Thursday, 14 January 2021

16-01-2021

 

            నేటివిశేష " Pranjali Prabha"

       గురు మౌఢ్యమి ప్రారంభం
ఉత్తరాయణ పుణ్యకాలం - విశిష్టత
‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది.
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’

మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.
‘‘రవి సంక్రమణే ప్రాపే న
న్నా యాద్యన్తు మానవః
సప్త జన్మసు రోగీ స్యా
నిర్దేనశే్చన జాయతే’’

అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…

ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది.... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం...

               🌸శుభమస్తు🌸
       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏 

మహా భారతం 14

ఒకరోజు శంతనుడు యమునానదీ తీరంలో యోజన గ్రంధిని చూసి ఆమెపై మనసుపడ్డాడు . ఆమెను వివాహమాడ నిశ్చయించి యోజన గ్రంధితో ఆమె తండ్రి అయిన దాశరాజు ఇంటికి వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు.అందుకు దాశరాజు సంతోషించినా సత్యవతిని శంతనునికి ఇవ్వడానికి ఒక నిభంధన పెట్టాడు. తన కూతురైన సత్యవతి కుమారులను చక్రవర్తిని చేయాలన్నది ఆ నిబంధన. శంతనుడు గాంగేయుడైన దేవవ్రతుని విడిచి వేరొకరిని రాజ్యాభి షిక్తుని చేయడానికి మనస్కరించక విచారిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. దేవవ్రతుడు తనతండ్రి విచారం గ్రహించి మంత్రుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని
ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు. అతడు దాశరాజు వద్దకు వెళ్ళి తన తండ్రి శంతనునికి సత్యవతిని ఇమ్మని అడిగాడు. దాశరాజు దేవవ్రతునితో " ఆమె ఉపరిచర మనువు కుమార్తె అని ఆమెను శంతనునికి ఇవ్వాలన్నది ఊపరిచర మనువు అభిమతమని చెప్పాడు. అందువలన ఆమెను దేవలుడు అడిగినా ఇవ్వలేదని చెప్పాడు. ఆ తరువాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మతిస్తేనే వివాహమని చెప్పాడు. గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్నవారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులని చెప్పాడు. కానీ దాశరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అని సందేహం వెలిబుచ్చాడు. అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అలా గాంగేయునికి భీష్ముడనే కారణ నామధేయం కలిగింది. ఆ తరవాత దాశరాజు శంతనునితో సత్యవతి వివాహం జరిపాడు. తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనంద పడిన శంతనుడు భీశ్ముుడికి ఇచ్ఛామరణం అనేవరాన్ని ఇచ్చాడు.

ఆ తరవాత శంతనునికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారి చిన్న వయసులోనే శంతనుడు మరణించాడు. భీష్ముడు తమ్ములను పెంచి పెద్ద చేసాడు. చిత్రాంగదుని చక్రవర్తిని చేసాడు. అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు. తరవాత భీష్ముడు విచిత్రవీర్యుని చక్రవర్తిని చేసాడు. కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడు అక్కడకు వెళ్ళి సాళ్వుడితో సహా అక్కడకు వచ్చిన రాజులను జయించి వారిని తీసుకు వెళ్ళి విచిత్ర వీర్యునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో అంబ తను సాళ్వుని ప్రేమించినట్లు భీష్మునితో చెప్పింది.వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు ఆమెకు బ్రాహ్మణులను తోడిచ్చి సాళ్వుని చెంతకు పంపి అంబిక, అంబాలికలను మాత్రం విచిత్ర వీర్యునకిచ్చి వివాహంచేసాడు. విచిత్ర వీర్యుడు భోగ లాలసుడై చివరకు మరణించాడు. ఇలా రాజ్యం రాజులేనిది అయింది.

ఒక రోజు సత్యవతి భీష్ముని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం కనుక పట్టాభిషిక్తుడై వివాహం చేసుకుని వంశోద్దరణ చేయమని కోరింది. భీష్ముడు తాను ఆడిన మాట తప్పనని చెప్పి వంశోద్దరణ కోసం దేవరన్యాయం పాటించమని తల్లికి నచ్చ చెప్పాడు. ఉదాహరణగా పూర్వం పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందు సంతానం పొంది వంశాలను నిలిపారని చెప్పాడు. అలాగే బృహస్పతి ఒక రోజు తన తమ్ముడైన ఉతధ్యుని భార్య మమతపై మనసు పడగా అప్పుడు ఆమె గర్భస్థ శిశువు దానికి అభ్యంతరం చెప్పగా అతనిని పుట్టు గుడ్డివి కమ్మని బృహస్పతి శపించాడు. అతడే దీర్ఘతముడు. అతడు గుడ్డి వాడైనా వేదవేదాంగాలనూ అభ్యసించాడు. అతని భార్య ప్రద్వేషిణి. అతనికి చాలా మంది పుత్రులు కలిగినా భార్య అతనిని ద్వేషిస్తూ ఉంది. చివరికి ఆమె అతనిని ఇక భరించలేనని తనను విడిచి వెళ్ళమని చెప్పింది. దీర్గతముడు ఆమెపై కోపించి " స్త్రీలు ఎంతటి వారైనా భర్త లేని ఎడల అలంకార హీనులులై బ్రతుకుదురుకాక " అని శపించాడు. అందుకు కోపించిన ప్రద్వేషిణి తన కొడుకులతో చెప్పి వారితో దీర్గతముని తాళ్ళతో బంధించి నదిలోకి త్రోసి వేయించింది. అతడు వేదాలు వల్లెవేస్తూ నదిలో కొట్టుకు పోతున్నాడు .అది చూసిన బలి అనే రాజు అతనిని విడిపించి తనతో తీసుకు వెళ్ళాడు. బలి దీర్గతమునితో సంతాన హీనుడినైన తనకు ఉత్తమ బ్రాహ్మణుడివయిన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు. దీర్గతముడు అందుకు అంగీకరించాడు. అతనిద్వారా సంతానము కని ఇవ్వమని భార్య అయిన సుదేష్ణను కోరాడు. సుదేష్ణ దీర్గతముని చూసి అసహ్యపడి అతని వద్దకు తన దాసీని పంపింది. దాసీకి అతని వలన పదకొండు మంది కుమారులు కలిగారు. దీర్గతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుదేష్ణను తిరిగి అతని తగ్గరకు పంపాడు విధిలేక సుదేష్ణ అతని వలన ఒక కుమారుని కన్నది . అతడే అంగరాజు. కనుక విధిలేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మ విరుద్దం కాని అనాదిగా వస్తున్న ఆచారమని కనుక ఉత్తమమైన బ్రాహ్మణుని తీసుకు వచ్చి వంశోద్దరణ మార్గం చూడమని భీష్ముడు సత్యవతితో చెప్పాడు.

భీష్ముని సలహా విన్న తరవాత సత్యవతికి తనకు పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు. ఆవిషయం భీష్మునకు చెప్పింది. వ్యాసుడు సమస్త ధర్మాలూ తెలిసిన వాడు. మహాతపశ్శాలి వేదవేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకు సంతానం ప్రసాదించగలడు అని చెప్పింది. ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్ధించింది. వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు. సత్యవతి వ్యాసునకు పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి తనకు మనుమలను ఇచ్చి వంశోద్దరణ చేయమని కోరింది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తానని చెప్పి"తల్లీ! నీకోరిక ధర్మసమ్మతమే కాబట్టి తీరుస్తాను. అయితే రానులిద్దరిని ఓ సంవత్సరము పాటు నేను చెప్పినట్లు వ్రతమును ఆచరించమను. అప్పుడే వారు నా తేజస్సును భరించ గలుగుతారు" అని అనగ సత్యవతి "నాయనా! అంతకాలం రాజు లేకుండా వుంటే రాష్ట్రంలో అరిష్టము లేర్పడతాయి. కాబట్టి ఏమి చేస్తే రాణులు త్వరగా గర్భవతులు కాగలరో ఆ ప్రకారం చేయి. వారిని భీష్ముడు పెంచి పెద్దచేస్తాడు" అని అన్నది.అంత వ్యాసుడు నా శరీర గంధాన్ని, రూపాన్ని, వేషాన్ని, శరీరాన్ని భరించ గలిగితే అంబిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు" ననగా సత్యవతీ దేవి పెద్దకోడలైన అంబికను ఎలాగో సమ్మతింప జేసి అలంకరించి వ్యాసుని వద్దకు ఏకాంతంగా పంపగా ఆమె సన్నని నల్లని జఠలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కన్నులను మూసుకున్నది. అందువలన ఆమెకు మహాబలవంతుడైన కుమారుడు పుడతాడు, కానీ అతడు తన తల్లి చేసిన దోషం వలన గ్రుడ్డి వాడుగా పుడతాడని చెప్పగా సత్యవతి " నాయనా! గ్రుడ్డివాడికి రాజ్యార్హత ఉండదు గదా కాబట్టి మరొక బిడ్డను ప్రసాదించు" మనగ వ్యాసుడు సంతసించాడు. సత్యవతి రెండవ కోడలైన అంబాలికను ఒప్పించి పంపగా ఆమె వ్యాసుడిని చూసి భయంతో తెల్లబోయింది. తనను చూసి తెల్లబోయింది కాబట్టి పాండు వర్ణం తో పుడతాడని చెప్పాగా సత్యవతి మరొక బిడ్డకోసం కోరగా సరేనని వ్యాసుడు నిస్కమించాడు. అంబిక గ్రుడ్డి కొడుకును కన్నది. అతడే ధృతరాష్ట్రుడు. అంబాలిక పాండు వర్ణంతో బిడ్డను కన్నది అతడే పాండురాజు. అంబికకు గుడ్డి వాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి ఇంతకు ముందే వ్యాసుడిని మరొక్క కుమారుని ప్రసాదించమని ప్రార్ధించి నందున తిరిగి అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అయితే అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించినా ఆ మహర్షి రూపాన్ని, తేజస్సును తలచుకొని భయపడి తన దాసీని అలంకరించి వ్యాసుని వద్దకు పంపగా ఆమె వ్యాసుడికి సకల సేవలు చేసి సంతోషింప జేసింది. వ్యాసుడు తల్లికి విషయం తెలియ జేసి ఈమె కడుపున పండిత శ్రేష్టుడు, ధర్మస్వరూపుడు పుడతాడని తెలిపి నిష్కమించాడు. ఆ దాసీకి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు. అతడే విదురుడు.అది విన్న జనమేజయుడు మాండవ్య ముని యమధర్మ రాజుకు శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయనుని అడిగాడు
.
మాండవ్యముని వృత్తాంతం సవరించు
మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు. 

సమ్మోహనాల... సంక్రాతి (1121-1130) 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంక్రాంతి సంబరం
సంబరం మానసం
మానసం సుఖశాంతిమయం మనకు ఈశ్వరా

పంట ఇంటికి వచ్చు
వచ్చి పండుగ తెచ్చు
తెచ్చి పిల్లలు పెద్దలు సందడిఈశ్వరా

భోగ భాగ్యము కలుగు
కలుగు సంతోషమగు
సంతోషపు వెల్లువ సంక్రాంతి ఈశ్వరా

మకరసంక్రణము ఇది
ఇది శుభములొసగునది
శుభాలొసగే శోభ సంక్రాంతి ఈశ్వరా

ఆయురారోగ్యముల్
ఆరోగ్య జీవముల్
జీవుల సమ్మాహపరకాంతులు ఈశ్వరా

అంబరమ్మున కాంతి
కాంతి ‌జ్వాల శాంతి 
శాంతీ సంబరమ్ము సంక్రాంతి ఈశ్వరా

గ్రొంగొత్త హంగులతొ
హంగు ఆర్భాటం తొ
ఆర్భాటం గా అల్లుళ్ళె ఈశ్వరా

స్త్రీలు వేసే ముగ్గు
ముగ్గు ముంగిట ముగ్గు
ముగ్గుల తొ చూపె  స్త్రీల ఓర్పు ఈశ్వరా 

బావ చీర తెచ్చే   
తెచ్చె చీర ఇచ్చే 
ఇచ్చే మరదలికి సంతసమే ఈశ్వరా 

ఇల్లంతా సందడి 
సందడి తో సుఖపడి 
సుఖపడి సంతోషాలు వెల్లువ ఈశ్వరా 

--(())--


  చూసినారా, చూడకపోతే చూడండి   

ఏమిటండి  కులం అని వాపోతారు మీరు  కులంలో ఏముంది
కులపెద్దలు కొన్ని లక్షణాలు తో అనుకరిస్తునన్నారు అంతె  కానీ కులంలో ఏమీ లేదు అని నా భావనా
ఏమిటే అట్లా మాట్లాడుతున్నావ్ అని. సుభద్రను అన్నాడు భర్త పరాంకుశం
ఎవరున్నా వింటారు,  అసలే గోడలకు చెవులున్నాయి
ఉంటె నాకేంటి .   మనిషిని  మనిషిగా గౌరవించలేని కులం కులమే కాదు

ఏమిటే ఇపుడు నిన్నెవరన్న అగౌరపరిచారా అట్లా  వాపోతావ్
చూడండి పేపర్ నిండా    సెవ రాజకీయాలు కాదే అవి సేవ రాజకీయాలు
చనిపోయిన వాణ్ని మెచ్చుకోవటం అట్లావుంచి,  కారణాలు వెతికి సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇదండీ ఈ  లోకం అసలు పాయింటుకు రా ముందు పొద్దున్నే కులం గురించి దీనికే దేనికా మన పుత్రరత్నం వేరేకులస్తుల పిల్లనుప్రేమించి పెళ్లి చేసుకొని వస్తున్నాడు కాబట్టి ఆ ఏమిటి నీవనేది అక్షరాలా నిజం అట్లైతే మనల్ని గుర్తించి గౌరవిస్తే చాలు గదే  ఈ వయసులో అమ్మయ్యా  ఇందాకడ్ని0చి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అని అంలోచించి ఇప్పుడు చెప్పా మీకు అసలే బి. పి  షుగర్ కదా కోపం తెచ్చుకుంటారని పిచ్చి నా శ్రీమతి నేచెపుతున్నా విను మనం పిల్లలను కంటాం గాని వాని బుద్దులు కనలేము కదా ఆ భగవంతుడు ఎట్లారాసి పెడితే అట్లా నడుచుకునే కీలుబొమ్మలం మనం  
ఉషోదయంలా కష్ట పడదాం చంద్రోదయంలా చల్లని వెన్నెలను ( అనగా మనలో ఉన్న శక్తితో అందరికీ చల్లదనాన్ని అదిందాం ) అవునండి  మీరు చాలా మంచివారు సరే సరే మన ప్రబుద్ధుడు ఎప్పుడు పెళ్ళంతో వస్తున్నాడు ఆహ్వానించాలిగా ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాగా సరే ఇట్లా కూర్చో మన ప్రవర్తన వల్ల ముందు బయఁట పడకుండా  వాళ్ళని బయఁట పెట్టకుండా జాగర్త పడుటే నిజమైన కులం భక్తి అంటే ఏంటో తెలుసా?

 భక్తి అంటే ఓ పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది.

 భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగ పేర్కొన్నది. భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

1. శ్రవణ భక్తి: ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వానం పెరుగుతుంది.

2. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది.

3. స్మరణ భక్తి: భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకుని స్మిరించుట స్మరణ భక్తి.

4. పాదసేవన భక్తి: భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం.

5. అర్చన భక్తి: ప్రతిరోజూ తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి.

6. వందన భక్తి: వందనం అనగా నమస్కారం. తన యందు మనసు నుండి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించారు.

7. దాస్య భక్తి: ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధల
తో పూజించాలి.

8. సఖ్య భక్తి: సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు.

9. ఆత్మ నివేదన భక్తి: ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం.

--(())--

🌻 *పుష్య మాసం, సంక్రాంతి విశిష్టత…….* 🌻

🍃🌺చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. 

🍃🌺శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు.

🍃🌺ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. 

🍃🌺పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాలు తొలగి శుభఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి . ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని చెప్పబడింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్య మాసం లోనే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించేది ఈ మాసం లోనే. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశి లో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

🌻 *సంక్రాంతి సంప్రదాయాలు.🌻

🍃🌺హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.

🍃🌺ముగ్గులు…..ఓర్పును నేర్పే కళ…ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. 

🍃🌺అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.


🌻 *భోగిమంటలు.* 🌻

🍃🌺వ్యామోహానికి నిప్పు

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. 

🍃🌺ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. 

🍃🌺ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

🌻 *గంగిరెద్దులు, హరిదాసులు….* 🌻

🍃🌺భిక్షానికీ ఓ ధర్మం..

ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

🌻 *గుమ్మడికాయ….* 🌻

🍃🌺తీగల్లా అల్లుకుపోవాలి..

ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

🌻 *గొబ్బెమ్మలు….* 🌻

🍃🌺అసహ్యం నుంచి అద్భుతం

కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .

🌻 *భోగిపండ్లు* 🌻

🍃🌺యోగిత్వం.. బదరీఫలం

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. 

🍃🌺ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.

🍃🌺బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

🌻 *గాలిపటం.* 🌻

🍃🌺దారంలాంటిది జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. 

🍃🌺అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

🌻 *కోడిపందేలు.* 🌻

🍃🌺యుద్ధనీతిని గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

🌻 *పశు పూజలు* 🌻మ

🍃🙏శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹

మధురిమలు (121--130) 

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


సరిగమ ల గానమే 

సంసారికి సహనము 

ఆనంద  గీతమే 

అందరిలో సహనము 

సుందర స్వప్నమే 

ఆనందాల మయము 

సంతోష గానమే 

మాధుర్యమ్ము తత్త్వము  


చిరుహాస జీవితము 

నిత్యమూ  యవ్వనము 

యవ్వనాల సహనము 

బిడ్డలే  సంతసము 


అనుక్షణము పాఠము 

పాఠము జీవితాశయము 

పలుకులో ఉంది వేదము 

వేదమే జీవి సమరము 


తొలగిం చాలి భయము  

శ్రమయే  నిరంతరము  

చేయకూ అపాయము

చేరకు కల వలయము 


నగవు చిద్విలాసము

కన్నుల శృంగారము  

మొఖిక సౌందర్యము 

మదిలో మాధుర్యము 


మంచికి నియంత్రణము 

చెడుకు ప్రభంజనము 

గ్రహించు ఏది మనము 

ఉంచాలి నిగ్రహము 


ఆదరణ సద్గుణము 

ఆత్మీయత అభయము 

మనిషి ఔదార్యము 

త్వజించుము దుర్గుణము


మనిషికుండు విజ్ఞానము 

మారుచుండు అజ్ఞానము 

బోధ అగును అనుక్షణము 

మంచి చెడుల వ్యత్యాసము 


దేన్నైనా నేర్చుకొనుము 

నేర్చుకున్నదే పంచుము 

పంచుటలో సంతోషము  

సంతోషము  సగము బలము 


--(())--

🌻 *_ఈరోజు కనుమ ఈరోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మన దోషాలు అన్ని తొలగిపోతాయని శాస్త్ర వచనం ..!_* 🌻



💫🌹సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాత లకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు. దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. 


💫🌹అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.


💫🌹కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత...


💫🌹గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..


💫🌹మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.


💫🌹అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.


💫🌹కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలెను.



🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼

*శాంతం స్వర్గతుల్యం*

మనిషి కొండంత విలువను పోగొట్టేది గోరంత కోపం. కోపం వచ్చిన మనిషి విచక్షణను కోల్పోయి పశువుగా మారతాడు.

కోపాన్ని జయించిన మనిషి గోవిందుడు. జనం అతణ్ని మెచ్చుతారు. అతడి సాంగత్యాన్ని ఇష్టపడతారు. సప్త రుషుల్లో విశ్వామిత్రుడు, జమదగ్ని ఉగ్రస్వభావులు. కశ్యప, అత్రి, భరద్వాజ, గౌతమ, వసిష్ఠులు సాధుపుంగవులు. మునుల్లో దుర్వాసుడు ముక్కోపి.

పుడమిపై పాపభారం పెరిగి, పుణ్యాత్ములు హింసపడుతుంటే భగవంతుడికీ కోపం వస్తుంది. పర్యవసానమే- అవతారాలతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నెరపడం. శాంతం మనిషి ముఖాన్ని, రూపాన్ని ఉద్దీపింపజేస్తుంది. ధ్యానంలో ఉన్న బుద్ధభగవానుడి ప్రశాంత వదన దర్శనం మానవుడిలోని కోపాన్ని నశింపజేస్తుంది.

నవరసాల్లో వీరం, భయానకం, బీభత్సం, రౌద్రాలకు కారణం కోపమే! తన కోపమే తన శత్రువు అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. కోపం మనిషిని ఏకాకిని చేస్తుంది. పనులకు విఘాతం కలిగిస్తుంది. సమాజ జీవి అయిన మనిషికి పదిమంది శ్రేయోభిలాషులుంటేనే సంఘజీవనం సంతోషదాయకం అవుతుంది. పరిస్థితులన్నీ ఎప్పడూ ఒక్కలాగా ఉండవు. ఒక్కోసారి అనుకోని విధంగా, ఆయా విపత్కర సమయాలు మనిషి కోపానికి హేతువులవుతాయి. అలాంటప్పుడే సంయమనం పాటించి, మనసును నియంత్రించుకోవాలని మానసిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తారు.

సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తికి అహంకారంతో కోపం వస్తే, అధమ స్థాయి వ్యక్తి కోపానికి ఏమీ చేయలేని నిస్సహాయత కారణమవుతుంది. స్థాయీభేదాలన్నది ఈ శరీరానికే, ఆత్మకు అంటవు అన్న పురాణ వచనాలు మనిషిలోని ఈశ్వరుణ్ని పరిచయం చేస్తూ, సమానత్వ భావనల్ని అంకురింపజేస్తాయి. అందరిలో తనను చూసుకునే వ్యక్తిలో కోపానికి ఆస్కారం ఉండదు.

ప్రకృతికి కోపం వస్తే, అది అన్ని క్రోధాలకన్నా భయంకరమైనది అంటాడు చాణక్యుడు. అదెంతటి నిజమో సోదాహరణంగా రుజువవుతూనే ఉంది!

కార్యార్థి సామ, దాన, భేద], దండోపాయాలతో కార్య సాఫల్యత పొందాలి. కార్యసాధకుడికి కోపం ఉండకూడదు. నొప్పింపక, తానొవ్వక, సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఫలితం సాధించాలి. సంధి ప్రయత్నాల కోసం శత్రుశిబిరాలకు వెళ్ళడమంటే, పులిగుహలోకి అడుగుపెట్టడంతో సమానం. అక్కడ కవ్వింపులు, వెక్కిరింపులు, కయ్యానికి కాలుదువ్వడం అత్యంత సహజం. దూతలుగా వెళ్ళేవారిలో సదా శాంతి, సామరస్యభావాలు తొణికిసలాడాలి.

ఇళ్లలో నవ్వుతూ శాంత స్వభావాన్ని వ్యక్తం చేసే సభ్యుల ఛాయాచిత్రాలు ఉంటాయే తప్ప, కోపాన్ని ప్రతిఫలించేవి ఉండవు కదా!

శాంతం మిఠాయి అయితే, కోపం కారంలాంటిది. సాధారణంగా ఎవరైనా మిఠాయిని ఇష్టపడినట్టుగా కారాన్ని కోరుకోరు. శుభవార్తలను సంతోషంగా పంచుకోవడానికి మిఠాయినే ఎంచుకుంటారు. శాంతం లేక సౌఖ్యం లేదు అన్నది త్యాగరాజ కృతి. మనసులో కోపం ఉన్న మనిషికి సుఖం, శాంతి ఉండవు. కోపాన్ని అదిమి ఉంచడానికే నవ్వుతూ బతకాలంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.

కోపం నరక సదృశం, శాంతం స్వర్గతుల్యం అన్నది ఆధ్యాత్మిక ఉపదేశం. ప్రశాంత చిత్తమే మోక్షపథం కనుక మనిషి, ఇతర జీవుల్ని ఈ విషయంలో అధిగమించాలి. ఉత్తమంగా నిలవాలి!

10. చిన్న కధ

చెవుడు ఎవరికీ

ఒక ఊళ్ళో ఓ భార్యా భర్త ఉన్నారు. ఒకసారి భర్తకి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అని అనుమానం వచ్చింది. అది ఆమెతో నేరుగా మాట్లాడటం ఇష్టం లేక సలహా కోసం ఓ వైద్యుడి దగ్గరికెళ్ళాడు.
“దానికో చిన్న పరీక్ష ఉంది. దాన్ని ప్రయాగిస్తే మీ ఆవిడకు చెవుడు ఏ మాత్రం ఉందో తెలుస్తుంది” అన్నాడా డాక్టర్.
“నేను చెప్పినట్లు చేయండి. మొదట 40 అడుగుల దూరంలో నిల్చుని మీరు మామూలుగా మాట్లాడుతున్నట్లు మాట్లాడండి. వినిపిస్తుందేమో చూడండి. ఒకవేళ వినిపించకపోతే పది అడుగులు దగ్గరకు వెళ్ళి అదే విధంగా చేసి చూడండి. అలా ఆమెకు వినిపించేదాకా చేసి ఈ పరీక్ష ద్వారా మీరేం గమనించారో నాకొచ్చి చెబితే నేను దానికి తగ్గట్లు వైద్యం సిఫారసు చేస్తాను” అన్నాడు.
ఆ రోజు సాయంత్రం అతను ఇంటికెళ్ళేసరికి భార్య వంట చేస్తూ ఉంది. అతను వైద్యుడు చెప్పినట్లుగా ముందుగా 40 అడుగుల దూరంలో నిలబడి “ఏఁవోయ్ ఈ రోజు ఏం కూర చేశావ్?” అని అడిగాడు. ఏం సమాధానం వినిపించలేదు.
మళ్ళీ కొంచెం దగ్గరకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. ఉఁహూ సమాధానం లేదు.
అలాగే వంటగదిలోకి వెళ్ళి “ఏఁవోయ్! ఇవాళ ఏం కూర చేశావ్?” అడిగాడు గట్టిగా మళ్ళీ. లాభం లేదు.
ఈ సారి సరాసరి ఆమె వెనకాలే వెళ్ళి నిల్చుని “ఏఁవోయ్ ఇవాళ ఏం కూర చేశావని అడిగితే సమాధానం చెప్పవేఁ!!” అన్నాడు విసుగ్గా…
ఆమె కోపంగా “మీకిది ఐదోసారి చెప్పడం, వంకాయ కూర చేశాననీ!!!” అనింది.

--((*))--
 
*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

      *శ్రీ భాగవతం - 112 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

             *శ్రీకృష్ణ లీలలు - 42*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁


 *బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువ వచ్చుట* 


కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు,  *‘ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం”* అని అడిగాడు. 


అపుడు వాళ్ళు,  *“ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి యిక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట యిరువది అయిదు సంవత్సరములు పూర్తి అయిపొయింది. కాబట్టి ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’* అని అడిగారు. 


అప్పుడు భగవానుడు  *‘ఓహో! అయితే యింక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. కాబట్టి నేనీ అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’* అని చెప్పి, 

ఒకసారి మనసులో సంకల్పం చేశారు.


*‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాశనం జరగాలి’* అని తలంచారు.  తాను నాయకత్వము నందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. 


మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. 


భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.


*విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట.* 



ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట అన్నారు. 


“నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అయిపోతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకోని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా యిది ఉండదు. వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి నీవు తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి యింతమందిని తరింపజేశావు. 


కృష్ణా! నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవింద నామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రీ, నీవు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కనులార దర్శిద్దామని వచ్చాము’. 


వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతున్నదని తెలుసు. 


ఈశ్వరా! నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు. 


ఈ సంసారమును దాటడానికి నీ పాదములు ఆధారము. వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారము. వేదములు నీ పాదముల ఆభరణములు. అటువంటి నీ చరణారవిందములను ఈ మాంసనేత్రముతో చూడాలని వచ్చాము. మరల యిటువంటి పాదములు మాకు దొరుకుతాయా” ఇవి,  *‘అంగనామంగనామంతరే మాధవం’* అని కొన్నివేలమంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. నీ పాదములను గోపాల బాలురు  *‘మా కృష్ణుడు’* అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడు అని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్ళతో ఆడుకున్నపుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేలగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాలబాలుర చేత ఒత్తబడిన పాదములు. *‘బ్రహ్మ కడిగిన పాదము’* అని బ్రహ్మగారి చేత కడిగించు కొనిన పాదములు. ఇంతమందిని తరింప జేసిన ఆ పాదములను ఒక్కసారి చూసి తరించి పోదామని వచ్చాము కృష్ణా’ 

అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు. 


కృష్ణా! నీనామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని ముప్ఫయిమూడుకోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగమునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికయిన నామము. గోవింద నామము నీ అంతట నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామము గోవింద నామము. స్వామీ నిన్ను మరల ఎప్పుడు చూస్తాము! ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము’ అని స్తోత్రం చేశారు. 


అపుడు కృష్ణ పరమాత్మ నవ్వి,  *‘నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా! చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పడు నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒకసారి నది ఒడ్డుకు వెళ్ళండి. నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి’* అని చెప్పాడు. 


ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు.


 *ఋషుల శాపము* 


వారికి కొద్ది దూరంలో వున్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమయిన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీరకట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏపాటి పరిజ్ఞానంతో చెపుతారో చూద్దామని అతడిని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి,  ‘మీరు మహాత్ములు కదా! మీకు తెలియని విషయములు ఉండవు కదా. మీరు త్రికాలవేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉందా కవలలు ఉన్నారా ఏ విషయం మాకు చెప్పండి’ అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీవంక చూశారు. వాళ్లకి మహా ఆగ్రహం వచ్చింది. ‘మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డమీద వున్న మీరు యిటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు తలమీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసి వున్న మీకు యింతటి దుస్సాహసమా? మాతో పరిహాసమా? అని వాళ్ళు,

“కొడుకూ కాదు, కూతురూ కాదు. క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపునుంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆ రోకలి మీ అందరి తీట తీర్చేస్తుంది. దానితో మీ యదుకులం నాశనం అవుతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద యినుప రోకలి కిందపడింది. వాళ్లకి భయంవేసి ఆ రోకలి తీసుకుని పరుగుపరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి “మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాము. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు? అని అడిగారు. అపుడు కృష్ణ పరమాత్మ – 


ఈమధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. యివి యదుకుల నాశానమును సూచిస్తున్నాయి. మీ అందరు ఆ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి దీనిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలమును అరగదీసి దీనిని సముద్రంలో కలిపివెయ్యండి’ అని చెప్పాడు. అపుడు వారు ఆ ముసలమును పట్టుకుని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలు పెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదియ్యగా అరగదియ్యగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వల్ల ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు. 


ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరకు వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు యింటికి వెళ్ళి ఈ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముళ్ళు పడింది. ఆ ఇనపముల్లును తన బాణమునకు పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.


 *కృష్ణుడు – ఉద్ధవుడు* 


ఈలోగా, ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.


ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి,  

‘కృష్ణా! మేము నీతోకలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. 


అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. 


‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. 


కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. 


కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.


          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

నేటి తేటగీతి పద్యాలు

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


 'నేను' అన్న ఒక్క పలుకు అహము పెంచు

నేను అన్నదే ఆలోచనలను ముంచు

నేను అనునది పట్టుకు నటన నన్న

నేను ఎప్పుడూ వేదము నేర్పు తాను


నీలొ మిగిలిన ఆలోచనల్ని తరుము

నీలొ ఉన్నట్టి మనసును నెంచి ఉండు

 నీలొ సహజంగ వచ్చేటి నటన చాలు

నీలొ దృశ్య అదృశ్యము నమ్మి బతుకు

 

ప్రశ్న పుట్టని స్థితిని పొంది ఉండి

ప్రశ్న లేకయే సాగించు పుడమి యందు 

ప్రశ్నలకు సమా దానము ప్రశ్నె యగును

ఉత్తమము సమాధి స్థితి ఉన్న తమ్ము


శ్వాస వల్ల దేహానికి ఉనికియే సకల మవ్వు 

దేహమున శ్వాసలు ఉనికి దాహ మవ్వు

ఒకటొకటిగాను ఉన్నను ఒకటి అవ్వు

మరొక దాని ఉనికికి మాదుర్య మవ్వు 


దేవుడున్నాడని నిజము దైవ మాయ

దేవుడేచేయు సకలము దయతొ తృప్తి

దేవుడుయెచేసినమనుష్య దుమ్ము తెల్పు

దేవు డిచ్చును శాంతిని ధర్మ మగును 


జీవుడే నియముతొ నిష్ట జీత మవ్వు

జీవుడే సర్వ లోకము జయము తెచ్చు 

జీవుడే ప్రేమ పంచియు జాతి నిలుపు

జీవుడే సమస్తము తెల్పి జోగి అవ్వు


🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏

సేకరణ వాట్సాప్

*(సశేషం..


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

Image may contain: people dancing

No comments:

Post a Comment