Wednesday, 6 January 2021

ప్రాంజలి ప్రభ

 

Art & Photos - Nilakantha


మహాభారతం ఆదిపర్వం ఐదో భాగం
""""""""""""""""""""""'''''''"""'''''""""""""'''"""""""""""""
నియతి రూపంలో ప్రకాశిస్తున్న నియంత కు నమస్కారం
అన్ని సంకల్పాలకు ఆధారభూతమైన జగన్నాటక సూత్రధారి కి నమస్కారం
క్షమా స్వరూపిణి మాతృదేవి భూమాతకు నమస్కారం
                  🌼🙏🙏🙏🌼
               సర్ప యాగం ప్రారంభం
యజ్ఞ నిర్వహణ దురంధరులు అయినా శాస్త్రవేత్త లందరికీ ఆహ్వానం పంపాడు జనమేజయుడు. ఎప్పుడో పూర్వ కల్పాలలో మినహా - వర్తమాన కల్పాది నుండి ఇప్పటిదాకా ఎవరూ నిర్వహించని పన్నగ యజ్ఞానికి పనిని ప్రారంభించడం చకచకా కొనసాగడం జరుగుతుంది.
దీక్షాకాలం సమీపించగానే జనమేజయుడు తన పట్టమహిషి వపుష్టా దేవి తో కలసి దీక్ష స్వీకరించారు.
ఆహ్వానం అందుకున్న ద్విజులు మహర్షులు ఎందరెందరో మహనీయులు యజ్ఞ కార్య దూర్వహులయ్యారు.
చ్యవన వంశ విఖ్యాతుడైన చంఢభార్గవుడు హోత గాను......
కుత్సకులోద్దీపకుడైన జైమిని ఉద్గాత గాను....
 శార్న్గవుడు బ్రహ్మ గాను......
పింగళుడు అద్వర్యువు గాను.........
పుత్రచ్ఛాత్ర సంయుక్తు డైనా వ్యాసుడు, ఉద్దాలక -ప్రమతక- శ్వేత కేత -పింగళ అసితదేవల - నారద, పర్వత, ఆత్రేయ, కుండ జఠర, వత్స గోత్రపు వృద్ధుడైన శ్రుతశ్రవ కోహల , దేవశర్మ మౌద్గల్య, సమసౌరభాది మహోత్కృష్ట పురుషులతో సభ స్థానాలు అలంకృతం అయ్యాయి.సర్ప వ్రతం ప్రారంభం అయ్యింది.
ఒక యజ్ఞం అనేది ఏ ఉద్దేశ్యంతో చేయబడుతుందో తత్ అనుగుణంగా ఋత్వికులు భావ స్వరూపాన్ని పొందుతుంటారు. సౌమ్య యాగాలలో ఋత్వికుల స్వరూపం  ఆహ్లాదకరంగా ఉంటే
శత్రు సంహారం కోసం ఆచరించే సర్పయాగాది యజ్ఞాలలో  లయకారకులైన రుద్ర స్వరూపంగా ఋత్వికులు గోచరిస్తూ ఉంటారు.
పరమ ధర్మాత్ముడైన జనమేజయుని యొక్క మనోవేదనను అర్థం చేసుకున్నా ద్విజులు సర్పజాతికి అంతకుని లాగా మారిపోయారు.
నల్లని బట్టలు అచ్చా దించుకుని కూర్చుని ఉన్న యాజకుల నేత్రాలు హోమ ధూపాలతో ఎర్రబడి విచిత్ర వాతావరణం ఏర్పడ సాగింది.
హోతలు సమంత్రకంగా...
 ఒక్కొక్క సర్పాన్ని ఆవాహనచేసి
        " స్వాహా " అంటుంటే
 పిలిచిన ప్రతి పాము వచ్చి ఆ యజ్ఞగుండంలో పడి మలమలమాడిపోతూ ఉన్నాయి.
తుళ్ళుతూ దీనమైన స్వరాలతో సహాయార్థం అయిన వారిని పిలుచుకుంటూ.....
 పడగలెత్తి అటు ఇటు మిడిసి పడుతూ... శిరోభాగాలతో...పాల భాగాలతో
 ఒకటి నొకటితో వీడలేము అన్నట్లు చుట్టుకుంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ...
తప్పించుకోలేని దుఃఖంతో......
 తామేమీ కాబోతున్నామో తెలియక
పడగలు  విప్పుకుని .....
అటు ఇటు అయోమయంగా
 చూస్తూ  వచ్చి.....
 హోమం వేడి తగలగానే కంగారుపడుతూ రకరకాల భంగిమల్లో భుజంగాలు
నిప్పుల్లో పడిపోతున్నాయి...‌..........
 నల్లవి ...తెల్లవి ..నీలానివి ...బంగారు రంగు వి ముసలివి... పడుచువి... పసివి.... ప్రౌఢత గలవి, రకరకాల కూతలతో " కూ " లిడుతూ
వచ్చి యజ్ఞగుండం లో పడి పోతున్నాయి.
ఏనుగు తొండాల వంటివి, ఏనుగు లంత శరీరం కలవి, పొట్లకాయల వంటి సన్నవి, యోజనాల వంటి పొడగైనవి కూడా మంత్రబద్ధాలై అనూహ్యమైన రీతిలో అగ్నిలో ఆహుతై పోతున్నాయి.
అవి కాలుతున్న చప్పుడు
 వాటి వసా - , మెదడు కావడం వల్ల వస్తున్న వాసన,రంగులు మారుతున్న హోమ ధూమాలతో......ఆ ప్రాంత మంతా నిండి పోయింది.
           తక్షకుని కి ఇంద్రుని అభయం
            -------------------------------------
జనమేజయుని యజ్ఞం ఇక్కడి ఆరంభం అవుతుందని తెలియగానే - అందరి కన్నా ముందుగా ఉలిక్కిపడింది తక్షకుడే. సంగతి తెలిసిన తక్షణమే, అతగాడు సర్వదేవతా ధీశుడైన మహేంద్రుని ఆశ్రయించాడు. తనను ఎలాగైన కాపాడమని అర్థించాడు. ఇంద్రుడు కూడా ఆలోచించాడు ....అయితే ఈ యజ్ఞం గురించి గతంలో విధాత చెప్పిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే శేషుడు,  వాసుకి మొదలైన దివ్య సర్పాలకు మరికొన్ని సర్పాలకు హాని వాటిల్లదని జ్ఞాపకం వచ్చింది.అందువలన యింద్రుడు అతనికి అభయం ఇచ్చాడు. అయినప్పటికీ తక్షకుని కి భయం పోక, అమరేంద్రుని వద్దనే చుట్టలు చుట్టుకొని పడుకొని పోయాడు.
        కథ వింటున్న శౌనకులు " సర్వ రహస్య వేత్తవైన సూతా ! భయంకరాగ్ని జ్వాలల్లో... సృష్టిలో అనుపమాన బలపరాక్రమం కలిగిన నాగులు ఇలా దగ్ధం కావడానికి మరొక బలమైన కారణం ఏదైనా ఉందా మహాత్మా" అని కథ వింటూనే కుతూహలం తో అడిగారు ఋషులు.
తల్లి మాటకు ఎదురు చెప్పినందువల్ల నాగులు, తమ తల్లి అయినా కద్రువ శాపానికి గురి అయిపోయారు అని సమాధానం చెప్పాడు సూతమహర్షి.
ఏమిటీ విచిత్రం కన్న తల్లేనా తన బిడ్డలకు శాపం పెట్టింది అని ఆశ్చర్యపోయారు శౌన కాదులు.......
 నాగులు కేవలం జనమేజయుని ఆగ్రహానికి గురియై పోయారు అని అనుకుంటాం ... కానీ దానికి తల్లి శాపం కారణమై ఉంది దానికి కూడా మరేదైనా కారణం ఉండవచ్చు ఏది ఏమైనా కారణ కారకుడు ఈశ్వరుడే 🌼🙏
కానీ అందరు నిమిత్తమాత్రమే... కారణానికి కారణమైన ఈశ్వరుడే అసలు కారణం 🌼🙏
అందరు నిమిత్తమాత్రులే కనుక ఈ లోకంలో తప్పు ఒప్పు అభిప్రాయాల నుండి మనం బయట పడవలసి ఉంది
           సర్వేజనా సుఖినోభవంతు
మిత్రులందరికీ శుభరాత్రి నమస్కారాలతో

__(())_-


 
నేటి సంక్షిప్త సమాచారం ప్రాంజలి ప్రభ  (శీలం )

మనిషిలో కళల చేతలు, మాటలు, సక్రమ పద్ధతిగా ఉన్న విలువలు పెరుగుతాయి,. దీనికి ప్రకృతి సహకారం ఉంటుంది. మనసు ప్రశాంతిగా ఉండి, దైవ కృపతో, ఆరోగ్యంగా, ఉండ గలుగుతారు. లోకంలో జరిగే విషయాలకన్నా మనలో ఉన్న జ్ఞానము, ఎంతమందికి అందించగలిగాము, ఎంతమందికి, ఉపయోగపడింది అనేది గ్రహించి, నడక సాగిస్తే అంతా శుభమే         

 (అందుకే నేను చెపుతున్నా చేతలు, మాటలు, ఆలోచనలు ఒకటిగా ఉంటే శీలం ఎప్పటికి చెడిపోదు ఆ దిశగా మారండి  )
                                      *****
డ్రైవింగ్​ లైసెన్స్ జారీలో భారీ మార్పులు.                              లైసెన్స్​ జారీ రూల్స్‌లో మార్పులు చేసిన రవాణా శాఖ

40 ఏళ్లు దాటితే రెన్యువల్ కు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి

ఏడాదిలోపు లైసెన్స్ రెన్యువల్‌ చేయకుంటే మళ్లీ ఎల్ఎల్ఆర్

ఎన్నేండ్లు లేట్ అయితే అన్నేండ్లూ రూ.వెయ్యి ఫైన్.                ఇప్పటిదాకా డ్రైవింగ్​ లైసెన్స్​ కావాలంటే కనీసం ఎనిమిదో తరగతి చదివుండాలన్న రూల్​ ఉండేది. కానీ, ఇకనుంచి దానికి ఎలాంటి చదువూ అక్కర్లేదు. కనీస విద్యార్హత రూల్​ను రవాణా శాఖ తీసేసింది. కేంద్ర మోటార్​ వెహికల్​ యాక్ట్​కు తగ్గట్టు మార్పులు చేసింది. నిరుడు ఫిబ్రవరి 18వ తేదీన అప్పటి ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ సునీల్​ శర్మ పేరుతో తాజాగా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కొత్త రూల్​ను తప్పకుండా అమలు చేయాలని పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్​లోనే జిల్లా అధికారులకు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. కొత్త రూల్స్​తో ఎల్లోప్లేట్​(ట్రాన్స్​పోర్ట్​ వెహికల్స్​) అయినా, మామూలు బండ్లు అయినా ఎలాంటి చదువు అవసరం లేకుండానే డ్రైవింగ్​ లైసెన్స్​ పొందేందుకు వీలు దొరికినట్టయింది.

రెన్యువల్​లోనూ మార్పులు

డ్రైవింగ్​ లైసెన్స్‌​ రెన్యువల్​కు సంబంధించి కూడా అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇప్పటికే లైసెన్స్​ ఉన్నోళ్లు 40 ఏండ్లు దాటితే రెన్యువల్​ కోసం తప్పనిసరిగా మెడికల్​ సర్టిఫికెట్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా 50 ఏండ్లు దాటినోళ్లే మెడికల్​ సర్టిఫికెట్​ ఇస్తున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాల పాలవుతుండడం, ప్రమాదాలు జరుగుతుండడంతో.. 40 ఏండ్లు దాటితే మెడికల్​ సర్టిఫికెట్​ కంపల్సరీ అన్న రూల్​ను తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇటు గడువు ముగిశాక టైంకు లైసెన్స్​ను రెన్యువల్ చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు. గడువు ముగిశాక నెల దాకా గ్రేస్​ పీరియడ్​ ఉంటుంది. ఆ లోపు చేసుకోకుంటే రూ.వెయ్యి పెనాల్టీ చెల్లించి రెన్యువల్​ చేసుకోవచ్చు. ఏడాది దాటినా రెన్యువల్​ చేసుకోకపోతే లైసెన్స్​ను రద్దు చేస్తారు. మళ్లీ లెర్నింగ్​ లైసెన్స్​ (ఎల్​ఎల్​ఆర్​) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డ్రైవింగ్​ టెస్టుకు వెళ్లి లైసెన్స్​ తీసుకోవాలి. రెన్యువల్​ ఎన్నేండ్లు లేట్​ అయితే.. అన్నేండ్లు వెయ్యి చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటు సీనియారిటీ కూడా పోతుంది. లైసెన్స్​ గడువు తీరాక ఐదేళ్ల దాకా రెన్యువల్​ చేసుకోకుంటేనే ఎల్​ఎల్​ఆర్​ అనే నిబంధన ఉండేది. ఇప్పుడు దానిని ఏడాదికి తగ్గించడం వల్ల వాహనదారులకు నష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఈరోజు జీవిత సత్యం. అదృష్టం తో పైకి వచ్చినవారికి, చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసు, వారికి ఎప్పుడు పడతామో అని భయంతో ఉంటారు..అదే స్వయంకృషి తో పైకి వచ్చినవారికి చెట్టు ఎక్కడం దిగడం రెండూ తెలిసి, పడినా పైకి ఎక్కగలను అని దైర్యంతో ఉంటారు..అదే అదృష్టానికి, స్వయం కృషి కి తేడా..

మనం ఒకరిని అభిమానిస్తే వారి లోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించ గలగాలి.. అప్పుడే స్నేహమైన, బంధమైనా బలంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది. .ప్రపంచంలో లోపంలేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా ..

మనిషిలో అహంతగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది.. గర్వం పోయినరోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండి పోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చు కుంటూ, ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం..

 ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు. అదే వెయ్యి సంతోషాలు ఒక బాధను కూడా దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి ఒకర్ని బాధపెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని.. అందుకే మన మాటలు పనులు ఇతరులను సంతోషపెట్టేవిలా కాక పోయినా బాధ పడేవిలా ఉండకూడదు.

ఆధ్యాత్మికతలో శుచి, శుభ్రత అవసరం. శుచి అంటే మానసిక పవిత్రత. శుభ్రత అంటే శారీరక పవిత్రత. ఏదో ఒక ఆలోచన ఎప్పుడూ తప్పదు. అయితే అప్పటికి అవసరంలేని ఆలోచన చేస్తున్న పనికి ఆటంకం అవుతుంది. శ్రద్ధ లోపించి పని చెడుతుంది. ఒక ఆలోచన ఆపినా మరోక ఆలోచన సిద్ధంగా ఉంటుంది. అందుకే ఎదురుగా ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధించిన ఆలోచననే చేయటం అలవాటు చేసుకుంటే మనస్సు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అప్పటికి అవసరమైన ఆలోచనలోనే ఉంటే పని ఫలవంతమైన శాంతి లభిస్తుంది !

--(() ) --

సమ్మోహనాలు () ... 1051----1060 (బతుకు బండి )
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దేశ మెలా ఉన్నా
ఉన్న నేను యున్నా
యున్న ఆధారమే జీవనం ఈశ్వరా
బతుక మార్గ మెంచా
మార్గము ఓర్పుంచా
ఓర్పుతో జీవసాగరంమ్మే ఈశ్వరా
కాలు లేని వాన్నీ
వాన్నీ ధర్మాన్నీ
ధర్మాన్ని బతికించు మార్గాన్ని ఈశ్వరా
బొమ్మ బొరుసు తప్పదు
తప్ప దన్న ఆగదు
ఆగదు ఏనిముషము  నీకొరకు ఈశ్వరా
మనిషిలొ అజ్ఞానం
అజ్ఞాన మకారం
మకార అహంకారం తొ సాగు ఈశ్వరా
జిజ్ఞాసు ఉండాలి
ఉండి ఆర్తవ్వాలి
ఆర్తి అర్దార్ది జ్ఞాని కలసె ఈశ్వరా
స్వార్ధ పిశాచానికి
పిశాచం బుద్దులకి
బుద్ధులు సక్రమం ఆదణలు ఈశ్వరా
విశ్వాసమే బలము
బలము బతుకు తనము
బతుకు వెలుగులు పంచుట మనిషియె ఈశ్వరా
సంకల్పమే బలము
బలము తో జీవనము
జీవన జవసత్వాలే కళలు ఈశ్వరా
శోధనలు సాధనలు
సాధన ఆయుధాలు
ఆయుధాలు న్యాయం ధర్మం ఈశ్వరా
భారమవ్వక సాగు
సాగే బండి లాగు
లాగేది నిత్య బతుకు బండిని ఈశ్వరా
--(())--


💐మారుతీ శతకము💐 :ఈ శతక కర్త పేరు గోపీనాథము వేంకటకవి. వీరునెల్లూరు జిల్లా, కావలి తాలూకాలోని లక్ష్మీపురాగ్రహార వాస్తవ్యులు. సాహిత్య పరిశోధకుల అభిప్రాయాన్నిబట్టి వీరు క్రీ.శ.1813
సం. శ్రీముఖ సంవత్సరమున జన్మించినట్లు తెలుస్తున్నది. వీరు తమ పదహారవ యేట వేదాద్రినరసింహస్వామిఉత్స వాలకు వెళ్ళగా అచ్చట ఒక మహాయోగి మంత్రోపదేశం
వలన వీరికి అనర్గళ కవితాధార యలవడినట్లుగా వీరి గ్రంధములవలన తెలుస్తున్నది. వీరు తన విద్వత్కవితా ప్రతిభ చేత వేంకటగిరి సంస్థానాధిపతులను మెప్పించి వారి ఆస్థానకవిగా నియమితులైనారు. వీరు రామభక్తులు. మారుతీ శతకము వీరి తొలి కృతి. దీనిని తమ పదహారవ  రచించినారట. ఆతరువాత తన ఇరవయ్యవయేట శ్రీరామాయణ రచన ప్రారంభించి అయిదేండ్లకు ముగించి నారు. ఆ రామాయణమే గోపీనాథ రామాయణంగా ప్రసిద్ధి ది. తదనంతర కాలంలో వీరు చెసిన ఇతర రచనలు శ్రీకృష్ణజన్మఖండము, భగవద్గీతా శాస్త్రము,శ్రీరామస్తవము, బ్రహ్మానంద శతకము, శిశుపాలవధము(మాఘకావ్యము),
శ్రీరాధికాపరిణయము, తిరునాళదండకము మొllవి.

శార్దూల మత్తేభ ఛందస్సులలో వ్రాయబడిన'మారుతి శతకము'లో 116 పద్యాలు వున్నాయి. ఈ పద్యాలలో ఆంజనేయస్వామివారి చరిత్ర,పుట్టుక మొదలుకొనిస్వామి ని గూర్చిన విశేషాలు, స్వామి చేసిన మహత్కార్యాలు రస రమ్యంగా వర్ణింపబడినాయి. రోజుకు కొన్ని పద్యాలను సహితంగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ దలచాను. భక్తులు, మిత్రులు, సాహిత్యాభిమానులు చదువుదురుగాక!
శతకం చివరిపద్యంలోకవిచెప్పుకున్న దాన్ని బట్టి కవి గారి
తండ్రి పేరు పద్మనాభ శాస్త్రి గారని తెలుస్తున్నది.

ఇంక మారుతీ శతకంలోనికి ప్రవేసిద్దాము.

1)శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్‌ సేవించి, యస్మద్గురు, 
స్వామిన్‌ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా, 
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్‌ భక్తి నర్పించెదన్‌, 
నా మీదం గృపజేసి కైకొను మమంద ప్రీతి తో మారుతీ!

తాll సీతారామచంద్రమూర్తి యొక్క పద్మములవంటి పాద ద్వయమును భక్తితో పూజించి, వేదాద్రి క్షేత్రములో మంత్రో పదేశముతో నన్ను అనుగ్రహించిన యోగిపుం గవుడైన నా గురుదేవుని సంతోషముతో స్మరించి, నాకు పూర్వులూ సమకాలికులూ అయిన సత్కపు లందరకూ నమస్కరించి, నాకు దైవదత్తముగా లభించినపాండిత్య ప్రతిభా పాటవములతో , ఓమారుతీ (ఆంజనేయ స్వా మీ!) నీ ప్రతిభావిశేషాలను వర్ణిస్తూ స్తుతిస్తూ నీ గూర్చి ఒక పద్య శతకాన్ని రచించి నీకు సభక్తికంగా సమర్పించ దలచాను.నాయందు దయయుంచి నాయీ కృతినిప్రేమ పూర్వకంగా స్వీకరించి నన్ను కృతార్థుని చేయి స్వామీ!.

2)మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరి తేజంబునన్‌, 
వినువీథిం గనుపట్టుబాలరవిసద్బింబంబు నీక్షించి, యె, 
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్‌ వేడ్క మున్నూరు యో,
జనముల్‌ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ!

తాత్పర్యం:- ఓ ఆంజనేయ స్వామీ! నీవు అంజనాదేవీ గర్భాన జన్మించిన తొలిరోజులలోనే, ఆకాశంలో గొప్ప తేజస్సుతో ప్రకాశించే బాల సూర్యణ్ణి చూసి, ఎర్రని పండనుకున్నావు. దాన్ని పట్టుకొని తినాలనే ఆసక్తితో గరుత్వంతుని (పత్రిపతి)వలె అత్యంత వేగవంతుడవై,
భూమి నుండి మూడువందల యోజనాల దూరం ఎగురుతూ వెళ్ళావు ( ఆ సందర్భంలో ప్రమాదాన్ని పసిగట్టిన దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా స్వామి దవడలు దెబ్బతిన్నాయి). శౌశవంలోనే ఇంతటి అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి, ముల్లోకాలలో
వుండే వారితో స్తుతింపబడినావు.
ఇంకావున్నాయి.,

 3)మll నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మతేజంబుఁ గూ, 
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాట క్షేత్రమందర్థి నిం, చ, 
జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్‌ రహిన్‌ మిశ్రమై,
త్రిజగంబుల్‌ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్‌ మారుతీ!

తాత్పర్యం:- జగత్ప్రాణుడైన వాయుదేవుడు, అగ్నిదేవుని ద్వారా తనకందజేయబడిన శివతేజాన్ని, తన స్వతేజం తో మిళితం జేసి, వనంలో తపస్సుచేస్తున్న కేసరి అను
వానరుని భార్య దోసిటలో పడవేయగా ఆమె దాన్ని ఫల మని భావించి దైవప్రసాదంగా తలంచి భుజించినది. శివ వాయువుల ఉభయ తేజముల మహిమ వలన గర్భందాల్చిన అంజనాదేవికి, ముల్లోకాలలో కొనియాడబడెడి విశిష్ట వ్యక్తిగా జన్మించితివి గదా స్వామీ!
వైశాఖ మాసం కృష్ణ పక్షం లో దశమి నాడుశనివారం పూర్వా భాద్ర నక్షత్రం లో వైద్రుతీ యోగం లో మధ్యాహ్న సమయం లో ,కర్కాటక లగ్నం లో అంజనా దేవికి ఆంజనే యుడు జన్మించాడు. బంగారు రంగు, పింగళ వర్ణం గలనేత్రాలు, స్వర్ణ హారం, బంగారు యజ్ఞోపవీతం, మణుల
నూపురాలతో, ధ్వజము, వజ్రాయుధం, అంకుశం, గొడుగు, పద్మం అనే శుభ చిహ్నాలు పాదాలలో వున్నవాడు , పొడవైన తోక గల వాడు, వజ్ర దేహంతో ప్రకాశించే వాడు పెద్ద
దవడలు కలవాడు, కటి సూత్రం కౌపెనం (గోచి) తో వున్న గొప్ప బాహువులతో విరాజిల్లు తున్న కపిరూపం లో ఆంజనేయ బాలుడు విరాజిల్లాడు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు. అంజనకు పుట్టిన వాడు కనుక ఆంజనేయుడు పేరు .కేసరి కుమారుడు కనుక కేసరినందనుడు.
వాయువు వర ప్రసాదం తో పుట్టాడు కనుక వాయునందనుడు, అనిల సుతుడు అయ్యాడు..అగ్ని తేజం కూడావుండటం తో అగ్ని సంభవుడని, శివ పార్వతుల తేజస్సుకల్గివుండటం తో పార్వతీ నందనుడనీ, శంకర సుతుడనిపిలువ బడు తున్నాడు. సకల దేవతలతేజస్సుతోజన్మించి
నందున సర్వ దేవాత్మకుడు అన్నారు .

”ఆన్జనేయః పూజితేస్చేత్ –పూజిత సర్వ దేవతాః
”అందుకే ఆన్జనేయుడిని పూజిస్తేసకల దేవతలను పూజించినట్లే నని బ్రహ్మ దేవుడు చెప్పాడు .

4)మllఅనిమేషేభము తెల్లపండనుచుబాల్యక్రీడలన్‌మ్రింగనొ,
య్యన డాయం బవిచే బలారి నినుమూర్ఛాక్రాంతునిం జేయ బూ,
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్‌ భగ్నంబుగా వ్రాలినన్‌, 
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ!

తాత్పర్యం:- ఓ స్వామీ! నీవు చిన్నపిల్లవానిగావున్నప్పుడొకసారి ఆటగోలుగా, ఆకాశంలో తూర్పు దిక్కునఉదయ సూర్యుని చూచి, ఆతనిని ఒక తెల్లని పండుగా భావించి,మ్రింగాలనే తలంపుతో ఆకాశంలోకి ఎగిరిపోతూ సూర్యని సమీపించ బోయావు. అప్పుడు ప్రమాదాన్ని పసిగట్టిన దేవేంద్రుడు తన వజ్రాయుధంచే ఎదురుపడి కొట్టగా,ఎడమ దౌడ భగ్నమై నీవు స్పృహ కోల్పోయి ఉదయాద్రిశిఖరతలాన పడిపోయినావు. అప్పటి నుండి నీ యొక్క
'హనువు' అనగా 'దౌడ' కొట్టవచ్చినట్లు కనిపించుచుడటంవలన నీవు హనుమంతుడనే పేరుగలవాడివయ్యావు.ఇంకావున్నాయి.,

5)మll అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్ థ వీక్షించి, 
తా,గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచిం పఁగాఁ జేయ న,
చ్చపు గూర్మిన్‌ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స, 
త్కృపతో నీకు వరంబులిచ్చిరి గదా బృందారకుల్‌ మారుతీ!

తాత్పర్యం:- గత పద్య భావానకి కొనసాగింపుగా..
ఓ మారుతీ ! ఇంద్రుని వజ్రాయుధ ఘాతంతో దెబ్బతిన్న దవడ గలవాడై ఉదయాద్రి శిఖర తలాన నీవు మూర్ఛితుడవై పడిపోగా, అప్పుడది చూసిన, నీతండ్రియగు వాయు
దేవుడు (గంధవహుండు) కోపించన వాడై తాను వీచుటమాని స్థబించి పోయాడు. (వాయువు వీచనిదే జీవులప్రాణాలు నిల్వవు, క్షణంలోలోకాలుకల్లోలమైపోగా)బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై వాయుదేవుని శాంతపరచారు, నిజమైన ప్రేమతో కృపాళువులై ఏవిధమైన అస్త్రములతోగానీ,
శస్త్రములతో గానీ నీకు హాని (లేదా మరణము) సంభవింపదని వరములు ఇచ్చారు కదా స్వామీ!

6)మll ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే,
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌,
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చా తుర్య మేమందు దా, 
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! బాల్యములో నీవు ఒక పాదాన్ని నూర్యోదయం అయ్యే ఉదయగిరిపైననూ, వేరొక పాదాన్ని సూర్యుడు హస్తమించే పశ్చిమగిరిపైననూవుంచి‌,సూర్యుని
ద్వారా సకల వేదవేదాంగములను నేర్చుకొనుటలో నీవు చూపిన ఓర్పూనేర్పలను గూర్చి ఏమని చెప్పగలము.దివ్య మైన అనితరసాధ్యమైన గొప్పదైన నీ ప్రతిభాపాటవము లను ఉన్నవి వున్నట్లుగా ప్రస్తుతించి చెప్పటం ఎవరికైనా సాధ్యమౌతుందా? అంటే సాధ్యముకాదని భావము.
ఇంకావున్నాయి.,

7)మల్ బలవంతుండగువాలి ప్రోలు వెడలింపం, 
బత్నిఁగోల్పోయిమి క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా,
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! ఇంద్రుని అంశతో జన్మించినవాడు మరియు మహాబలవంతుడగు వాలి ( వానరరాజ్యమైనకిష్కిధాధిపతి) చేత కిష్కింధాపురము నుండి వెళ్ళగొట్టబడిన వాడగు సుగ్రీవుడు, తన భార్యను కోల్పోయి, తీరనిదుఃఖంతో కీకారణ్యములలో తిరుచున్నప్పుడు, అతడు నీగురువగు సూర్యదేవుని పుత్రుడగట వలన ఆతనిపై ప్రేమా భిమానాలూ చూపూతూ, అతణ్ణి ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని వుంటూ వాలికిచిక్కకుండాకాపాడితివికదా,స్వామీ!

8)మllతనపత్నిం దిలకింపుచున్‌ నిబిడకాంతారోర్వివర్తించు రా,
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువే షంబునన్‌,జని,
సుగ్రీవుని చందముం దెలిపి యాక్ష్మానాథుదోడ్తెచ్చి, మె,
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్‌ సఖ్యసంబంధమున్‌ , 
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ!

తాత్పర్యం:- ఓ మారుతీ! అపహరణకు లోనైన తనభార్య ను వెదకుచూ దట్టమైన అడవులలో తిరుగుచూ (ఋష్య మూక పర్వత సమీపానికి) వచ్చిన, శ్రీరామ రాజేంద్రుని కడకు, సుగ్రీవుడు పంపగా బిక్షకుని వేషంలో వెళ్ళి, (చక్క గా సంభాషించి, శ్రీరాముని మొప్పుబొంది) సుగ్రీవుని దుర వస్థను వివరించి, (శ్రీ రామ లక్ష్మణులను నీ రెండు భుజముల మీద ఎక్కించుకొని, కొండ మీద భయకంపితుడై కలవర పడుతున్న) సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళి, శ్రీరామ సుగ్రీవులకు అగ్నిసాక్షిగా మైత్రీబంధాన్ని కుదిర్చిన వినయశీలుడవు నీవే కదా స్వామీ!

--(())--


🌻  *మహా భారతం* 🌻

🩸 *భాగము 5* 🩸

💧 *సింహబలుడు* 💧

🍃🌺విరాటరాజు పట్టమహిషి, సహోదరి అయిన సుథేష్ణాదేవిని చూడడానికి కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వచ్చీరాగానే వాని దృష్టి ద్రౌపదిని సోకింది. మహావీరుడు, సింహబలుడుగా పేరుగాంచిన కీచకుడు రాజుగారి బావమరిది. పైగా విరటుని సర్వసేనాధిపతి. రాజ్యానికి కీచకుడు పెద్ద అండ. సోదరిని ‘‘కొత్తగా వచ్చి, అంతఃపురానికే వినూత్న శోభ తెచ్చిన యీమె ఎవరు?’’ అని అడిగాడు సింహబలుడు. 

🍃🌺రాక్షస ప్రవృత్తిగల సోదరుని ఆంతర్యం గ్రహించిన సుథేష్ణ తడబడింది. కీచకుడు కనుబొమలు సారించి, రెప్పవేయక పాంచాలిని చూస్తున్నాడు. మహారాజుకి అతడే కండబలం, అతడే మనోబలం. పైగా ఎంతో కావల్సిన వాడు. మాలిని కేవలం అక్కగారి దాసి. కనుక, తను మనసు పడితే భంగపడే అవకాశమే లేదు. కీచకుని చూపులు ముళ్లవలె ద్రౌపదిని గుచ్చుకుంటున్నాయి. 

🍃🌺వాని హావభావాలు, వాగ్ధోరణి కంపరం పుట్టిస్తున్నాయి. అప్పటికీ ఆమె అలక్ష్యం చేసి, రోషాన్ని దిగమింగి- ‘‘అన్నా, అక్క చెల్లెళ్లున్న వాడివి. నేను హీనవంశంలో పుట్టి, దాసి వృత్తిలో వున్నదానిని. నా యీ వేషభాషలు నీకు జుగుప్స కలిగించడం లేదా మా రాజా’’ అన్నది దీనంగా. కీచకుడు మాలిని మాటలకు విలాసంగా నవ్వాడు. అంగాంగ వర్ణనలో ఆమెను పొగిడి, తిరుగులేని తన కోర్కెను ముఖాముఖి వివరించాడు.

🍃🌺ద్రౌపది సింహబలుని దుర్భాషలను సహించలేక పోయింది. ఆగ్రహావేశాలు కమ్ముకున్నాయి. మర్యాదలు పక్కన పెట్టి, పరుష స్వరంతో, ‘‘కీచకా, నా భర్తలు అయిదుగురు. వారు శౌర్యనిధులు. శత్రు సంహార విద్యలో విశారదులు. దేవ అంశగల గర ధర్వులు. సాక్షాత్తూ ఇంద్రాదులు దిగివచ్చి, నీకు అభయం ఇచ్చినా ప్రయోజనం వుండదు. 

🍃🌺నీ మంచికోరి చెబుతున్నాను. రవంత ముందు వెనకలు ఆలోచించుకో. అధికార బలంతో, బల గర్వంతో అహంకరించి చావుని గడపలోకి పిలుచుకోకు సుమా’’ అని హెచ్చరించింది. సింహబలుడు హేలగా నవ్వి, ఆమె మాటలను తృణప్రాయంగా తీసి పారేశాడు. పరస్ర్తీలను ఆశించిన దుష్టాత్ముల బతుకులు ఎలా ముగిశాయో ద్రౌపది చెప్పింది. 

🍃🌺కీచకుడు నిర్లక్ష్యంగా సోదరి సుథేష్ణ దగ్గరకు పోయి, ‘‘ఆ జవ్వని నా వశం కావాలి. నీదే భారం’’ అన్నాడు. సుథేష్ణ పరిపరి విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించి, విఫలమైంది.మూర్ఖుని మనసు మార్చలేమని పట్టపురాణికి అర్థమైంది. మాట మీద మాట పెరగడం తప్ప, సమస్య పరిష్కారం కాదని తేటతెల్లమైంది. సోదరుని అనునయంగా చల్లబరిచింది.

🍃🌺 ‘‘నాయనా, కేవలం వొక దాసి పొందుకోసం నీవు యింతగా తపించనేల? మనమూ మన అంతస్తూ దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పానుగాని, వేరేమీ కాదు. నాకు కొంచెం వ్యవధి యిస్తే, ఆమెను నయానో భయానో దారికి తెస్తాను. ఏదో వంకతో నీ మందిరానికి పంపుతాను’’- అంటూ వూరట పరిచింది మహారాణి. ఆ క్షణానికి యీ ఆపదకు తెరపడింది. తన ప్రాసాదానికి మరలి వెళ్లిన సింహబలుడు మాత్రం క్షణాలు లెక్కపెడుతున్నాడు. 

🍃🌺ఆ సౌందర్యరాశి రాకకోసం నిరీక్షిస్తున్నాడు. మందిరంలో ఎక్కడ అడుగుల సవ్వడి వినిపించినా సింహబలుడు వుత్సాహంగా, ఆత్రుతగా చూపులు సారిస్తున్నాడు. సోదరుని బుద్ధి సుథేష్ణకు పూర్తిగా తెలుసు. సింహబలుని తిరస్కరించి సింహాసనాన్ని కాపాడుకోవడం దుర్లభం. సుథేష్ణ తన భవనంలో అడుగు పెట్టినపుడే, మాలినిని వ్యక్తిగత పరిచారికగా వుంటుందని, భవనం దాటి వెళ్లే పనులు చెప్పనని మాట యిచ్చింది. 

🍃🌺ఇప్పడు మహారాణికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఇక చేసేది లేక, మాలినిని పిలిచి కీచకుని భవనానికి వెళ్లి మద్యం తీసుకు రమ్మని ఆదేశించింది. ద్రౌపది తన ముఖ కవళికలలోనే అయిష్టతను వ్యక్తం చేసింది. రాణి యిచ్చిన మాటను వినయంగా గుర్తు చేసింది. సుథేష్ణ మరపు నటిస్తూ లౌక్యాన్ని ప్రదర్శించింది. ‘‘ఔనౌను. ఇలాంటి పనులు నీకు చెప్పనని నాడే చెప్పాను. 

🍃🌺అత్యవసరమై మాట మరచి నీకు చెప్పాను. అయినా అదేమీ పరాయి చోటు కాదని భావించాను’’ అంటూ, అందులో నిష్ఠూరాన్ని, అపరాధ భావననీ ధ్వనింప చేసింది. ‘‘రాణి కరకుగా వున్నా దాసి వుండకూడదు. అజ్ఞాతవాసంలో మగ్గేటపడు యివన్నీ తప్పవు’’ అని ద్రౌపది మనసు దిటవు చేసుకుని మదిర పాత్రతో సింహబలుని నివాసానికి బయలు దేరింది.

🍃🌺బెబ్బులి గుహలో అడుగు పెట్టిన ఆడలేడిలా ఆమె బెదురుతూ లోనికి అడుగు పెట్టింది. సైరంథ్రిని చూడగానే సింహబలుని హృదయంలో హర్షావేశం తాండవించి, అది ముఖమంతా ప్రతిఫలించింది. వెంటనే తన విశాల వక్షస్థలం మీది ముత్యాల హారాలను సద్దుకుని, ఆమెకు యెదురు వెళ్లాడు. మాలిని ముక్తసరిగా వచ్చిన పని చెప్పింది. 

🍃🌺సింహబలుడు తన ధోరణిలో మాటలు మొదలు పెట్టాడు. సైరంథ్రి సౌందర్యాన్ని పొగిడాడు. తన బలాన్ని, బలగాలని ఏకరువు పెట్టాడు. అధికారాన్ని, తనకు గల ఐశ్వర్యాన్ని వివరించాడు. అపూర్వ మణి మాణిక్యాలతో శరీరాన్ని పొదగగలనన్నాడు. భవనాలు, ఉద్యానవనాలు, వస్తువాహనాలు లెక్కకు మిక్కిలిగా నీ సొంతం చేయగలనన్నాడు. 

🍃🌺నా కులకాంతలే నీకు చెలికత్తెలై నిన్ను సేవిస్తారు. నేను సైతం అడుగులకు మడుగులొత్తుతాను. సైరంథ్రీ, సరేనని వొక్కమాటతో నా వీనులకు విందు చేయవా - అని ప్రాధేయపడ్డాడు. శిలాప్రతిమలా నిలబడిన సైరంథ్రిని చూసి మదనోన్మాదంతో వివశుడై మరో అడుగు ముందుకు వేశాడు. 

🍃🌺ద్రౌపదిని బలమైన తన చేతులతో బంధించ యత్నించాడు.తన సమస్త శక్తులను తృటికాలంలో కూడతీసుకుని, ద్రౌపది ఒక్కసారిగా కీచకుని విసిరి కొట్టింది. అంతటి శక్తిని ఆమెలో సింహబలుడు వూహించలేదు. అనుకోని పరిణామానికి కీచకుడు పురుగులా దూరంగా పడ్డాడు. రెప్పపాటులో భవనం దాటి రాజవీధిలోకి నడిచింది పాంచాలి. కీచకుడు క్రోధావేశంతో లేచి, ఆమెను పెద్ద పెద్ద అంగలతో వెంటాడాడు. భీతితో మాలిని రాజవీధిన పరుగు వంటి నడకతో, కంట నీరు వొత్తుకుంటూ సాగుతోంది.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀:

 *ఓం నమో భగవతే వాసుదేవాయ*

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

      *శ్రీ భాగవతం - 103 వ భాగం* 

        *చదువుకుందాం భాగవతం*

      *బాగుపడదాం మనం అందరం*

              *దశమ స్కందము*

             *శ్రీకృష్ణ లీలలు - 33*

🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

ఒకనాడు‌ శ్రీకృష్ణభగవానుడు పరమసంతోషంగా రుక్మిణీ దేవి మందిరంలోకి ప్రవేశించారు. అది అసురసంధ్య వేళ దాటిన కాలం. 

ఆ యిల్లు కర్పూరము అగరు మొదలయిన సువాసనలతో ఉంది. కృష్ణ పరమాత్మ ఆగమనమును తెలుసుకున్న రుక్మిణీదేవి గబగబా వెళ్లి ఆ పరిచారిక చేతిలో ఉన్న దండమును తాను తీసుకొని కృష్ణ పరమాత్మకి విసురుతోంది. కృష్ణుడు రుక్మిణి వంక చూసి పరమ ప్రసన్నుడై ఆమెతో,  “రుక్మిణీ! నిన్ను చూస్తే నీవు చాలా పొరపాటు చేశావేమో అనిపిస్తోంది. నేను ఐశ్వర్య హీనుడను, దరిద్రుడను. ఎక్కడో సముద్రగర్భంలో యిల్లు కట్టుకున్న వాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతునితో వివాహం సిద్ధం చేశాడు నీ అన్న. నిష్కారణంగా అంత మంచి సంబంధం విడిచి పెట్టి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని సముద్ర గర్భంలో ఉన్నవాడిని, దరిద్రుడిని అయిన నన్ను నీవు చేపట్టేవేమో అనిపిస్తోంది. నీవు చేసిన పొరపాటును దిద్దుకోవాలని నీ మనసులో కోరిక ఉంటే అలాంటి అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 

ఈమాటలు వింటున్నప్పుడు రుక్మిణీ దేవి ముఖ కవళికలు మారిపోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా అదిరిపోయి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. అపుడు ఇన్ని మాటలు మాట్లాడిన కృష్ణుడు గబగబా రుక్మిణీ దేవి దగ్గరకు వెళ్ళి రెండు చేతులతో ఎత్తి ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆవిడ ఒళ్ళు చల్లబడడం కోసం ఒళ్ళంతా గంధమును రాశాడు. కళ్ళనుండి వెలువడే కన్నీటిని పన్నీటితో కదిగాడు. కర్పూర వాసనవచ్చే పలుకులు ఆమె చెవులలోకి ఊదాడు. ఆమె నేలమీద పడిపోయినప్పుడు ఆమె వేసుకున్న హారములన్నీ చిక్కుపడిపోయాయి. వాటి చిక్కులు విడదీసి గుండెల మీద చక్కగా వేశాడు. చెమట పట్టేసి కరిగిపోతున్న కుంకుమను చక్కగా దిద్ది చెమటనంతా తుడిచివేశాడు. తామర పువ్వురేకులతో చేసిన పెద్ద విసనకర్రను తెప్పించి దానితో విసిరాడు. అమ్మవారికి ఉపశాంతి కలిగేటట్లు ఆమె ప్రసన్న మయేటట్లు ప్రవర్తించి ఆవిడను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అదేమిటి రుక్మిణీ నేను నీతో విరసోక్తులాడాను. ఆ మాటలకు నీవు ఇంత నొచ్చుకుని అలా పడిపోయావేమిటి’ అన్నాడు. 

కృష్ణుడి లాంటి స్వామి యిలా మాట్లాడవచ్చునా? అని మనకి అనుమానం రావచ్చు. కృష్ణుడు అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. రుక్మిణీదేవి యందు చిన్న దోషం కలిగింది. అటువంటి చిన్న దోషమును స్వామి సత్యభామ యందు భరిస్తాడు కానీ రుక్మిణీదేవి యందు భరించడు. రుక్మిణీ దేవికి కొద్దిపాటి అతిశయం వచ్చింది. ‘అష్టమహిషులలో నేను పట్టమహిషిని. కాబట్టి కృష్ణ పరమాత్మ తప్పకుండ నా మందిరమునకు విచ్చేస్తూ ఉంటారు’ అని ఆమె మనస్సులో కొద్దిపాటి అహంకారం పొడసూపింది. కానీ యథార్థమునకు కృష్ణ పరమాత్మ 16 వేల ఎనిమిది మంది గోపికల ఇంట్లోనూ కూడా కనపడతాడు. ప్రతిరోజూ ఉంటాడు. అందరితోనూ క్రీడించినట్లు ఉంటాడు. కానీ ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. అది మన మేధకు అందే విషయం కాదు. 

రుక్మిణీదేవికి కలిగిన చిన్న అతిశయం పెరిగి పెద్దదయి పొతే ఆవిడ ఉపద్రవమును తెచ్చుకుంటుంది. అలా తెచ్చుకోకూడదు. ఆవిడ లక్ష్మి అంశ. కారుణ్యమూర్తి అయి ఉండవలసిన తల్లి. ఈ అతిశయ భావనను ఆమె నుండి తీసివేస్తే ఆమె పరమ మంగళప్రదురాలిగా నిలబడుతుంది. అందుకు కృష్ణుడు ఆమెను దిద్దుబాటు చెయ్యాలని మాట్లాడిన మాట తప్ప ఆయన ఏదో కడుపులో పెట్టుకుని మాట్లాడిన మాట కాదు. కాబట్టి యిపుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి పట్ల ప్రవర్తించిన తీరు ఆమె అభ్యున్నతి కొరకు ప్రవర్తించిన ప్రవర్తన. 

కృష్ణుని మాటలు విన్న తరువాత అమ్మవారు చాలా అద్భుతమయిన విషయమును చెప్పింది. ‘కృష్ణా! మీరు చెప్పినవి అన్నీ పరమ యదార్థములు. నేను చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని, మీకు మాత్రమే పత్నిని కావాలని పలవరించి పలవరించి మీకు భార్యనయ్యాను. మీరు లోకులు అందరివలె ఉండేవారు కాదు. మీరు పరమాత్మ. అందుకే మిమ్మల్ని చేరుకున్నాను. ధనగర్వం కలిగిన ఐశ్వర్యవంతులెవరు నీకు చుట్టాలు కారు. తాము ఐశ్వర్యవంతులమనే గర్వం కలిగి మిగిలిన వారిని చిన్నచూపు చూసే వారు నీకు చుట్టాలు కారు. అన్నీ ఉన్నా అన్నిటినీ విడిచిపెట్టి ఈశ్వరుడే మాకు కావాలని భగవంతుని కోసమే జీవితం గడిపే పరమ భాగవతోత్తములు ఎవరు ఉంటారో, అటువంటి వారికి చెందినవాడవు నీవు. ఎప్పుడూ కూడా పరబ్రహ్మ స్వరూపుడవు. నీ నడవడి ఒకరు అర్థం చేసుకోలేని రీతిలో ఉండేవాడవు. అన్నీ విడిచిపెట్టేసి ఒక్క ఈశ్వరునే చెయ్యి చాపి అడగడమే తప్ప, వేరొకరి దగ్గర చెయ్యి చాపనని అన్నవాడి దగ్గర చెయ్యి చాపేవాడివి. 

సౌందర్య వంతులయిన కాంతలతో నీకు పని లేదు. నీకు బాహ్య సౌందర్యముతో పనిలేదు. నీకు కావలసినది అంతఃసౌందర్యము. కృష్ణా, నీవు అనిన మాటల్తో చమత్కారమును నేను గ్రహించగలిగాను. ఇటువంటి వాడివి కాబట్టే నిన్ను చేరుకున్నాను. ఇంత తపస్సు చేసి నిన్ను పొందడానికి కారణం అదే. చాతక పక్షి వలె నా జన్మ ఉన్నంత కాలము నీ పాదములను సేవించే దానను తప్ప అన్యుల పక్కకి మనస్సుచేత కాని, వాక్కుచేత కాని, చేరేదానను కాను. ఈశ్వరా, నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని యివ్వు’ అని అడిగింది. 

కృష్ణుడు ‘రుక్మిణీ! నీవు పరమ పతివ్రతవు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఎవరి దగ్గరయినా నిలబడి తనను క్షమించమని అడిగిన సందర్భం లేదు. మొట్టమొదటి సారి రుక్మిణీ దేవి దగ్గర అడిగాడు. అనగా ఈశ్వరుడు తన కింకరుడిగా ఉండాలని కోరుకున్న వాని దగ్గర ఎలా ఉంటాడో చూడండి. ఈశ్వరుడు అంతవశుడు అవుతాడని తెలియజేస్తూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవలసిన విధానమును విరసోక్తిని రుక్మిణి పట్ల ప్రదర్శించినట్లుగా చూపించిన ఒక మహోత్కృష్టమయిన ఘట్టం ఈ ఘట్టం. 

రుక్మిణీ దేవి కృష్ణుడిని వశం చేసుకుని తన వాడిని చేసుకుంది. ఇది రుక్మిణీ విజయం. దానిని మన విజయంగా మనం మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము.

బలరాముడు రుక్మిని చంపుట

రుక్మికి, రుక్మిణీ దేవి అంటే చాలా ఇష్టం. కానీ కృష్ణుని మీద మాత్రం అంత పెద్ద ప్రీతి లేదు. పాము చుట్టం పడగ విరోధం. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలలో ఈ లక్షణం ఉంటుంది. అల్లుడుగారు కావాలి. కానీ అల్లుడుగారి నాన్న గారు, అమ్మగారు కానీ ఉండకూడదు. ఆ అబ్బాయి వీళ్ళింటికి అల్లుడు అవ్వాలి. ఆ పిల్లవాడికి అక్క చెల్లెళ్ళు, ఉండకూడదు. అల్లుడు గారు తన భార్య అక్క చెల్లెళ్ళను ఎంతగానో ఆదరించాలి. కానీ ఆ పిల్లవాడు తన అక్కచెల్లెళ్ళను చూడకూడదు. కొంతమంది ఆలోచనలు ఇంత హేయంగా ఉంటాయి. ఇది వ్యక్తులకు ఉండవలసిన లక్షణం కాదు. 

రుక్మికి సంబంధించిన ఈ ఘట్టం యిందుకు సంబంధించిన విషయములను విశదపరుస్తుంది. పురాణమును మన జీవితమునకు సమన్వయము చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని వలన మనం ప్రయోజనమును పొందగలుగుతాము. లేకపోతె అది మన జీవితమును ఉద్ధరించదు. 

రుక్మికి రుక్మిణి అంటే తోడపుట్టింది కాబట్టి ప్రేమ. కృష్ణ భగవానుడు అంటే అంత ప్రీతి లేదు. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతిని మేనల్లుడయిన ప్రద్యుమ్నుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన వేరొక కుమార్తె అయిన చారుమతిని కృతవర్మకు యిచ్చి వివాహం చేశాడు. మనవరాలయిన రుక్మలోచనను కృష్ణుని మనుమడయిన అనిరుద్ధునకిచ్చి వివాహం చేశాడు. ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుని వివాహమునకు కృష్ణపరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యమునకు వెళ్ళారు. అక్కడ వివాహ వేడుకలు చాలా సంతోషంగా జరిగిపోయాయి. వేడుకలు పూర్తి అయిన పిమ్మట కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అందరు బయలుదేరి పోవడానికి సిద్ధపడుతున్నారు.

అక్కడికి కళింగరాజు వచ్చాడు. కళింగ రాజు లేనిపోని పెద్దరికం తెచ్చిపెట్టుకునే తత్త్వం కలిగిన వాడు. కడుపులో చాలా బాధ పడిపోతున్నాడు. వారందరూ అలా సుఖంగా ఉండడం అతనికి సహింపరానిది అయింది. వెంటనే అతను రుక్మి దగ్గరకు వెళ్లి ‘ఏమయ్యా నీకేమయినా బుద్ధి వున్నదా? నీకు జరిగిన అవమానమును ఎంత తొందరగా మర్చిపోయావు. నీ కూతురుని కృష్ణుడు కొడుకుకు యిచ్చి వివాహం చేస్తావా. ఆరోజున కృష్ణుడు తన ఉత్తరీయం తీసి నిన్ను బండి చక్రమునకు కట్టి కత్తిపట్టి నీ జడను పాయలు పాయలుగా గొరిగి వదిలిపెట్టాడు. అపుడు రాజులందరూ నిన్ను చూసి నవ్వితే నీవు భోజకటకమును రాజధానిగా చేసుకుని ఉండిపోయావు. ఇవాళ ఆ రుక్మిణీ దేవికి కృష్ణునియందు పుట్టిన కొడుక్కి నీ కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తావా! నీకు జరిగిన అవమానం చాలా తొందరగా మర్చిపోయావే. నీ మనస్సు మంచిదే. నీవు చాల తొందరగా నీ అవమానములు మర్చిపోతావు’ అన్నాడు. 

ఇతని మాటలు విన్న రుక్మి ‘బలరామ కృష్ణులను ఎలా అవమానించ గలను?’అని కళింగ రాజుని అడిగాడు. అపుడు కళింగ భూపతి ‘ఏమీ లేదయ్యా బలరాముడికి ద్యూతం ఆడడం అంత బాగా రాదు. ద్యూతమునకు రమ్మనమని ఆహ్వానిస్తే రానని అనడు కదా! కాబట్టి బలరాముణ్ణి ద్యూతమునకు రమ్మనమని పిలు. అతను వస్తాడు. పందెములు పెట్టు. వరుసగా ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూ ఉండు. బలరాముడు కుపితుడయిపోతాడు. అన్నగారు అలా ఓడిపోతూ నువ్వు నువ్వుతుంటే కృష్ణుడి మనస్సు ఖేదపడిపోతుంది. అలా నీవు నీకు వచ్చిన పాచికలతో వాళ్ళని అవమానం చెయ్యి’ అన్నాడు. 

ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. రుక్మి బలరాముని ద్యూతమునకు పిలిచి ఓడిపోయినప్పుడల్లా నవ్వుతూవ ఉండేవాడు. బలరాముడు సహిస్తున్నాడు. కృష్ణుడు అన్నీ ఎరిగి వున్నవాడు కాబట్టి ఏమీ తెలియని వాడిలా చూస్తున్నాడు. 

ఆఖరున బలరాముడికి కోపం వచ్చి లక్ష రూకలను ఒడ్డాడు. బలరాముడు గెలిచాడు. ‘నేను గెలిచాను’ అన్నాడు బలరాముడు. నువ్వు గెలవలేదు అన్నాడు రుక్మి. అక్కడ కూర్చున్న వారు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. అపుడు బలరాముడు సరే వేరొకసారి లక్ష ఒడ్డుతున్నాను అని మళ్ళీ ఆడి గెలిచాడు. ఇప్పుడు కూడా నేనే గెలిచాను అని అన్నాడు రుక్మి. అశరీరవాణి ఈ ఆటలో బలరాముడే గెలిచాడు అని పలికింది. ఇంత అశరీరవాణి చెప్పినా రుక్మి నవ్వుతూ నువ్వు గొల్లలలో పుట్టిన వాడివి, ఆవుల వెంట, దూడల వెంట అరణ్యములలో తిరుగుతూ గోవులను కాసుకునే వాడివి. నీవు రాజులతో ద్యూతం ఆడడం ఏమిటి? నీవేమి మాట్లాడుతున్నావు? అన్నాడు. బలరాముడు ఇంక వీడిని ఊరుకోవడానికి వీలు లేదని అనుకున్నాడు. 

రుక్మిని ప్రోత్సహించిన కళింగ భూపతిని చూసి తను కూర్చున్న ఆసనం మీదనుంచి లేచి కళింగ భూపతి ముఖం మీద చెయ్యి వేసి మెడ విరిచేశాడు. పళ్ళు ఊడిపోయి క్రింద పడిపోయి కళింగ భూపతి నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. రుక్మి దగ్గరకు వచ్చి కంఠం క్రింద చెయ్యి వేసి పైకెత్తి ఒక్కదెబ్బ కొట్టాడు. మూతి వెనక్కు వెళ్ళిపోయి నెత్తురు కక్కుకుని రుక్మి చచ్చిపోయాడు. 

అపుడు కృష్ణుడు లేచి ‘రుక్మిణీ బయలు దేరదామా’ అన్నాడు. అయ్యో తప్పకుండా బయలుదేరదాము అన్నది. ఆవిడకి కృష్ణుడు ఎంత చెప్తే అంతే. తన పుట్టింటివారనే మమకారములు ఆవిడకు లేవు. ‘నా భర్త ధర్మమూర్తి. ఆయనకు తెలుసు ఏమిచేయాలో, ఆయన ఏమి చేస్తే అదే యదార్థం. అని ఆమె భావించింది. తన భర్తతో కలిసి రుక్మిణీ దేవి రథం ఎక్కి వెళ్ళిపోయింది. బలరాముడు వెళ్ళిపోయాడు. యాదవులు వెళ్ళిపోయారు.

          🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏

🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏

*నాగ సుబ్బయ్య పైడి*  (సశేషం.....)

🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹

🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 54* 🕉

*శ్రీ శైలేశు భజింతునో యభవుంగాంచీ నాధు సేవింతునో*

*కాశీవల్లభుఁ గొల్వంబోదునొ మహా కాళేశుఁ బూజింతునో*

*నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా*

*శ్రీ శృంగారవిలాసహాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 *_తాత్పర్యం:_* 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! నేను శ్రీశైలమునకు పోయి మల్లికార్జునుని సేవింతునా! కాంచీనగరము పోయి అభవుడగు (శివుడు) ఏకామ్రేశ్వరుని ఆరాధింతునా! 

🌹కాశీ నగరము పోయి విశ్వేశ్వరుని సేవింతునా! ఉజ్జయినీ నగరమునకు పోయి మహాకాలేశుని ఆరాధింతునా! అనగా ఇట్టి క్షేత్రములకు పోయి అందలి దేవతలను సేవించవలయునని నేను అనుకొనుట లేదే. 

🌹ఈ కాళహస్తియందే యుండి నిన్నొక్కనినే సేవించుచున్నానే. ఇట్టి ఏకాంతభక్తుడునగు నాయందు నీపై భక్తి అను శీలము అణుమాత్రమే ఐనను మహామేరువుగా భావించి నాపై నీ కృప ప్రసరింపుము.

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼


*వ్యక్తిత్వం*


ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలుగా భావిస్తూ శత్రువులను, మిత్రువులను సమంగా చూసేగుణాన్ని కలిగి ఉండాలంటాడు కబీరు దాసు. అంటే మనిషి రూపు రేఖలు, కులగోత్రాలు ప్రధానం కాదు.. నలుగురి మంచిని కోరి అందరినీ సమానంగా చూడడమే మానవధర్మం. అదే మనిషి వ్యక్తిత్వానికి గుర్తుగా నిలుస్తుందనేది ఈ పద్యంలోని అంతరార్థం. ఒకరి నడవడిక, ఆలోచనా విధానాలు, వాటిని వ్యక్తపరిచే విధానమే వారి వ్యక్తిత్వం అవుతుంది. క్రమశిక్షణ లేని మనసు శత్రువుగా మారుతుందని.. చక్కని శిక్షణ పొందిన మనసు మనిషికి స్నేహితునిగా వ్యవహరించి మంచిపేరు తెస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పాడు. 


మానవచరిత్రలో ఎందరో మహానుభావులు తమ మంచిగుణాలతో రాణించి, ప్రపంచాన్ని ప్రభావితం చేసి అద్భుతాలను సృష్టించారు. అందుకు వారి వారి వ్యక్తిత్వాలే కీలకంగా నిలిచాయని చెప్పవచ్చు. అందుకే కబీరుదాసు చెప్పినట్టు.. మనిషికున్న సిరిసంపదలు, చదువులు ముఖ్యం కాదు. మంచి గుణాలు మేధో, ఆధ్యాత్మిక సంపదతో కూడిన వ్యక్తిత్వమే మనిషిని మహనీయునిగా మారుస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు శ్రీరాముడిదే. రామాయణంలో ఎన్నో ఘట్టాల్లో రాముని మృదుస్వభావం, బలగర్వం లేని వినయం, వివక్ష లేని ఆప్యాయత కనిపిస్తాయి. ఉదాహరణకు తన వనవాసానికి కారణమైన కైకేయిని  మిగతావారు ద్వేషించారేమో కానీ, రాముడు కాదు. శబరి ఎంగిలి చేసిచ్చిన పండ్లను తృప్తిగా ఆరగించడం, తండ్రికి ఇచ్చిన మాటను నెరవేర్చకుండా అయోధ్యకు తిరిగిరానని చెప్పి వనవాసాన్ని కొనసాగించడం.. ఇవన్నీ రాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఘట్టాలే.


ఆధునిక కాలంలో గొప్పదైన తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని ఆకర్షించి విశ్వగురువుగా పూజలందుకుంటున్న మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. ఆయనొక ఆధునిక యోగి, మహా దార్శనికుడు, మహా సంస్కర్త, గొప్ప సంస్కరణాభిలాషి. తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని వదులుకుని.. సనాతన ధర్మం కోసం తనను తాను అర్పించుకుని.. మొదట భారతదేశంలో, ఆ తర్వాత ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ వ్యక్తుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే రూపశిల్పిగా నిరంతరం శ్రమించాడు. ఆధునిక కాలంలో అన్నీ సమకూర్చుకున్న మనిషి మాత్రం ఏదో ఆందోళన చెందడానికి కారణం..  ఆధ్యాత్మిక స్పృహ కోల్పోవడమేనని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. వివేకానందుడు తన బోధనలన్నింటిలో వ్యక్తిత్వాన్నే కీలకంగా చూపుతూ మనిషిని మేలు కొలిపే ప్రయత్నం చేస్తుండేవాడు. ప్రస్తుత కాలంలో జరిగే చాలా అనర్థాలకు కారణం.. సరిగా రూపుదిద్దుకోని వ్యక్తిత్వాలేనని మనస్తత్వ శాస్త్ర నిపుణులు కూడా చెబుతారు. కాబట్టి.. మంచి వ్యక్తిత్వ నిర్మాణం కోసం మహనీయుల జీవిత చరిత్రలు చదివి, వారి మంచి గుణాల్లో కొన్నింటినయినా అనుకరించి ప్రయత్నించాలి.


No comments:

Post a Comment