Saturday, 30 January 2021

31-02-2021


 

UI UIIU UI UIUUii IU 


మట్టి ఆటలతో మోట్టికాయలొస్తాయని  భయం
కుమ్మె ఆటలతో కూల్చి బందిచేస్తారని భయం
రెప్ప మాటలతో పిల్చి కౌగిలిస్తారని భయం
వెల్గు ఆటలతో నీడలల్లుకొస్తాయని భయం

వట్టి మాటల తో గట్టి పోరు చేస్తారని భయం
గట్టి చేష్టల తో చెడ్డ మంచి చేస్తారని భయం
వెర్రి వేషము తో తప్పు ఒప్పు చేస్తారని భయం
తిక్క పల్కులతో మార్చ లేక చస్తారని భయం

నమ్మి ఆకలితో ఉండ లేక చూస్తారని భయం
చెప్పు చేతలతో ఉండ లేక మార్తారని భయం
తప్పు లెక్కలతో చూప లేక చస్తారని భయం
ఒప్పు మాటలతో చెప్ప లేక చూస్తారని భయం

తల్లి కోరికనే  తీర్చ గల్గలేమోనని  భయం  
తండ్రి గౌరవమే కాలమంత చూడాలని భయం  
దైవ సంపదయే రక్ష చేయ లేమొనని భయం  
నిత్య సేవికగా జీవితమ్ము మారేనని భయం   
 

 [30/01, 7:20 am] +91 94414 08564: 🌻  *మహా భారతం* 🌻


🩸 *భాగము 30* 🩸


💧 *వీడుకోలు* 💧


🍃🌺‘‘బలరామా’’ అన్న సంబోధనలోనే సాత్యకి అధిక్షేప ధోరణి తేటతెల్లమైంది. సాత్యకి కృష్ణుని వైపు చూశాడు. కృష్ణుడు చూపు తప్పించి, ధర్మజుని వంక చూశాడు. ధర్మజుడు తొట్రుపడి సాత్యకి వైపు దృష్టి సారించాడు. సాత్యకి బలరాముని సూటిగా నిగ్గదీస్తున్నాడు. ‘‘...యీ విధంగా నువ్వు మాట్లాడడం భావ్యమేనా? హద్దులతిక్రమించి నీవొక్కడివే యిట్లా మాట్లాడ గలవు. నిన్ను కాదు, నీ ప్రసంగాన్ని ఆలకించి తలలూపిన యీ సభాసదులందరినీ అనాలి. 


🍃🌺మిత్రద్యూతానికి పిలిచినపుడు ధర్మజుడు అంగీకరించాడు. అందులో త ప్పేమున్నది. దుష్టచతుష్టయం, ఆ మాయావుల కుయుక్తులు ధర్మమూర్తి రాజ్యాన్ని కబళించాయి... సరే, అయినదేమో అయినది. నియయం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు పూర్తయినవి. ఇటువంటి సమయంలో వీరు దుర్యోధనుని వద్ద ప్రాధేయపడాల్సిన అగత్యమేమున్నది. 


🍃🌺తమ పాలు తాము తీసుకొనుటకు యాచించవలెనా? ఇది ఏ ధర్మశాస్త్రంలో వుంది. చేచాచి అర్థించుట క్షాత్రధర్మమా? సుక్షత్రియుడు రాజ్యలక్ష్మి కోసం యుద్ధరంగంలో నిలబడి తేల్చుకుంటాడు.


🍃🌺ఈ భూమండలంలో భీమార్జునులనెదుర్కొని నిలబడగ వారెవ్వరున్నారు? ఎందరు రాజులు పాండవపక్షము వహించి రణరంగమున కౌరవులనెదిరించి పోరాడుటకు సిద్ధంగా వున్నారో నాకు తెలుసు. పాంచాలాధీశ్వరులు, యుదుసింహులు, మత్స్యభూపతి వీరంతా ధర్మపక్షం వహించరా? ఇరుగో యీ ద్రుపద మహారాజు తోడు నిలిచిన సాధించలేనిది ఏమున్నది?- సాత్యకి మాటలకు అందరి మనసులు వేడెక్కినవి. 


🍃🌺తిరిగి అతడందుకుని, రాయబారిగా హస్తినాపురికి తగువారిని పంపడంలో తపలేదు. కాని దైన్యముగా అర్థించవలసిన అగత్యం లేదు. తమ రాజ్యభాగము తమకు యిమ్మన్నారని ధర్మజుని మాటగా చెబితే చాలు. దుర్యోధనుడు మన్నిస్తే సరే. అహంకరిస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తాడు’’ అని ముగించాడు. కాసేపు సభ నిశ్శబ్దంగా వుంది. ద్రుపదుడు సాత్యకి అభిప్రాయాలను మెచ్చుకున్నాడు. ‘‘బలదేవుడు సూచించిన సవినయ ప్రార్థన కంటే సాత్యకి చెప్పిన ధోరణే సముచితంగా ఉంది. 


🍃🌺దురహంకారి దుర్యోధనుడు అంత తేలికగా దారికి వస్తాడని అనుకోను. శక్తిహీనులై యాచనకు దిగివచ్చారని భావిస్తారే గాని, మన సౌమత్యను వారు గుర్తించరు. దుర్యోధనుడు కుటిల స్వభావియని తెలిసినా, భీష్మద్రోణాదులు వారి వారి కారణాల వల్ల అక్కడే అణగిమణిగి వుంటున్నారు. ఇక అంధభూపతి ధృతరాష్ట్రునికి కన్న కొడు కుపై మనసుకు మించిన ప్రేమ. కర్ణుని సంగతి సరేసరి. కన్నుమిన్ను కానక, వీరందరినీ చూసుకుని విర్రవీగే దుర్యోధనుడు దీనికి అంగీకరిస్తాడని అనుకోవద్దు.


🍃🌺పాండవులకు, ధార్తరాష్ట్రులకు సంధి పొసగడం కల్ల! విస్పష్టంగా ప్రకటించాడు ద్రుపదుడు. మరల ప్రారంభించి, ‘‘ఇది ఘోర సంగ్రా మానికి నాంది కాబోతున్నది. మనం అప్రమత్తమై అందుకు సిద్ధం కావాలి. చతురంగ బలాలను అపారంగా పెంపుచేసుకోవాలి. మనకు ఆప్తులు, మన హితాభిలాషులైన రాజన్యులను ఆహ్వానించి, సందర్భాన్ని వివరించాలి. రాజలోకంలో కొందరు తటస్థులుంటారు. 


🍃🌺మొట్టమొదట కోరిన వారి పక్షాన వారు నిలుస్తారు. శల్యుడు, కేకయాధీశుడు, దృష్టకేతువు, జరాసంధుని కుమారుడు మొదలైన వారి వద్దకు వార్తాహరులను పంపాలి. ఇపడు జరగవలసిన కార్యక్రమం గురించి పెద్దలు వివరించండి’’ అన్నాడు ద్రుపదుడు. ‘‘సంధి ప్రయత్నాలు చేయడమే...అంతేకదా’’ అన్నాడు కృష్ణుడు తొణకని చిరునవ్వుతో అన్న బలరాముణ్ణి, ధర్మరాజుని చూస్తూ. ధర్మజుడు ‘‘ఔను అదే’’ అన్నట్టు తలవూపాడు.


🍃🌺ద్రుపదుడు రెండవ వరుసలో కూర్చుని వున్న బ్రాహ్మణుని చూపించి, ‘‘ఆయన నా పురోహిత బృందానికి పెద్ద. మృదు మధుర సంభాషణా చతురుడు. పరేంగితం గ్రహించగల మేధావి. అన్నివిధాలా దక్షత గల విజ్ఞానగని. ఆ ధృతరాష్ట్ర మహీపతి వద్దకు పాండవదూతగా వెళ్లడానికి యోగ్యుడు. దుర్యోధనునితో, భీష్మద్రోణులతో ఎట్లా మాట్లాడాలో తెలిసిన కార్యసాధకుడు. పైగా, యీ సమస్యకు సంబంధించిన పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇక్కడి పెద్దలు ఆమోదిస్తే వారిని పంపుదాము’’ అన్నాడు.


🍃🌺సభలో కొద్దిసేపు గుసగుసలు వినిపించినవి. కృష్ణుడు చొరవ తీసుకుని, పాంచాలేశ్వరుని సూచన అందరికీ ఆమోదయోగ్యమేనని ప్రకటించాడు. సర్వజ్ఞులైన ద్రుపదుని పురోహితులు యీ పనిని చక్కదిద్దగలరనే ఆశిస్తున్నాను. చివరిగా ఒక్కమాట. నాకుగాని, నా సోదరులు బలరామదేవునికి గాని ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన అభిమానం లేదు. అందరూ శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలనేదే మా అభిమతం. ఉత్తరాభిమన్యుల వివాహానికి ధర్మనందనుడు ఆహ్వానిస్తే వచ్చాం. 


🍃🌺శుభకార్యం శోభస్కరంగా ముగిసింది. మమ్మల్ని సాదరంగా అతిథి మర్యాదలతో ముంచెత్తారు. సర్వదా కృతజ్ఞులం. ఇక మేము మా రాజధానికి బయలుదే రుతాం. అందుకు అనుమతించాలని మత్స్యాధీశుని, ధర్మనందనుని అర్థిస్తున్నాను’’ అన్నాడు కృష్ణుడు.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀



UU IU UU UI UU. ...13

ఆద్యం విశ్వ తేజం ధర్మ మార్గం
మార్గం జ్ణాన గమ్యం ధర్మ సాధ్యం
సాధ్యం సృష్టి కృత్యం నిత్య సత్యం
సత్యం విశ్వ వ్యాప్తం సర్వ కృత్యం

కృత్యం జాడ్య భావం విశ్వ జాప్యం
జాప్యం వెత్కు లాటే సర్వ గోప్యం
గోప్యం బత్కు లాటే జన్యు లౌక్యం
లౌక్యం జీవు లాటే కర్మ సౌఖ్యం

సౌఖ్యం కాలకృత్యం నిత్య కృత్యం
కృత్యం జీవ లోకం తత్వ నృత్యం
నృత్యం మన్షి మాయే లౌక్య జీవం
జీవం హాయి నిత్యం మాతృమర్మం

మర్మం చెప్ప లేకే చేయు కార్యం
కార్యం దేహ ధర్మం చేయు చోడ్యం
చోడ్యం చూసి తెల్పే మాయ మోడ్యం
మోడ్యం వల్ల వేసే వేష ధైర్యం
--(())--
 

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 78* 🕉


*మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే*

*సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ*

*జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ*

*ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 *_తాత్పర్యం:_* 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! 

నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైనా  నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. 


🌹నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. 


🌹ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. 


🌹జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ జన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.

🙏 *ఓం నమః శివాయ* 🙏


+91 99858 31828: *మన కోరికలు ఎలా ఉండాలి*?


హరిద్వార్లో కొండగుహలో ఉండే స్వామీజీ వద్దకు ఇద్దరు స్త్రీలు వచ్చారు

స్వామిజికి నమస్కరించి ఇలా ప్రశ్నించారు

"స్వామిజీ! మామనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు! ఎప్పుడూ అశాంతితోనే ఉంటాము!! మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామీ!!" అంటూ అడిగారు

"ఏమిటమ్మా! మీ మనసులో ఉన్న కోరిక?"ప్రశ్నించాడు స్వామిజీ

"నాకు ఎవరితో మాటపడవద్దని ఉంటుంది స్వామి! నన్నెవరూ తిట్టవద్దు!! అని కోరుకుంటాను. కానీ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ వుంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది." చెప్పింది ఒక స్త్రీ

"నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఖం వస్తూనే ఉంటుంది.. లేదా.. ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు".. చెప్పింది రెండవ ఆమె కూడా!!

వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక పదినిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్లి తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగాడు.

"చూడండీ! మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది.. అంటే మన భావాలే మంత్రాలౌతాయి!!"

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే....

"కావాలా? వద్దా??...జరగాలా? వద్దా?? అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది."

"భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి"

"స్వామీజీ! భావాన్ని బట్టి అలవాట్లు అంటే?" ప్రశ్నించారు ఒకరు.

స్వామీజీ సమాధానమిస్తూ..

మనకోరికలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి! నెగిటివ్ గా ఉండవద్దు!!

"శతమానం భవతి"..అంటూ వంద సంవత్సరాలు జీవించు!!..అంటూ దీవిస్తామే తప్ప.."నువ్వు నూరు సంవత్సరాల వరకు చచ్చిపోకు!!"..అంటూ దీవించము!!..అంటూ చెబుతూ

"అమ్మా! నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా? "ప్రశ్నించాడు స్వామి ఒకరిని

"అవును స్వామీ! నేను తప్పును ఓర్వనూ!! ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను!" అంది ఆమె

"నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా? నువ్వు!! "అంటూ రెండవ ఆమెను ప్రశ్నించాడు స్వామిజీ

"అవును స్వామీ! కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలికపడుతుంది సమాధానమిచ్చింది!" రెండో ఆమె

"అలవాట్లంటే ఇవేనమ్మా! 

మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి.

ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి!"

ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి!

"మీరొకరికి జ్ఞానదానం చేశారు! అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా?తగ్గుతుందా??" అడిగాడు స్వామిజీ

"పెరుగుతుంది స్వామి" చెప్పారిద్దరొకేసారి

"సరే! మరొకరికి ధైర్యం చెప్పారు! అప్పుడు ధైర్యం పెరుగుతుందా?తగ్గుతుందా??"

"పెరుగుతుంది స్వామి" చెప్పారు మళ్ళీ..

మీరు జ్ఞానాన్ని..ధైర్యాన్ని.. సంతోషాన్ని.. ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినపుడు..

మీరు విమర్శలనూ..దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు కాబట్టి, అవి కూడా పెరుగుతూ పోతాయి కదా!!

"స్వామిజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? " అంటూ ప్రశ్నించారు

స్వామిజీ సమాధానమిస్తూ...

"అందుకే మనసులో ఎప్పుడూ నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు!"

"నేను మాటలు పడవద్దు!

నన్నెవరూ తిట్టవద్దు!!

నాకు దుఃఖాలు రావద్దు!!!

నేను బిచ్చమెత్తుకోవద్దు!!!!"

......ఇలా!!

వద్దు!..కావాలా?..అనేది ముఖ్యం కాదు ..ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది.. ఆ భావమే ఒక మంత్రంలా పనిచేస్తుంది!

కాబట్టి వాటినే ఇలా అనుకోవాలి!

నేను పొగడబడాలి!

నేను బాగా కీర్తించబడాలి!!

నేను ఆనందంగా ఉండాలి!!!

నేను ధనవంతురాలను కావాలి!!!!

...ఇలా పాజిటివ్ గా ఉండాలి!అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది.

మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్ గా అనుకోండీ!

"అమ్మా! నీ అదే కోరికను "నన్ను అందరూ పొగడాలి!" గా మార్చుకుని దాన్నే మననం చెయ్యు!!" అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి...

రెండవ ఆమె వైపు తిరిగి..

"నువ్వేమో 'నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి' అనుకో! దాన్నే మననం చెయ్యు!" అంటూ చెప్పాడు. "సరే !స్వామి!! ఈ క్షణంనుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము! 

ఇది తొందరగా నెరవేరేలా ఇంకేదైనా రెమిడి చెప్పండీ!" అంటూ అడిగారు.

"సరే అమ్మా ! అలవాట్లను బట్టే ఫలితాలు ఉంటాయన్నాను కదా!! ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి!...ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం 5 గురినైనా పొగుడు! తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ వెళ్లు!!"

ఇక నువ్వేమో కష్టాలు,దుఃఖాలు,బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను..సంతోషాలను చెబుతూ నీ హ్యాపీ నెస్ ను పంచుతూ వెళ్లు! అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో!!

అంటూ రెమిడి సూచించాడు స్వామిజీ!

"అద్భుతం స్వామి!! చాలా బాగా చెప్పారు!" అంది మొదటి స్త్రీ.

"కదా!! స్వామిజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషమనిపించిందో!!!" అంది రెండవ ఆమె.

....ఆ క్షణమే రెమిడి ప్రారంభించిన ఆ ఇద్దరినీ చూసి స్వామిజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపాడు!

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు. దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి!

ఉపనిషత్‌ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు. నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది.

వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి. యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు.

కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే!

అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్‌ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు. బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి.

ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి. జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి.

[28/01, 6:25 am] +91 99858 31828: *చిలుక చెప్పిన రహస్యం*


అనగనగా ఒక చెట్టు మీద రెండు చిలుకలు కాపురం ఉంటున్నాయి. వాటికి ఓ బుజ్జి చిలుక పుట్టింది. నాన్న చిలుక ఆ వనంలోని చిలుకలకు రాజు. అక్కడి చిలుకలు తమ కష్ట సుఖాలను జ్ఞానియైన ఆ చిలుకరాజుతో పంచుకొనేవి. బుజ్జి చిలుక ను ఆ రెండు  చిలుకలు ఎంతో ప్రేమగా పెంచుతూ రోజూ ఆహారం తెచ్చి పెట్టేవి.  మెలమెల్లగా బుజ్జి చిలుకకు రెక్కలు రావడం మొదలయ్యే సరికి, అమ్మ చిలుక, దానికి ఎగరడం నేర్పింది. ఎగరడం నేర్చుకున్న బుజ్జి చిలుక తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.

వేరే చిలుకతో జతకట్టి గూడు ఏర్పరుచుకుంది. అదే సమయంలో బుజ్జి చిలుక తల్లి కి జబ్బు చేసి చనిపోతుంది. దానికి ఎంతో బాధ కలుగుతుంది. నాన్న చిలుక మౌనంగా ఉండడంతో దగ్గరకు వెళ్లి "నాన్నా, అమ్మ వెళ్లి పోయి ఒంటరై పోయానని బాధపడుతున్నావా. వద్దు నాన్నా. నేనున్నాను మీకు." అంటుంది ఊరడిస్తున్నట్లుగా.

"పిచ్చి వాడా, ఈ ప్రపంచంలో అందరూ ఒంటరి వారే. ఒక్కరే వస్తారు. ఒక్కరే వెళ్తారు. ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత బాల్యం, యవ్వనం, ముసలితనం అనే దశలను అనుభవిస్తుంది. ఈశరీరం ఎప్పుడైతే జర్జరమై పనికిరానిదౌతుందో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలి పెడుతుంది. దానినే మరణం అంటారు. ఆ శరీరం నుండి వేరైన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి మరల జన్మిస్తుంది. అదే జననం అంటే." అని వివరించింది చిలుకరాజు.

"అయితే ఇది ఎవరికైనా తప్పదనమాట. మరైతే అమ్మ మళ్ళీ పుడుతుందా నాన్నా." ఆశగా అడిగింది బుజ్జి చిలుక.

"పుట్టవచ్చు. కోడలు కడుపుతో ఉన్నట్లుంది కదా. మళ్ళీ నీ మీద ప్రేమతో నీ బిడ్డగా పుట్టవచ్చు." అంది చిలుకరాజు నవ్వుతూ.

"నాన్నా, ఈ రోజు నాకెంతో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నాను నాన్నా." అంటూ తన గూటివైపు ఎగిరి పోయింది బుజ్జి చిలుక.


దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।


నీతి : దీనిని బట్టి తెలిసేదేమంటే ఏ జీవి అయినా పుట్టి, పెరిగి తన జీవితంలో అన్ని దశలూ అనుభవించి, చివరికి చనిపోక తప్పదు. చనిపోయింది శరీరం మాత్రమేనని, ప్రాణం మరో శరీరంలో ప్రవేశించి తిరిగి పుడుతుందని తెలుసుకున్నవారు, చావు గురించి బాధ పడరు.

✍🏻రామశేషు

May be an image of outdoors

సమ్మోహనాలు ..తాళం ప్రేమ (1161-1170)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఇంటికి తాళ ముండు
ముండును గుర్తు గుండు
గుర్తు దొంగిలించుట వీలుండు ఈశ్వరా

తాళంతో భందన
భందన తో శిక్షణ
శిక్షణ ప్రజా రక్షణలుగా ఈశ్వరా

బానిసకు సంకెళ్లు
సంకెళ్ళు తాలాళ్ళు
తాలాళ్ళు వేసి బంధిస్తారు ఈశ్వరా

తాళ మనేది శిక్ష
శిక్ష వేసిన రక్ష
రక్షతో దొంగల భయము పోవు ఈశ్వరా

విశ్వ సించు తాళము
తాళమే బంధనము
బంధనము ఎప్పటికి మారదును ఈశ్వరా

భావ రాగ తాళము
తాళము కరతాళము
తాళము మెదడులో ఉండు తాళము ఈశ్వరా

భజన కుండు తాళము
తాళము తో స్వరము
స్వరము హృదయములోన తాళము ఈశ్వరా

తాళముతోనూ చెవి
చెవి బిగింపు బావి
బావి ని చెవితో కదిలించుఁనే ఈశ్వరా

నోటి కుండు తాళము
తాళము యే శబ్దము
శబ్దము తగ్గియు పెంచు తాళము ఈశ్వరా

మనిషి మనిషి తాళము
తాళ వేళ కోళము
వేళ కోళముతొ తాళమువేయు ఈశ్వరా
 

[29/01, 7:10 am] +91 99858 31828: *కరవు* 

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

 

​సకాలంలో వర్షం  కురవక, పంటలు పండక, ప్రజలకు ఆహారం, నీటి కొరత ఏర్పడి అలమటించే కరవు కాలం లోకంలో కొన్నిసార్లు సంభవిస్తుంది. అలాంటప్పుడు  జనజీవనం అస్తవ్యస్తమగుతుంది.  ఆహారం, నీటిలభ్యత ఉన్న ప్రాంతాలకు జీవులు వలస వెళతాయి. ఆకలి, దాహం తట్టుకోలేక ప్రాణనష్టం విపరీతంగా జరుగుతుంది.    


కరవు కాటకాల్లాంటి కష్టాలకు మానవుల అధర్మ ప్రవర్తనే కారణమంటాయి ధర్మశాస్త్రాలు.  దుర్భిక్ష కాలంలో ఆకలికి ఓర్చుకోలేని  జనులంతా దోపిడీలు, దొంగతనాలకు ఒడిగడతారు. మానవుల్లో నైతిక ప్రవర్తన నశిస్తుంది. అధర్మాన్ని ఆశ్రయిస్తారు. క్షామకాలం దాటిపోతే  అధర్మాలు తగ్గవచ్చు  కానీ అధర్మం తగ్గందే క్షామమూ తగ్గదని శాస్త్రాలు బోధిస్తున్నాయి. 



దైవాజ్ఞానుసారమే సూర్యచంద్రులు భ్రమిస్తున్నారు. వాయువు వీస్తున్నది.  సకల భారాన్ని  భూమాత మోస్తోంది. గ్రహాలన్నీ  వాటి స్థానాల్లో ఉన్నాయి. సముద్రుడు తన హద్దులోనే ఉన్నాడు.  సమస్త ప్రకృతి సక్రమముగా ఉన్నప్పటికీ మేఘాలు వర్షించక పోవడం వల్లనే కరువు ఏర్పడుతుంది. 


చెరువులు, సరస్సులు, సముద్రాల్లోని  జలాన్ని సూర్యకిరణాలు ఆవిరి రూపములో ఆకర్షించడం వల్లనే  మేఘాలుగా మారి చల్లని వాయువు తాకినంతనే వర్షమై కురుస్తుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కరువు కాలంలోనూ వాయువు వీస్తుంది. సూర్యుడు వెలుగులు పంచుతాడు. కనుక కరవుకు వాయు, సూర్యులు కారకులనలేం.   


 ‘లోకంలో సత్యం సన్నగిల్లినప్పుడు సూర్యాదుల కార్యాలు తారుమారవుతాయని’ ధర్మశాస్త్రాలు చెప్పినట్టుగా ,  మానవులు సత్యాన్ని ఆచరించనందువల్ల కలిగే ఫలితమే కరువు కాటకాలు.  

 

​“అపూజ్యా యాత్ర పూజ్యంతే /పూజ్యాయత్రావ మానితాః /తత్రత్రయం భవిష్యంతి /వ్యాధి దుర్భిక్ష తస్కరాః !!”  అంటున్నాయి శాస్త్రాలు. ‘అపూజ్యులు పూజింప బడినప్పుడు , పూజ్యులైనవారు అవమానింప బడినప్పుడు, అకాల మృత్యు కారకాలైన వ్యాధులు, జీవన భీతి కారకాలైన  దుర్భిక్షం, మానప్రాణ ధనాలను హరించే  చోర భయం కలుగుతాయని చెప్పినట్టుగానే కరువు, తుపాన్లు మొదలైనవి ఏర్పడి అనేక నష్టాలను కలిగిస్తాయి.  

  

     “దాతా దరిద్ర కృపణోధనాఢ్య / పాపీ చిరాయు సుక్రుతీ గతాయుః/ 

రాజా కులీనో నకులీనసేవ్య/ కలౌ యుగే షడ్గుణ మాశ్రయతి /”  అంటున్నాయి ధర్మ శాస్త్రాలు.  దాత దరిద్రుడై , లోభి ధనికుడై, పాపి చిరాయువై , పుణ్యుడు అల్పాయుష్కుడై , రాజు నీచకులుడై, నీచకులుడు సేవింపదగిన వాడవుతాడన్న ఆరు గుణాలు కలియుగంలో ఆవరించి ఉంటాయన్నది లోకంలో జరగడం జనవిదితమే. 


​‘సత్యం వద, ధర్మం చర’ అన్న ఉపనిషత్తుల బోధనలను ఆచరిస్తూ  ఆరాధ్య దైవాలను ఆర్తితో కొలిచినప్పుడు దైవం కటాక్షిస్తుంది. అననుకూల పరిస్థితులు తొలగిపోయి శుభప్రదం అవుతుంది.

 

మధురిమలు .. లడ్డు   ((293 --304 )

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అలుపెరుగని మానవీయత కలిగిన మహోన్నత వ్యక్తి  భారతదేశం ప్రజలందరినీ ఏకత్రాటిపై నడిపించిన భావోద్వేగం లేని సున్నిత స్వభావం కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు జీవితంలో కుటుంబ సర్వస్వాన్ని విడిచి 6మూరుల గావంచా, పై కండువా వేసుకొని ఒక చేతి కర్రతో దేశమంతా తిరిగిన అసమాన సాహసికుడు ఉప్పు సత్యాగ్రహంలో ప్రారంభమైన సత్యాగ్రహం ఆంగ్లేయులను గడగడలాడించిన బాపు దేశానికి స్వాతంత్రానికి తెచ్చి, విదేశీయులను నుండి  భరతమాత శృంఖలాలు తెంచిన యుగపురుషుడు. జనులు మహాత్మా అని పిలుపిచ్చారు .పూజ్య బాపూజీ వర్ధంతి ఈరోజున ఆయనను స్మరించుకొని హృదయాంజలి ఘటిద్దాము.*

 🌹  జై బాపూజీ జై జై బాపూజీ 🌹


గాంధీగారు సాధించిన రాజ్యం యే స్థితిలో ఉందొ ఒక్కసారి తెలుసుకోండి 


వక్ర తుండిని మహత్యము

వచ్చూ విధ్యాభ్యాసము

కొల్చిన వచ్చును మోక్షము

మనకందరకీ క్షేమము


నవరసాల కధ వలయము

నటరాజు రాజకీయ ము

చూపేటి అహంకారము

ఓట్లకు ఆశా వాదము


మానసికముతో జాడ్యము

మానవాళి లో మోనము

ప్రభోధాల ప్రభావము

మేధస్సుల తో రాజ్యము


కాగితమ్ము గ మారాము

పక్షిగ ఎకరక ఉన్నాము

మేము కాము గాలి పఠము

మాది రాజకీయ మతము


కాలాన్నీ బట్టి పోము

తృణీకరించనూ లేము

ఆడించిన ఆడుతాము

రాజకీయ పార్టీలము


విధ్వంసం చేయలేము

వద్దని వారించలేము

హక్కుని హరించలేము

నాయకత్వమోదలలేము


అల్లర్లను అదుపుంచము

బందు లతో అవకాశము

అదుపులేక అరాచకము

ఇదియేను ప్రజా సామ్యము


రాజకీయ చైతన్యము

జన శ్రేయస్సు లక్ష్యము

నాయకులు చేయు యుద్ధము

జన సేవకు ప్రయత్నము


ఇదేమి ప్రజాస్వామ్య ము

అధికారి ఏకగ్రీవము

రాజకీయుల నాటకము

ఇదీ  అవకాశ వాదము


నిప్పుకు కాంతి జ్వలనము

నిత్యమూ కాంతి కిరణము

జాలము కాంతి మెరుపు గుణము

ఓట్లకు ఆశల కిరణము


నీతిగా కిరణ గమనము

గాలి గా అంతా గమనము

దారిగా ప్రజా గమనము

నాయకులు ఓట్లకు గమనము


కాలము మారినంతటనె కాంచన పుష్పపు శాఖలన్నియున్

రాజము తారుమారగుట రాకసి బుధ్ధుల శాఖలన్నియున్

ఆశల ఆటపాటలతొ అర్ధపు రాజ్యపు శాఖలన్నియున్

మాటలు కోటదాటుటుతొ మాధ్యపు శాఖలన్నియున్


అంటూ ప్రస్తుత రాజకీయ నాయకులు అంటున్నారు గాంధీజీ తో ఈశ్వరా

--(())--


[31/01, 7:17 am] Prathyusha: ఎంత  అద్భుతమైన  పోస్టింగు  ఇది.


🍁MUST READ 

గొప్ప నీతి కథ..


అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.


దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.


అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

🍃🍃🍃

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. టూ

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా? 

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. 

ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. 

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట.

అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. 

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? 

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? 

నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? 

నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. 

నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. 

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? 

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? 

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. 

ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. 

ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. 

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? 

ఇక నేనుండలేను వెళ్తున్నా!'

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. 

దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. 

దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇

[31/01, 7:20 am] Prathyusha: 🙏ఒక తాత తన మనవడితో ఇలా అన్నాడు 🙏


ఒరేయ్ మనవడా స్వర్గానికి వెళ్లాలంటే ఉచితం కానీ నరకానికి వెళ్లాలంటే ఖర్చు పెట్టాలి అన్నాడు 


ఈ మాట విన్న మనవడు ఆశ్చర్యంగా అదెలా తాతయ్య అన్నాడు 


మందు తాగాలంటే డబ్బులు పెట్టాలి 

సిగరెట్ తాగాలంటే డబ్బులు పెట్టాలి 

నువ్వు తప్పు చేయాలంటే డబ్బులు కావాలి 


అదే మంచి చేయాలంటే 


నువ్వు సేవ చేయాలి అంటే డబ్బు అవసరం లేదు 

దేవుడిని ధ్యానించ డబ్బు అవసరం లేదు 

నీ ప్రేమ నలుగురికి పంచడానికి డబ్బు అవసరం లేదు 

నువ్వు సాయం చేయడానికి డబ్బు అవసరం లేదు 

నీ సమయాన్ని ఇస్తే చాలు అక్కడ నీ డబ్బు అవసరం లేదు 


డబ్బు పెట్టి మరీ మనం నరకాన్ని కొంటున్నాం 

ఉచితంగా స్వర్గానికి వెళ్లడం లేదు అన్నాడు 


నిజమే అనిపిస్తుంది కదా 

వ్యసనాలని డబ్బు పెట్టి కొనుక్కుని బానిసలై నరకాన్ని చూస్తున్నాం 🙏🙏

[31/01, 7:24 am] Prathyusha: *🌞🌻మానవుని జీవితానికి ఆలంబనగా నిలిచే ముగ్గురు స్నేహితులు...🌻🌞*


 *👉మొదటిది సంపద.  అదృష్టం ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది.👆*

  *👉రెండవది బంధువులు..  స్మశానం వరకు తోడుగా ఉండి అక్కడ వదిలేస్తారు. మళ్లీ ఎప్పటికో కానీ తలవరు..🤘*

  *👉 ఇక మూడవది మనం చేసిన పుణ్యం...  స్మశానం దాటిన తర్వాత కూడా మనల్ని అనుసరిస్తుంది...🤟*

 

     *🌷సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి👍*

     *🌸మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైనప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది👆*

      *🌻సజ్జన సాంగత్యం వల్ల జీవన  ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది🤘*

     *🌷సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల దుకాణం లాంటిది... ఆ దుకాణం వద్దకు వెళితే చాలు మనం కొన్నా కొనకపోయినా సువాసన అంటుకునే తీరుతుంది🤟*

 

     *🌹అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి...👌*


*🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏*

[31/01, 7:29 am] Prathyusha: 🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️


  ☀️ *తులసి దళం-2*☀️

       *(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)


 *"అంతర్ జీవితం"* 


రెండు రకాల జీవితాలు ఉన్నాయి :

ఒకటి బాహ్య జీవితం.

రెండు అంతర్ జీవితం.

బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు - అలాగే అంతర్ జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు.

అయితే, వాస్తవానికి అంతర్ జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది.

అంతర్ జీవితమే బాహ్యజీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది.

అంతర్ జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం.

అంతర్ జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది.

అంతర్ జీవిత సహిత బాహ్యజీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం.

అంతర్ జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సువిదితం తెలియజేయగలిగేది.

అంతర్ జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం - ఆత్మానుభవ మయం.

బహిర్ జీవితం అందరికీ చూపించగలిగినది.అంతర్ జీవితం అందరికీ చూపించలేనిది.

అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్ధవంతమవుతుంది.తేజోవంతమౌతుంది. ధర్మార్ధ కామమోక్షదాయకం అవుతుంది.

అంతర్ జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటి సారిగా పరిచయం అవుతుంది.

తర్వాత నిరంతర ధ్యాన, స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షితమౌతుంది.

 

1 comment: