Thursday, 28 January 2021

30--01--2021



సమ్మోహనాలు .. గోవుప్రేమ  (1151-1160)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బిడ్డ ప్రేమ చూపు
చూపు ప్రేమ మలుపు
మలపు లెన్నైనున్నా మారదు ఈశ్వరా

గోవు పాలు త్రాగి
త్రాగిన బాబు ఆగి
ఆగి ముద్దు పెట్టి ముచ్చటించె ఈశ్వరా

సృష్టిలో అందరూ
అందరు బతికెదరూ
బతుకులో జంతువులను పెంచెను ఈశ్వరా

గోమాత ప్రేమయు
ప్రేమనే మరువదుయు
మరువలేని పాలు ఇచ్చుచుండు ఈశ్వరా

ప్రకృతి చూపును శక్తి
శక్తి పెంచును యుక్తి
యుక్తితో సమస్తజీవులు బతుకు ఈశ్వరా

తల్లి పిల్లకు ముద్దు 
ముద్దు వల్లే హద్దు 
హద్దు నిర్మల మనస్సుకు లేదు ఈశ్వరా 

మానవులలో ప్రేమ 
ప్రేమ జంతువు ప్రేమ 
ప్రేమ అపురూపమనిపించేను ఈశ్వరా 

మనిషి కున్నా జంతువు 
జంతువు లే కదలవు 
కదలి  ఆశించవు ప్రేమించును ఈశ్వరా 
 
అమ్మలాంటి ఆవు 
ఆవు మనిషి ఆయువు 
ఆయువుతొ  సమస్త జీవ రక్షా ఈశ్వరా 
 
నమ్మిన ప్రాణ మిచ్చు 
ఇచ్చి బంధము నిచ్చు 
నిచ్చి సహాయముచేయు చుండును ఈశ్వరా 
  
--(())--


*నవ నారసింహక్షేత్ర ఆలయం.....అహోబిలం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరం లోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరం లోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం


*స్థలపురాణం:—*


 ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.


ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం

వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.


రాజగోపుర దృశ్యం

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.


జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.


*ఆలయప్రత్యేకత :--*

*శ్రీ భార్గవ నరసింహ స్వామి :--*


దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే” భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి;;- వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.


*శ్రీ ఛత్రవట నరసింహస్వామి ;;--*


ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .


*శ్రీ అహోబిల నరసింహస్వామి ;;--*


నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.


*శ్రీ వరాహ నరసింహస్వామి;;--*


 ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.


*శ్రీ మాలోల నరసింహస్వామి ;;---*


 ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.


శ్రీ మాలోల నరసింహ స్వామి

*శ్రీ జ్వాలా నరసింహస్వామి;;--*


ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు..హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి,చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే,సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందు లో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణి లోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱ గా ఉండిపోయింది.


*శ్రీ పావన నరసింహస్వామి::--*


 ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది.అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను,పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితం గా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదం గా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ పావన నరసింహస్వామి

*శ్రీ కరంజ నరసింహస్వామి ;;---*

 ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు.

శ్రీ కరంజ నరసింహస్వామి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;-- ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

చారిత్రకప్రాధాన్యం .;;--- దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి . పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరి కనువిందు చేస్తాయి .

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

దిగువ అహోబిల రాజగోపురం

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.


ఉగ్ర నరసింహుని సుందర రూపం

*ఉగ్ర స్థంభం :--*

 ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు. 

“ उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं

नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!!

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.


*ఉగ్ర స్థంభం*

*ప్రహ్లాదమెట్టు;;--*


ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.


*స్థంభ శిల్పం*నా

*అహోబిలమఠం.:--*

 ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.


చెంచులక్ష్మీ నరసింహుల స్థంభ శిల్పం

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

రంగమండపం లోని స్థంభ శిల్పం

*ప్రత్యేక ఉత్సవాలు::--*

 ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

యోగానంద నరసింహ స్థంభ శిల్పం

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.

అహోబిల నరసింహ స్వామి లీలా ­శేషాల్లో ప్రధానమైనది మానసిక గందరగోళాన్ని దూరం చేయడంలో ఈయన చూపే మహిమలు. సమస్యలతో మనసు ­కలమైన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయట.

నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నా ఆయన లీలలకు లోటుందట. అలాంటి ఆ స్వా­మి తాను అవతరించిన ప్రదేశమైన అహోబిలంలో అంతకు మించిన రీతిలో భక్తులను దీవి­స్తున్నాడు. మహాశక్తివంత దైవ స్వరూపంగా పేరున్న ఈ స్వా­మి మీద భారం వేస్తే బాధాపీడితులకు ఏదో రూపంలో దారి చూపుతాడని పేరు. మహామహిమాకరుడైన నరసింహ స్వామి నవనారసింహుడుగా కొలువైన అహోబిల క్షేత్రం ప్రతి నిత్యం హరినామ ఘోషలతో అలరారుతూ ఉంటుంది. వైష్ణవ పూజా ­ధానంలో అత్యంత ప్రశస్తమైనదిగా చెప్పే పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అహోబిలంలో నిత్యపూజలు జరుగుతాయి.


అహోబిల నరసింహ స్వా­మికి ఉదయం సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ­విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ పిదప వరుసగా బాలభోగం, తలిగ ఆరాధన, తోమాల సేవ, పానకారాధన వంటి­ ఉంటాయి. రాత్రి ఉత్సవమూర్తికి శయనం చేసి పాలు, క్షీరాన్నం ఆరగింపు ఇస్తారు. దీంతో నిత్యపూజలు పరిసమాప్తం అవుతాయి.

నిత్యపూజలతో పాటు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వర్షోత్సవాలు వంటి­ నిర్వహిస్తారు. దీనితో పాటు ఫాల్గుణ శుక్ల చ­తి నుంచి పౌర్ణ­మి వరకు స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వివి­­ధ రూపాలు ధరించిన ప్రహ్లాద వరదస్వా­మి ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఉంటారు.


అహోబిలం చేరుకోవడానికి ­విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలోనూ అహోబిలం నెలవై ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఇక్కడికి వి­స్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నవనారసింహుడు కొలువైన అహోబిల క్షేత్రాన్ని దర్శించి ­మీరూ పునీతులు కండి


అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి.


తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు

లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.

దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చును.

సేకరణ..

[26/01, 10:04 am] +91 79810 02699: 🙏 *శుభోదయం*🙏

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*



          *ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది.*

  .      *లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని మరియు దేశాన్ని కూడా కదిలిస్తుంది.*


*గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో*🙏🙏

*మీ*

*-- వరలేఖరి.నరసింహశర్మ.*

[27/01, 7:54 am] +916281264412: *శుభోదయం*

*కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,

     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*

              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*.

             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*

[27/01, 7:54 am] +916281264412: 🌳🌳🌳




*మనం గెలవడం అంటే మనుషులను కాదు* *మనస్సులను గెలవాలి. ముందుకు వెళ్లడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, నలుగురినీ కలుపుకుంటూ వెళ్లడమే నిజమైన విజయం*.



🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

[27/01, 7:54 am] +916281264412: 🌿🌹🌿



శారీరకంగా వచ్చే అందం ఈ రోజున వుంటే రేపు పోవచ్చు. 

*వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది.*



🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿

[28/01, 9:29 am] +916281264412: ఉదయం 11 గంటలు.

తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న జనం బయటకు వస్తున్నారు. గర్భాలయం బయట చుట్టూ తిరిగి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇంక బయటకు వెళ్లిపోవడానికి వాకిలి దగ్గర గుమికూడారు. ఎప్పుడూ ఉండే విధంగానే అప్పుడూ రద్దీ ఉంది. సెక్యూరిటీ గార్డులు ఇద్దరూ, వలంటీర్లు ఇద్దరూ ఆ ద్వారం గుండా లోపలికొస్తున్న వాళ్లను ఆపి బయటకు వెళ్లటానికి వీళ్లని అనుమతిస్తున్నారు.

లాల్చీ పైజమాలతో ఉన్న యాభై ఏళ్ల ఆసామీ ఒకతను బయటికి వెళ్లబోతూ తన కుడిచేతి వేళ్లు తడుముకున్నాడు.

హఠాత్తుగా గట్టిగా, ‘దొంగ.. దొంగ, దొంగ..’ అని అరిచాడు. తన చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. ఎక్కువ మంది నడివయస్సు ఆడా మగా జనమే. వాళ్లు ఇతని వైపు విచిత్రంగా చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు.

ఈ ఆసామి మళ్లీ, ‘దొంగండీ.. దొంగ! ఎవరో నా ఉంగరం దొంగిలించారు.. ఎవరు? ఎవరు?’ అన్నాడు.

ద్వారంలో ఎదురుగా నుంచునున్న వలంటీరు గబగబా ఇతని వైపు వచ్చాడు. ‘మీతోబాటు వచ్చిన వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మీ వెనకాల వచ్చిన వాళ్లని మీరు తప్పు పట్టలేరు గదా. ఇట్లా ఇవతలికి రండి’

ఆ ఆసామి అన్నాడు. ‘అంటే నా ఉంగరం దొంగిలించిన వాడిని వదిలెయ్యాలంటారా?’

‘మీరు ఆవేదన పడకండి. సెక్యూరిటీని పిలుస్తాను. అతన్తో చెప్పండి’ అంటూ సెక్యూరిటీ గార్డు వైపు చెయ్యి ఊపాడు. సెక్యూరిటీ గార్డు రాగానే వలంటీర్ అతన్తో ‘ఈయన ఉంగరాన్ని ఎవరో దొంగిలించారట’ అన్నాడు.

సెక్యూరిటీ తికమకగా, ‘దొంగిలించారా? స్వామి సన్నిధిలో దొంగతనమా? ఎన్నడూ ఎరగమే.. ఇంతకీ ఏం పోయింది?’

ఆ ఆసామి అన్నాడు. ‘నా ఎడమచేతి ఉంగరాలు రెండూ ఉన్నాయి. నా కుడిచేతి వేలి ఉంగరమే పోయింది’

‘మీ పేరేమిటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తూంటారు? రండి, ఈ పక్క మంటపం మీద మాట్లాడుకుందాం’

ముగ్గురూ పక్కనే ఉన్న అన్నమాచార్య గ్రంథాలయం మెట్ల మీద కెళ్లారు.

సెక్యూరిటీ గార్డు అన్నాడు, ‘మీ పేరేమిటి?’

ఆ ఆసామి అన్నాడు ‘నా పేరు అంబాలాల్. మాది సూళ్లూరుపేట. నేను రాత్రి వచ్చాను. ఒక్కణ్ణే వచ్చాను. స్పెషల్ గెస్ట్‌హౌస్ తీసుకున్నాను. నాకు స్పెషల్ దర్శనం టిక్కెట్టు ఉంది. కనుక ఇందాక పది గంటలకి శ్రీవారి దర్శనార్థం మహాద్వారంలో ప్రవేశించి బంగారు వాకిలి దాటి ధ్వజస్తంభం దాటి, వెండి వాకిలి ద్వారా జయవిజయుల పక్కనించి లోపలికి వస్తూనే నా స్వామికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నా మూడు ఉంగరాలూ స్వామికి చూపించాను. ఆయన ముచ్చట పడ్డాడనుకోండి. స్వామి దర్శనం తర్వాత రద్దీలో బయటకొచ్చి ప్రదక్షిణంగ చుట్టూ తిరిగాను. ఇప్పుడింక వెళ్లిపోతూ చూసుకుంటే కుడిచేతి ఉంగరం లేదు.’

‘ఎక్కడన్నా పడిపోయిందేమో గమనించారా?’

‘అహహ పడిపోలేదు. అట్లా పడిపోతే అరవను గదా!’

‘దర్శనంలో ఉండగా ఎవరైనా మీ వేలు పట్టుకున్నారా?’

‘లేదు.. కానీ ఒక వాలంటీరు అమ్మాయి మాత్రం నా ఉంగరం చూస్తూ ముచ్చటగా ‘మీ వస్తువులు జాగర్తండి’ అంది. అప్పుడు నా ఉంగరం నాకు కనిపిస్తూనే ఉంది’

‘సరే ప్రదక్షిణం చేస్తూ మీరు ఎక్కడెక్కడ తిరిగారు?’

‘నేను బయటికొచ్చి ముందర వకుళాదేవిని దర్శించుకున్నాను. స్వామి వారికిచ్చే ప్రత్యేక నైవేద్యాల పోటు చూసాను. మండపంలో తీర్థం పుచ్చుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పెళ్లి శిల్పాలు, మండపంపై చిత్రించి ఉన్నవి, చూసుకుంటూ నడిచాను. స్వామి వారి హుండీ లెక్కించే స్థలం పరకామణిని చూసాను. నేను అలా చూస్తూండగా నా పక్కన నుంచుని చూస్తూ ఉన్న ఇద్దరు కుర్రాళ్లల్లో ఒకడు ఎర్రగళ్ల చొక్కావాడు నా దగ్గరకొచ్చి నా వేలును పట్టుకుని ‘చాలా బాగుంది సార్ ఉంగరం’ అన్నాడు. నేను పరకామణిని, అక్కడున్న మీ సెక్యూరిటీ వాళ్లని చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుర్రాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత గంధం తీసేచోట కొంచెంసేపు నుంచున్నాను. ఆ తరువాత విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నాను..’

‘మళ్లీ ఉంగరం చూసుకున్నారా?’

‘లేదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది లేదు’

‘మీకు అనుమానం ఆ కుర్రాళ్ల మీదనా?’

‘అవునండి. ఆ ఎర్రగళ్ల చొక్కావాడి మీదనే- వాడే ఇప్పుడు నా ముందు నుంచి బయటకి వెళ్లిపోయాడు. ‘్భజనం చేసి వెడదాం రా’ అని రెండోవాడితో వాడు అనటం నేను విన్నాను.’

సెక్యూరిటీ వెంటనే వలంటీర్‌తో ‘బయటికెళ్లి చూడు. కనిపిస్తే పిలుచుకురా!’ అన్నాడు.

వలంటీర్ వేగంగా వెళ్లిపోయాడు.

సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ని అడిగాడు ‘మీరేం చేస్తుంటారు?’

‘ఏదో.. చిన్న బంగారం వ్యాపారం’

‘కుటుంబంతో వచ్చినట్లు లేదు కదూ!’

‘అవునండి. వాళ్లకి ఏర్పాట్లన్నీ చూడాలి. వెళ్లడం ఆలస్యమయితే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని వాళ్లని తీసుకురాలేదు’

‘అది సరే. అసలు ఎందుకని అంతా మీ ఉంగరం వైపు పరిశీలించి చూశారు?’

‘అదీ అదీ.. వజ్రపు టుంగరం. వజ్రం అరంగుళం పొడుగు, పావు అంగుళం వెడల్పు. దానికి అన్నీ నగిషీలే. ఏ కొంచెం కాంతిలోనయినా అది అన్ని వైపులా చురుక్కు చురుక్కుమని అనేక రంగులు మెరుస్తూ ఉంటుంది. ఆ వజ్రం ఖరీదే ఏభై వేలు. బంగారమేమో కాసు. ఉంగరం మొత్తం లక్ష. కనక అందరినీ అది ఆకర్షిస్తూ ఉంటుంది’

బయటకెళ్లిన వలంటీర్ ఊడిపడ్డాడు. సెక్యూరిటీతో అన్నాడు ‘కుర్రాళ్లిద్దరూ కనిపించారు. ఎర్రగళ్ల చొక్కాతను ‘ఆ ఉంగరాన్ని నేను తియ్యలేదు. అసలు, ముట్టుకోలేద్సార్. ఎంత రోగ్ అయినా స్వామి వారి దగ్గర ఇలాంటి డర్టీ పని చేస్తాడా? అసలు నేను బ్యాంకు ఉద్యోగిని దాన్ని ఇచ్చినా పుచ్చుకోన్సార్?’ అన్నాడు. నేను డ్యూటీలో కెళతాను’ చెప్పి వలంటీర్ వెళ్లిపోయాడు.

సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ను గుచ్చిగుచ్చి చూసాడు.

‘తెలిసిందిగా. ఆ కుర్రాడు తియ్యలేదు. విమాన స్వామిని చూసాక మీరేం చేశారు?’ అని అడిగాడు.

‘ఆ ఏముందిలెండి. హుండీ దగ్గరికెళ్లి నా పాకెట్ పడేసాను. వెంటనే...’

‘ఆగండి.. ఆ పాకెట్‌లో ఏం వేశారు?’

‘డబ్బండి.. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. కిందట ఏడాది ఇక్కడికొచ్చి నన్ను గట్టెక్కించి కాపాడమని స్వామిని ప్రార్థించాను. ‘నాకు వచ్చే లాభంలో టెన్ పర్సెంట్ నీకిస్తానయ్యా’ అని మొక్కుకున్నాను. ఈ ఏడాదిలో నాకు కోటి లాభం వచ్చింది.


కనుక అందులో టెన్ పర్సెంట్ తెచ్చి హుండీలో పడేసాను అంతే. ఆ తరువాత బయటికొచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు మళ్లీ చూసుకుంటే ఉంగరం లేదు.’

‘మీరు హుండీలో పేకెట్ వేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తోసారా?’

‘చిన్న తోపులాట జరిగిందండి’

ఒక్క నిమిషం ఆగి సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘సరే ఈ విషయం అంతా మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెబుతాను. ఆ తోపులాటలో హుండీలో పడిందేమో చూడమని కోరతాను’

‘హుండీలో ఇప్పుడు చూసేయొచ్చు గదా! నేను మళ్లీ ఈ సాయంత్రానికి మా ఊరు వెళ్లిపోవాలి’

‘అట్లా కుదరదండి. హుండీలన్నీ రాత్రి రెండు గంటలకి స్వామికి పవళింపు సేవ అయ్యాకే తీస్తారు. వాటిని పరకామణిలో పెట్టి పొద్దునే్న లెక్కిస్తారు. మీరు ఈ రాత్రికి ఆగిపొండి. రోజూ మేము యాత్రీకుల్లో పెద్ద మనుషులనుకున్న ముగ్గుర్ని సాక్షులుగా పరకామణి దగ్గరికి తీసుకెళ్లాలి. రేపు మిమ్మల్ని మూడోవారుగా తీసుకోమని విజిలెన్స్ ఆఫీసర్‌గారికి చెబుతాను. రేపు ఉదయం అయిదు గంటలకి వైకుంఠ ద్వారం దగ్గరికి మీరు రండి. నేను మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను. పరకామణి లెక్కించడం మీరు చూద్దురుగాని.

‘అన్నట్టు మీ ఉంగరం విషయం ఇదిగో ఈ కాగితం మీద మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి రాసివ్వండి’ ఇట్లా అంటూ గార్డ్ కాగితం ఇచ్చాడు.

‘అంటే అసలు దొంగే లేడంటారా? నా లక్ష రూపాయల ఉంగరానికి ఇంతే సంగతులా!’

గార్డ్ కటువుగా అన్నాడు, ‘అది రాసిచ్చి రేపుదయం రండి. అంతే’

అంబాలాల్ రాసిచ్చాడు.

ఇద్దరూ చెదిరిపోయారు.

* * *

మర్నాడు ఉదయం అంబాలాల్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే అదే సెక్యూరిటీ గార్డు అక్కడున్నాడు. అంబాలాల్‌ను తీసుకుని లోపలికి చుట్టూ తీగ జల్లెడ కట్టి ఉన్న పరకామణి దగ్గరకొచ్చాడు. లోపల స్వామివారి హుండీలన్నీ కుమ్మరించబడ్డాయి. లెక్కించడం మొదలైంది. చుట్టూ ఉన్న తితిదే సిబ్బందీ, సాక్షులూ నిశితంగా గమనిస్తున్నారు.

హఠాత్తుగా ఎర్ర కాగితంతో చుట్టబడిన తొమ్మిది వెయ్యి రూపాయల కట్టలు బయటపడ్డాయి. అంబాలాల్ వెంటనే ‘అదిగో అదిగో నా కట్ట. తొమ్మిది లక్షల కట్ట’ అన్నాడు. మళ్లీ వెంటనే, ‘అదిగో ఆ దారానికి వేలాడుతున్నదే నా వజ్రపు ఉంగరం. నాదే, నాదే’

సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘మీ కోటి లాభంలో పది పర్సెంట్ అంటే, పది లక్షలు స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు గదా. తొమ్మిది లక్షలే ఇచ్చారేం?’

‘ఆ ఏముంది, ఆ పదిలోంచే ఒక లక్ష నేను తీసుకుని ఉంగరం చేయించుకున్నానండి. మిగిలిన తొమ్మిదీ స్వామికిచ్చాను. ఇందులో పెద్ద పాయింటేముంది?’

‘అదే అసలు పాయింటు. స్వామికి ఇస్తానన్నది ఇవ్వకుండా మీరు తీసుకున్నారు. ఆయన ఊరుకుంటాడా! దారంతో గేలం వేసి మీ వేలు మీంచి ఊడ లాక్కున్నాడు. తనది తాను తీసుకున్నాడు. ఇస్తానన్నది ఇవ్వకపోవడం దొంగతనమా, తనది తాను తీసుకోవడం దొంగతనమా?.. అంటే దొంగ ఎవరో తెలుస్తోంది కదా! మీరు ఇంకెవర్నో దొంగ అంటారేమిటి?’

అంబాలాల్ మొహం మాడిపోయింది. ఉండుండి అన్నాడు, ‘పొరబాటయింది’

‘నిన్న మీరు హడావిడి చేశారు. కానీ ఇక్కడ స్ట్ఫా అందరికీ తెలుసు. స్వామి వార అనుగ్రహమేమిటో..

‘దొంగనోట్ల కట్టలు గోడల్లో దాచుకోవడం, తిరువనంతపురంలో రంగనాథుడి మీద కేసు వెయ్యడం - ఇవన్నీ స్వామి చేయించినవా? చేసుకున్న వాళ్లు అనుభవించారు. అనుభవించి తీరుతారు. ఎందుకంటే స్వామి తన త్రాసుతో కచ్చితంగా తూస్తాడు కనక!... ఒక ముస్లిం కుటుంబంలో మూడు తరాల వారు తిండి మానేసి స్వర్ణ కమలాలు చేయించి తెచ్చి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి త్రాసు ఏమిటో తెలుసా, అవి ఇప్పుడు భాండాగారంలో లేవు. ఆర్జిత సేవలో ప్రతి మంగళవారం ఉపయోగించబడుతున్నాయి. ఆ ఆర్జితసేవ కిప్పుడు విపరీతమైన డిమాండ్..! కనుక స్వామి విషయంలో మేం మాట జారం. పొల్లుపోనివ్వం.. అన్నట్టు, దొంగ దొరికాడని మీరు ఒక రిపోర్టు రాసివ్వండి.’

అంబాలాల్ చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ‘నన్ను వదిలెయ్యండి. వెళ్లిపోవాలి. ప్లీజ్?’ అంటూ విసవిసా బయటకు దారితీసాడు.


గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు..

 98857 98556

💦మంచి మాట


         *మనం చెప్పే మాటల కంటే కూడా*

                   *మనతో మనం*

      *చెప్పుకునే సందేశాత్మక సంభాషణకు*

                      *శక్తి ఎక్కువ,* 

                 *ప్రభావం ఎక్కువ* 

                    *ఏదో ఒక రోజు* 

        *జీవితం మొత్తం మనకళ్ళ ముందు* 

                  *కదలాడుతుంది..* 

                    *ఆ రోజున ....!*

           *చూసేందుకు మనకు నచ్చేలాగా* 

          *మన జీవితాన్ని* *మలుచుకోవాలి..!!*


[28/01, 3:15 pm] హనుమంతరావు: 🌹🌹 *నేడు శాకంభరీ దేవి జయంతి , శాకంభరీ దేవి పూర్ణిమ* 🌹🌹



     *శాకంభరీ దేవి అనగా దుర్గా  దేవి యొక్క మరో అవతారం. శాకంభరీ జయంతిని జనవరి మాసంలో జరుపుకుంటారు. దీనిని శాకంభరీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈ పండుగను భారతదేశం మొత్తం జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో దుర్గాదేవికి అధిక ప్రాధాన్యం ఇస్తారు*.


      *దుర్గాదేవి అనేక అవతారాలలో ముఖ్యమైన అవతారం శాకంభరీ దేవి. శాకంభరీ దేవి పూలు, పండ్లు, మరియు పచ్చదనమునకు  అధిదేవతగా భావిస్తారు. శాకంభరీ ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుపుతారు. ఆఖరి రోజు ముఖ్యమైన రోజు అనగా శాకంభరీ పూర్ణిమ. అదే పుష్య పూర్ణిమ*.


         *పూర్వం చాలా రోజులు భూమి మీద వర్షం లేకపోవడం వల్ల భూమి మీద మానవులు, పక్షులు , జంతువులూ ఇంకా అనేక జీవులు మరణించాయి . అప్పుడు మహా మునులు దుర్గాదేవిని వేడుకున్నారు . ఆమె అప్పుడు శాకంభరీ అవతారంలో వర్షం కురిపించి భూమి మీద కరువుని పారద్రోలింది. అప్పటి నుంచి భారతదేశంలో శాకంభరీ జయంతిని జరుపుతారు*.


                  *కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్  అనేక ప్రాంతాలలో ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి. చెన్నైలో ని శాకంభరీ పురంలోని శాకంభరీ ఆలయంలో ఉత్సవాలు తొమ్మిది రోజులు  జరుపుతారు*.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[28/01, 3:41 pm] హనుమంతరావు: 🐊 *నాన్న* కూ *కన్నీళ్లు* ఉంటాయి👨‍👩‍👧‍👦


🐊 *నాన్న* మనకోసం ఏం చేశాడో*

ఏం *కోల్పో* యాడో  మనకు తెలియదు..!*


🐊 *జీవితాంతం* పిల్లల కోసం *తపిస్తూ, వారి అభివృద్ధి* కోసం పాటుపడే వ్యక్తి *తండ్రి* తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. *నాన్న* మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

🐊 ఎందుకంటే..  *నాన్న* ఎవరికీ చెప్పడు. *పిల్లలకి, భార్య* కి అసలు చెప్పడు. *అమ్మ* లా *ప్రేమ* ను బయటికి చూపించడం *నాన్న* కు రాదు. *నాన్న* ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

🐊 *ఎప్పుడూ పనేనా* ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. *పెళ్లై, పిల్లలు* పుట్టగానే *నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

🐊 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 

🐊 *వృద్ధాప్యం* ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న *డాక్టర్‌* ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

🐊 తన *పిల్ల* లు గొప్ప వాళ్లు అవుతారని *నాన్న* కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. *ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.* మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని *ఆశ.*

 

🐊 *ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా* చేస్తాడు. ఎక్కడ, ఎన్ని *సంతకాలు* పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు *అమ్మ* ఏడ్వడం చూశాం కానీ, *నాన్న ఏడ్వడం* ఎప్పుడైనా చూశారా? *నాన్న* కూడా *ఏడుస్తాడు*.😰 కానీ మీ ముందు *ఏడ్వడం* ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని *ఏడుస్తాడు.**

 

🐊 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. *నాన్న* అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే *పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం* మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, *నేను ఎవరి కోసం బతికాను*?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. *నా కోసం నేను* ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*

 

🐊 నిజానికి *నేను* అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో *నాన్న* ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 🐊 కొడుకు ఎంత మంచివాడు *ప్రయోజకుడైతే* తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా *తండ్రి* ని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ *నాన్న* స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ *నాన్న* పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.

 🐊 *,పిల్లల* కోసం తన *రిస్క్‌* తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన *కెరీర్‌* ను *నాశనం* చేసుకుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న *ఎనర్జీ* పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది 🐊 *నాన్న* లు జీవితంలో తమ *పిల్లల* కోసం *ఆర్డినరీ* గా మిగిలిపోయారో.....


ప్రతి *నాన్న* కు 

       🙏😌🙏

            🐊🐊🐊🐊🐊

[29/01, 7:34 pm] +916281264412: *ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా జనవరి నుండి పూర్తిగా యూనియన్ బ్యాంక్ లోకి మార్చడం జరిగింది.*

1. అకౌంట్ నంబర్ పాతదే ఉంటుంది.

2. కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది.

3. కొత్త పాస్ బుక్ యూనియన్ బ్యాంకు ముద్ర తో వస్తుంది.

4. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్ లో 31/03/2021తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి తరువాత పని చేయివు. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి.

5.ఆంధ్ర బ్యాంక్ ifsc కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త  కోడ్ మీ దగ్గరి లో యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రబ్యాంక్) తెలుసుకోవలెను.

ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కి1800 208 2244 ఫోన్ చేయగలరు.

6.మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు U-mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ Install చేసుకోవాలి పాత (App ab tej) పని చేయదు కాబట్టి.

 🙏 *శుభోదయం*🙏

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


  *"సమయం, ఆరోగ్యం, బంధం" వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటివిలువ తెలిసేది*

        *అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలపెట్టుకోవాలి*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*-- వరలేఖరి.నరసింహశర్మ.*

 *వాత రోగాలు ఎందుకు వస్తుంది??*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైైైైైై


   మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నాయి.


*కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :*

**********************


1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం.


2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం

3. అతి వేడిగా గానీ అతి చల్లగా గానీ భోజనం చేయడం.


4. ఎక్కువగా గాలికి తిరగటం, లేక నిరంతరం గాలిని విసిరే ఫ్యాన్ల కింద కూర్చోవటం, నిద్రించడం.


5. వరుసగా అనేక మాసాల పాటు రాత్రిళ్ళు మేల్కోవటం.


6. అనేక మాసాలపాటు విశ్రాంతి లేకుండా విపరీతమైన శారిరక శ్రమ చేయడం.


7. మంచు లోను, చల్లటి నీటిలోను, చల్లని గాలిలోను, ఏ.సి. గదులలో ఎక్కువ సమయం గడపడం.


8. ఆర్ధక ఇబ్బందుల వల్ల లేక పనుల వత్తిడి వల్ల వేళకు భోజనం చేయకపోవడం, వేళ కాని వేళల్లో అకాల భోజనం చేయడం.


9. మలము, మూత్రము, తుమ్ములు, ఆవలింతలు మొదలైన సహజవేగాలను, పనుల ఒత్తిడిలో పడి కొంత సమయం ఆపడం.


10. అలివి కాని పనులు చేయటానికి ప్రయత్నించి, విఫలమై అమితంగా దిగులు పడటం, అతిగా అలోచించడం, అతిగా భయపడటం.


11. వివిధ అనారోగ్య సమస్యల వల్ల శరీరంలో మాంసం క్షీణించటం.


12. జీర్ణ శక్తి గమనించకుండా కఠినమైన పదార్ధాలను సేవించడం, అవి జీర్ణంగాక మురిగిపోయి ఆమం ఏర్పడి వాయు సంచారానికి అడ్డుపడటం.


ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన మానసిక శారీరక చర్యల వల్ల 80 రకాల వాత వ్యాధులు పుట్టుకొస్తాయి.


*సేకరణ:*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

No comments:

Post a Comment