Tuesday, 12 January 2021

15--01--2021

What If Facebook Existed During The Ramayan? Hahahahahahahahah via @BuzzFeed

 

మధురిమలు...‌సృష్టి

 

రామ ధ్యాన లోకంగా

రాగ యుక్తి భావంగా

నిత్యవెలుగు జ్యోతిగా

ఇది సంక్రాంతి పండుగా


కావ్య సృష్టి కర్తగా

కర్మ కావ్య కృషిగా

క్రియ కావ్య దృతిగా

గాలి శ్వాస భృతిగా 


గమనం జగతి స్థితిగా

గమ్యం భవిష్య దిశగా

న్యాయం మేథా కళగా

ధర్మం ఇక దీపంగా


నీవు నాకు దాహంగా

నేను నీకు లోకంగా

నడుము నియమ బద్ధంగా

జీవితం ఏకాంతముగా


 విత్తు విశ్వోదయంగా

చెట్టు సర్వోన్నతంగా

పండు సర్వాధికారాలు గా

ఆకు కాయ ఆహారంగా


పాదం పుణ్య పీఠంగా

హృదయం ధన్య రూపంగా

దీపం జ్యోతిర్మయి గా

దేహం సర్వోన్నత మయంగా

*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


మహాభారతం 13 వ భాగం సత్యవతి శంతనుల సమాగమం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తన అర్ధాంగి గంగాదేవి బిడ్డతో సహా తనను విడిచి వెళ్లిపోయినందుకు... శంతనుని హృదయం దు:ఖంతో నిండి పోయింది.
అజ్ఞానంతో చేసిన తొందరపాటుకు తనను తాను నిందించుకున్నాడు. ఆమె గురించి తన తండ్రి ప్రదీపుడు ముందే చెప్పాడు ...ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను ఆమె చర్యలలో ఏదో దైవకార్యం దాగి ఉన్నది ఆమె ఏం చేసినా నీవు ప్రశ్నించ వద్దు అన్న తండ్రి ఆజ్ఞను తానెందుకు గౌరవించలేదు.
జరిగిన కార్యానికి వగచి..... ఉపయోగమేముంది. అనుకొని స్థితప్రజ్ఞుడైన శంతనుడు, తన బుద్ధిని దారి మళ్లించాడు.బ్రహ్మచర్యమును ఆచరించడం మొదలుపెట్టాడు. పరిపాలనపై దృష్టి పెట్టి తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించసాగాడు. కేవలం సద్గుణ ప్రవర్తనను అవలంబించడం ద్వారా శంతనుడు ఆయుధాలను ఉపయోగించకుండానే ప్రపంచం మొత్తాన్ని సులభంగా జయించగలిగాడు. రాజులందరూ శంతనుడిని చక్రవర్తిగా ప్రకటించారు. అతని పాలన శాంతియుతంగా కొనసాగింది. కాంతను... వేటను మరచి . పాలన సాగించిన శంతనుడు మంచి ప్రజాదరణ పొందాడు.
ఒక రోజున ...ఆయన గంగానది ఒడ్డున నడుస్తూ వున్నాడు ..ఎందుకో...నది జలరహితమై ఉండడం గమనించాడు. నా విరహంతో గంగా ఇలా కృషించి పోయిందేమో ఏమిటి చిత్రం ఈ దృగ్విషయానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ... అది ఏమిటో తెలుసుకోవాలని ముందుకు సాగాడు. తన బాన పరంపరతో నది ప్రవాహాన్ని కట్టడి చేసిన.. ఒక అందమైన యువకుడిని చూశాడు. ఆ బాలుడు తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలానే కనిపిస్తున్నాడు ఎదురుగా ఉన్నది ..నా ప్రతిబింబమా అన్నట్లు భావన చెందాడు.... ఈ చిన్న వాడిది ఎంతటి పరాక్రమం ఈతని కన్న తల్లిదండ్రులెవరో ధన్యుఛ కదా...శంతనునికి తన కుమారుడు గుర్తుకు వచ్చి .. ఆశ్చర్యంతో కూడిన వాత్సల్యంతో హృదయం మధుర భావన తో బరువెక్కగా కంటి నీరు నింపుకున్నాడు శంతనుడు...
ప్రభూ.. అన్న తీయని కంఠం వినపడగా వెనుతిరిగి చూశాడు శంతనుడు.... ఇంకెవరు తన నెచ్చెలి గంగనే... మధురం గా భాషిస్తూ వస్తున్నది. " ఈ బాలుడు నీ బాలుడే 14 సంవత్సరాల యుక్తవయసు వాడయ్యాడు వశిష్ట మహర్షి వద్ద వేద వేదాంగాలను.... పరశురాముని వద్ద ధనుర్వేదం అభ్యసించాడు... ఈ దినాన నీవు వస్తావని నాకు తెలుసు. ఇదిగో నీ సొత్తును నీకు అప్పగిస్తున్నాను ఇక సెలవు " అని పలికింది గంగా.
పరాక్రమ వంతుడు వంశోద్ధారకుడు అయిన పుత్రుడు లభించాడనే ఆనందం ఒకవైపు... తన ప్రాణ సఖి తనను విడిచి వెళ్ళి పోతుందన్న బాధ మరొకవైపు కలగలసి కంటి నీరై జాలువారగా ...మౌనంగా ...గంగ వైపు చూస్తూ ఉన్నాడు శంతనుడు.... " మహారాజా ! జీవితం - నాటకం రెండూ ఒకటే... నీవు జ్ఞానివి అర్థం చేసుకో " అంటూ అదృశ్యమైంది గంగా....
కలకు - జీవితానికి వ్యత్యాసం ఏమిటో అర్థంకాక తన కుమారుని వెంట నిడుకొని హస్తినాపురానికి బయల్దేరాడు శంతనుడు....
రాజధాని చేరుకున్న తరువాత శంతనుడు తన పుత్రునికి దేవవ్రతుడిని నామకరణం చేసి అతనిని తన వారసుడిగా ప్రకటించి యౌవనరాజ్య పట్టాభిషేకం చేశాడు. . గంగాదేవి వంటి భార్యతో వియోగం చెందిన తరువాత కూడా శంతనుడు దేవవ్రతుడని వంటి కుమారుడిని పొందినందుకు ఆనందించాడు. దేవవ్రతుడి సాయంతో శంతనుడు యమునాతీరంలో ఏడు అశ్వమేధ యాగాలు నిర్వహించాడు.
నాలుగు సంవత్సరాల తరువాత శంతనుడు యమునా ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. ఏమిటి ఈ దివ్య పరిమళం ఎక్కడి నుండి వస్తుంది అంటూ ఆ పరిమళం వస్తున్న వైపుగా నడక సాగించాడు.అలా కొంతదూరం ప్రయాణించిన తర్వాత శంతనుడు దాసరాజపుత్రిక అయినా సత్యవతిని (యోజనగంధి) చూశాడు. ఆమె నుండి దివ్యమైన ఈ సువాసన వస్తూవున్నది......
ఆమెను చూసి చూడగానే మనసు పరవశించినది. తనవు పులకించినది...... తనలోని ఈ నూతనత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శంతనుడు......
పరమ పవిత్రమైన గంగయే తన జీవిత సర్వస్వం అనుకున్నాను ఇంకెవ్వరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు అనుకున్నాను ఇంకెవరికి ఆస్థానాన్ని ఇవ్వలేను అనుకున్నాను ఏమిటీ వింత ...నా చపలత్వమా లేక విధి విలాసమా ?!
మిత్రులందరికీ శుభ శుభోదయం

అందుకే బతికేందుకు విద్య,  సంపాదనకు శక్తి, సంసారానికి రక్తి  అని ఆ భగవంతుడే కల్పించాడు వాటిని అతిక్రమిస్తే పున్నామ నరకంలో పడతారని చెప్పాడు
వివరంగా చెపుతారా
చెపుతా విను  
 
-ఎవడు -అయోగ్యడైనవాడికి ఉపదేశించువాడు,-
ఎవడుఅతిగామర్యాదనుల్లం ఘించి సంతుష్టుడుగాయుండునో,  
ఎవడు శత్రువులను సేవించునో , -
ఎవడు స్త్రీలను రక్షించు ద్వారా శుభమును లేదా క్షేమమునుపొందు నో,
ఎవడు యాచింపదగనివానిని యాచించునో
ఎవడు ఆత్మస్తుతి చేసుకొనుచుండునో,
ఎవడు మంచికులమందుపుట్టి కూడా చేయరాని పనిని చేయునో, -
ఎవడు బలములేని వాడయ్యు బలవంతునితో నిత్యము వైరము పెట్టుకొనునో ఎవడు నమ్మకములేని వానికి ఉపదేశించునో, -
ఎవడు కోరదగనిదానిని కామించునో,
ఎవడు మామ అయియుండి కోడలితో పరిహిసమును కోరునో,
కోడలి సహాయముతో నిర్భయ ముగా జీవించుచు తనకుగౌరవము చూపవలనని కోరునో
ఎవడు ఇతరుభూమియందు తనబీజమునునాటునో,
ఎవడు మర్యాదనుల్లంఘించి అతిగా స్త్రీని దూషించునో,
ఎవడు సహాయముపొందియు గుర్తులేదు అని పలుకుచు మరపు నటించునో
ఎవడు అర్థింపబడగా దానము చేసి తన గొప్పలు చెప్పుకొనునో,
ఎవడు  అసత్పురుషులను సత్పురుషత్వమును పొందించునో , అనగా చెడ్డవారిని మంచివారుగా చిత్రించునో వీరిని యమదూతలు పాశములతో బంధించి నరకమున కు కొనిపోవును.
ఏమోనండి మనబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటుందో మరి
ఎలా ఉంటుందా కొత్తపెళ్ళాం బెల్లఁముగా ఉంటుంది మనం అల్లంగా ఉంటాం
అంతేనా
అక్షారాలా
మరి ఎట్లాగండి
కొడుకు కోడలు ఏమిచేసినా. ఏమి మాట్లాడినా బాగుంది అనటమే
అంతేనా
మన పెద్దరికమండి
పెద్దరికమ్ కాదు వాల్ళముందు అదే పేదరికం
వాళ్ళు ఆధునిక యుగంలో నేర్చుకున్న విద్యలు, సంపాదన లక్షల్లో ఉన్నది
మనది వానాకాలంలో మనభాషలో చదివిన విద్యలు అంతే వాళ్ళే మనకు సలహాలు ఇస్తారు  
అందుకని
ఆ అందుకని మన మిద్దరం అలా వాకింగ్ చేస్తూ, అలా దేవాలయంలో ఆధ్యాత్మిక   విషయాలు తెలుసుకుంటూ, మన పిల్లలకు స్వేశ్చ ఇచ్చి దేశ  సేవచేస్తూ బతికేద్దాం
అంతేనా
అంతే  
అంతేనా
అంతే  

--((***))--
 

 వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు?
1. ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారుట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను.

        వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.

       2.  ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు.

        కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడుట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.

        3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని.

అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందిట.

        ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు  ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు.

        రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడుట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది.

        అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.

--(())--

      *శ్రీ భాగవతం - 111 వ భాగం*          *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*              *శ్రీకృష్ణ లీలలు - 41*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

*శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతులను తెచ్చుట* 

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోను ఆయన చేసిన లీలలచేత లోకమునంతటిని తరింపచేయడం కోసమని మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి గల మార్గములను సుగమం చేయడం కోసమని, మనందరం కూడా ప్రాకృతికమయిన శరీరంతో వచ్చి కర్మ ఫలితం అనుభవించడం కోసం పొందే కష్ట నష్టముల వంటివి కాకుండా హేలగా కొన్ని లీలలు చేసి వాటికి అంతమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనమును ఇవ్వకపోతే అది సరియైన ఆలంబనను పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనలను తిప్పుతుంది కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము మనకు అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తివైపు నడిపించే విధానమును భాగవతమునందు ఆవిష్కరించారు. 

పూర్వం ద్వారకానగారమును కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్యయందు ఒక కుమారుడిని కన్నాడు. కాని ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. అపుడు బ్రాహ్మణుడు ఆ పిల్లవానిని తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి,  ‘నేను ఏ పాపమూ ఎరుగని వాడను ధర్మ బద్ధమయిన నడవడి ఉన్న వాడను. అయినా సరే నా కుమారుడు మరణించాడు, అంటే దేశానికి ఆధిపత్యం వహించిన రాజు దోషం వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకు ధర్మబద్ధమయిన నడవడి లేదు’ అని ఉగ్రసేనుని నింద చేసి ఆ శవమును అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి తరువాత ఆ పిల్లవాని శవమును తీసుకుని వెళ్ళిపోయాడు. 

మరల కొంతకాలము పోయిన తరువాత ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకు వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా ఎనమండుగురు కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. 

ఎనిమిదవ సారి బ్రాహ్మణుడు రాజును నిందజేస్తుండగా అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకి పుట్టిన బిద్దలందరూ కేవలం రాజు అధర్మం వల్లనే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒకమాట అన్నాడు.

“నీవు బ్రాహ్మణుడవు. నీ ఏడుపులను బట్టి ఇప్పటికి నీకు ఎనమండుగురు కొడుకులు మరణించారని నాకు అర్థం అవుతోంది. అలా మరణించిన కొడుకులను పెట్టుకుని నీవు రాజద్వారం దగ్గర ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్న వాడు ఊళ్ళో లేడు. ఈ ఏడుపు నుంచి ఉద్ధరించి నీకు పుత్రశోకము కలుగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా?” అని అడిగాడు. 

అర్జునుడు ఈ ప్రశ్నను కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్క సారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను గొప్ప విలుకాడననే అతిశయం చేత ఈ మాట వచ్చింది. 

అపుడు ఆ బ్రాహ్మణుడు ‘మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు. అనిరుద్ధుడు ఉన్నాడు, ప్రద్యుమ్నుడు ఉన్నాడు. బలదేవుడు ఉన్నాడు, ఉగ్రసేనుడు ఉన్నాడు. కానీ యిటువంటి వాళ్ళే రక్షించలేకపోయారు. నీవెవరివయ్యా యిన్ని మాటలు ఆడావు’ అన్నాడు. 

ఆ మాటలకు అర్జునునికి కోపం వచ్చింది. అపుడు అర్జునుడు నేనెవరినో తెలుసా! ఏమహానుభావుడు తన గాండీవము పట్టుకుని రెండుచేతులతో బాణములను తీసి సంధించి విడిచి పెట్టి శత్రువుల మూకలను చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుడను. నేను ఉండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడుతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా నీ కొడుకును నేను కాపాడలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని ద్వారకలో ఉండిపోయాడు.

బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభం అవుతోంది అనగానే అర్జునునకు కబురు చేశారు. ఆయన శుచియై ఒక పవిత్రమయిన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుని ఒకసారి తలచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయ బాణ తూణీరములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో బాణ పరంపరా ప్రయోగం చేశాడు. మంత్రపూరితములయిన బాణములతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లినాడు. ఇపుడు అందులోకి సూక్ష్మమయిన అణువు కూడా ప్రవేశించలేదు. అందులోంచి ఒక అణువు కూడా బయటికి వెళ్ళలేదు. ఇపుడు మృత్యుదేవత వచ్చి పిల్లవాడి ప్రాణములు తీసుకువెళ్ళడానికి వీలులేదు. అటువంటి దుర్భేధ్యమయిన రక్షణ కవచమును నిర్మాణం చేశాడు.

లోపల ఒక పిల్లవాని కేర్ మన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ‘ఏడి పిల్లవాడు’ అని అర్జునుడు లోపలికి వెళ్ళాడు. తీరా చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయం అయిపోయాడు. అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమయిన బాణ కవచము ఉన్న చోటునుండి ఈసారి శరీరం కూడా అదృశ్యం అయిపొయింది. 

ప్రాణములను తీసుకు వెళ్ళడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకమునకు వెళ్ళి ‘బ్రాహ్మణ కుమారుని తీసుకు వచ్చి ఎక్కడ పెట్టావు’ అని యమధర్మరాజు గారిని అడిగాడు. అపుడు ఆయన నేను తీసుకురాలేదు అని చెప్పారు. ఆయన ధర్మరాజు అబద్ధం ఆడడు. ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్య పోయాడు. 

అక్కడి నుండి దిక్పాలకుల లోకముల కన్నింటికి వెళ్ళాడు. అన్ని లోకములలో వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదు అని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తల వాల్చుకుని భూలోకమునకు ద్వారకా నగరమునకు తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు కోసం చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్నాడు

“వీడు పార్థుడట! వీనికి ఒక గాండీవమట. అక్షయ బాణ తూణీరములట. మంత్రపూరితమైన బాణములట. నా కొడుకును రక్షిస్తాడట. ఇన్ని చెప్పాడు. కానీ పిల్లవాడు మాయం అయిపోయాడు. నేను పట్టుకు వస్తాను అని వెళ్ళి దిగాలు మొహం వేసుకుని వస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు, బలదేవుడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందరే చెప్పాను. వాళ్ళు చెయ్యని పని నీవెక్కడ చేస్తావన్నాను. గాండీవం చూపించాడు. తనపాటి విలుగాండ్రు ఊళ్ళో లేరా అన్నాడు. 

ఈ మాటలను అర్జునుడు విన్నాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోయాడు. క్షత్రియునిగా యింతమంది మధ్యలో అధిక్షేపించబడ్డాడు. ఇంక ఈ బ్రతుకు ఎందుకు అని భావించి చితి పేర్పించుకుని అగ్నిహోత్రుని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించ బోయాడు. 

అపుడు కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడి చేయి పట్టుకుని,  ‘బావా! ఏమిటి ఈ అగ్నిప్రవేశం’ అన్నాడు. అపుడు అర్జునుడు,  ‘నేను నామాట నిలబెట్టుకోలేక పోయాను. అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్ని ప్రవేశం చేస్తున్నాను’ అని చెప్పాడు. 

అంత కృష్ణుడు ‘అంత పని చేయవద్దు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో నాతోరా నేను చూపిస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ రథమును ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథం సప్త సముద్రములను, మేరు పర్వతమును దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. ‘ఏమిటి బావా నాకు భయం వేస్తోంది. మనం ఎక్కడికి వెళ్ళాలి’ అని అర్జునుడు అడిగాడు. నీవు భయపడకు అని కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును స్మరించి విడిచిపెట్టాడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగటి వెలుతురును సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంటే వెనుక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనమును అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమయిన మనశ్శాంతి కలిగింది. పాలసముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు, నల్లటి వస్త్రమును కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద తన కుడిచేతిని హేలగా శిరస్సు క్రింద పెట్టుకుని పడుకుని ఉండగా ఆదిలక్ష్మి పాదములు ఒత్తుతున్నది. అటువంటి స్వరూపమును కృష్ణార్జునులు దర్శనం చేశారు. అటువంటి మూర్తి దర్శనం అప్పటి వరకు అర్జునుడు చెయ్యలేదు. అది శ్రీమన్నారాయణుని దర్శనం. ఆయనే శ్రీమహావిష్ణువు. అందులోంచి అంశగా శ్ర్తీకృష్ణ భగవానుడు వచ్చాడు. ఆ శ్రీమహా విష్ణువును దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు.

అటువంటి మూర్తిని దర్శించిన తర్వాత ఆయన *‘నరనారాయణులారా! రండి’* అన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరకు వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఈ కోర్కె తీర్చాలి. అర్జునునకు కలిగిన కించిత్ గర్వమును అణచాలి. అందుకని బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చాను. ఇదిగో వాళ్ళు యిక్కడే ఉన్నారు అని చూపించాడు. వారి అదృష్టమేమిటో గానీ ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణుని పాదముల దగ్గర కూర్చుని స్తోత్రము చేసుకుంటూ ఆయన పాదములకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. 

పిమ్మట శ్రీమహావిష్ణువు మునుల వైపు తిరిగి ‘మునులారా మీ కోర్కె తీరిందా’ అని అడిగాడు. ఆ బ్రాహ్మణ కుమారులనందరినీ కృష్ణుడి చేతికి ఇచ్చి ఈ పిల్లలను తీసుకుని నీవు భూమండలమునకు వెళ్లి ఆ బ్రాహ్మణునకు అప్పజెప్పు’ అన్నాడు. ఏ మహానుభావుడి దర్శనమును యోగీంద్రులయిన వారు కూడా తమ మాంస నేత్రముతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయనను చూస్తూ ఆయనను సేవిస్తూ లక్ష్మీ దేవి పెట్టిన అన్నం తింటూ ఆయనను భజించిన మహా పురుషులయిన బ్రాహ్మణ పిల్లలను తన రథంమీద కూర్చో పెట్టుకుని తిరిగి భూమండలమునకు కృష్ణ భగవానుడు తీసుకువచ్చాడు. ఆ నాడు అర్జునునకు కలిగిన కించిత్ ఆవేశమూ తగ్గింది. ‘నా అంత గొప్పవాడు లేడు’ అనే భావనా తగ్గింది.

మనం ఒక్కొక్కసారి మనలను నిరంతరం రక్షించే పరమేశ్వరుడిని కూడా మర్చిపోతాము. ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తుంది. యథార్థమునకు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉంది. కానీ కృష్ణుడు అర్జునుని ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్నిప్రవేశం చేసేటంత స్థితికి వచ్చేవరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేశాడు అంటే అహంకారం పోయిందన్నమాట. అతిశయం పోయిన తర్వాత యింక తనవాడిని తాను రక్షించుకోవాలి. అపుడు గబగబా పరుగెత్తుకు వచ్చి రక్షించుకుని అర్జునునకు మరల యింత సత్కారమును చేయించి బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చి బ్రాహ్మణునకు అప్పచెప్పాడు. 

ఆ భగవానుడిని నమ్ముకున్న వాళ్ళకు లోటేమి ఉంటుంది. మనం ఆ స్వామిని నమ్మి ‘నా స్వామి ఉన్నాడు’ అనే పూనికతో ఉంటే, ఎప్పుడయినా తెలియక మనవల్ల ఏదయినా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పును తండ్రి దిద్దుకున్నట్లు ఆయనే దిద్దుకుని మనను రక్షించుకుని తన వస్తువుగా మనలను మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగిన పరమ పవిత్రమయిన లీల.

          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య**నాగ సుబ్బయ్య పైడి*  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

మధురిమలు .. భద్రతే (111-- 120)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

  

మనసు మంచిదైతే

మనుగడకు భద్రతే

నడక మంచి దైతే

నడవడిక ద్రతే


కలలు నీకు నిజమయితే 

కలలకు లేదు భద్రతే 

కథలు వ్రాయు బతుకైతే 

కలల బతుకుకు భద్రతే 


కష్ట ఫలం లేకపోతే 

శ్రమఫలము భద్రతే 

నిత్య భుక్తి నష్ట మైతే 

ఓర్పు ఫలించు భద్రతే 


కాల మెపుడూ నీదైతే  

చేసే పనికి భద్రతే 

కాలమాయకు చిక్కితే 

మంచికుండదు భద్రతే 

   

బంగారు కళ నీదైతే 

నెల తల్లికి  భద్రతే 

కనకాభిషేక మయితే 

సంక్రాంతికి భద్రతే


ఆనందం సొంతమైతే 

అవకాశమ్ము భద్రతే 

అన్నదాత నీవైతే 

అవని కాంతి భద్రతే


నిరాశ ఆవహించితే  

బ్రాంతి తొలగితె భద్రతే 

రైతే రాజు అయ్యితే 

ఆహారం భద్రతే  


సర్దుబాటు నీదైతే 

జీవితానికి భద్రతే 

అహంకారం నీదైతే  

మనసు కుండదు భద్రతే 


తండ్రిని గౌరవించితే 

జీవితమంత భద్రతే 

తల్లిపై ప్రేముంచితే 

ఆహారముకి భద్రతే 


నమ్మక బతుకు నీదైతే  

భార్య పిల్లల భద్రతే

దేవుని పైన భక్తైతే    

నిత్య సుఖముకు భద్రతే

  

--(())--

 ఆ పరమేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణములు మనందరిపై ప్రసరించి సకల శుభములు కలుగవలెనని కోరుచూ మీకూ మీ కుటుంబసభ్యులందరకూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


సీ.భోగ భాగ్యము లిడు “భోగి”  “మకరసంక్ర

 మణము” మనకిడుత మహిత కీర్తి

 కనుమ శుభములెన్నొ “కనుమ” పండుగయిడ

 ఆయురా రోగ్యముల్ హాయి నీయ.

 సంక్రాంతి కాంతులు సమ్మోహ పరుపంగ

 మన జీవితంబుల మధువు లొలక

 అంబరమును దాకు సంబరముల వోలె

 . పల్లెపల్లెల యందు పరగుచుండ

 క్రొత్తయల్లుళ్ళతో గ్రొంగొత్త హంగుల

 హృదిని హత్తుకొనుచు నాదరింప

 ఇంటి ముంగిట జేరి యింతు లందరు వేయ

 ముత్యాల ముగ్గుల ముచ్చటగుచు

కల్లకపట మెరుంగని పిల్ల వాండ్ర

 అల్లరుల వల్లరులనంగ నుల్ల మందు

 తీయ తీయనగుచుఁ బెనవేయు చుండ

 రావ! సంక్రాంతి మహలక్ష్మి కావ మమ్ము.


రచన...

శ్రీ తోపెల్ల.బాల సుబ్రహ్మణ్య శర్మ

మాధవ పట్నం... కాకినాడ


శుభాకాంక్షలు

సమర్పణ‌..వేపా.పార్వతీశం

హైదరాబాద్

 .......

సూర్యుడికి పల్లెసీమలు సమర్పించే కృతజ్ఞతాంజలి.. సంక్రాంతి "సంక్రాంతి వైభవం"

సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని "ఉత్తరాయణ పుణ్యకాలం"గా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో.. ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. ఈ సంక్రమణ ఘడియలకు ముందు వెనకల కాలమంతా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యమున్నా, పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది. 

2021మకర సంక్రమణ(సంక్రాంతి) ముహూర్త నిర్ణయం

2021 శ్రీ శార్వరినామ సంవత్సర మకర సంక్రాంతి

స్వస్తి శ్రీ చంద్ర మాన శ్రీ వికారి నామ సంవత్సర పుష్యమాస బహుళ పంచమి బుధవారం అనగా ది.. 14- జనవరి – 2021 న తేది  రవి [సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును మరియు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. రాత్రి సంక్రమణం కావునా 14 జనవరి 2021 తేది గురువారం మకర సంక్రాంతి  చెయవలయును. జనవరి 14 గురువారం నాడు ఉదయం 8.14 గంటలకు ముహూర్తం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6.54 గంటల వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది. ఇది బ్రాహ్మణులు, ఉపాధ్యాయులు, రచయితలు, విద్యార్థులకు ప్రయోజనకరంగా, శుభకరంగా ఉంటుంది. సంక్రాంతి రోజు ఉదయం 6.24 గంటల ముందే పుణ్యం కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంతో కలిసి సంక్రాంతి స్నానం చేయడం ఈ ఏడాది జరుగుతుంది. ఈ రోజు సంక్రాంతికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మద్యాహ్నం 02.38 గంటల నుంచి మంచిది. తద్వారా స్నానాపానాలు, దానాలు చేసుకోవచ్చు. 

మకర సంక్రాంతి తేదీలు మారడానికి అసలు రహస్యమేమంటే.. సూర్యుడు వేగం ఏడాదికి 20 సెకన్లు పెరుగుతుంది. దీని ప్రకారం 5 వేల సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతి జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో జరుపుకునే అవకాశముంది. మకర సంక్రాంతికి సూర్యుడి రాక 14వ తేదీ ఉదయం జరుగుతుంది. కాబట్టి మకర సంక్రాంతిని ఈ ఏడాది జనవరి 14 అంటే గురువారం నాడు జరుపుకుంటారు.

ఈ సారి మకర సంక్రాంతి చాలా ప్రత్యేక విషయమేమంటే సూర్యుడు కుమారుడైన శని సవ్యంగా మకరంలో సూర్యదేవుడిని స్వాగతిస్తారు. గురుడు, బుధుడు, చంద్రుడు, శనితో పాటు సూర్యుడు కూడా మకరంలో ఉండటం వల్ల పంచగ్రహాల కలయిక ఏర్పడుతుంది. గ్రహాల ఇలాంటి కలయిక చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే గురువులు, రాకుమారులు, న్యాయమూర్తులు, గ్రహాల నక్షత్రరాశులు అందరూ కలిసి ఉంటాయి. సూర్యుడు శ్రావణ నక్షత్రంలో మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఇది శుభసంకేతాన్ని సూచిస్తుంది. మకరంలో సూర్యుడు ప్రయాణం వల్ల దేశ రాజకీయాల్లో అధికార పార్టీ ప్రభావం పెరుగుతుంది.

"తిల సంక్రాంతి"గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాక తెల్ల నువ్వుల్ని, మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకొనే సంప్రదాయం ఉంది. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో పంట చేతికందే సందర్భమిది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి. దైవీయమైన పవిత్రతతో పాటు, మానవీయమైన సత్సంబంధాల సౌహార్దమూ ఈ పండుగల సత్సంప్రదాయాల్లో మేళవిస్తుంది. 

రంగవల్లుల శోభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది. ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు- సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను, ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యముంది. ఈ పుణ్యదినాన పంచుకున్నవి, ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తోంది. 

కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా- మంచి వృష్టిని, ఆరోగ్యాన్ని, సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి. ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం, నువ్వుల నూనె దీపం, బియ్యం కలిపిన తిలలతో పూజ, తిలలతో కూడిన పదార్థాల నివేదన- శాస్త్రం చెప్పిన విధులు. పుణ్యస్నానాలకు మకర మాసం (చాంద్రమానం ప్రకారం రానున్న మాఘం) ప్రముఖ మైనది కనుక- ఈ రోజు నుంచి నదీ స్నానాదుల్ని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే గంగా-యమునా-సరస్వతుల సంగమమైన త్రివేణీ తీర్థస్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం.

 ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం. అది కుదరనివారు గృహంలో భగవత్‌ స్మరణతో, స్నానమంత్రాలతో స్నానం చేస్తారు. దానాల్లో ఈ రోజున వస్త్రధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతోంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి... ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసనను పేర్కొన్నారు. 

సూర్యుణ్ని నారాయణుడిగా; శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా సంభావించారు. సంక్రాంతినాటి సూర్య శోభయే కాక, పంటల శోభ, సంపదల పుష్టి... అన్నీ కలిసి సంక్రాంతి లక్ష్మీభావన. శాస్త్రీయమైన సత్కర్మలు, సంప్రదాయసిద్ధమైన కళలు, ఉత్సాహాల ఉత్సవాలు, బంధుమిత్రుల ఆత్మీయతల వేడుకలు.. వెరసి సంక్రాంతి వైభవాలు!

మిత్రమా

శారీరకపరంగా ఆరోగ్యమే మహాభాగ్యం

మానసికపరంగా ప్రశాంతతే మహాభాగ్యం

సామాజికపరంగా ప్రాణమిత్రులుండటమే మహాభాగ్యం

👁ఆధ్యాత్మికపరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే మహాభాగ్యం

ఆహారపరంగా రెండు పూటలా రుచికరమైన తిండి వుండటమే మహాభాగ్యం

కుటుంబపరంగా పరస్పరానుకూల దాంపత్యం కలిగి వుండటమే మహాభాగ్యం

ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలనూ, చెట్లనూ పెంచగలగడమే మహాభాగ్యం

🕊🐄పక్షులనూ, జంతువులనూ పోషిస్తూ, వాటిని సంరక్షిస్తూ వుండగలగడమే మహాభాగ్యం

రోజంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం

ప్రతిరోజూ చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం

సంగీతానికి మైమరచి అప్పుడప్పుడూ నృత్యం చేయగలగడమే మహాభాగ్యం

రోజుకో ఆట, అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం

మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం

రోజుకో గంటసేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మాహాభాగ్యం

రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం

రోజుకో గంటసేపు మౌనంగా ఉండటమే మహాభాగ్యం

మనకు తెలిసినవి ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం

కొండల్లో, లోయల్లో, అడవుల్లో ఏకాంతంగా వుండగలగడమే మహాభాగ్యం

నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా వుంచుకోగలగటమే మహాభాగ్యం

ప్రతి సూర్యోదయాన్నీ, ప్రతి సూర్యాస్తమయాన్నీ, పున్నమి ప్రశాంతతనూ ..

ప్రకృతి అందాలను కనులవిందుగా అనుభవించగలగడమే మహాభాగ్యం 👀

నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం

చిన్నపిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం. 

--(())--

ఆత్మీయులకు నమస్సుమాంజలులు ఆ భగవంతుడు మిమ్ము సర్వదా రక్షించుగాక దయచేసి మీరు వాహనం నడిపేటప్పుడు ఫోన్  మాట్లడవద్దు

లోకాసమస్తా సుఖినోభవంతు

ఎల్లప్పుడూ మీ మేలు కోరే మీ ప్రాంజలి ప్రభ



No comments:

Post a Comment