Sunday, 21 February 2021

22--02--2021

 
Art - India: maritana — LiveJournal

 

నిత్యమంగళ - ర/న/య/జ/న/గ 
 UI UII IIU - UI UII IIU
నేటి కవిత్వం - సరసా 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


విన్నపాలను వినగా - బ్రేమ పారు అమృతమే 
చిన్న చేష్టలు వదిలై - భ్రాత మాట సుకృతమే 
కన్న వారును నుడిరా - ప్రాణమే సమ కృతిగా  
వెన్న నీ హృది యవగా - బ్రీతి యౌనుగ ఘృతమై 


కాల మాయయు ఇదియే - కాపు కాయుట వలదే  
మాట మోసము కాదుగా - మూగ గుండుట దెనికే     
మాయ చేసిన మనిషే - మోటు వానిగ అనకే 
తీరు మారును ఇపుడే  -  తేరు కోవుట కథలే 

నిన్ను చూడగ మనసే -  నేడు పొంగెను చెలియా 
కన్ను కొట్టకు  ఇపుడే  -  వాద మెందుకు సఖియా 
మిన్ను తక్కువ చెయకే - శబ్ద  భేదము  దెనికే     
మన్ను తింటిని ఇపుడే  -  పాశ  మన్నది  కరువే 


నిత్యమంగళ మిదియే - బ్రేమ రాగపు మదిలో 
సత్య వాదిగ వినుమా  -  నీవు నాకొక  నిధిరా 
పత్య మెందుకు ఇపుడే - నీవు నాకిక  మదిరా 
తత్వ మేదియు లేదురా  -  దూరముండేది నెలరా 

ప్రేమ సంద్రపు టలలా -  కామ మోహిని  కలలా 
శ్వేత  పుష్పము కమలా -  అంద మంతయు వలలా 
బుద్ధి మంచిది విమలా  -  బ్రాంతి నొందకు భ్రమలా 
లాలి పాడెద  సరసా   - రా పరుండుము వడిలో 

***** 

తేదీ : 22-02-2021 సోమవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#భీముని_ఏకాదశి_వ్రతము
సంవత్సరములో వచ్చు పన్నెండు మాసము లలోనూ #మాఘ_మాసము అతి ప్రశస్తమైనది. అటువంటి #మాఘ_మాసము లో నదిలో గాని, నది లేనిచోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని యెడల నూతి వద్ద గానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును.
పూర్వం అనంతుడను విప్ర పుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారములో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.
అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, యితరులకు పెట్టడు.ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. "అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని.. ధనము, శరీర బలము వున్నదను మనోగర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్య మొక్కటియు చేయలేక పోయినాను గదా" అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని యింటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.
అనంతుడు నిద్రనుండి లేచి చూడగా, అతని సంపదంతా అపహరింపబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి.. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయము ననే #మాఘ_మాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి సానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలo దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను.. చలికి గడగడ వణికి బిర్రబిగసి పోవుచూ 'నారాయణా' అని ప్రాణములు విడచినాడు. ఆ ఒక్క రోజు దివ్యమైన నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములన్నియు నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను అని వశిష్టుడు తెలియజేసెను.
పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు.. బండెడన్న మయినను చాలదు. అటువంటి భీమునకు యేకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో యుండెను. అదేమందువా! ఏకాదశీనాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదు కదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి.. ఓ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు గదా దాని విశిష్టత యేమి" అని భీముడు అడిగెను.
అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు "అవును భీమసేనా! ఆరోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును యేకాదశీ వ్రతము చేయవచ్చును" అని పలికెను. సరే నేను అటులనే చేయుదును. గాని, "విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగధ్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండెను. కావున ఆకలి దాహము తీరులాగున, యేకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము" అని భీముడు పలికెను.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి "రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము.. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ద ఏకాదశి మహాశ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశీ సమానమగునది మరి ఏమియులేదు. సంవత్సరము నందు వచ్చు 24 ఏకాదశులలో మాఘ శుద్ద ఏకాదశి మహాపర్వదినము గాన, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యే మాత్రమును సంశయము లేదు. కాన, ఓ భీమసేనా! నీవు తప్పక మాఘ శుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యే మాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు" అని వివరించెను.
ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని "భీమ ఏకాదశి" అని పిలుతురు. అంతియే గాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘ మాసమందే వచ్చును. కాన #మహా_శివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజుతో నిటుల పలికిరి.
ఏకాదశి మహావిష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో, అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి. దీనినే '#శివరాత్రీ యని అందురు. అది యీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము.. మాఘమాస మందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి దీనినే '#మహా_శివరాత్రి" అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందువచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షములో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో గాని, తటాకమందు గాని లేక నూతివద్ద గాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించ వలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసిన యెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలయును.
మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు బోవుట, జంతువులను చంపి, వానిని కాల్చి, తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు.. క్రూరమృగములు సైతం ఆ బోయవానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినము వలెనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియు కంటబడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయిన అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలదీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి.. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట యివన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.
జరామరణములకు హెచ్చుతగ్గులు గాని, శిశువృద్ధ భేదములు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమధూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.
శివుడు-పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతట యముడు, "మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగా నున్నాడే గాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు.. కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యము దొరకునా" అని యముడు విన్నవించుకున్నాడు.
 "యమధర్మరాజా! నాకు ప్రీతికరమగు #మహా_శివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుజ్యము ప్రాప్తమైనది" అని పరమేశ్వరుదు వివరించెను..
ఇతి శ్రీ మాఘ పురాణం ఏకాదశ అధ్యాయం పారాయణం సంపూర్ణం..
 --(())--

మహాభారతం ఆదిపర్వం 22 వ భాగం
"""""""""""''''"""""""""""""""""""'''''"""''''""'''''"""""""'""'
తనపై అలిగి కోపంతో వెళ్ళిపోతున్న దుర్యోధనుని వెనక్కి పిలిచి ధృతరాష్ట్రుడు బుజ్జగిస్తూ ఇలా అంటున్నాడు " నాయనా మాన ధన ! నీవు పుట్టిన నాడే జ్యోతిష్కులు నిన్ను  వంశ క్షయ కారకుడని  వదిలిపెట్టమని నిన్ను పారవేయమని నాకు సలహా ఇచ్చారు... వారి మాట కాదని నీ పై మమకారంతో తో ప్రజలంతా వద్దు వద్దు అంటున్నా పసికందు వైన నిన్ను వదల లేక  పెంచుకున్నాను....
కారణం ఏమిటో తెలుసా నీవంటే ప్రాణం కనక.
ఆనాడే పెద్దల మాటను ధిక్కరించాను కేవలం నీ కొరకే
నీకోసం నేను ఏదైనా చేస్తాను  ఏం కావాలో చెప్పు !
నాకు చెడ్డ పేరు వచ్చి నా కీర్తి మంటగలిసిన సరే నీ కొరకు దానిని త్యాగం చేస్తున్నాను చెప్పు నేనేం చేయాలి.".. అని ధృతరాష్ట్రుడు తన కొడుకైన దుర్యోధన తో పలకగా....
దుర్యోధనుడు తండ్రితో ఇలా అన్నాడు " తండ్రి నా ఆవేదనను అర్థం చేసుకో ...
నీ కీర్తిని మంట గలపాలన్నది నా ఉద్దేశ్యం కాదు ఆ అపకీర్తి ఏదో మేమే తెచ్చుకుంటాం. నీ తమ్ముని కొడుకులు నీకు ప్రేమ పాత్రులు కావచ్చు కానీ నా దృష్టిలో వారు ఎప్పుడూ శత్రువులే... మమ్మల్ని వారి దాసులుగా ఉండే దీనస్థితి నుండి రక్షించు ఇది నీ చేతిలోని కార్యమే.... తండ్రి నీకు అపకీర్తి రాకుండా ఒక పని చేయండి  
     తండ్రీ ! ప్రజాభిమతం మార్చడానికి కొంతకాలం పాండవులను వారణావతం పంపుతాము. ప్రజలు కొంత మరచిన తరువాత వారు తిరిగి వస్తారు . ఈ వ్యవధి కాలంలో నేను మంచి పనులు చేసి ప్రజల అభిమానం సంపాదిస్తాను. క్రమక్రమంగా ప్రజలు వారిని మర్చిపోతారు మార్పు అన్నది ఎవరికైనా సహజం కదా ! చీకటిలో నక్షత్రాలు అద్భుతంగా ప్రకాశిస్తాయి . తెల్లవారగానే సూర్యుడి కాంతి ముందు అవి కనబడకుండా పోతాయి. ఆ విధంగా నేను ప్రజలకు చేసే మంచి పనుల వల్ల పాండవుల కీర్తి ప్రజలకు కనిపించదు. కనుక పాండవులను ప్రజలకు కొంత కాలం కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండేటట్లు చేయండి ఇది ఒక్కటి చాలు " అని అన్నాడు. అందుకు దృతరాష్ట్రుడు " సరే నీవు చెప్పింది బాగానే ఉంది కానీ....ఏ కారణం లేకుండా వారిని వారణావతానికి పంపడానికి ...  ఏ విధంగా వీలవుతుంది ?! దీనికి భీష్మద్రోణ విధుర అశ్వత్థామ కృపులు  అంగీకరిస్తారా ?!... సాధ్యం కాదు " అన్నాడు.
అందుకు దుర్యోదనుడు " మీ ఆజ్ఞ మీది గౌరవం చేత భీష్ముడు ద్రోణుడు మొదలైనవారు దీనికి అంగీకరిస్తారు. వారు పాండవులపట్ల సమభావం కలవారై ఉన్నప్పటికీ, వారంతా నా వారే.  ఎట్లనగా అశ్వత్థామ నావాడు కనక నన్ను వదిలి పోడు. కొడుకు మీద ప్రేమ చేత ద్రోణుడు... చెల్లెలి భర్త అయిన ద్రోణుని వదల లేక కృపుడు నా వైపే ఉంటారు నన్ను విడిచి పోలేరు. భీష్ముడు మధ్యముడు కనక పాండవుల వైపు వెళ్ళడు.  విదురుడు పాండవ పక్షపాతియే. కానీ అతడొక్కడు నాకు కీడు తలపెట్టలేడు . కనుక ఈ కార్యక్రమంలో ఎటువంటి లోపం రాదు. నాకు నిద్ర లేకుండా చేసే ఈ గుండె లోని ముల్లును  తీసి... జీవితంలో నన్ను పైకి తీసుకురండి." అని చెప్పి చిట్టచివరికి బలవంతంగా తండ్రి ని ఒప్పించాడు దుర్యోధనుడు. . గత్యంతరం లేక దృతరాష్ట్రుడు అందుకు అంగీకరించాడు.
పాండుసుతులు వారణావతానికి వెళ్ళుట లక్కాగృహ దహనం
తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపటోపాయం అమలులో పెట్టాడు... మంచి నేర్పరులు తనకు నమ్మకస్తులైన మంత్రులను పిలిచి " మీరు పాండవులు వినేటట్లు గా వారణావతం గూర్చి గొప్పగా చెప్పండి మీరు చెప్పింది విని వారు దానిపై ఆసక్తి పెంచుకోవాలి అది విషయం..." అని ఆజ్ఞాపించగా....
వారు పాండవులు వినేటట్లు గా వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పారు. గొప్పగా వర్ణించిబడిన వారణావతమును చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది...
. కొంతకాలం తర్వాత ఒక నాడు దృతరాష్ట్రుడు కొడుకైనా దుర్యోధనుని చెడు మాటలు మనస్సుకు పట్టిన వాడై పాండవులను పిలిచి , ఆప్తుల యెదుట కన్నీరు నింపుకున్న వాడై వారితో ఇలా అంటున్నాడు"నాయనా ధర్మరాజా ! మీ తండ్రి పాండురాజు కన్నా ఉత్తమ భక్తి గల మిమ్మల్ని నేను ఒకటి ఆజ్ఞాపిస్తున్నాను ... నీతండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు. కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు మీ తమ్ములు తండ్రికి తగిన తనయులు. ఇంత కాలం రాజ్యభారాన్ని మోసి అలసి పోయారు  వారణావతంలో మీ తల్లితో కలిసి కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి. గంగా తీరాన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రథమైన నగరం అని విన్నాను. నా మాట కాదనరు కనుక నేనిది చెప్తున్నాను ...
నీ తండ్రి పాండురాజు కు మరియు పరమశివునికి మిక్కిలి ప్రీతిపాత్రమైన వారణాసిలో ... అర్హులైన వారికి సజ్జనులకు బ్రాహ్మణులకు   హిరణ్య గోదానాలు చేసి మంచి వ్రతాలు ఆచరించి దైవ కరుణను సంపాదించండి " అన్నాడు.
 పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించ లేక ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచారుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని, తమ్ములను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనంద పడ్డాడు. పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగులపెట్టు. వారి మరణ వార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించ వచ్చు. అని అతనిని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు.
మిత్రులందరికీ శుభ శుభోదయం
 

ఉచితంగా అంటే

 ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,
నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,
కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!
ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు,
అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
ప్రొఫెసర్ ok అన్నారు...
మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లో,average ర్యాంక్ B వచ్చింది అందరికి,

2 nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,

ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
చదువు తక్కువ చదివే స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,

ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,

1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,
కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు,

2. ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే
మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,

3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,
ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,
4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,

సగం మంది ప్రజ
లు మేము కష్టపడటం ఎందుకు,
అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,

మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,
ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది..
పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నలుగురితో చర్చించండి...దేశం కోసం...రేపటి తరాల కోసం.....

 --(())--

మధురిమలు ..... వడిలో
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విన్నపాలను విని యే  
బ్రేమ పారు అమృతమే
చిన్న చేష్టలు కలయే  
భ్రాత మాట సుకృతమే

కన్న వారుకు మదియే
ప్రాణమే సమ కృతిగా  
బ్రీతి యౌనుగ ఘృతయే
వెన్న నీ హృది మయగా    

కాల మాయయు ఇదియే
 కాపు కాయుట వలదే  
మాట మోసము కథయే
మూగ గుండుట వలదే
      
మాయ చేసిన మనిషే   
మోటు వానిగ అనకే
తీరు మారే మనిషే    
తేరు కోడని అనకే  

నిన్ను చూడగ మనసే  
నేడు పొంగెను చెలియా
కన్ను కొట్టకు  వరుసే     
వాద మెందుకు సఖియా
 
మిన్ను తక్కువ చెయకే  
శబ్ద  భేదము  దెనికే     
మన్ను తింటిని అనకే   
పాశ  మన్నది  మనకే  

నిత్యమంగళ మిదియే  
బ్రేమ రాగపు మదిలో
సత్య వాదిగ ఇదియే    
నీవు నాకొక  యదలో
 
పత్య మెందుకు ఇపుడే  
నీవు నాకిక  మదిరా
తత్వ మేదియు ఇపుడే   
దూరముండేది నెలరా

ప్రేమ సంద్రపు టలలా   
కామ మోహిని  కలలా
శ్వేత  పుష్పము కమలా   
అంద మంతయు వలలా

బుద్ధి మంచిది విమలా    
బ్రాంతి నొందకు భ్రమలా
లాలి పాడెద  కలలా    
రా పరుండుము వడిలా  

*****

🏵️🖋️అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: అమృతం.. అమ్మ భాష🌸🖋️

శిశువు తొలిసారిగా తానొక భాషను నేర్చుకుంటున్నామనే జ్ఞానం కూడా లేనప్పుడు, తనలో ఉన్న అనుకరించడం అనే సహజ ప్రవృత్తి తో తన పరిసరాలలోని వారి భాషని
అనుకరిస్తూ, జీవితంలో తొలిసారిగా
నేర్చుకునే భాష "మాతృభాష".
శిశువు సౌందర్య దృష్టిని ,తన లోని
భావాలను,తనఆనందానుభూతిని
వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది
మాతృభాష.

మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.

గ్లోబలైజేషన్​ వల్ల కొన్ని భాషలకు ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. కొన్ని వేల భాషలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

ఫిబ్రవరి 21నే అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు?

1948 లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూను పాకిస్తాన్ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్ ప్రజలు అభ్యంతరం తెలిపారు.తూర్పు పాకిస్తాన్ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారు.1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారు.ఉద్యమం పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం చివరకు దిగి వచ్చింది. 1954 మే 8 న పాకిస్తాన్ రాజ్యాంగ సభలో బెంగాలీని రాష్ట్ర భాషలలో ఒకటిగా స్వీకరించారు.
యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని
యునెస్కోకి ఎన్నికైన బంగ్లాదేశ్.. మాతృభాషా దినోత్సవం గురించి ప్రతిపాదించగా ఐక్య రాజ్యసమితి మద్దతుతో – 1989 నవంబర్ 17న యునెస్కో ఆమోదించింది. అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించాలని యునెస్కో తీర్మానించింది. ప్రజలు తమ మాతృభాషలోని మాధుర్యాన్ని గుర్తు చేసుకోవాలని, ఆయా భాషల వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ‘యునెస్కో’ ప్రకటించింది.

తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం:

ఇటాలియన్‌‌‌‌ ఆఫ్ ద ఈస్ట్’గా పిలిచే తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 8వ, 7వ శతాబ్దంలో రచించిన ఐతరేయ బ్రాహ్మణంలో తెలుగు పదాల ప్రస్తావన ఉంది. ఆంధ్ర, తెనుగు, తెలుగు అనే మూడు పేర్లతో పిలిచే తెలుగు.. తెనుంగు, తెనుగు, తెలుగు, త్రిలింగ అనే ఐదు వ్యవహారాల్లో పిలిచేవారు. పోర్చుగ్రీసు వాళ్లు 8వ శతాబ్దంలో మన భాషను ‘జెంతూ’ అన్నారు.
యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నది. దేశం వెుత్తం మీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే.
ప్రపంచ భాషలలో ఎట్టి శబ్దాన్నైనా తనలో జీర్ణించుకోగల సత్తా, ఏ శబ్దాన్నైనా ఉచ్చరింపజేయగల శక్తి అటు సంస్కృతానికీ ఇటు తెలుగుకు తప్ప మరే భాషకూ లేదు.
సాహిత్య వారసత్వ సంపదకు, జాతి మనుగడకు మాతృభాష ఎంతో దోహదం చేస్తుంది.
అటువంటి మాతృభాషను అపురూపంగా చూసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సామాన్య ప్రజలు కూడా మాతృభాష లోనే భావ వ్యక్తీకరణ ద్వారానే ఒకరికొకరు దగ్గరవుతారనేది సత్యం .


ఎంత చక్కనిదోయి ఈ తెలుగు భాష
ఎంత మధురమోయి ఈ తీపి మాట
ఎంత నాణ్యత గలది ఈ భాష నడక
ఎంత రమ్యత గలది ఈ తెలుగు రూపం
సీమ యాసలో విన్న, తెలంగాణ యాసైన
తీర కోస్తా తెలుగు ఇంపుగ విందులు గూర్చు
సొగసులు విరిసే స్వరాంత భాషగదా!
సర్వ సరాగాలు కురిసే సుమరాశి గదా!
సురల రుచిరాజి ఈ తీపి భాష
గిడుగు గురజాడల వాడుకల్లో
ముత్యాల సరాల మూటల్లో
దళిత జన పలుకుల్లో
కూలక్కల చెమట పాటల్లో
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు భాష!

ఇంగ్లిష్ భాష నేర్చుకోవటం అన్నది అవసరం మాత్రమే, విజ్ఞానవంతులు అవ్వడానికి ఉపయోగపడాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు
సుసంపన్నమైన మన భాషాసాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను,సంస్కృతినీ కాపాడుకోవడం ,భావి. తరాల వారికి దీనిని  అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం మనఅందరి కర్తవ్యం.

ఆ దేశంలోతెలుగుకున్న క్రేజ్ అంతాఇంతా కాదు

ప్ర‌పంచ వ్యాప్తంగా స్థిర‌ప‌డ్డ తెలుగు వాళ్ళ‌లో మారిష‌స్‌లో ఉన్న‌వారిది ప్ర‌త్యేక స్థానం. అక్క‌డ 30 వేల‌మందికి పైగా తెలుగువాళ్లు ఉంటారు.
వారంతా 1835 ప్రాంతంలో బ్రిటిష్ వారి ద్వారా అక్క‌డ‌కు వెళ్ళి స్థిర‌ప‌డ్డారు. క్ర‌మంగా వారు స్థానిక మారిషియ‌న్ క్రియోల్‌ని మాతృ భాష‌గా చేసుకున్నారు. త‌మ పూర్వీకుల‌ భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ త‌మ మాతృ భాష అని చెప్పుకోవ‌డం వారి ప్ర‌త్యేక‌త‌! వారు ఇళ్ల‌లో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటారు. అయినా వారికి తెలుగు మీద ఆస‌క్తి, అభిమానం ఉన్నాయి.
అక్కడి కొత్త త‌రం చాలా ఆస‌క్తిగా తెలుగు నేర్చుకుంటోంది. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి యూనివ‌ర్సిటీ వ‌ర‌కూ తెలుగు నేర్చుకునే అవ‌కాశం ఉంది. అక్క‌డి వారు తెలుగు సినిమాలు చూస్తుంటారు. మారిష‌స్ అధికారిక టీవీ చానెల్లో కూడా వారానికి ఒక తెలుగు సినిమా వేస్తారు. డీడీ యాద‌గిరి చానెల్ మారిష‌స్‌లో వ‌స్తుంది.
ఇక తెలుగు వారికోసం చాలా సంస్థ‌లు ఉన్నాయి. ఆ సంస్థల ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఉత్స‌వాల్లో అంద‌రూ తెలుగులోనే మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తారు. భాషే కాదు, సంస్కృతిపై కూడా వారికి ప్రేమ ఉంది. కూచిపూడికి మారిష‌స్‌లో ఆద‌ర‌ణ ఉంది.
 

==(())==

మధురిమలు ...శివోహం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శంకర శూలపాణియే
వినాశన  కారకడవే
సకలమ్మును రక్షణయే
దళముకు లోంగు వాడివే

ఆత్మ విలాప శివాయే  
వాసిగ దయ చూపు శివే
గుండెనే గుడి చేసియే
చిత్తమును మురిపించవే   

భక్తికి శివ లొంగుటయే
నాగ భూషణ దారివే  
ప్రణవమునే చదువుటయే
ఆది మధ్యాం తరుడివే          

గంగా ధరా కరుణయే
నాపైన కురిపించవే
తడిసి ముద్దై తరుణయే
ధన్యుణ్ణి గా చేయవే

శూలపాణివి నీవుయే
మాపై కన్ను ను ఉంచవే
మృత్య మార్గము మిదియే
కర్మ సర్పము అపవే

భ్రమరాంబతొ కలిసియే
బిరా మమ్మే చూడవే
గరళ కంఠా దారియే
బంధాలు తెప్పించవే

కరి చర్మము ధారివియే
కడచేర్చే వాడివే
నీఅండ అవసరముయే
మాకర్మ సరిచేయవే

నిటలాక్ష నీ చూపుయే
నావైపు మళ్ళించవే
జ్ఞాన మార్గము నెరిగియే
నడుస్తున్న ఆదుకోవే

--(())--

కొబ్బరి నూనెను మీ పాదాలకు అరికాళ్ళకు  రాసుకుని మసాజ్  చేయండి.

 1. *ఒక తాతకు 87 సంవత్సరాల వయస్సులో కూడా తలనొప్పి గానీ, వెన్నునొప్పి గానీ, కీళ్ల నొప్పులు, దంతాల సమస్య లేదు. కొబ్బరి నూనెను వాడడమే అతని ఫిట్నెస్ కు మూలకారణం.

2. *మణిపాల్‌కు చెందిన ఒక విద్యార్థి మాట్లాడుతూ, కొబ్బరి నూనెను అరికాళ్ళకు రాసుకోవాలని నా తల్లి పట్టుబట్టేది.  చిన్నతనంలో నా దృష్టి బలహీనపడిందని చెప్పారు. అమ్మ ఈ ప్రక్రియను కొనసాగించినప్పుడు, నా కళ్ళ దృష్టి క్రమంగా పూర్తిగా, ఆరోగ్యంగా బాగుపడింది.

 3. *కేరళ కు నేను సెలవు కోసం వెళ్ళానని ఒక పెద్దమనిషి రాశాడు. నేను అక్కడ ఒక హోటల్‌లో పడుకున్నాను. నేను నిద్ర  పోలేకపోయాను. నేను బయట నడవడం ప్రారంభించాను. ఆ రాత్రి బయట కూర్చున్న ముసలి కాపలాదారు నన్ను "ఏమిటి విషయం?" అని అడిగాడు. నాకు నిద్ర రావటం లేదు అని చెప్పాను! "మీ దగ్గర కొబ్బరి నూనె ఉందా?" అని అడిగాడు. నేను ఏం చెప్పలేదు, అతను వెళ్లి కొబ్బరి నూనె తెచ్చి, "మీ పాదాలకు అరికాళ్ళకు కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి" అని అన్నాడు.  నేను నిద్రలోకి వెళ్ళిపోయాను.

4. *నాకు కడుపు సమస్య వచ్చింది. కొబ్బరి నూనెతో నా అరికాళ్ళకు మసాజ్ చేసిన తరువాత, నా కడుపు సమస్య 2 రోజుల్లోనే నయమైంది.

5. *నేను గత 15 సంవత్సరాలుగా ఈ ట్రిక్ చేస్తున్నాను. ఇది నాకు బాగా నిద్రపోయేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో నా పిల్లల అరికాళ్ళను కూడా మసాజ్ చేస్తాను.  ఇది వారిని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. *నా కాళ్ళు ఎప్పుడూ వాపుతో ఉంటాయి. నేను నడుస్తున్నప్పుడు నేను అలసిపోతాను. నేను రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనె మసాజ్ ప్రక్రియను నా పాదాల అరికాళ్ళపై ప్రారంభించాను. కేవలం 2 రోజుల్లో, నా కాళ్ళ వాపు మాయమైంది.

7. *ఇది అద్భుతమైన విషయం, *విశ్రాంతి కోసం నిద్ర మాత్రల కంటే ఈ చిట్కా మంచిది. ఇప్పుడు నేను ప్రతి రాత్రి నా పాదాలకు, అరికాళ్ళకు కొబ్బరి నూనె రాసుకుని మసాజ్ చేసుకుంటూ నిద్రపోతాను.

8. *మా తాతకు తలనొప్పి, పాదాలకు మండుతున్న అనుభూతి,  ఉన్నాయి. కొబ్బరి నూనెను తన అరికాళ్ళపై రాయడం ప్రారంభించే సమయానికి, నొప్పి పోయింది.

9. *నాకు థైరాయిడ్ వ్యాధి వచ్చింది. నా కాళ్ళు అన్ని వేళలా దెబ్బతింటున్నాయి. గత సంవత్సరం ఎవరో రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను పాదాలకు, అరికాళ్ళకు మసాజ్ చేయాలని సూచించారు.  నేను శాశ్వతంగా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటున్నాను.

10. *నాకు పన్నెండు సంవత్సరాల క్రితం హేమోరాయిడ్స్ వచ్చాయి. నా స్నేహితుడు నన్ను 90 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒకతను వద్దకు తీసుకువెళ్ళాడు. కొబ్బరి నూనెను అరచేతులపైన, వేళ్ళమధ్య, వేలుగోళ్ల మధ్య, గోళ్ళపై రుద్దమని ఆయన సూచించారు మరియు ఇలా అన్నారు: నాభికి నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె రాసుకుని నిద్రపోండి. నేను అతని సలహాను అనుసరించడం ప్రారంభించాను.  నాకు చాలా ఉపశమనం కలిగింది.  
11. *ఈ చిట్కా నా మలబద్ధకం సమస్యను కూడా పరిష్కరించింది. నా శరీర అలసట కూడా మాయమైంది. గురకను నివారిస్తుంది.

12. *చిన్నప్పటి నుండి నా కాళ్ళు, మోకాళ్ళల్లో నొప్పి వస్తుండేది. ఇప్పటికీ నేను రోజూ కొబ్బరి నూనె నా పాదాలకు, అరికాళ్ళకు రాసుకుని,  మసాజ్ చేస్తుంటాను, నాకు మంచి నిద్ర వస్తుంటాది.

 13. చాలా సంవత్సరాల నుండి నాకు వెన్నునొప్పి వచ్చింది, నేను పడుకునే ముందు కొబ్బరి నూనె  నా కాళ్ళ మీద రాసుకుని మసాజ్ చేసుకోవడం  మొదలు పెట్టినప్పటి నుండి, నా వెన్నునొప్పి పూర్తిగా తగ్గిపోయింది, నా నిద్ర బాగా మెరుగుపడింది.

దక్షిణ భారత రహస్యం ఈ క్రింది విధంగా ఉంది:

రహస్యం చాలా సులభం:
"మీరు కొబ్బరి నూనెను మాత్రమే వర్తించనవ
సరం లేదు రాయనవసరం లేదు. మీరు ఏదైనా నూనె, ఆవాలు, ఆలివ్ మొదలైన నూనెలతో పాదాలపై,  అరికాళ్ళపై, మొత్తం పాదాలకు రాసుకోవచ్చు, ముఖ్యంగా అరికాళ్ళపై మూడు నిమిషాలు, పాదాలకు మూడు నిమిషాలు.

అరికాళ్ళపై 100 ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి.
 మానవ అవయవాలను నొక్కడం మరియు మసాజ్ చేయడం ద్వారా కూడా నయం చేస్తారు.
ఫుట్ రిఫ్లెక్సాలజీ

==(())==

మధురిమలు .. అమ్మలగన్న అమ్మ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శక్తి అందించవమ్మా
దీవెనలే  అండమ్మా
జన్మల బంధం మమ్మా
తప్పులే సరిదిద్దమ్మా

జీవి పరమార్ధమమ్మా  
మనిషిని  కరుణించమ్మా
మూర్ఖున్ని మార్చవమ్మా
మనిషిగ నమ్మితి నమ్మా

విద్యే మాకివ్వమ్మా
మమ్ము సహకరించమ్మా
నీవుయే లక్ష్యమమ్మా
నన్ను క్షమించు మమ్మా

స్వేదము చిమ్మతి మమ్మా
నిను సేవించితినమ్మా
మది ముక్కలయ్యె నమ్మా
భక్తితో పూజలమ్మా

 పురుషోత్తమ సతివమ్మా
 పరమాత్ముని సతివమ్మా
 పరమేశ్వర సతివమ్మా
 గొల్చుటయే సమమమ్మా

 అమ్మా శక్తి ఇవ్వమ్మా
 కొండంతే అండమ్మా
జన్మల బంధం మమ్మా
తప్పులే సరిదిద్దమ్మా

--(())--

ఇంట్లో మగవాడి  కర్తవ్యం:
1)  స్టవ్ మీదున్న కుక్కర్ వేసే 3 విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.
 2)  స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే తెలివిగా స్టవ్ ఆఫ్ చేయడం.
3)  డోర్ బెల్ అటెండ్ అవ్వడం.
 4)    అటకపైన  పెట్టిన సామాను  కిందికి దించడం.*
 5)   గట్టిగా మూత బిగించినవి తీసివ్వడం
 6) సాస్, జామ్ మూతలు  ఓపెన్ చేసి ఇవ్వడం.
 7) ఇంట్లో  బల్లి, బొద్దింకలవంటి భయంకరమైన  జీవులను కొట్టి బయట పడేయడం.
 8) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.
9)    భార్య చెపితే మాత్రమే పిల్లలను  తిట్టి కంట్రోల్ చేయడం.
10)  డోర్  దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్  వెంటనే  చదివేయాలి లేదంటే,'పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ ' అని నిందిస్తుంది.
11)  షాపింగ్ చేసేటప్పుడు    నసపెట్టకుండా  భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి  వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.*1*2)  *ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్ ప్లంబింగ్ పనులు చేయడం.
13) టాయిలెట్ క్లీన్ చెయ్యటం
14) తనని అందంగా ఉన్నావని పొగుడుతూ ఉండటం
15) సీరియల్స్ నడిచేటప్పుడు నిశ్శబ్దముగ ఉండటం
16)ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్ సరిఅయిన టైం కి కట్టి తనకు కోపము రాకుండా చూసుకోవడం*17) *కూరగాయలు తరిగి ఇవ్వటం
18) కొబ్బరికాయ పీచు తీసి ఇవ్వటం*19) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం
20) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం.
  ఈ 20  పనులు చక్కగా నిర్వహించడం  భర్త కర్తవ్యం.

--(())--

సమ్మోహనాల. హత్యలు (1271..1280)

ఇది ఏమి లోకమ్ము
లోకములోను దుమ్ము
దుమ్ముగా దమ్ముచూపు జనులే ఈశ్వరా

న్యాయానికి గడ్డే
గడ్డు తెలిపి తెడ్డే
తెడ్డులా ఆదుకొను వారెవరు ఈశ్వరా

సర్వ కర్మ త్యాగము
త్యాగము సకల ఫలము
ఫలము లాసించని బతుకులేలు ఈశ్వరా

సంశయము తొలగించి
తొలగించి వివరించి
వివరించేది ప్రజాస్వామ్య మే ఈశ్వరా

సత్య గుణమే ఉంచి
ఉండు త్యాగము పంచి
పంచాక ధ్వేషమ్ము వీడాలి ఈశ్వరా

అపార ప్రజ్ణ గలిగి
గలిగి శ్రధగ మెలిగి
మెలిగి న్యాయరక్షణ చేదోడు ఈశ్వరా

నడి బజారు జాతర
 జాతరేలు పాతర
పాతర అమానుషం గ్రామాలు ఈశ్వరా

సమాజ అకృత్యాలు
ఆకృత్య సంఘటనలు
సంఘటనకు లేదులే జవాబు ఈశ్వరా

అవినీతి అందలము
అందల ఆర్భాటము
ఆర్భాటాలు అన్ని హత్యలే ఈశ్వరా

అన్యాయ విన్యాసము
విన్యాస విపరీతము
విపరీతమువల్ల హత్యలేలు ఈశ్వరా

దంపతుల హత్యలే
హత్యల్తొ భయాలే
భయాలు వల్ల ఆవేశాలు ఈశ్వరా
--9())--

పూర్వం మా తెనాలి రామలింగేశ్వర పేటలో, మణెమ్మ గారి మఠం లో ప్రతి ఏడాదీ, మాఘ మాసంలో 'వార్షిక ముద్దపప్పు సప్తాహం' ఘనం గా జరిగేది! తెనాలి చుట్టుపక్కల గల ఆరు అగ్రహారాలనుండి వేద పండితులే కాక, ముద్దపప్పు ప్రియులు కూడా అయిన సద్బ్రాహ్మణోత్తములు  వేంచేసి, ఆ ముద్దపప్పు సప్తాహపు ఏడు రోజులూ, ముద్దపప్పు భోజనం, మఠం నిద్రా కావించి తిరిగి వెడలేవారు!
ఒక ఏడాది మా తాత గారితో పాటు నేను గూడా ఆ ఏడు రోజులూ, ముద్దపప్పు సప్తాహపు వేడుకలన్నీ వీక్షించా!
మాఘ శుద్ధ పాడ్యమి నాడు, చెయ్యి తిరిగిన నరసరావుపేట వంట వారు కొల్లూరు గ్రామపు పొలాలలో పండిన ఏడాది వయసుగల కందిపప్పు వాడి, బాగుగా గజ భగోణీలలో గోధుమ రంగు బారే వరకూ వేయించి, అటు పిదప బాగుగా ఉడకపెట్టి, ఉప్పూ, పసుపూ వేసి దివ్యమైన ముద్ద పప్పు వండినారు! ఆ ముద్ద పప్పుకు అనుపానములుగా అంగలకుదురు పుల్ల దోసకాయలు వాడి, అనకాపల్లి ఆవపిండీ, చినరావూరు గానుగ నువ్వులనూనే, బుడంపాడు ఎర్ర మిరపకాయలు కొట్టిన ఖారమూ, వేటపాలెం రాళ్ళ ఉప్పూ తగు పాళ్ళలో వేసి, దేవతా దోసావకాయ తయారు చేసినారు! అంతే కాక, వలివేరు మెట్టపొలాలలో కాసిన ఎర్ర గుమ్మడి కాయలూ, ముదురు బెండకాయలూ యొక్క ముక్కలు బాగా తగిలించి, ప్రసస్తమైన  ఇంగువ తిరగమాత పడవేసి, గొప్ప గుమ్మడి ముక్కల పులుసు చేసినారు! తెనాలి పక్కన గల అనంతారం లో పండిన వడ్ల దంపుడు బియ్యం తో, మెత్తగా వేడన్నము వండినారు! ఇకపోతే, వేజెండ్ల గ్రామపు నల్లటి గోకు తేలుతున్న బర్రె నెయ్యి సిద్ధం చేశారు! సంగం జాగర్లమూడి బర్రెలు బకింగ్ హాం కాలువ తీరాన గడ్డి మేసి ఇచ్చిన చిక్కటి పాల జిడ్డు గడ్డ పెరుగు పదిహేను కుండలలో తోడు  పెట్టారు! ఇంగువ మినప వడియాలూ, పెసర ఎర్ర అప్పడాలూ వేయించారు!
మధ్యాహ్నభోజన వడ్డనకి ముందు ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికాధా కాలక్షేపం ఏర్పాటు చేశారు, ఒక గంట పాటు!
అటు పిమ్మట, పచ్చల తాడిపర్రు అరిటాకులు పరచి, పంక్తులు గా వడ్డన చేయగా, మేమందరం ఆ ముద్దపప్పు భోజనం కావించి తాదాత్మ్యం చెందాం!
ఇదే విధం గా, మాఘ శుద్ధ విదియా, తదియా, చవితీ, పంచమీ, షష్టీ, సప్తమీ దినాలలో కూడా, అదే ముద్ద పప్పూ, కానీ వేరు రకముల అనుపానాలూ, ఇతర హరికధా, బుర్రకధా, పురాణ పఠనా కాలక్షేపాలూ!
ఆ 'ముద్దపప్పు సప్తాహములు ' మరల తిరిగి రావు! ఆ రోజులే రోజులు!

1 comment: