాన్ని తెలుపుతోంది. నీకు అంతా మేలే జరుగుతుంది.

ఇతరుల మేలు కోరేవాడు ఆత్మరక్షణ గురించి ఆలోచించడు’ అంది. వివేకానందుడు శారదామాత పాదాల్ని స్పర్శించాడు.
*నేటి కధ - నా అప్పు ఎవరు తీరుస్తారు
2. *  నాలో ఉన్న శుద్ధ అంతఃకరణమే.

3. * మానవ జీవితం మూడు విధాలు


2. *  నాలో ఉన్న శుద్ధ అంతఃకరణమే.

*ఆదమరచి నేను హాయిగా నిదురించు వేళ ఒక కల గన్నాను.*

ఆ కల లో నాతో , నాలో ఉన్నవారిని కొన్ని ప్రశ్నలు అడిగాను.

అవి ఏమిటంటే:-

నీవు ఎవరు ? = నేను నేనే.     
             95
నీ  పేరు ? = బ్రహ్మము.
                      
నీ రూపు ? = నిరాకారము.
నీ రంగు ? = నిర్మలత్వం.
నీ ఊరు ? = అనంతం.
నీ చిరునామా ?=నేనే అంతా.
నీ గుణగణాలు ? =నిర్గుణం.
నీ శక్తి ?= చైతన్యం.
నీ స్వభావం ?= ఆనందం.
నీ వయస్సు  ? = అనాది.
నీ తత్త్వం  ? = ప్రేమతత్వం.
నీకు ప్రియమైనది ? = నాతొ నేను ఉండటం.
నీకు సంతోషాన్ని కలిగించేది?=మౌనం.
నీవు ఉండే నిలయం = సకల జీవుల హృదయ కమలం.
నీ బలం ? = నిశ్చలత్వం.
నీ గురువు ? = నేనే.
నీ తల్లితండ్రులు ? = నేనే.
నీ బంధువులు  ? = నేనే.
నీ తోడు నీడ ?= నేను ఒంటరిని.
నీకున్న బరువుభాధ్యతలు ? = కాళీ.
నీకున్న హద్దులు ? = హద్దులే లేవు.
నీకున్న పరిమితులు ? = నేను అపరిమితుడ్ని.
నీ వృత్తి  ? = సాక్షిత్వమ్.
నీ ధర్మం ? = సర్వ వ్యాపకత్వం.
నీ ద్రుష్టి  ? = సమ ద్రుష్టి.
............కల చెదిరింది - ఇ
ల స్ఫురణకు వచ్చింది.
అయినా నాలో ఒక  ప్రశ్న ఉదయించింది ,ఏ ఉలుకు పలుకు
లేనివారు యిన్ని ఊసులు ఎలా చెప్పారు అని....
ఈ ఊసులన్నీ...
పలికింది నాలో ఉన్న శుద్ధ అంతఃకరణమే.
నా గురువు నాలోనే అంతర్యామిగా
ఉన్నారు.
 !!బ్రహ్మార్పణమ్!!

🕉🌞🌎🌙🌟🚩

ఉదయ భాను ఉదయానికి చీకటి తొలగే😒
మనిషి మర హృదయానికి
వెల్గులు చిలికే😱
సూర్యుని తేజం పృధ్వి ని తాకి పులకరించే😇
ప్రేమమ్ము నైజం శక్తిని పెంచి పలకరించే😆
కిరణ్ కాంతికి మేఘం కరిగి వర్షించే😴
పుడమితల్లి పురుడు పోసి ప్రభవించే😵
ఆదిత్య రాకతో అంతర్ మధనం కలిగే🤗
నెలవంక రాకతో మన్మధ మధనం కరిగే👩‍❤️‍💋‍👩
గురు బోధ
.................................,.........

3. * మానవ జీవితం మూడు విధాలు


మానవ జీవితం మూడు విధాలుగా విభజింవచ్చును.
1. భౌతిక జీవితం
2. ఆధ్యాత్మిక జీవితం
3. దేనికి చెందని జీవితం.
పై 3 జీవితాలకు సరైన దిశ, నిర్దేశం ,లక్ష్యం ,లేకపోతే జీవితం మొత్తం వృధాగా మారుతుంది. ఎందుకు జివించామో ,ఎలా జీవించాం అని ఆలోచించు కుంటే జీవితం మొత్తం పూర్తవుతుంది.కాలం ముంచుకొస్తుంది. ఈ శరీరాన్ని వదిలి , ఈ భూమిని వదిలి వెళ్లి పోవడం జరుగుతుంది.
మొదటిదశ, ఆధ్యాత్మిక దశ.:
------------------------------------
ఈ దశలో సరైన గురు సాంగత్యం లేక గుడి, గోపురం తిరుగుతూ భక్తి పేరుతో ఉపవాసాలు చేయడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయించడం, తీర్థ యాత్రలు తిరగడం, నదుల్లో, సముద్రాల లోని మునగడం, మొదలగు భక్తి పేరుతో కాలం వృదా చేస్తారు.భక్తి అనునది సరైన దశ,దిశ మార్గం లేక జీవితాన్ని వృదా చేసుకుంటారు.
ఆధ్యాత్మిక జీవితం అంటే నీకు ఒక గురువు ఉండాలి, ఆ గురువు తన జీవితం మొత్తం భగవంతుని కోసమే జీవితాన్ని అర్పించిన వాడై ఉండాలి. నిరంతర సాధన చేస్తూ భగవత్ తత్వంతో ఉంటూ వారు దశ నిర్దేశం చేయగలిగిన స్థితిలో ఉండి శిష్యుని ఉద్దరించగల స్థితిలో ఉండాలి. అటువంటి వారి సాంగత్యం పొంది ,సాధకుడు నిరంతర సాధన చేస్తూ తన జీవితాన్ని మొత్తం సాధన కే అర్పితం చేసి తన ఆత్మను ఉద్దరించు కోవలెను. అప్పుడు మాత్రమే తానెవరో తెలుసుకోగలరు. అటువంటి సాధన కోసము మాత్రమే జీవితాన్ని ఆర్పితం చేయడం ఆధ్యాత్మిక జీవితం. ఈ దశలో సరైన లక్ష్యం లేకపోతే సమయం వృధాగా మరి అవసాన దశ వచ్చిన సమయంలో సరైన సాధన చేయలేకున్నానే అని బాధ పడడం జరుగుతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే సాధన అనేది జరుగుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు సాధన జరగదు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధన చేస్తే మంచము మీద ఉండగా కూడా సాధన చేయడం జరుగుతుంది. ప్రాణము శరీరాన్ని వదిలి పోయె సమయంలో  ఆత్మ పరమాత్మ తత్వాన్ని కూడి శరీరాన్ని వదులుతుంది.



భౌతిక దశ:

---------------
ఈ  దశలో జీవితం మొత్తం భార్య తోను, భర్త తొను, పిల్లల తోని, వృత్తి, వ్యాపారాలు తొని, సినిమాలో,షికార్లు, క్లబ్బులు, త్రాగుడు, జూదం, కక్షల తో, కార్పణ్యాలు తో, గొడవలతో, నేను అను అహంకారంతో, తినడం,పడుకోవడం, మైధునం చేయడం వారి జీవిత లక్ష్యంగా డబ్బు సంపాదించడం, స్థలాలు, పొలాలు ,బంగళాలు కట్టుకోవడం వంటి వాటి మీద లక్ష్యం పెట్టుకుని జీవిస్తూ, వారి జీవిత లక్ష్యం ఇదే జీవిస్తూ శరీరాన్ని వదులుతారు. వీరికి ఆధ్యాత్మిక జీవితం మీద మక్కువ నేది ఉండదు. అసలు ఆధ్యాత్మిక జీవితం వైపు చూడరు కూడా చూడరు. వీరి జీవితం మొత్తం భౌతిక జీవిత లక్ష్యం కోసమే సాధన చేస్తూ ఉంటారు. ఏదైనా సాధించగల లక్ష్యం పెట్టుకుని జీవిస్తూ ఉంటారు.అలాగే శరీరాన్ని వదులు తారు.

రెండు కానీ దశ:
--------------------

వీరు అటు ఆధ్యాత్మిక దశకు,ఇటు భౌతిక దశకు చెందకుండా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరు ఎంతసేపు అవసరానికి గుడి, గోపురం ,గురువు సాధన అంటూ తిరుగుతూ, పూజలు చేయడం , పుజరులతో పూజలు చేయించడం, అవసరం తీరిన తర్వాత వాటిని వదిలిపెట్టి సాధారణ జీవితాన్ని జీవిస్తూ, మరలా కష్టం వచ్చినప్పుడు యదా ప్రకారం గుడి గోపురం వెంట తిరుగుతూ, ఏ పుట్టలో ఏ పాము వుంది? ఎక్కడ అదృష్టం కలిసి వస్తుంది? కష్ట పడకుండా ఏ పని చేయకుండా సంపాదించాలి అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ, పెద్దలు సంపాదించిన ఆస్తులను కరిగిస్తు తిరగడం ,లక్ష్య సిద్ది లేకుండా జీవించడం, యజ్ఞ,యాగాదులు, జపాలు, హోమాలు, పూజలు, తాయత్తు,మంత్రం వంటి వాటిమీద వ్యామోహము చెందడం , కష్ట పడకుండా వచ్చే ధనార్జన  మీద వ్యామోహం పడడం వంటివి చేస్తూ ,వీటిని సాధించడం కోసం ఆధ్యాత్మిక జీవనాన్ని అవలంబిస్తున్నారు. దీని వలన తమను తాము మోసం చేసుకుంటున్నారు ,అన్న విషయం తెలిసే నాటికి సమయం కాస్త పూర్తవుతుంది.శరీర ఆరోగ్యం ఉన్నంత వరకు ఏమి చేయకుండా అంటే అటు నిజమైన ఆధ్యాత్మిక జీవితం గడపక, ఇటు నిజమైన లక్ష్య సిద్ది లేకుండా భౌతిక జీవితంలో ఏమి సాధించాలి ? ఎలా సాధించాలి? అన్న లక్ష్య సిద్ది లేకుండా జీవితాన్ని గడిపి శరీరం మంచానికి అతుక్కు పోయినపుడు బాధ పడుతూ ఉంటారు.అయ్యో నా జీవితం మొత్తం వృదా ఐనదే ఇటు భగవంతుని పొందే మార్గమును ఎంచుకొక, అటు భౌతిక జీవనం సాగించడానికి ఒక లక్ష సాధన పెట్టుకోకుండా ఎందుకు జివించా నో  తెలియకుండా శరీరాన్ని వదులుతున్న అని వాపోతు శరీరాన్ని వదులుతారు. అప్పుడు వారి మానసిక స్థితి వర్ణనాతీతం. ఎందుకంటే బౌతిక జీవితంలో వొక లక్ష్య సిద్ది కోసం జీవించి, దానిని సాధించాను అని గర్వంతో శరీరాన్ని వదులుతారు బౌతీక వాదులు, అదే ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ భగవత్ తవాన్ని తెలుసుకుని తన్ను తాను తెలుసుకుని, నేను ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకుని శరీరాన్ని వదిలి పెడుతున్నాను, జీవిత మరమార్థం సాధించాను అని ఆనందంగా శరీరాన్ని వాదులుతారు ఆధ్యాత్మిక జీవితం లో ఉన్నవారు. ఇక్కడ అటు,ఇటు కానివారు శరీరం వదిలే సమయములో వారి ఆలోచనా స్థితి వర్ణనాతీతం . ఏటు కానీ స్థితిలో శరీరాన్ని వదులుతారు.
మరి మనమందరం ఏ స్థితిలో ప్రస్తుతం ఉన్నామో,నిజముగా తెలుసుకుని ఏ మార్గాన్ని ఎంచు కుంటారు ? అన్నది మీరే నిర్ణించుకోండి....

--(() ) --

🌻 *తెలిసుకోవాల్సిన మంచి విషయాలు.....* 🌻



🍃🍒1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.

🍃🍒2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.

🍃🍒3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.

🍃🍒4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.

🍃🍒5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.


🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

 

No comments:

Post a Comment