Friday, 1 January 2021

03--01--2021


ప్రాంజలి ప్రభ కధలు ... 13
పరమ శివునకు ఐదు ముఖాలు.....!!
అవి తత్పురుష, వామదేవ, సద్యొజాత, అఘోర, ఈశాన ముఖములు. ఇవి పంచభూతములకు ప్రతీకలు.
ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన సృష్టి( పుట్టుక), స్థితి (పెరుగుట), లయ (గతించుట), తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం), అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట. గుర్తుంచుకోవలసిన విషయం పుణ్యము ఎక్కువ చేసిన పాపము ఎక్కువ చేసిన తిరిగి జన్మించాలి. పాపము - పుణ్యము లేని సమతుల్య స్థితి లో మాత్రమే మోక్షము) చేయబడును.
ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:
సద్యొజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని పూర్వమ్నాయ మంత్రములు అంటారు.
సద్యొజాత - పశ్చిమ దిశ - అధిపతి సుబ్రహ్మన్యుడు - పృధ్వి తత్వం(సమస్త ప్రాణులు భూమి నుండే పుట్టును) - స్రుస్టి.
వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని దక్షిణాంమ్నాయ మంత్రములు అంటారు. శైవాగమమ్ ఇందులోనిదే.
వామదేవ - ఉత్తర దిశ - అధిపతి కల్ప వృక్షం క్రింద పార్వతీ సహిత ఈశ్వరుడు - జల తత్వం (సమస్త ప్రాణులు నీటి వలననే జీవించి / వృద్ది పొందును) - స్థితి.
అఘోర ముఖమునుండి వైష్ణవాగమంకు( విష్ణు తత్వాన్ని ఆరాధించే వారు) సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని పశ్చిమామ్నయమ్ మంత్రాలు అంటారు.
అఘోర - దక్షిణ దిశ - అధిపతి దాక్షిణామూర్తి - అగ్ని తత్వం ( అన్నిటినీ కాల్చి భస్మం చేయటం) - నాశనం.
తత్పురుష ముఖము నుండి శక్తేయములైన(శక్తి ని ఉపాశించే వారు ఆచరించే విధానం శాక్తేయం) 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహావిద్యాది మంత్రములు ఇందులోనివే. వీటిని ఉత్తారాంన్యాయ మంత్రాలంటారు.
తత్పురుష - తూర్పు దిశ - వాయు తత్వం (ఒక చోటనుండి మరో చోటికి ప్రయాణం) - తిరొధానం, ఈశాన్య ముఖమునుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్న్యాయ మంత్రాలు అంటారు.
ఈశాన - ఊర్ద్వ దిశ - అధిపతి రుద్రుడు - ఆకాశ తత్వం – అనుగ్రహం.
అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది.
అంతే
కాదు దేవునికి మహా నివేదన సమయములో ఈమహా మంత్రాలతోనే పవిత్రించబడును.
వాటినే "సధ్యోజాతాది పంచబ్రహ్మ మహామంత్రాలు" అంటారు..
ఓం శ్రీ రాం ... శ్రీ మాత్రేనమ: ... ఓనమ:శివాయ
--(())--
mments

 
మహాభారతం రెండో భాగం నైమిశారణ్య ప్రవేశం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
                       🙏🙏🙏
మహాభారత కథ అంతా కూడా నైమిశారణ్యంలో ప్రస్తావించబడింది ఇక్కడ సూత మహర్షి శౌనకాది మహా మునులకు ఈ కథ చెప్పాడు కనుక నైమిశారణ్యం గురించి తెలుసుకోవడం, అది మన బాధ్యత గా భావిస్తున్నాను మిత్రులు సహకరించగలరు గూగుల్ వికీపీడియా ఆధారంగా వివరిస్తున్నాను
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
భౌగోళికాంశాలు :
రాష్ట్రం:
Uttar Pradesh
ప్రదేశం:
Naimisaranya
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:
Deva Rajan
(Vishnu)
ప్రధాన దేవత:
Pundarikavallai
(Lakshmi)
పుష్కరిణి:
Chakra
కవులు:
Tirumangai Alvar
నైశారణ్యం
నైమిశారణ్యం (Naimisha Forest) వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాదాపు 100 కి.మీ. దూరం ఉంటుంది.
ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.
ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఉంది.
                                                                                  inkaa undi ...4
ఓం నమో భగవతే వాసుదేవాయ
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
        శ్రీ భాగవతం - 99 వ భాగం
        చదువుకుందాం భాగవతం
      బాగుపడదాం మనం అందరం
              దశమ స్కందము
             శ్రీకృష్ణ లీలలు - 29
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁

 ప్రద్యుమ్నకుమార చరిత్ర

పోతనామాత్యుల వారు దశమ స్కంధము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ అంటారు -

శ్రీకర! పరితోషితరత్నాకర! కమనీయ గుణగణాకర! కారుణ్యాకర! భీకరశర ధారాకంపిత దానవేంద్ర! రామనరేంద్రా!!

వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి రామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు.

‘శ్రీకర’ – సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా! అపారమయిన కారుణ్యమునకు అవధి అయినవాడా! శత్రువులను పరిమార్చకలిగిన వాడా! రామచంద్ర ప్రభో! భాగవతం ఉత్తర భాగమును ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను’ అన్నారు.

దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనము ఏ పనిమీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రం విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మ్యత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భక్తుడయిన వాడికి అలవాటు కావాలి. అందుకని సంతతము ఆ భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ‘నా అంతటి వాడిని నేను’ అని అనడు. అలా అంటే మీ స్థితి ఏమిటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన మహా దయాళువు. అలా చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడములనయినా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్పమాట అంటారో చూడండి!

కమనీయ గుణగణాకర! కారుణ్యాకర!’ మహా కారుణ్యము కలిగినటువంటి వాడా – రామచంద్రప్రభో! అని ప్రారంభం చేశారు.

మనం కూడా దీనిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. భాగవతమును వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితములో ప్రత్యేకముగా అస్తమానూ ఈశ్వరుడిని జ్ఞాపకమునకు తెచ్చుకోవడం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.  మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు.

రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురుటి కందుని చూసుకొని ఆమె పరవశించి పోయింది. ఆవిడ ఆదిలక్ష్మి. ఆమె నుండియే మిగిలిన అష్టలక్ష్మిలు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతముగా ఉండడానికి యిష్టపడదు. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలు యిచ్చింది. బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది.

ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపియై ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్ళలో ఉన్న ప్రద్యుమ్నుడు అనబడే ఆ చిన్న బిడ్డడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపివేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడు.

ఇది మీరు జాగ్రత్తగా గమనించ వలసిన లీల. ఈ లీలను గాని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగారంటే ఈశ్వరుని దివ్యమయిన అనుగ్రహం, కారుణ్యం, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పముతో ఎలా ఏమి జరుగుతాయన్నది మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీయందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఎంత గొప్ప పద్యమును ఇచ్చారో చూడండి!

తామరసాక్షునంశమున దర్పకుఁ డీశ్వరుకంటిమంటలం
దా మును దగ్ధుఁడై; పిదపఁ దత్పరమేశుని దేహలబ్ధికై
వేమఱు నిష్ఠఁ జేసి హరి వీర్యమునం బ్రభవించె రుక్మిణీ
కామిని గర్భమం దసురఖండను మాఱట మూర్తియో యనన్!!

ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరమును పొంది వున్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వరులను కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడు. మన్మథుడు శ్రీమహావిష్ణువు కుమారుడు. శ్రీమహావిష్ణువు అందం అంతా మన్మథునికి వచ్చింది. మన్మథుడు అనగా మనస్సులను మథించగలిగిన వాడు అని అర్థం. ఆయన పుష్ప బాణుడై అవతలవారి మనస్సులను కదుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణ ప్రయోగం చేయబోయాడు. ఇంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చుని వింటినారి సారిస్తున్న మన్మథుడు కనపడ్డాడు. అంతే! మూడవకన్ను తెరిచాడు. కాముడు భస్మమయిపోయాడు. అతను హర తేజస్సుచేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు. మూడవకంటి మంట. ఇంక దానికి ఎదురులేదు. అటువంటి మంటయందు మన్మథుడు దగ్ధమయి పోయాడు. శివుడికి ఉన్న మూడు నేత్రములే సూర్యచంద్ర అగ్నిహోత్రములు. అటువంటి అగ్నిహోత్రముచేత కాలి బూడిదరాశియై పడిపోయాడు.
మన్మథుడు కాలిపోవడం పరమశివునకు విజయము. ఎందుకనగా ఆయన కామదహనం చేశాడు. కామునికి లొంగడు. కాని మన్మథుడు దహింప బడడం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇపుడు ఆమెకు ఎవరు అయిదవతనమును ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునితో చేర్చడం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనము పొందుతారనే భావనచేత మన్మథుడు బాణప్రయోగం చేశాడో, అటువంటి భర్తను తనకు యిమ్మనమని పార్వతీదేవిని, పార్వతీపరమేశ్వర కళ్యాణం తరువాత రతీదేవి అడిగింది. అందువలన పరమేశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని మరల పార్వతీదేవి బ్రతికించినది. అమ్మవారి శక్తికి పరిమితి లేదు. అందువలననే కాలి బూడిద అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగినది. ఆవిడ ఏదయినా చేయగలదు. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ! ఆమె రతీదేవికి ఒక వరం యిచ్చింది. నీ అయిదవతనమునకు భంగం లేదు. నీ భర్త అనంగుడు అవుతాడు. శరీరం ఉండదు. కానీ నీకు కనపడతాడు. పైన ఎవ్వరికీ కనపడడు. నీకు మాత్రం కనపడతాడు’ అని వరం యిచ్చింది. రతీదేవికి తన పతిని శరీరముతో చూడాలని కోరిక కలిగింది. అపుడు పరమశివుడు మన్మథునితో అన్నాడు ‘వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించెదవుగాక! అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు’ అని వరం ఇచ్చాడు.


ఈ పుట్టిన మన్మథుడు (ప్రద్యుమ్నుడు) రాక్షస సంహారమునకు శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటిమంటచేత కాలిపోయిన వాడు యిప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్లి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు ‘తాను రాక్షస సంహారం చేసి భూభారమును తగ్గిసాను’ అని అభయం యిచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదుకదా! ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంది. ఈయన పుట్టగానే ఈయన వలన మరణించేవాడు ఒకడు ఉన్నాడు. అతను శంబరాసురుడు అనే రాక్షసుడు. వానికి ఈ విషయం తెలుసు. తన మృత్యువునకు ఏది కారణమని భావించాడో దానిని తీసివేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహమునకు వెళ్ళిపోయాడు.

కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికే వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరి వేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటకు తీసి ఒడ్డుకు వచ్చి రంపముతో దాని కడుపు కోయగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడిని కానుకగా ప్రభువుకు ఇద్దామని వాళ్ళ ప్రభువు అయిన శంబరాసురుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. శంబరాసురుడు మాయకు వశుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మథుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా, ఈ మాంస నేత్రముతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురుచూస్తోంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతొ శంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంబరాసురుని వద్దకు వెళ్లి ఆ పిల్లవాడిని తనకివ్వమని, వానిని తాను పెంచుకుంటానని చెప్పింది. ఆ పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు.

ప్రపంచంలో ఎవరయినా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతోనే పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మథుడనని తెలియదు. రతీదేవికి తెలుసు.

ప్రద్యుమ్నుడికి యౌవనము వచ్చిన తరువాత ఈమె ప్రవర్తనయందు చేష్టితములను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తనయందు దోషమును కనిపెట్టి,  ‘నీవు మాతృత్వమునకే కళంకం తెస్తున్నావు. నీ ప్రవర్తన యందు దోషం కనపడుతోంది. ఎందుకు నీయందు ఈ విధమయిన విచిత్రమయిన ప్రవర్తన జరుగుతోంది?’ అని అడిగాడు. అపుడు ఆవిడ జరిగిన విషయమును తెలియజెప్పి ఆ అమ్మకు వున్న కష్టమును పరిమార్చి నీవు మరల అమ్మవద్దకు చేరవద్డా’ అని అడిగింది. ఆయనలో వున్న మాతృ భావమును ఎవరి వైపుకి తిరగాలో వారి వైపుకి తిప్పింది. అవతార ప్రయోజనమును పూర్తి చేయిస్తోంది.  అప్పుడు ప్రద్యుమ్నుడు ‘ఉత్తర క్షణం నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను’ అన్నాడు

అపుడు ఆమె ‘నీవు అంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలను నిర్జించడం ఎవరివల్లా కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశిస్తాను. ఆ విద్యపేరు మహామాయా విద్య’ అని ఆ విద్యను బోధచేసింది. అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులను చెపుతారు.
మనుశ్చంద్ర కుబేరస్య లోపాముద్రాచ మన్మథః అగస్తీరగ్నిసూర్యశ్చ     ఇంద్రస్కంధశ్శివస్తథా క్రోధభట్టారకోదేవ్య ద్వాదశాని ఉపాసకాః!!

అను ఈ పన్నెండుమంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణం ప్రక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళి అయిన తరువాత మాతృత్వమును కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడడానికి మహామాత అనుగ్రహం కలగాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడమును అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహమును పోతనగారు కథలోకి తీసుకువచ్చారు. చూడండి ఆయన ఉపకారం.

ప్రద్యుమ్నుడు మహా మాయా తత్త్వమును పొంది శంబరాసురుని మీదికి యుద్ధమునకు వెళ్ళాడు.
వాడికి ఈ సత్యం తెలియగానే తోక త్రొక్కిన త్రాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధమునకు బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకు ఉన్నటువంటి మహా మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రములను అణచివేసి తరువాత కత్తిలో శంబరాసురుని కుత్తుక ఖండించివేశాడు. ఎవరిచేతిలో శంబరాసురుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వానిచేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. అలా చంపివేసిన తరువాత ఒక చిత్రం జరిగింది.

వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మని చూడడానికి వెళ్ళాలి కదా! ఇక్కడ జరుగుతున్న విషయములన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకి తెలుసు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పింది మాత్రమే మనం చెయ్యాలి తప్ప ఆయన చేసింది మనం చేయకూడదు.

 కృష్ణుడిది పరిపూర్ణావతారం. కృష్ణుడిని అనుకరించకూడదు.

ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశమార్గంలో రుక్మిణీదేవి అంతఃపురమునకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది.

కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్ర గుద్దినట్లు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణునిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వాళ్ళు అక్కడే స్తంభముల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉన్నదా అని అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవి వద్దకు వెళ్లి ‘అమ్మా, ఎవరో ఆకాశము నుండి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడి లాగానే ఉన్నారు. మీరు చూడవలసినది’ అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది.

ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపొయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకు వచ్చి ఆమె స్తన్యములలో పాలు చేపునకు వచ్చాయి. ఆవిడ అంది “ఈపిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే యిప్పటికి యింత అయి ఉండేవాడు. ఈతడు నా కొడుకే అయివుండాలి’ అనుకుంది. అమ్మ యిరువది అయిదేళ్ళ తరువాత తన కుమారుని గుర్తు పట్టేసింది.

ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకువచ్చారు. ఆయన మహా మాయావి. ఆయన వచ్చి ఒకసారి రుక్మిణి వంక, ఒకసారి ప్రద్యుమ్నుని వంక చూసి ప్రద్యుమ్నుని ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోపల అక్కడికి మహా జ్ఞాని అయిన నారదుడు వచ్చాడు.

‘అయ్యా! నీకు తెలియని విషయమా! ఆనాడు మన్మథుడు కాలి బూడిద అయిపోతే వరం యిచ్చారు కదా! దాని ప్రకారం మన్మథుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో శంబరాసురుడు అపహరించాడు. తరువాత యితడు శంబరాసురుణ్ణి సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ యింటికి కొడుకు కోడలు కూడా ఈశ్వర వరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకుని చేసుకున్న పెళ్ళి కాదు. ఇది జన్మజన్మాంతర సుకృతం. ఇలాంటి కొడుకు కోడలు సృష్టిలో ఉండరు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని తన భార్యత్వమును నిరూపించుకొని, భర్తను తీసుకుని వచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు! అత్తగారియందు అంత గౌరవమును చూపించిన కోడలు! యింక యింతకన్న నీకు ఏమికావాలి?’ అని చెప్పాడు.

రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని, రతీదేవిని ఆప్యాయతతో కౌగలించుకుంది. కృష్ణుడు సంతోషించాడు. అంతఃపురం అంతటా భేరీలు మ్రోగాయి.
చచ్చిపోయాడని మనం అనుకున్న పిల్లవాడు బతికి వచ్చాడు. ఆహా! రుక్మిణీ దేవి ఎంత తపస్సు చేసినదో! మరల కొడుకు యింతవాడయి కనపడ్డాడు’ అని గోపకులందరూ ఆనందముతో వసంతములు జల్లుకుని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు పొంగిపోతూ కొడుకునూ కోడలినీ యింట్లోకి తీసుకువెళ్ళి పెద్ద సంబరములు చేసుకున్నారు.

          🙏 శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో....... 🙏

🙏 కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య🙏

 *ఉపవాసం పాటిస్తున్న రోజుల్లో తలకు మరియు శరీరానికి నూనె ఎందుకు రాసుకోరాదు?* 

రోజంతా ఉపవాసం లేదా రోజులో కొంతభాగం ఉపవాసమును పాటిసున్న రోజులలో తలకు

మరియు దేహానికి నూనె రాసి స్నానం చేయకూడదు

నూనెను అద్దుకొని స్నానం చేయడం భారతీయులకు సర్వసాధారణమే. మరి ఉపవాస రోజులలో ఎందుకు అలా తగదని చెప్పబడింది దీని వెనుక శాస్త్రీయ కారణం దాగి వుంది

శని గ్రహం శక్తి ప్రభావం వల్ల నూనె ఉత్పన్నమైనట్టుగా భావించడం జరిగింది. తలకు నూనె అంటుకోవడం వల్ల తల చుట్టూ ఓ తేజోవలయం ఏర్పడుతుంది. 

ఈ వలయం ఇతర గ్రహాల నుండి మన శరీరంలోకి ప్రసరించే అయస్కాంత తరంగాలను నిరోదిస్తుంది. కానీ ఉపవాసం పాటించు రోజుల్లో ఇది వేరుగా చెప్పబడింది. ఉపవాస దీక్షను పవిత్ర మనస్సు మరియు శరీరముతో ఆచరించడం జరుగుతుంది 

కాబట్టి మన శరీరానికి ఇతర గ్రహాల మరియు నక్షత్రాల నుండి భూమిపైకి ప్రసరించే అయస్కాంత తరంగాల అవసరం ఉంటుంది. 

తలపై రాసిన నూనె ఈ శక్తి తరంగాలను మనలోకి ప్రసరించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇలాంటి నిషేదాన్ని ఉపవాసముండు రోజులలో ఏర్పాటు చేసారు మన పెద్దలు.

🌼


🙏 *శ్రీ వేంకటేశ్వర లీలలు* 🙏

🍒 *భాగము 1* 🍒

*నైమిశారణ్య ప్రాధాన్యము* 

శ్రీలతో తులతూగుచూ పాడిపంటలు పుష్కలముగా నుండి సర్వప్రజలు నీతిమంతులై విలసిల్లిన దేశము భారతదేశము. 

అందమైన హిమాలయములు, మహా శిల్పుల పనితనమునకు మచ్చుతునకలుగానున్న దేవాలయములు మున్నగు వానితో దేశము శోభాయమానముగానుండెడిది. 

ఎచ్చట జూచినను దైవపూజలే యెచ్చట వినినను పుణ్య కథా శ్రవణములే! ఎచ్చట మెట్టినను ఆధ్యాత్మిక చింతనలే! అట్టి పవిత్ర భారత దేశమున అనఱ్యములు ప్రజలకు విజ్ఞాన విషయములందించుటలో విజ్ఞాన విశేషములను శోధించి, నూతన విషయములు కనుగొని, ప్రజల ఉపయోగార్థమందించెడివారు. 

భయంకరారణ్య సీమలందు మోక్షకాముకులై అనేక మంది మునీశ్వరులు తపస్సు చేసుకొనుచెండెడి వారు. చక్రవర్తులు, రాజులు, పరిపాలనను సరిగా చేయుచు మధ్యమధ్య ఆయా మునీశ్వరులను సందర్శించి వారు ప్రబోధములు వినిచు ఉత్తేజితులయ్యెడివారు. 

నైమిశారణ్యము భారతదేశమున గల అరణ్యములలో గొప్పదై విలసిల్లినది. సూతులవారు శౌనకాది మహర్షుల కనేక పౌరాణిక కథలను, భగవన్మాహాత్మ్యములను ఆ యరణ్యమునందే చెప్పెడివారు. 

సర్వవేద పురాణ విజ్ఞాన నిధియైన సూతులవారు చెప్పు విషయములు ఆసక్తికరములై మోక్షదాయకములై యుండెడివి. ఆయన విప్పని ధర్మసందేహములు లేవు. చెప్పని పురాణ రహస్యములు లేవు. 

అనేక ధార్మికాంశములతో ఆయన శౌనకాదులకు సర్వ పురాణములు వినిపించుచుండిరి.

🙏

 *కర్ణపర్వము..*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైఃఃైైైైైైైైైైై


లోక భీకర రీతిలో దుశ్శాసనుడి వధజరగటం కళ్ళారా చూసిన కర్ణుడు ఒకవిధమైన నిర్వేదంతో కూడిన భయంకలిగిన వాడై కూలపడిపోయాడు ! దుర్యోధనుడు దారుణమైన తన తమ్ముని మరణం జీర్ణించుకోలేక నిశ్చేష్టుడైనాడు.

అప్పుడు కర్ణుడి కొడుకు వృషసేనుడనేవాడు అర్జునుడి మీదకు రాగా అతనిని అవలీలగా చంపివేసి కర్ణునివైపు రధం మరలించమన్నాడు అర్జునుడు.

బాధ నుండి తేరుకొని యుద్ధానికి సిద్ధమయి అర్జునుని ఎదురుగా రధం నిలిపాడు కర్ణుడు ! 

లోకోత్తరమైన యుద్ధం మొదలయ్యింది ! అందరి చూపులూ అటువైపే !.

ధర్మజుడు గాయాలకు మందువేసుకొని కవచం తొడుగుకొని మరల వీరిరువురి యుద్ధం చూడటానికి అక్కడకు వచ్చాడు .

అర్జునుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగిస్తే దానిని వారుణాస్త్రంతో ఉపశమింపచేశాడు కర్ణుడు ! .

ఒకరి దివ్యాస్త్రాలను మరొకరు వమ్ము చేసుకుంటున్నారు ! కాసేపు ఒకరిది పైచేయి అయితే మరికాసేపు ఇంకొకరిది పైచేయిగా పోటాపోటీగా హోరాహోరీగా సాగుతున్నది కర్ణార్జునుల యుద్ధం !.

కర్ణుడు సర్పముఖాస్త్రం తీశాడు అందులో ఒక నాగుడు యోగబలంతో దాగి ఉన్నాడు ,వాడు ఖాండవదహనమప్పుడు అర్జునుని మీద పగబట్టినవాడు.

 అప్పుడువాడు పిల్లనాగు! ఇప్పుడు దూకుడు మీదున్న కోడెనాగు! 

వాడున్న సంగతి కర్ణునకు తెలువదు ఆ బాణాన్ని సరిగ్గా అర్జునుడి కంఠానికి గురి పెట్టివదిలాడు ! 

ఈ సంగతి పార్ధసారధి గ్రహించాడు, వెంటనే గుర్రాలకు ఆజ్ఞ ఇచ్చాడు మోకాళ్లమీద వంగి కూర్చోమని !తమ యజమాని చెప్పినట్లు అవి చటుక్కున వంగాయి.

 రధం ఎత్తు అడుగు మేర తగ్గిపోయింది . కంఠానికి గురిపెట్టబడ్డ బాణం కిరీటాన్ని ఎగురకొట్టి పోయింది .

పగతో రగులుతున్న నాగుడు మరల కర్ణుని వద్దకు వచ్చి తనను ప్రయోగించమన్నాడు ! ఎవడవురా నీవు అన్నాడు కర్ణుడు ! నేను అర్జునుని శత్రువును అన్నాడు నాగుడు ! 

ఒకసారి ప్రయోగించిన బాణం తిరిగి ప్రయోగించడం నా చరిత్రలోనే లేదు నీవు వెళ్లు అన్నాడు ,అప్పుడు వాడు భయంకరమైన విషాగ్నికీలలు చిమ్ముకుంటూ అర్జునుడి మీదకు రాసాగాడు ! వాడిని నిశిత శరాలతో నిలువునా చీల్చాడు అర్జునుడు!.

కర్ణుడు బాగా అలసి పోయాడు, యుద్ధం నిర్ణయాత్మక స్థితి చేరుకుంటున్నది ! ఏ అస్త్రాలు స్ఫురణకు రావడంలేదు ! అర్ధమయ్యింది  ఆ యోధుడికి తనకుసమయమాసన్నమయ్యిందని !

అయినా తిప్పలుబడి బాణప్రయోగం చేస్తూనే ఉన్నాడు అర్జునుడి దెబ్బలు కాచుకుంటూనే ఉన్నాడు 

ఇంతలో జరుగరాని ఘోరం జరిగిపోయింది రధచక్రం భూమిలో దిగబడ్డది ! .

రధం దిగి చక్రాన్ని ఎత్తటానికి ప్రయత్నం చేస్తున్నాడు కర్ణుడు . అర్జునుడిని కృష్ణుడు రెచ్చగొడుతున్నాడు.

ఇదే మంచిసమయం అతనిని సంహరించటానికి అని!.

 సందిగ్ధంలో పడ్డ పార్ధుని కృష్ణుడు ప్రేరేపించటం చూసి కర్ణుడు  నల్లనయ్య వైపు తిరిగి నిరాయుధుడను ,నేల పై ఉన్నవాడిని ,నా మీద అస్త్రప్రయోగం ధర్మమా ! అని అడిగాడు  ! .

ఓహో ధర్మం ఇప్పడు గుర్తుకు వచ్చిందా కర్ణా నీకు! 

 ,బాలుడు అయిన అభిమన్యుని విల్లు దొంగచాటుగా నీవు తెగనరికినప్పుడు, అతనిని నిరాయుధుడిని చేసి చంపినప్పుడు గుర్తుకు రాలేదా !.

ఏకవస్త్రను,పాండవుల ధర్మపత్నిని సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు ఏ గాలికి కొట్టుకు పోయింది ధర్మం !.

ద్యూతము ఆడటంతెలియని ధర్మరాజు ను ద్యూతప్రవీణుడయిన శకుని ఓడించిననాడు ( రాజు తో రాజే ఆడాలి ,కానీ అతని ప్రతినిది ఆడాడు) ఎటుపోయింది నీధర్మం ?.

పాండవులను లక్క ఇంటిలో ఉంచి తగులబెట్టిననాడు ఎక్కడ తగలబడ్డదయ్యా? ఆ ధర్మం !

ద్రౌపదీ వస్త్రాపహరణమప్పుడు నీవామెను చూసిన వంకర చూపులు ఏ ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉన్నాయి కర్ణా !.

ఒక్కొక్కమాట కృష్ణుడు అడుగుతుంటే సిగ్గుతో తలవంచిన కర్ణుని శిరస్సును అంజిలకం అనే భయంకరమైన బాణప్రయోగంతో ఖండించివేశాడు అర్జునుడు.

కర్ణుని దేహం నుండి దివ్యతేజస్సు సూర్యమండలం వైపుసాగిపోయింది.

గమనిక

కర్ణుడి వ్యక్తిత్వం పరస్పర వైరుధ్యాలతో కూడుకొన్నది

ఆయన కర్మసాక్షి సూర్యభగవానుడి పుత్రుడు ,దుర్యోధనుడి అధర్మవర్తనానికి అతగాడే సాక్షీ ! .

పుట్టుక రాచపుట్టుక ! వంట్లో ప్రవహించేది క్షత్రియ రక్తం ! పెరిగింది సూతుని ఇంట! .

తల్లి ఎవరో తెలిసినా, పాండవులు తన తమ్ములని తెలిసినా తనకు జీవితాన్ని ,వైభవాన్ని ప్రసాదించిన దుర్యోధనుడే ముఖ్యమనుకున్నాడు .

వైభవమే ముఖ్యం ! జీవితపు విలువలు కాదు అని అనుకున్నవాడు !.

ధర్మమేమిటో తెలిసీ అధర్మానికి కొమ్ముకాశాడు ! .

తల్లి విసిరిపారేసిందన్న కోపం ! ఆ కోపాన్ని అర్ధరహితంగా అర్జునుడి మీదకు మరల్చాడు ! అస్త్ర విద్యలో తనకు పోటీ అతను కాబట్టి! .

వైరుధ్యాల పుట్ట ! కర్ణపాత్ర !

--(())--

*జీవన మాధుర్యం*

మనిషి తన జీవిత కాలంలో ప్రపంచ వ్యవహారాలు నిర్వహించే తీరునే బతుకుగా చెబుతారు. పుట్టుక ప్రపంచానికి ప్రవేశ ద్వారం. మరణం నిష్క్రమణ మార్గం. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. జీవి అంటే ప్రాణంతో ఉన్నది. దేహంలో ప్రాణం ఉన్నంతవరకు జీవుడు. లింగ దేహమనే ఆత్మ ఉన్నంతకాలం మనిషి శివుడే. లింగధారణ చేసి శివారాధనలో జీవితాలను అంకితం చేసినవారు ఆత్మలింగ స్వరూపులుగా గౌరవం పొందుతారు.

రుద్రార్చనలో ముందుగా మహన్యాసం ఉంటుంది. శరీరంలోని అణువణువును రుద్రమంత్రాలతో శక్తిమంతం చేస్తారు. రుద్రమంత్రాలన్నీ వేదవాక్కులే. రుద్రార్చనకు వేదపఠనానికి తేడా లేదు. మహాదేవుడు అంటే దేవతలకే దేవుడు. దేవతలు, రుషులు శివలింగాలను శిరస్సు, కంఠం, బాహువుల్లో  ధరిస్తారని శివపురాణం చెబుతుంది.

కోటి జన్మల పుణ్యఫలమే శివభక్తి అని స్వయంగా శివుడే చెప్పినట్లు శివగీత వెల్లడిస్తుంది. శివభక్తులకు అకాల మృత్యువు రాదంటారు. భక్తి లోపం లేనంతవరకు ప్రాణరక్షణకు ఇబ్బంది ఉండదు. సమస్త గ్రహాలకు, అస్త్రదేవతలకు శివుడే ఆరాధ్యుడు.

మార్కండేయుడి అల్పాయుష్షును అనంతంగా మార్చివేసిన భక్త పరాధీనుడు శివుడు. ఆయన వాక్కే దివ్య శాసనం.

ప్రతి జీవికీ అంతిమ గమ్యం మరణమే. జీవన ప్రయాణం చావుతో ముగిసిపోతుంది. బతుకు తీపి ఉన్నంతకాలం చావు గురించిన ఆలోచనే భయం కలిగిస్తుంది. అయ్యో... అప్పుడే బాల్య, యౌవన దశలు దాటి, వార్ధక్యంలోకి వచ్చేశామా... మరణం ముంగిట ఉన్నామా- అనుకోగానే మనసు దుఃఖంతో బరువెక్కిపోతుంది.

బతుకు ముగిసిపోతోందనే బాధకు బదులు ఈ బతుకులో నేను సాధించినదేమిటి అనే ప్రశ్న వేసుకుంటే, మనం చేసిన పొరపాట్లన్నీ మనసులో మెదులుతాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. మనం అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేస్తే ఎంతో బావుండేది అనుకుంటాం.

విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేసి పెద్దవారయ్యాక, తమ ఆశలకు తగిన ఉద్యోగాలు దొరకనప్పుడు ఇలాగే పశ్చాత్తాపపడతారు. ఉద్యోగులు శ్రద్ధగా పనిచెయ్యకుండా పదోన్నతులు పొందలేరు కదా? చిన్న స్థాయిలోనే ఉద్యోగకాలం ముగిసిపోతుంది. అప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. సకాలంలో ఉన్నత విద్య చదివి, ప్రజ్ఞను పెంచుకుంటే పెద్ద ఉద్యోగం, ఎక్కువ జీతం పొందగల వీలుంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం లభిస్తుంది. సంతానానికి మంచి విద్యతోపాటు ఉత్తమ భవిత  సాధ్యపడుతుంది.

బతుకుబండి ప్రయాణం సాఫీగా, ఒడుదొడుకులు  లేకుండా గమ్యం చేరాలంటే చక్కటి జీవన ప్రణాళిక వేసుకోవాలి. పొదుపు పాటించాలి. అప్పుల తప్పులు చెయ్యకూడదు. ఎవరికీ ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. దుర్విచక్షణ చూపకుండా అందరితో ఆత్మీయంగా సమభావంతో వ్యవహరించాలి. కులమతాలన్నీ కల్పనలే, అడ్డుగోడలే. మనం ఇతరులకు చేసే ఉపకారాలే మన ఆస్తిపాస్తులు.  ఇతరులకు మనం చేసే అపకారాలే శాపాలు.

మనల్ని అందరూ ప్రేమించాలంటే, మనం అందర్నీ ప్రేమించాలి. ఈ జీవన సూత్రం పాటించిన వారికే బతుకు తియ్యదనం అనుభవంలోకి వస్తుంది. జన్మ ధన్యమవుతుంది.

*వ్యామోహంతోనే మనిషి

భగవంతుడు సాధారణ సందేహాలకు సమాధానమయ్యేంత అల్పస్థాయి వాడు కాదు. ఏ ప్రశ్నకూ అందనంత ఉన్నతుడు. మాటలకు ఇమడనివాడు. మనసుకు అందనివాడు. ఆత్మానుభూతికి మాత్రమే అవగాహన అయ్యేవాడు. దేవుడు సమాధానాలకు తావుకాడని, ప్రశ్నలకు అంతకంటే బద్ధుడు కాడని తెలుసుకొన్న జీవుడు.. దేవుడికి సమీపగతుడై వ్యామోహరహితుడు అవుతాడు.

సత్‌, చిత్‌ ఆనందాలు మనలోనే ఉన్నాయి. కానీ, మనకు తెలీదు. నిరంతరం వాటికోసం బయట అన్వేషిస్తూ ఉంటాం. అయినా వెతుకుతూనే ఉంటాం. నిరంతర అన్వేషణలో మనమేమిటో, మనం తెలుసుకున్నప్పుడు ఆనందం మనదవుతుంది. మనం సచ్చిదానందులం అయినప్పుడు, మన దిగుళ్లు, భయాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కనుమరుగవుతాయి. అప్పుడు వ్యామోహరహితమైన స్థితప్రజ్ఞులమవుతాం. దైవానికి దగ్గరవుతాం.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలలో మోహం మిగుల ప్రమాదకారి. ఆ మోహం తీవ్రంగా ప్రకోపిస్తే ‘వ్యామోహం’ అవుతుంది. దానికి‘తృష్ణ’ సమానార్ధకం. ముసలితనం వల్ల శరీరం జీర్ణమైనా వ్యామోహం జీర్ణం కాదు. తత్ఫలితంగా అత్యంత భయంకరమైన పాపబంధాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా పోతుంది.

దారాపుత్రులు, ధన, కనక, వస్తు వాహనాదులు, కీర్తి, ఇత్యాదులపై వ్యామోహం ఉంటుంది. ఈ వ్యామోహంలో అంతర్లీనంగా అధర్మం, అసత్యం, అన్యాయం అత్యధిక శాతం ఉండి మానవాళిని పతనావస్థకు చేరుస్తాయి. మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది. ఆ మచ్చ బాహ్య సౌందర్యాన్ని చెడగొట్టి అంతఃసౌందర్యాన్ని హరించి వేయడానికి వ్యామోహమే ప్రధాన కారణం.

అనంతమైన మన పూర్వానుభవాన్ని మన పురాణాల్లో పూర్వచిత్తి అంటారు. మన ఏకాగ్రతకు భంగం కలిగించే పూర్వ వాసనలూ, జ్ఞాపకాలే పూర్వచిత్తి. ఇది గతానుగతంగా సంభవించే వ్యామోహజనితమని గ్రహించాలి. పరమాద్భుతమైన సాధనోపకరణమైన ఈ ప్రపంచంలో మమతానురాగాల మాయాతెరలు, జిహ్వ చాపల్యాలు, అందమైన సర్పాల్లా ఆకర్షించే ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటివైపూ మనసును నడిపించేది వ్యామోహమే. దానికి బద్ధులం కాకుండా చూసుకోగలిగితే మోక్షసాధన మార్గంలో అనేక బంధాలు తొలగిపోయినట్టే. అందుకే వ్యామోహాన్ని తొలగించుకుని.. మంచికి యజమానులం అవుదాం. అంతే తప్ప చెడుకు బానిసలం కావద్దు.

,............................


*సుగుణ భూషణం*

భౌతిక సంపదలకన్నా సుగుణ సంపద గొప్పది. ధన ధాన్య రాశులు ఎన్ని ఉన్నా పాప భీతి నశించిన భోగానుభవం ప్రమాదకరం. రావణాసురుడు స్వర్ణ లంకను పరిపాలించాడు. కుబేరుణ్ని జయించి అంతులేని సంపదలు సమకూర్చుకున్నాడు. వేదాల్లో పాండిత్యం సంపాదించాడు. శాస్త్రజ్ఞానాన్ని ఎరుకపరచుకొని పంచభూతాలను తన నియంత్రణలోకి తెచ్చుకొన్నాడు. ఆయుర్వేదంలో ప్రజ్ఞ కలిగి రావణ సంహిత రచించాడు. గొప్ప శివ భక్తుడు. అయినా... ఒకే ఒక తప్పు... సీతాపహరణకు పాల్పడి- మానవుడి చేతిలో మరణించాడు. సౌశీల్యం లోపించిన పుస్తక జ్ఞానం, మానవత్వాన్ని మరచిన శాస్త్ర విజ్ఞానం, సిద్ధాంతాలను విస్మరించిన పాలన మూలాన- సుగుణాల కారణంగా లభించే ఘన కీర్తిని ఎవరూ ఆస్వాదించలేరు. వినమ్రతను మించిన తపః సాధన లేదంటారు. సద్గుణాల కారణంగా లభించిన గౌరవానికి మించిన ఉత్కృష్టత లేదు. దయను మించిన సుగుణం ఉండదు.

మనకు శారీరక బలం ఉన్నప్పుడు ఎదుటివాడిని ఓడించడం సులువే. కానీ అతణ్ని గెలవడమే కష్టం. సుగుణశీలురు ఎన్నడూ ఇతరులను, శత్రువునైనా సరే- అణగదొక్కాలని అనుకోరు. పైకి తేవాలనే ప్రయత్నిస్తారు. వసిష్ఠుడు విశ్వామిత్రుణ్ని బ్రహ్మర్షిని చేశాడు. మొదట్లో తనతో యుద్ధం చేసిన విశ్వామిత్రుడి వెంట యాగ రక్షణ కోసం రామ లక్ష్మణులను పంపడంలో వసిష్ఠుడు కీలకపాత్ర వహించాడు. సుగుణాలు గలవారికి అసూయా ద్వేషాలు ఉండవు. గుణవంతుల్లో ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్షణం. లోకంలో ఇదే అత్యుత్తమ సన్మార్గం. గుణ హీనులు పక్కదోవ పట్టిస్తారు. సుగుణాల్లో అద్భుత దైవత్వం ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ దైవత్వాన్ని వెతికి పట్టుకోవాలి. అందుకోసం గుణవంతులతో స్నేహం చేయాలి. విభజించి పాలించడం ఒక పరిపాలనా సూత్రం అయితే కావచ్చు.... కానీ అది గుణహీనుల సూత్రం. సద్గుణాలు గలవాడు ఒక్కడే అయినా నలుగురితో కలిసిమెలసి ముందుకు నడిపిస్తాడు. గాంధీజీ చేసింది ఇదే. అందుకే ఆ సుగుణం అంత మంచి ఫలితాలను ఇచ్చింది. జాతి భవితనే మార్చింది. మంచి నడత, క్షమ, ధైర్యం, కృతజ్ఞత అనేవి సుగుణ రాశులు. ఇందులో కృతజ్ఞత విచిత్రమైంది. కృతజ్ఞతను చూపకపోవడం, కృతజ్ఞతను చూపమని అడగడం... రెండూ పొరపాటే. మనం ఏదైనా పొందినప్పుడు కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. కానీ ఇంతకంటే ఉన్నతమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఇచ్చేటప్పుడు చూపాల్సిన కృతజ్ఞత. మనం చేసేది సహాయం కాదు, సేవ అనే అనుభూతి కలిగినప్పుడు ఆ కృతజ్ఞత మనకు అలవడుతుంది.

సుగుణాలను సాధన చేయాలి. సుగుణ భూషణుడనిపించుకునేందుకు తహతహలాడాలి. దుర్గుణాలు మనిషిని నీచస్థితికి దిగజారుస్తాయి. కామం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషంలాంటి భయానక స్థితి మరొకటి లేదు. మూర్ఖత్వం లాంటి బంధం ఇంకొకటి లేదు. దురాశ లోతు తెలియని వరద లాంటిది. అందుకే వీటికి దూరంగా ఉంటూ సుగుణాలన్నింటినీ పట్టుదలతో సాధన చేయాలి. కోపం, అసహనం... మన పైనే మనం ప్రయోగించుకోవాలని బుద్ధుడు చెబుతాడు. ఎందుకంటే అవి గొప్ప సుగుణాలే అవుతాయి. సుగుణభూషణుడు తాను పొందిన కష్టాలను నీటిపై రాసుకోవాలి. తాను పొందిన కరుణను రాయిపై రాసుకొంటాడు. దైవం మనకు ప్రసాదించిన వాటిపట్ల మనం కృతజ్ఞత చూపితే దైవం మనకు మరింతగా ప్రసాదిస్తాడు. ఎందుకంటే సుగుణభూషణుల పట్ల అంతర్యామి సదా అనురాగ హృదయుడై ఉంటాడు!

ఈనాడు అంతర్యామి

- అప్పరుసు రమాకాంతరావు

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.
ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావ్​. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీ కృష్ణుడు అంతరార్థం. -




1 comment: