"""""""""""""""'''"""""""""""""""""""""""""""""""""""""
తల్లి దాస్య సంకెళ్ళను తుంచిన మహోన్నత పుత్రుడగు సుపర్ణునకు.... వైనతేయునకు గరుత్మంతునకు నమస్కారం
ధర్మమును ప్రాణంగా భావించిన అనంతున కు వాసుకి మొదలైన దివ్య సర్ప రాజులకు నమస్కారం
నిజ జీవితంలో ఎలా నడుచుకోవాలో ఏమి చేస్తే ఉన్నతంగా బ్రతకవచ్చు... ఏది చేస్తే నశించి పోతారో ....చాలా వివరంగా పురాణ రూపంలో ప్రకాశింప చేసి... నడవడి దిద్దిన వ్యాస భగవానునికి నమస్కారములు
🌼🙏🙏🙏🌼
నాగజాతి పతనానికి కారణమేమని శౌనకాది మునులు ప్రశ్నించగా నిఖిల పురాణ ద్రష్ట అయిన సూతుడు వివరంగా చెప్పడం మొదలు పెట్టాడు
కశ్యప ప్రజాపతి భార్యలైన వినతా, కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కొన్ని వేల్లేళ్ళు భర్తను ఆరాధించారు. వారి సేవకు సంతృప్తి చెందిన కశ్యపుడు వారిని " మీకు ఎలాంటి పుత్రులు కావాలి " అని అడిగాడు. కద్రువ తనకు బలవంతులు ,ప్రకాశవంతులు అయిన వెయ్యి మంది సంతానం కావాలని కోరింది. వినత తనకు కద్రువ పిల్లల కంటే బలవంతులైన పుత్రులు ఇద్దరైన చాలు అని అన్నది.
కశ్యపుడు వారి భావాలను అర్థం చేసుకుని చిరునవ్వు నవ్వి అభయమిచ్చి మీరు మీ గర్భాలను జాగ్రత్తగా సంరక్షించుకోండి అని చెప్పాడు, వారు చాలా సంతోషపడ్డారు తరువాత కశ్యపుడు పుత్రుల కొరకు పుత్రకామేష్టి యాగం చేసాడు. యాగ ఫలితంగా కద్రువ గర్భిణి యై వెయ్యి గ్రుడ్లలను ....వినత రెండు గ్రుడ్లలను ప్రసవించారు. వా రా గ్రుడ్లను జాగ్రత్తగా నేతికుండలలో పెట్టి రక్షించు కుంటున్నారు.
కాలం నడుస్తోంది సుదీర్ఘంగా ....పదిహేను వందల ఏళ్ళ తర్వాత ముందుగా కద్రువ పెట్టిన అండాలు పక్వం చెంది అందుండి వెయ్యి మంది నాగ కుమారులు జన్మించారు.
పుత్రుల ఆలనాపాలన తో వారి ముద్దు ముచ్చట్లతో కద్రువ చాలా సంతోషంగా కాలం గడుపుతోంది. వినత కూడా చాలా సంతోషించింది రేపు మాపో తనకు కూడా పిల్లలు పుడతారని ఎదురు చూస్తూ ఉన్నది.... ఒక నెల రోజులు గడిచింది చాలా ఆశ్చర్యంగా " అరే తనకు ఏమిటి ఇంకా పిల్లలు కలగలేదు అక్క నేను ఒకేసారి గుడ్లను పొదగేశాము. ఆమెకు కలగడం ఏమిటి నాకు కలగకపోవడం ఏమిటి ?! "అని చాలా ఉద్విగ్నంగా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది...... రెండు మూడు మాసాల గడిచాయి అయినప్పటికీ తన గ్రుడ్లు పొదిగ లేదు. అందుకు వినత ఉక్రోష పడి అసహనంతో... అక్క పై కలిగిన అసూయతో ఓర్వలేక ఇంకనూ ఎదురు చూసే ఓపిక లేక తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది. దాని నుండి పరిపక్వము కానీ సగము దేహంతో ఊరువులు లేని వాడు అయినా అనూరుడు జన్మించాడు. అతడు పుట్టుకతోనే తండ్రి అంతటి జ్ఞానిగా ప్రకాశించాడు.... అతడు తల్లి వైపు జాలిగా చూస్తూ " ఎందుకు తల్లీ ! తొందరపడి అండాన్ని చిదిమావు. నీ తొందర, పొరపాటు , నీ సోదరిపై అసూయ చెంది చేసిన పని వల్ల , నేను సగం దేహంతో పుట్టాను. అమ్మ ఎప్పుడు కూడా మనం ఇతరుల పై అసూయ చెందకూడదు ఒకవేళ అసూయ పడితే ఉత్తర జన్మలలో వారికి మనం సేవకులమై పోవాల్సి వస్తుంది. ఘోరమైన పాపం నీ వెన్నంటి వస్నది. దాని ఫలితంగా రానున్న రోజులలో నీ సవతికి నీవు బానిస గా మారుతున్నావు. ఇక విచారించాల్సిన అవసరం లేదు .... నీ రెండవ గ్రుడ్లు నైనా కాస్త జాగ్రత్తగా రక్షించుకో...అందుఃడి జన్మించే వాడు అపురూప బల పరాక్రమ సంపన్నుడు అయిన తేజోవంతుడు. నీ పుత్రుడు నీకు దాస్యాన్ని విడిపిస్తాడు" అని పలికి.... తల్లికి నమస్కరించి అనూరుడు సూర్యభగవానుని సేవించుటకై వెళ్ళిపోయాడు.
ఇంద్రుని ఉచ్ఛైశ్వం సముద్రతీరంలో తిరగటం చూసిన కద్రువ వినతతో " సోదరి ! ఈ అశ్వం చాలా అందంగా చాలా తెల్లగా ఉన్నది మరి ఎందుకు దాని తోక మాత్రం నల్లగా ఉన్నది " అని అడిగింది . అందుకు వినత ఏమిటి అక్క అలా మాట్లాడతావు దాని తోక తెల్లగా ఉంది కదా అని చెప్పింది. తన కంటే చిన్నది తన చెల్లెలు అయిన వినుత అలా పలకడం కద్రువకు నచ్చలేదు " ఎప్పుడు చూసినా నీవు నా మాటకు ఎదురు చెబుతుంటావు నేనేమైనా గుడ్డిదానినా?! ఆ గుర్రానికి తోక నల్లగా ఉన్నది కావాలంటే పందెం వేసుకుందాం ' అని కోపంతో పలికింది కద్రువ..... దీనితో సవతులకు పంతం పెరిగి పందెం కాచారు. ఆ పందెం ప్రకారం గెలిచిన వారు ఓడిన వారికి దాస్యం చేయాలని ఒప్పందం కుదుర్చు కున్నారు. వినత అన్నది...ఇప్పుడే కావాలంటే దగ్గరకి వెళ్ళి చూద్దామని చెప్పింది. కద్రువ వినతను వారించి ఈ రాత్రి పూట చూడడం అంత అవసరమా ఈ గుర్రం ఎక్కడికి పోదు రేపు పొద్దున వచ్చి చూద్దామ్ లే" అని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కద్రువ తన కుమారులను పిలిచి ఆగుర్రం తోక నల్లగా మార్చి తల్లిని దాస్య బాధ నుండి కాపాడమని అడుగింది.
తల్లి మాటలు విన్న అనంతుడు ధనంజయుడు వాసుకి మొదలైన వారు ఆ పనిని నిరాకరించి తల్లికి హితవు చెప్పారు. కద్రువకు ఒక లక్ష్యం ఉన్నది తన మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పకూడదు కానీ చిత్రంగా తనను అందరూ ఎదురిస్తూ ఉంటారు ఇది తన జ్ఞానం ఫలితం అని ఆమెకు తెలియదు . తన పనులు అధర్మమని తన కడుపున పుట్టిన పిల్లలే తనకు ఎదురు చెబుతుంటే సహించలేకపోయింది కద్రువ. ఆమె తన కొడుకు ల వైపు చూస్తూ " మీరంతా నా సొత్తు .... నేను చెప్పినట్లు నడుచుకోవడమే మీ బాధ్యత.... అంతే కానీ నాకు ఎదురు చెప్పడం నాకే ధర్మాన్ని చెప్పడం మీ పని కాదు ...తప్పు ఒప్పు ఆ పాప మేధో ... నేను అనుభవిస్తాను మీకెందుకు ?!. విశ్వాసఘాతకులు అయిన, ఆ విధేయులై ప్రవర్తించే మీరు భవిషత్ లో జరుగు జనమేజయుని సర్పయాగంలో పడి మరణించమని శపించింది. ఇది చూసి భయపడిన కర్కోటకుడు మరికొందరు నాగులు తల్లిని క్షమాపణ అడిగి ఆమెను శాంతింపజేసి ఆ పనికి ఒప్పుకున్నారు .
మరునాడు కద్రువ వినత ను తీసుకొని పోయి దూరం నుండి గుర్రం యొక్క తోకనుచూపించింది ...చూడవే అది నల్లగా ఉందా ! తెల్లగా ఉందా ? చూడు అని పలికింది. అశ్వం తోకకు కాల సర్పాలు చుట్టుకొని ఉన్నందు వలన ఆ తోక నల్లగా నిగనిగలాడుతున్నది. నిజమే గుఱ్ఱం తోక నల్లగా ఉంది. ఆ విధంగా ఉందని భ్రమపడిన వినత తన ఓటమిని అంగీకరించి కద్రువకు దాస్యం చేయటం మొదలుపెట్టింది.
వినత వినయవిధేయతలతో అక్కని గౌరవిస్తూ దాసిగా జీవించ సాగింది . ఇలా ఐదు వందల సంవత్సరాలు గడిచాయి తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు. పుట్టీ పుట్టకముందే ఆ వైనతేయుడు ఒక్కసారిగా గగనంలోకి ఎగిరి వెళ్లాడు. స్వేచ్ఛగా మహా వేగంతో అటు ఇటు తిరిగి వచ్చాడు తల్లికి నమస్కరించాడు. వినత చాలా ఆనందించింది తనకు పుట్టిన వాడి బలపరాక్రమాలు చూసి మురిసిపోయింది త్వరలో తన దాస్యాన్ని నిర్మూలించ గలడు అని ఆనంద పడింది .. పసివాడైన గరుడుడు. అమాయకంగా తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. కాలం కొద్దికొద్దిగా వినతకు సాయం చేయడానికి మారుతూ ఉన్నది.
ఒక రోజు కద్రువ గరుడునితో..గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని తీసుకొని వెళ్ళు" అన్నది.
పెద్దమ్మ చెప్పిన ఆ మాటలు గరుడునికి నచ్చలేదు తన పట్ల తన జనని పట్ల ఆమె చూపిస్తున్న నిరాధరణ
అతనికి నచ్చడం లేదు సరే ఈ పిల్లలను సూర్యమండలం వైపు తీసుకువెళ్లి నా ప్రతాపం చూపిస్తాను అని భావించాడు గరుడుడు...
ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. ఇ వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయారు..
పుత్రుల అవస్థకు తల్లడిల్లిన కద్రువ తన సోదరి అయిన అదితి ని ప్రార్ధించినది. అదితి తన కుమారుడైన దేవేంద్రుని ఆజ్ఞాపించి వర్షం కురిపించినది. ఇలా కద్రువ తన పుత్రులు సేద తీరగానే...తాను... పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని గరుత్మంతుడు .. పెద్దమ్మ నేను చేసిన పని మూర్ఖమైనదే... కానీ నువ్వు పెద్ద దానివి మా అమ్మకు అక్కవు. నాలో కోపం పెరగడానికి కారణము అధర్మబద్ధమైన నీ ప్రవర్తన. అది నీ చెల్లెల్ని నీ చెల్లెలు కొడుకు నైన నన్ను చాలా బాధ పెడుతున్నది .... అని పలికి నమస్కరించి తన తల్లి దగ్గరికి వెళ్లి పోయాడు
తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు. గరుత్మంతుడు
పెద్దమ్మ దగ్గరికి వెళ్లాడు గరుత్మంతుడు _ అమ్మ ! నీ చెల్లెల్ని నువ్వు బానిస గా చూడడం ...బానిస గా మార్చడం నీకు గౌరవప్రదమేనా ?! దీనికి పరిష్కారం ఏమిటి నేను ఏమి చేస్తే మీరు సంతోషిస్తారు మాకు ఈ చెర తొలుగుతుంది దయచేసి సెలవు ఇవ్వండి అని ప్రార్థించాడు. తమను దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు. అందుకు ఆమె గరుడా ! పెద్దలకు చిన్న వారు ఎప్పుడు బానిసలే" ముందుగా ఇది తెలుసుకో ....సరే మీరు బానిసలుగా భావించి బాధ పడుతున్నారు కనుక మీరు విముక్తి పొందాలి అంటే ఒక పని చెయ్. నీవు మహావీరుడవని నీ తల్లి తెగ మురిసిపోతున్నది. మహేంద్రుని ఓడించి నీ పరాక్రమాన్ని ఋజువు చేసుకో ...అతని సంరక్షణ లో ఉన్నా అమృతాన్ని తెచ్చి నీ సోదరులకు తెచ్చి ఇస్తే... మీరు దాస్య విముక్తులు కాగలరని చెప్పింది.
గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు.
మిత్రులందరికీ శుభ శుభోదయం
ఓం శ్రీ రాం...... శ్రీమాత్రేనమః
*ఒకసారి శ్రద్దగా చదవండి... చదివిన తరువాత ఆనందంతో ఆశ్చర్యపోతారు*
*అంతా రామమయం !. మన బతుకంతా రామమయం !!*
*ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే - రామాయణం.*
*ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ - రాముడు మనవెంట నడిచిన దేవుడు !*
*మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు.*
*మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం రాముడు.*
*ధర్మం పోత పోస్తే - రాముడు !*
*ఆదర్శాలు రూపుకడితే - రాముడు !*
*అందం పోగుపోస్తే - రాముడు !*
*ఆనందం నడిస్తే - రాముడు !*
*వేదోపనిషత్తులకు అర్థం - రాముడు !*
*మంత్రమూర్తి - రాముడు !*
*పరబ్రహ్మం - రాముడు !*
*లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - రాముడు !*
*ఎప్పటి త్రేతాయుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా - రాముడే.*
*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*
*బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - రామాలాలి - మేఘశ్యామా లాలి.*
*మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*
*మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా.*
*వినకూడని మాట వింటే అనాల్సిన మాట - రామ రామ.*
*భరించలేని కష్టానికి పర్యాయపదం - రాముడి కష్టం.*
*తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు.*
*కష్టం గట్టెక్కే తారక మంత్రం - శ్రీరామ.*
*విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*
*అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా !*
*వయసుడిగిన వేళ అనాల్సిన మాట - కృష్ణా రామా !*
*తిరుగులేని మాటకు - రామబాణం.*
*సకల సుఖశాంతులకు - రామరాజ్యం.*
*ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన.*
*ఆజానుబాహుడి పోలికకు - రాముడు.*
*అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - రాముడు.*
*రాముడు - ఎప్పుడూ మంచి బాలుడే.*
*చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా.*
*ఆదర్శ దాంపత్యానికి - సీతారాములు.*
*గొప్ప కొడుకు - రాముడు.*
*అన్నదమ్ముల అనుబంధానికి - రామలక్ష్మణులు.*
*గొప్ప విద్యార్ధి - రాముడు (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).*
*మంచి మిత్రుడు - రాముడు (గుహుడు చెప్పాడు).*
*మంచి స్వామి - రాముడు (హనుమ చెప్పారు).*
*సంగీత సారం - రాముడు (రామదాసు, త్యాగయ్య చెప్పారు).*
*నాలుకమీదుగా తాగాల్సిన నామం - రాముడు ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).*
*కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు.*
*నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు.*
*చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు.*
*చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు.*
*జన్మ తరించడానికి - రాముడు, రాముడు, రాముడు.*
*రామాయణం పలుకుబళ్లు*
*మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.*
*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.*
*చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక రామాయణం.*
*జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*
*ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక పుష్పకవిమానం.*
*కబళించే చేతులు, చేష్ఠలు - కబంధ హస్తాలు.*
*వికారంగా ఉంటే - శూర్పణఖ.*
*చూసిరమ్మంటే కాల్చి రావడం - హనుమ.*
*పెద్ద పెద్ద అడుగులు వేస్తే - అంగదుడి అంగలు.*
*మెలకువలేని నిద్ర - కుంభకర్ణ నిద్ర.*
*పెద్ద ఇల్లు - లంకంత ఇల్లు.*
*ఎంగిలిచేసి పెడితే - శబరి.*
*ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు.*
*అల్లరి మూకలకు నిలయం - కిష్కింధ కాండ.*
*విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - అగ్ని పరీక్షలే.*
*పితూరీలు చెప్పేవారందరూ - మంథరలే.*
*యుద్ధమంటే - రామరావణ యుద్ధమే.*
*ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - రావణ కాష్ఠాలే !*
*కొడితే బుర్ర - రామకీర్తన - పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).*
*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.*
*బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.*
*ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.*
*ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.*
*ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.*
*ఒంటిమిట్టది ఒక కథ..*
*భద్రాద్రిది ఒక కథ...*
*అసలు రామాయణమే మన కథ.*
*అది రాస్తే రామాయణం చెబితే మన భారతం మహ భారతం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.*
*జై శ్రీ సీతారామ చంద్ర హనుమాన్ కీ జై*
ఓం శ్రీ రాం. శ్రీ మాత్రే నమః
మధురిమలు (05 ... 10)
రచయత మల్లాప్రగడశ్రీదేవి రామకృష్ణ
బలము నీది బాధ్యత నాది
సంతృప్తి పరిచే యుక్తి
ఆశయ ప్రేమమ్ము నీది
ఆకలిని తీర్చే యుక్తి
మన మధ్య గుర్తింపు
నిత్యమూ బలమైంది
ప్రేమ మనకు పెంపు
సత్యము హృదయమైంది
సదా లోచన మనకు,
సంతృప్తి నిస్తుంది
దురాలోచన మీకు
దు:ఖము నింపుతుంది
చదువుని మరవకు ఎప్పుడు
గురువు మాట ఆచరించు
తెలివితొ నడుచుకోవాలి
తప్పులు చేయకు ఎప్పుడు
సంకల్ప దీక్షతో
న్యాయ మైన ఫలితము
సవ్య వ్యూహముతో
అదృష్టము అద్భుతము
ఏదీ స్వంతమే కాదు
నీ దన్నది నాదియులే
నీ చేతి నున్నది తీపి
ఆశించే ప్రేమమ్ము లే
--(())--
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై జరిగిన దాడుల వివరాలు*
1) గుంటూరు దుర్గ గుడి ద్వoసం - 14 Nov 20192) పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహలు ద్వoసం - 21 Jan2020
3) రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వoసం - 11 Feb 2020
4) ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ద్వoసం చేశారు - 13 Feb 2020.
5) నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రధం దగ్ధం
- 14 Feb 2020
6) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం - 6 Set 2020
7) విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ - 13 Sept 2020
8) కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి విగ్రహ ద్వoసం - 15 Sept 2020
9) ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 16 Sept2020
10) గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపై ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 16 Sept 2020
11) కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ద్వoసం -- 17 sept 2020
12) విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం - 19 sept 2020
13) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా
అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం - 20 sept 2020
14) కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా
ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 23 Sept 2020
15) నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 25 Sept 2020
16) కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్న సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయం లో నరసింహస్వామి శేషపడగలు ద్వoసం - 5 Oct 2020
17) కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ
స్వామి విగ్రహం ద్వoసం - 6 Oct 2020
18) గుంటూరు జిల్లా నరసరావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ద్వoసం - 6 0ct 2020
19) తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వoసం - 17 Oct 2020
20) యానాం బైపాస్, లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం.
21) వేలాది సంవత్సరాల పురాతన విజయ నగరం రామతీర్థం క్షేత్రంలో శ్రీరామచంద్రుల వారి ఆలయం తలుపులు విగ్రహాన్ని బద్దలు గొట్టి రాముని తలను తీసుకు పోయి కోనేటిలో పడవేసిన దుర్మార్గులు!
_పోలీస్ నాన్న పోలీస్ కూతురికి "ప్రేమతో సెల్యూట్..."_
_ఇదికదా..?? మరుపురాని మధురానుభూతి..._
-------------------------
🌻 *మహా భారతం* 🌻
🩸 *భాగము 6* 🩸
💧 *అరణ్య రోదన* 💧
🍃🌺పట్టపగలు రాజవీధిలో ఒక మగువను వెంటాడి, వేటాడుతున్న సింహబలుని అడ్డుకునే వారే లేకపోయారు. అదిరాచనగరమా, కీకారణ్యమా! రాజబంధువులకు, రాజాశ్రితులకు నీతినియమాలు, ధర్మాధర్మ విచక్షణలు వుండవు కాబోలు- మనసులో రోదిస్తూ వడివడిగా పరుగిడుతోంది మాలిని.
🍃🌺కొంతదూరం వెళ్లగానే కీచకుడు ఆమె కొపను చేజిక్కించుకున్నాడు. వుచితానుచితాలు వానికి తెలియవు. హీనస్వరంతో ద్రౌపది ఆర్తనాదాలు చేసింది. అంతా అరణ్యరోదనమే అయింది. అంతటి అవమాన వేళ, నిస్సహాయతలోంచి భగవదనుగ్రహంలాగా ఎక్కడలేని శక్తీ పుట్టుకు వచ్చింది.
🍃🌺అంతటి మహాబలుడూ ఆమె ధాటికి తట్టుకోలేక నడివీధిన బోరగిలపడ్డాడు. ఆ భంగపాటుకు తత్తరపోయాడు. ఆ శక్తికి నివ్వెరపోయాడు. పురజనుల కంటపడితే అవమానం, అప్రతిష్ట అనుకుని, హతాశుడై దెబ్బతిన్న త్రాచులా బుసల నిట్టూర్పులతో కదిలాడు.
🍃🌺సరిగ్గా, యీ ఆపదవేళ విరటుడు కొలువుతీరి వున్నాడు. ధర్మజ, భీమసేనులు సభామందిరంలో వున్నారు. ద్రౌపది నడివీధిన యెదుర్కొన్న ఘోరపరాభవాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వలలుని కన్నులలో దారుణ ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి. బ్రహ్మాండభాండాన్ని చిదిమి వేయాలన్నంత వుద్రేకం అతని పిడికిళ్లలో వ్యక్తమవుతోంది.
🍃🌺ఆకాశాన్ని, భూమిని చెరొక చేతా పట్టుకుని తాళాలుగా మోగించాలన్నంత విజృంభణ అతనిలో నిలువెల్లా ద్యోతకమవుతోంది. అజ్ఞాతవాసంలో అణగిమణ గి వున్న భీమన్నలో నిగ్రహం, నియమం కట్టలు తెంచుకున్నాయి. సభామందిరం పక్కన వున్న మహావృక్షం వైపు రెండు అంగలలో నడిచాడు. కీచకుని రాజసముఖంలోనే పరిమార్చాలని నిర్ణయించుకున్నాడు.
🍃🌺సింహబలుని శక్తిసామర్థ్యాలతో రాజ్యాన్ని పాలించే యీ రాజు వాడికేమి యెదురు చెప్పగలడు? మహావృక్షాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి వుద్యుక్తుడైన భీముడు, అక్కడే వున్న అగ్రజుని ఆనతికోసం చూశాడు. ధర్మజుడు కనుసైగతోనే తమ్ముని వారించాడు.
🍃🌺సభలోని వారంతా వలలుని వుద్రేకాన్ని గమనించి, కారణం తెలియక తికమక పడుతున్నారు. కంకుభట్టు సమయ సందర్భాలను గ్రహించి, పెద్దగా నవ్వి నర్మగర్భంగా ‘‘పాకప్రవీణా, వంటచెరుకు కోసం పచ్చని చెట్లను పెకిలిస్తావా? వచ్చేపోయేవారికి తీయని పండ్లను, చల్లని నీడను యిచ్చే దానిని నిర్మూలించడం ధర్మం కాదు.
🍃🌺ఎక్కడైనా ఎండిన మానులుంటే చూసుకో. లేదంటే భటులకు పురమాయిస్తే వారే సమకూరుస్తారు కదా!’’ అన్నాడు. ఆ మాటలలోని ఆంతర్యం బోధపడి, భీముడు కొంచెం చల్లబడ్డాడు. మరి గత్యంతరం లేని పాంచాలి విరటుని కొలువుకు వచ్చి నిలిచింది. కనుల నీరు తిరుగుతున్నాయి. అక్కడే వున్న ధర్మరాజుని, భీముని చూడనట్టే చూసింది.
🍃🌺రాజుని, సభాసదులను ధీరగంభీరస్వరంతో సంబోధించింది. నా గర ధర్వపతులు అయిదుగురూ ధర్మవేత్తలు. దుష్టశిక్షణలో, శిష్టరక్షణలో ఆరితేరిన శూరులు. పరాక్రమంలో, శస్త్రాస్త్ర సంపదలో వారికి వారే సాటి. వారు నేడు నాకింతటి ఘోరపరాభవం జరిగినా, ఏమీ తెలియనట్టే వుపేక్షించి వూరుకున్నారు.
🍃🌺మరి యింతటి అండదండలుగల నాకే యిట్టి స్థితి దాపురిస్తే, యీ రాజ్యంలో సాధారణ స్త్రీల గతియేమిటి? యీ నేలపై సౌశీల్యగౌరవాలతో మగువ మనగలదా? ఇందరు సదస్సులలో ఏ ఒక్కరికైనా కీచకుని దుశ్చర్య ఏవగింపు కలిగించలేదా? మత్స్యదేశాధిపతి విరాట మహీపతి ధర్మాధర్మ విచక్షణ గలవారు.
🍃🌺ఏలినవారు సైతం కీచకుని అకృత్యాన్ని చూసీచూడనట్టు వ్యవహరించడం నా దురదృష్టం’’ ఆమె కంఠం గద్గదికమైంది. సభ మ్రాన్పడిపోయింది. మౌనముద్రతో తలవాల్చింది.విరటుడు ద్రౌపది స్థితికి జాలిపడ్డాడు. సింహబలుని హెచ్చరించగల ధైర్యం ఆయనకు లేదు.
🍃🌺ఒక సాధారణ దాసి, నిండుకొలువులో రాజుని నిర్భీతిగా నిలదీసినా ఆయన ఆగ్రహించలేదు. విరటుడు సింహబలుని అతిసున్నితంగా మందలించి, నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడి పంపించాడు. అణచుకున్న అక్కసుతో, కోపంతో వూగిపోతూ కీచకుడు తన నివాసానికి కదిలాడు.
🍃🌺సభామండపం దిగి వెళ్లేవేళ, నిర్లక్ష్యంగా తలతిప్పి, ద్రౌపదిని తీక్షణంగా చూశాడు. ఆమె అస్సలు లక్ష్యపెట్టలేదు. సింహబలుని నిష్క్రమణతో సభ స్వేచ్ఛగా వూపిరి పీల్చుకున్నది. రాజు ముఖంలో అపరాధనా భావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కాని నిస్సహాయుడు. మానవతికి అభయమివ్వగల ధైర్యం లేదు. మదోన్మత్తుని సమర్థించేంతటి దుర్బుద్ధిలేదు. ఆ క్షణాన రాజు అడకత్తెరలో పోక.
🍃🌺సభాసదులు తమకు తోచిన విధంగా గుసగుసలాడుకుంటున్నారు. అసలింతటి సౌందర్యరాశి సైరంథ్రిగా కుదరటమేమిటోనని కొందరు ముక్కున వేలేసుకున్నారు. పట్టపగలు దేశసేనాధిపతే యింతటి అమానుషానికి పాల్పడడమా, కంచే చేను మేసినట్టుంది- అని కొందరు వ్యాఖ్యానించారు. అసలు రాజు అసమర్థుడైనపడు యిలాగే వుంటాయని కొందరు వ్యంగ్యధోరణిలో మాట్లాడారు.
🍃🌺‘‘సుధేష్ణాదేవి వుపేక్షించి, ప్రోత్సహించడమే దీనికి కారణం’’ అన్నారు కొందరు. విజ్ఞులు రకరకాలుగా చర్చించారు. అందరూ జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. కాని పెదవి విప్పి పరుషంగా మాట్లాడే ధైర్యం రాజుకే లేకపోయె. సాత్వికులైన సభికులు బాధతో, జాలితో తలలు వంచి నిట్టూర్చారు.
🍃🌺అంతకుముందే ధర్మజుని మనసులో రోషం కోడెత్రాచై, పైకెగసి బుసకొట్టి, పడగ విప్పి, కోరసాచింది. ఆయన నుదుటిపై స్వేదం కమ్ముకొని, అది రోషమై, జాలియై, నిస్సహాయతయై, నీటికంటె పల్చనై చెంపలపైకి జారింది. ఆ గంభీరమూర్తి అరచేతితో స్వేదబిందువులను అద్దుకుని, ప్రశాంతవదనంతో, మృదుస్వరంతో-‘‘సాధ్వీమణీ, మహారాజుతోబాటు సభాసదులందరూ నీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నారు.
🍃🌺ఇక ఎక్కువగా తర్కించడం వల్ల ప్రయోజనం ఏముంది? రాణిగారి మందిరానికి వెళ్లి వూరట చెందడం మంచిది. నీ గంధర్వపతులు విశ్వాన్నే జయించగల సమర్థులని పదేపదే చెబుతున్నావు. వారు ఆగ్రహంతో ప్రజ్వలించడం ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్కరం కాదని నా భావన.
🍃🌺పెద్దల సాన్నిధ్యంలో నీవంటి వుత్తమ యిల్లాలికి యీ వైఖరి తగదు సుమా’’ అని హితవు పలికాడు. ఆమె ధర్మజుని మాటలు విని మరింత రోషపడింది. అది గ్రహించిన పాండవాగ్రజుడు, ‘‘సైరంథ్రీ, సభామధ్యంలో నర్తకి వలె ప్రవర్తించకు. కులసతివలె మీ రాణిగారి సేవకు బయలుదేరు’’ అన్నాడు హెచ్చరికగా.
🍃🌺మాలిని సాభిప్రాయంగా చూసి, ‘‘కంకుభట్టారకా! నా ప్రాణేశ్వరుడొకరు నటశేఖరులు! అందుకే నేను నర్తకినైనాను. పతిపాండిత్యమే నాకు కొంత సంక్రమించింది. అంతేకాదు, నా భర్త నాట్యవిద్యతోబాటు ద్యూతకేళిలో ప్రవీణుడు. జూదరి ఆలికి పదిమందిలో గౌరవమర్యాదలతో నడచుకోగల మెళకువలుంటాయా?’’ అన్నది. ఆ మాటలకు ధర్మజుని ముఖం వివర్ణమైంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
_పోలీసు డిపార్ట్మెంట్ లో తన ఉన్నతాధికారికి సెల్యూట్ చెయ్యటం మామూలు విషయం, కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే ? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది._
_ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి "ఇగ్నైట్" అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి "ఇగ్నైట్" వేదికయ్యింది._
_2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సి ప్రశాంతి. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు శ్యామ్ సుందర్._
_తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శ్యామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా... అంటూ గట్టిగా నవ్వేశారు... పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శ్యామ్ నుందర్. పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి "ఇలాంటి సన్నివేశం సహజంగా సినిమాలో చూస్తుంటాం. తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు ఎస్పి._
ఓం శ్రీ రాం... శ్రీ మాత్రేనమః
_*🧘సన్మార్గం🧘♂*_ లో ప్రాంజలి ప్రభ
_*సన్మార్గం అంటే ఏమిటి - ఎలా ఆచరించాలి?*_
*_-[సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది]-
*_జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం._*
*_స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు._*
*_ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి..._*
*_సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి._*
*_మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి._*
*_ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి, చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు. సత్ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు._*
*_దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు._*
*_బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంబించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు..._*
*_శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు. జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి._*
*_రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు. వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు._*
*_ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట._*
*_చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదాని కోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి._*
*_సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి మనీషిగా ఎదుగుతాడు. ఉన్నౄ స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు,
మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం !_*
ఓం శ్రీ రాం... శ్రీ మాత్రేనమః
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 104 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 34*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*ఉషా పరిణయం*
పూర్వం బాణాసురుడనే ఆయన ఉండేవాడు. ఆయనకి వేయి బాహువులు. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. ఆ నూర్గురు కుమారులలో పెద్దవాడు బాణాసురుడు. అతను శోణపురమును పరిపాలన చేస్తున్నాడు.
వేయి చేతులు వున్న బాణాసురుడు ఒకరోజున కైలాస పర్వతం మీదికి వెళ్ళాడు. అది అసురసంధ్య వేళ. ఆ సమయంలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు. బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి అయిదువందల వాద్య పరికరములను తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు. పరమశివుడు తాండవం చేసిన పిదప సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు. ‘వేయి చేతులతో అయిదువందల వాద్య పరికరములను ఎంతో గొప్పగా వాయించావు’ అని బాణాసురుడిని మెచ్చుకున్నాడు.
అతను పరుగుపరుగున వచ్చి శంకరుని స్తోత్రం చేశాడు. బాణాసురుడు చేసిన స్తోత్రమును విని శంకరుడు, ‘నీకు ఏమి కావాలో కోరుకో, ఇస్తాను’ అన్నాడు. అపుడు వానిలో వున్న అసురీ ప్రవృత్తి బయటకు వచ్చింది. అతడు ఎంత చిత్రమయిన కోరిక కోరాడో చూడండి.
“ఈశ్వరా! నేను ఎప్పుడూ నీ పాదములను ఆశ్రయించి ఉంటాను. నీవు మాత్రం నాకొక ఉపకారం చేసిపెట్టాలి. పార్వతీ దేవితో కలిసిన వాడివై, నేను కోటలోపల ఉంటే నీవు నా కోట బయట కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా కోరిక. నీవు భక్తుల కోర్కెలు తీర్చడంలో వశుడవయిపోయే వాడివి కదా! అందుకని నాకీ కోరిక తీరుస్తావా” అని అడిగాడు.
అపుడు శంకరుడు వానికేసి చిత్రంగా చూశాడు. కాని ఈశ్వరుని కారుణ్యము చాలా గొప్పది. బాణాసురుని కోరిక తీర్చడానికి అంగీకరించాడు.
పార్వతీదేవితో కలిసి త్రిశూలం పట్టుకుని కోట బయట అటు యిటూ తిరుగుతున్నాడు. శంకరునితో పాటు ఆయన అనుయాయులు అందరూ కూడా అక్కడికి వచ్చేశారు. ఈవిధంగా శంకరుడు కోట బయట తన పరివారంతో ఉంటూ కోటను రక్షిస్తూ ఉండేవాడు.
ఎప్పుడయితే పరమశివుడు బాణాసురుని కోటకు కాపుదలగా ఉన్నాడని తెలిసిందో యిక బాణాసురుని వైపు కన్నెత్తి చూసిన వాడు లేడు.
ఒకరోజు కోట బయట కాపలా కాస్తున్న శంకరుని వద్దకు వచ్చి ‘శంకరా! ఆరోజు నేను కోరిన కోరికను మన్నించి మీరు వచ్చి నా కోటకు కాపలా కాస్తున్నారు. ఎవడూ వచ్చి నాతో యుద్ధం చేయడం లేదు. కానీ నాకు యుద్ధం చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే దయచేసి నాతో ఒక పర్యాయం యుద్ధం చేయవలసింది’ అని కోరాడు.
భగవంతుని కారుణ్యం వానికి చులకనగా కనపడింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఇపుడు ఈశ్వరునికి ఒక ఇబ్బంది వచ్చింది రక్షించవలసినవాడూ తానే. వాడు అడిగిన కోరికకు శిక్షించవలసిన వాడూ తానే. ఈ రూపంతో రక్షణ చేస్తూ శిక్షను ఈయనకు వున్న ఇంకొక రూపంతో వేయాలి. అపుడు ఆయన అన్నాడు – ‘నాతో సమానమయిన ఇంకొకడు నీ దగ్గరకు వస్తాడు. వాని రాకకు గుర్తుగా నీ రథమునకు వున్న జండా క్రింద పడిపోతుంది. అప్పుడు నీకు తగిన యుద్ధం దొరుకుతుంది. అప్పుడు నీకున్న వ్యగ్రత పోతుంది’ అన్నాడు.
పరమేశ్వరుని మాటలు విని బాణాసురుడు చాలా సంతోషించాడు. ఆరోజు గురించి ఎదురు చూస్తున్నాడు.
ఇపుడు శివుడు స్థితికారుడై కేశవుడిగా రావాలి. పురాణమును అర్థం చేసుకుంటే అలా ఉంటుంది. అర్థం చేసుకోకపోతే శివ కేశవులు కొట్టుకున్నారని అనిపిస్తుంది. మన అజ్ఞానమును బాణాసురుని స్థాయికి తీసుకువస్తుంది.
ఇపుడు ఈశ్వరుడు ఒక చమత్కారం చేశాడు. బాణాసురునికి మంచి యౌవనంలో వుండి అతి సౌందర్యవతి అయిన కుమార్తె ఒకతె ఉన్నది. ఆమె పేరు ఉష. ఆమె ఒకరోజు రాత్రి నిద్రపోతోంది. పురుషుల గురించి ఆమెకు ఏమీ తెలియదు. నిద్రపోతున్న ఉష కలలోకి కృష్ణ భగవానుడి మనుమడయిన అనిరుద్ధుడు వచ్చి ఆమెతో రమించాడు. ఆమెకు సుఖానుభూతి కొన్ని కొన్ని గుర్తుల చేత స్పష్టముగా తెలిసింది. ఆవిడ నిద్రలేచింది. కానీ ఆవిడ నిన్నరాత్రి కలలో ఏ పురుషుడిని చూసిందో ఆ పురుషుడి కోసమని ఆమె మనస్సు గతితప్పి తిరగడం మొదలుపెట్టింది. అందువలన ప్రతిరోజూ ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయింది. చాలా దిగులు చెందింది.
ఈమెకు చిత్రలేఖ అనబడే అనుంగు చెలికత్తె ఒకతె ఉన్నది. ఆవిడ వచ్చి “నీవు ఎందుకు అలా ఉంటున్నావు? నీ ప్రవర్తనలో వచ్చిన మార్పువలన నేను ఒక విషయమును గమనించాను. నీవు ఎవరో ఒక పురుషుని వలపులో పడ్డావని నేను అనుకుంటున్నాను. నేను నీ చెలికత్తెను. ప్రాణ స్నేహితురాలను. కాబట్టి అసలు జరిగిన విషయం ఏమిటో నాకు చెప్పవలసింది’ అని అడిగింది.
అపుడు ఉష తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అప్పుడు చిత్రలేఖ సఖీ! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నీకు కలలో కనిపించిన వాడు ఎలా ఉంటాడో నీవు చెప్పావు. నేను ఎందఱో రాజాధిరాజులను చూశాను. వాళ్ళ చిత్ర పటములను గీస్తాను నేను. అవి చూసి ఇందులో ఎవరు కనపడ్డారో చెప్పు’ అని రాజకుమారుల బొమ్మలను చిత్రీకరించింది. పిమ్మట ఉషాదేవిని పిలిచి ఆ చిత్రములను చూడమని చెప్పి వాళ్ళందరి గురించి పేరుపేరునా వివరించింది. అనిరుద్ధుని చిత్రమును ఆమె గుర్తించింది.
అపుడు చిత్రలేఖ ‘ఆయన పేరు అనిరుద్ధుడు. ఆయన యందా నీవు మనసు పడ్డావు. సఖీ! ఇప్పుడు నేను నీకొక గొప్ప ఉపకారం చేస్తాను. నాకు కామరూపం తెలుసు. అందుకని ఇవాళ రాత్రి నేను ద్వారకానగర ప్రవేశం చేసి నిద్రపోతున్న అనిరుద్ధుడిని అపహరించి తీసుకువచ్చి నీ హంస తూలికా తల్పం మీద పడుకోబెడతాను. నీవు హాయిగా నీ ప్రియుడితో క్రీడించు.’ అని చెప్పి రాత్రికి రాత్రి ద్వారకకు బయలుదేరింది.
బయట మూడుకన్నులున్న వాడు ఆమె వెళ్ళడం చూసి కూడా ఊరుకున్నాడు. ఈయన వరం నిలబెట్టవలసిన వాడు అక్కడ ఉన్నాడు. శివకేశవుల ఇద్దరి మనస్సులు ఒక్కటే. అందుకని అక్కడ కృష్ణ భగవానుడు అక్కడ ఏమీ తెలియనట్లు పడుకున్నాడు.
చిత్రలేఖ అనిరుద్ధుని మందిరంలో ప్రవేశించి నిద్రపోతున్న అనిరుద్ధుని ఒక్కసారి సమ్మోహనం చేసి ఆయనను తీసుకొని ఆకాశమార్గంలో తిరిగి వచ్చేసి తిరిగి లోపలి వెళ్ళిపోయింది. చిత్రలేఖ మరొక పురుషుని తీసుకొని కోటలోపలికి వెళ్ళడం బయట కోటకి కాపలా కాస్తున్న మూడు కన్నులవాడు చూశాడు. ఏమీ అభ్యంతర పెట్టలేదు.
చిత్రలేఖ అనిరుద్ధుడిని తీసుకువెళ్ళి ఉషాదేవి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకోపెట్టేసింది. ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆయన ద్వారకలో కృష్ణుడిగా ఉన్నాడు. ఇక్కడ శివుడిగా ఉన్నాడు. ఒక మూర్తియే రెండుగా ఉన్నాడు.
ఉషాదేవి తన ప్రియుడిని గుర్తించింది. అనిరుద్ధుడు కూడా వేరు అభ్యంతరం చెప్పకుండా ఆమెతో ఆటపాటలు మొదలుపెట్టాడు. వారిద్దరూ సంతోషంగా అలా అంతఃపురంలో కాలం గడిపేస్తున్నారు. నెలలు నెలలు కాలం గడిచిపోతున్నది. కానీ కాలం ఎల్లప్పుడూ ఒకేరీతిగా ఉండదు.
ఉషాదేవి యందు గర్భిణి చిహ్నములు కనపడ్డాయి. ఈ విషయమును పరిచారికలు వెళ్ళి బాణాసురునికి చెప్పారు. బాణాసురునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఎవరు ఈ తుంటరి పని చేసినవాడు అని ఉషాదేవి అంతఃపురమునకు వచ్చి కూతురుని అడిగాడు. ఎదురుగా అనిరుద్ధుడు కనపడ్డాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వెళ్లి అనిరుద్డుడిని బంధించడానికి ప్రయత్నించగా అనిరుద్ధుడు తన గదా ప్రహారములతో వారినందరినీ పరిమారుస్తున్నాడు. బాణాసురునికి ఆగ్రహం వచ్చి అనిరుద్ధుని నాగ పాశముల చేత బంధించాడు. అలా బంధింపబడిన అనిరుద్ధుడు యిక కదలలేక నిలబడిపోయాడు. ఇది చూసి ఉషాదేవి విలపిస్తోంది. ఇదే సమయంలో అక్కడికి భటులు వచ్చి ప్రభూ మీ రథం మీద ఉన్న జండా విరిగి క్రిందపడిపోయింది అని చెప్పారు. తనతో యుద్ధము చేయడానికి ఎవరో వచ్చేశారని అతడు భావించి ఇన్నాళ్ళకు తన కోరిక తీరబోతున్నదనుకొని బయలుదేరాడు.
అసురీవృత్తి ఎటువంటిదో చూడండి. వానికి కూతురి గొడవ అక్కరలేదు. యుద్ధం కావాలి.
ఈలోగా అక్కడ నారదుడు ద్వారకలో దిగాడు. ఏమీ ఎరగని వాడిలో అనిరుద్ధుని కోసం వెతుకుతున్నట్లు నటిస్తున్నాడు కృష్ణుడు. నారదుడు “అనిరుద్ధుడిని బాణాసురుడు నాగ పాశములతో బంధించాడు. నీవు వెంటనే బయలుదేరవలసినది’ అని చెప్పాడు. వెంటనే బలరాముడు, కృష్ణుడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు అందరూ కొన్ని కోట్ల సైన్యంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్లు బయలుదేరి శోణపురం మీదికి యుద్ధమునకు వెళ్ళారు. బాణాసురునికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది.
వాడు శంకరుని పిలిచి “నీవు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకు కాపు వున్నావు. నీవు కృష్ణుడు కోటలోపలికి రాకుండా యుద్ధం చేయాలి. అప్పుడు మాత్రమే నీవు నాకిచ్చిన వరం నిలబెట్టినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా నీవు యుద్ధం చేసి, కృష్ణుడు తన పరివారంతో కోటలోకి రాకుండా ఆపవలసింది’ అని అన్నాడు.
శంకరుడు భక్త వత్సలుడు. భక్తునికి ఇచ్చిన మాట తప్పడానికి వీలు లేదు.కాబట్టి యిపుడు శంకరుడు కృష్ణుడితో యుద్ధం చేయాలి. కృష్ణుడి చేతిలో ఓడిపోవాలి. శంకరుడు భక్తవశంకరుడై తనతో యుద్ధం చేస్తున్నాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధం ప్రారంభం అయింది. శివుడు యుద్ధంలో లొంగనంత సేపు బాణాసురుని జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీలులేదు. తన వరం నిజం కావాలంటే కృష్ణుడి చేతిలో తాను ఓడిపోతే అవతల తానిచ్చిన వరమునకు మినహాయింపు యిచ్చినట్లు అవుతుంది. శంకరుడు యుద్ధం చేసి కృష్ణుడి చేత ప్రయోగింపబడిన బాణపు దెబ్బకు నందీశ్వరుని మీద వాలిపోయాడు. అప్పుడు కృష్ణుడు బాణాసురుని మీదకు యుద్ధమునకు బయలుదేరాడు.
అపుడు శివజ్వరము అనబడే శక్తి ఒకటి బయలుదేరింది. అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది. కృష్ణుడు వైష్ణవ జ్వరమును ప్రకోపం చేశాడు. ఆ రెండు శక్తులు ఒకదానితో ఒకటి డీకొన్నాయి. ఆ రోజున శివజ్వరం విష్ణువును ప్రార్థన చేసింది.
ఉషాపరిణయ ఘట్టంలో పార్వతీ పరమేశ్వరుల వలన, కృష్ణ భగవానుడి వనాల లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది. ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం, విష్ణుజ్వరం యుద్ధం చేయడం అనే ఘట్టంలో శివజ్వరం చేసే శరణాగతి విన్నారో, వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమయినదిగా జ్వరము బాధించడానికి వీలులేదు. ఆ మేరకు నేను వరం యిస్తున్నాను అన్నాడు.
కాబట్టి ఎప్పుడయినా జ్వరము చేత ప్రాణాంతకం అవుతోందని అనుకుంటే ఉషా పరిణయమును శరణాగతి తత్త్వమును చదువుకోవడం కోసమని ఒకసారి పారాయణం చేస్తారు. అంత గొప్ప వరమును యిస్తే ఆ రోజున శివజ్వరం ఉపశాంతిని పొందింది.
వెంటనే బాణాసురుడు యుద్ధమునకు వచ్చాడు. పరమాత్మ చేసిన యుద్ధం వలన ఆ రోజున బాణాసురుడు పడిపోయే పరిస్థితి వచ్చింది. తన కొడుకును ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని తల్లియైన కోటర ఆ రోజున యుద్ధమునకు వచ్చి ఒంటిమీద ఉన్న వలువలన్నిటిని విప్పేసి, జుట్టు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది. ఒక స్త్రీ వివస్త్రయై జుట్టు విడివడి ఎదురునిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనుస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు. బాణాసురుడు కోటలోకి పారిపోయాడు.
మరునాడు మరల యుద్ధం ప్రారంభం అయింది. అపుడు శంకరుడు కృష్ణుణ్ణి ప్రార్థన చేశాడు. ‘నేను కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలులేదు. కాబట్టి తగిన విధంగా నీవు వానికి శిక్ష వేయవలసినది అని.
శివకేశవుల హృదయములు ఒకరికొకరు తెలుసు. ఉన్న ఒక్క పదార్ధం రెండుగా కనపడుతోంది. కాబట్టి ఆరోజు కృష్ణ భగవానుడు
బాణాసురునకు ఉన్న బాహువులలో 996 బాహువులను సుదర్శన చక్రధారల చేత తెంచేశాడు. నాలుగు బాహువులను వదిలేశాడు. అపుడు వానికి ధర్మార్థ కామ మోక్షములు తెలిశాయి. ఇప్పుడు వాని శరీరమునందు రజోగుణ తమో గుణములు లేవు. శుద్ధ సత్త్వంతో ఉంటాడు. ‘ఈశ్వరా వీడు నీ భక్తులలో అగ్రేసరుడు అవుతాడు. బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడని చెప్పుకుంటారు.
ఎక్కడ అసురసంధ్య వేళలో బాణాసురుని చరిత్ర, ఉష అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడ విజయములు సంభవిస్తాయి. అందుకని నాలుగు చేతులతో వీనిని వదిలేస్తున్నాను. నీ పరివారంలో వీడు అగ్రేసరుడు అవుతాడు. ఇంకా ఎప్పుడూ ప్రమాదముతో కూడిన ప్రవర్తన వీడియందు ఉండదు’ అని ఆరోజున కృష్ణ భగవానుడు వరం ఇచ్చాడు. శంకరుడు సంతోషమును పొందాడు.
ఇప్పుడు బాణాసురుడు శివుని పరివారంలో చేరిపోయాడు. కాబట్టి యిపుడు వాడు కైలాసం బయట కాపలా ఉండాలి. ఇప్పుడు అతను తన నిజస్థితిని గుర్తించాడు. సంతోషంగా శంకరుడు కైలాసం చేరుకున్నాడు.
బాణాసురుడు కోటలోకి వెళ్లి అనిరుద్ధుడికి, ఉషాదేవికి వివాహం చేసి వారికి వస్త్రములు మాల్యములు ఆభరణములు బహూకరించి ఉషా అనిరుద్ధులను కృష్ణ పరమాత్మతో ద్వారక నగరమునకు సాగనంపాడు.
ఈవిధంగా ఉషాపరిణయం అనే ఘట్టము ఎన్నో రహస్యములను ఆవిష్కరించింది. ఎవరు ఈ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు పరమ శివుడంతటి వాడిని కింకరునిగా చేసుకున్నాడో ఎవరు తుట్టతుదకు నాలుగు చేతులతో, పరమశివునికే కింకరుడు అయ్యాడో కృష్ణుని విజయమునకు పొంగిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారో, కల్పాంతం వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో, కృష్ణ విజయం వింటున్నారో ఆయన నామం ఎవరు చెపుతారో వారికి సమస్త విజయములు చేకూరుతాయి. వాళ్లకి ఓటమి సంభవించదు. జయము కావాలనుకున్న పరిస్థితులలో ఈ ఉషాపరిణయఘట్టమును, బాణాసుర ఘట్టమును ఒక్కసారి పారాయణ చేసుకొని బయలుదేరుతుంటారు. ఇది అంతగొప్ప ఆఖ్యానము.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
(సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 55* 🕉
*మాయా(అ) జాండకరండకోటిఁ బొడిగామర్ధించిరో విక్రమా(అ)*
*జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీ మోహముం బాసిరో*
*యాయుర్దయభుజంగమృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో*
*శ్రేయోదాయక్ లౌదు రెట్టు లితరుల్ శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 *_తాత్పర్యం:_* 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! తొల్లి చెప్పిన శుష్కపండితులగు గురువులను కాని, ఇతరదేవతలు కాని, రాజులు కాని నీ మాయచే ఏర్పడిన బ్రహ్మాండముల కోటలను మర్దించినారా....
🌹వానియందలి సుఖసంపదల విషయమై విరక్తిని పొందినారా. ఎవ్వరికి జయింపశక్యము గాని శక్తిశాలియైన మన్మధుని జయించినారా. అశాశ్వతమైన సంపదలయందు మోహమును వదిలినారా.
🌹ఆయుహరణము చేయు కాలసర్పమను మృత్యువును అధిగమించినారా. ఇట్టి ఏ లక్షణములు లేని గురువులు, ఇతర దేవతలు, రాజులు మానవులకు ఎట్లు శ్రేయము కలిగించగలరు.
🙏 *ఓం నమః శివాయ* 🙏
ఓం శ్రీ రాం
ReplyDelete