Wednesday, 3 February 2021

05-02-2021

 

మధురిమలు .... ... ఓదార్పు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
 
మనసు కలుపుకోలేవా
మనసును దోచు కొందువా
మనసును బట్టి ఉండవా
ప్రేమను ఇవ్వకుంటివా
 
మనసే మూయ నంటావా
మూలన పెట్టమంటావా
మమతల మరవమంటావా
మమకారం మరిచెదవా
 
మత్తులోనే ఉన్నావా
కళ్లు కనపడకుంటివా
కన్నీరు కార్పిస్తుంటివా
కలలు కల్లలు చేస్తివా
 
ముచ్చటే తీర్చలేవా
మౌనంగా ఉన్నావా
మూగగ ఉండమంటివా
మాటలే వినకుంటివా
 
కరుణను చూపకుంటివా
కలసి ముందుకు సాగవా
పరిచయం వద్దందువా
ప్రేమ వదల మంటావా
 
పెళ్ళి ఒప్పు కొనలేవా
పరితాపం చెందావా
పరిస్కార మంటావా
సమాధానము చెప్పవా
 
నాకు సమయం ఇవ్వవా
నాకు సత్యం తెల్పవా
సంజయషీ నే వినవా
సంధి చేయాలన్నావా
 
రాధనామాట వినవా
నన్ను నమ్మీ వినవా
అర్ధం తెలుసు కొందువా
ప్రేమా మరచి యుందువా

 

ఒక్కసారి చదవండి

     సమయం  గడిచిపోయింది,  ఎలా  గడిచిందో తెలియదు, జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది  తెలియకుండానే. భుజాలపైకి..ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు.
   తెలియనేలేదు.. అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం.
ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో తెలియదు ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ..
కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో తెలియదు
ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది.
కానీ  ఇప్పుడు  నాపిల్లలకు  నేను బాధ్యత గా మారాను ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియదు. .
ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం
కానీ..ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో. ఇది కూడా ఎలా జరిగిందో తెలియదు. ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..
అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో తెలియదు.   ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..
    ఎప్పుడు  రిటైర్  అయ్యామో..
తెలియనేలేదు. పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో..
వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో తెలియదు. రొమ్ము విరుచుకొని  అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియదు. ఇప్పుడే   ఆలోచిస్తున్నాను..నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..
కానీ..శరీరం  సహకరించడం లేదు.     ఇవన్నీ..జరిపోయాయి..
కానీ  కాలం  ఎలా  గడిచిందో..తెలియనేలేదు. ఇదేనేమో జీవిత సత్యం..

--(())--
 

[04/02, 6:52 am] +91 94414 08564: 🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏

    🌻 *శుభోదయం* 🌻

          -------------------- 

🌺 *మహనీయుని మాట* 🌺

         ------------------------

తన వైపు ఇతరులు విసిరే రాళ్ళతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి!!

         

       --------------------------

🍃 *నేటి మంచి మాట* 🍃

       ---------------------------

పేదవాడికి ఏమి లేకపోయినా భగవంతుడు ఉన్నాడని ధైర్యంతో బ్రతుకుతాడు! బాగా ఉన్నవాడు ఈ ఆస్తిపోతే నేనెలా బతకాలి అనే భయంతోనే చస్తాడు!

                                     

: 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 83* 🕉

*లేవో కానలఁ గంధమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ*

*బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలోలేవో నీవు* *విరక్తుల న్మనుప జాలిం బొంది భూపాలురన్*

*సేవల్ సేయఁగఁ బోదు రేలొకొ జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:*_ 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! 

మానవులు ఆహారముగ ఉపయోగించుటకు అడవులలో కందమూలఫలములు లేవా?దప్పిక తీర్చుటకు నదులయందు జలములు లేవా?నివసించుటకు ఆశ్రయముగా పర్వత గుహలు లేవా?

🌹పండుకొనుటకు ఆకుల పడకలు లేవా? జీవితమున కలుగదగు సుఖములననుభవించుటకు, యోగక్షేమములు చూచుటకు సదా జనుల ఆత్మలలో అంతర్యామివై యున్నావు. 

🌹నీ అనుగ్రహమున ఇన్ని లభించుచుండగ మానవులు ఏ సుఖములు కోరి ఈ రాజులను సేవించుటకై ఏల పోవుచున్నారో నాకు తెలియుట లేదు.

🙏 *ఓం నమః శివాయ* 🙏

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

🌻 *తెలిసుకోవాల్సిన మంచి విషయాలు.....* 

🍃🍒31. శివపూజకు మొగలిపువ్వు పనికిరాదు.

🍃🍒32. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.

🍃🍒33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు.

🍃🍒34. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి.

🍃🍒35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

 _*💫 వందే ''మాతరం'' 🥀*_

_యాభై దాటిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు._ 

_ఆంగ్ల మాధ్యమంలో  చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము.  లెక్కలు [విడివిడిగా.. కాంపోజిట్, జనరల్], సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ప్రధానంగా తెలుగు ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము._

_పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న *సామాజిక -ఆర్థిక* పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి._ 

_దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం ముగ్గురు నుండి ఆరుగురు పైబడిన పిల్లలు ఉండేవాళ్ళు. *ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది...* అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది._

_*పొద్దున్నే చద్దన్నం, [టిఫిన్ అనేది లేనేలేదు, ఎప్పుడైనా హోటల్ కు వెళితేతప్ప] మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.*_

_పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో, పొట్టు పొయ్యిలోనో వంటలు చేస్తూ, కళ్ళవెంట నీళ్ళు కారుతున్నా వంటలు ఎంతో రుచిగా చేస్తూ, ఇంత మంది పిల్లలను పెంచిన *ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.*_ 

_దాదాపు అందరం ప్రభుత్వ ఉచిత పాఠశాలలో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే ! కేవలం రెండుజతల బట్టలతో, అవి చిరిగే వరకు వాడినవాళ్ళమే. పదవ తరగతి వరకు నిక్కర్లతో బడికి వెళ్ళినవాళ్ళం. సరిగా చదవక పాఠాలు అప్పగించలేనప్పుడు బెత్తం, చెక్కస్కేళ్ళతో, చెక్కడస్టర్లతో మాష్టర్ల చేతిలో ఎన్నోసార్లు దెబ్బలు తిని, తిరిగి కంఠోపాఠం చేసినవాళ్ళం._  

_ఆ రోజులు చాలా సాధారణంగా ఉండేవి. కరెంట్ లేని ఇళ్ళలో కిరసనాయిల్ దీపాల వెలుగులో చదువుకున్న వాళ్ళం. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు._

_ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే._

_*మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. మూడు అణాలు, పావులా, ముప్పయి పైసలు, నలభై పైసలు, యాభై పైసలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని [నేలపై కూడా] చూసిన సినిమాలు ఎన్నో.*_

_అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ... మహ్మద్ రఫీ ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి._

_మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట, ఏడుపెంకులాట, కోతి కొమ్మచ్చి, బిళ్ళంగోడు, బచ్చాలాట, సిగరెట్ ఖాళీ పెట్టెలతో పత్తాలాట, ఇసుకతో పిచ్చుక గూళ్ళు కట్టటం, పాడైన సైకిల్ టైర్లు, రిమ్ములతో చక్రాలాట, అష్టాచెమ్మ, పచ్చీస్, దాడి, రాముడు-సీత ఆట, పులీ-మేక రాత్రికి హరికథలు, బుర్ర కథలు, నాటకాలు చూడటం, పురాణాలు వినటం. ఇక మహిళలైతే కొన్ని ఈ ఆటలతోపాటు అచ్చెనగిల్లలు, తొక్కుడుబిళ్ళ, వాన గుంటలు, కాళ్ళాగజ్జ.., ఐస్, దాగుడుమూతలు ఇదే వినోద, విజ్ఞాన కాలక్షేపం.._

_ఈ నాటికీ దాదాపు అందరం 48-65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పైచదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే !_

_అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే !_  

_*ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు ?*_

_*ఆహా ! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ !!*_

_*అచ్చంగా మన బాల్యాన్ని మనమే రాసుకున్నట్టుగానే వుంది కదా !!!*_


🙏🇮🇳😷🥦🌷🌐🤺🥀

దైవ దర్శనం తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా ?

🌹🌹🌹🌹🌹

దైవదర్శనం మనసును పవిత్రం చేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కష్టాలు  నష్టాలు బాధలు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దైవదర్శనం వలన మనసుకి ఉపశమనం లభిస్తుంది. దైవం మనకి అండగా ఉందనే భరోసా కలుగుతుంది. దైవం అనుగ్రహం కన్నా మనకు కావలసిందేముందనే సంతృప్తి మిగులుతుంది.

అందుకే చాలా మంది ఉదయాన్నే ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటూ వుంటారు.కరుణాకటాక్ష వీక్షణాలను తమపై ప్రసరింపజేయవలసిందిగా దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనసు కుదుటపడేవరకూ ఆలయ ముఖమంటపంలో కూర్చుంటారు. ఇక సమస్యలు పెద్దగా లేనివారు సైతం నిత్యం దైవదర్శనం చేసుకుంటూవుంటారు. వీరిలో ఒకరకమైన తేజస్సు చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంటాయి.

ఇక ఇలా ఆలయానికి వచ్చే భక్తులను ఓ సందేహం సతమతం చేస్తుంటుంది. ఆలయానికి వెళ్లిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఇంటికే రావాలా? లేదంటే అక్కడి నుంచి నేరుగా ఎక్కడికైనా వెళ్లవచ్చా? అని అనుకుంటూ వుంటారు. ఈ సందేహానికి సమాధానం మనకి శాస్త్రాల్లో కనిపిస్తుంది. పండితుల ప్రసంగాల్లోనూ వినిపిస్తుంటుంది.

విశేషమైనటువంటి పుణ్య తిథుల్లో ఆలయానికి వెళ్లినప్పుడు, పూజ పూర్తి అయిన తరువాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాతే దైనందిన వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్లాలని అంటూ వుంటారు.

ఇక సాధారణ రోజుల్లో కూడా దైవదర్శనం తరువాత, అపవిత్రమైన ప్రదేశాలకు, మైలలో వున్న ఇళ్లకు వెళ్లకూడదని చెబుతుంటారు. అందువలన దైవ దర్శనం తరువాత ఆ పవిత్రత చెడని ప్రదేశాలకు ప్రశాంతత చెదరని ప్రదేశాలకు వెళ్ల వచ్చని సూచిస్తుంటారు.

🌹🌹🌹🌹🌹

ఓం నమో నారాయణాయ

🙏🙏🙏🙏🙏

 *ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.

*ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....*

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.

 నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.

 అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. 

 నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త,  గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, 

నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, 

మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.

కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.

 నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.

ప్రేమ యొక్క సౌందర్యాన్ని , 

అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. 

ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, 

కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. 

నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, 

కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.

 నువ్వు అందరితో మంచిగా ఉండు, 

అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. 

ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే  నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

                                       *........ నాన్న*

 *అమృతస్య పుత్రా:*

*30-నా రమణాశ్రమ జీవితం సూరి నాగమ్మ*

*ఓం నమో భగవతే శ్రీరమణాయ* 

*30. ఖాండిక్య కేశిధ్వజుల కథ*

''ఇక్ష్వాకుకుమారుడైన నిమి అనే రాజువంశంలో ధర్మధ్వజుడనే రాజుకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కృతధ్వజుడు మిథిలకు రాజైనాడు. (మిథిలాధినాథు లందరకూ జనకులని సామాన్యనామం.) మితధ్వజుడు వలసరాజ్యానికి అధిపతియైనాడు.

వారిద్దరూ ధర్మాత్ములై రాజ్యములు పాలిస్తూ వుండగా కృతధ్వజునకు ఆత్మవిజ్ఞాన సంపన్నుడైన కేశిధ్వజుడును, మితధ్వజునకు కర్మ శూరుడైన ఖాండిక్యుడును జన్మించారు. వా రిద్దరికీ అంటే ఖాండిక్య కేశిధ్వజు లిద్దరికీ కారణాంతరములవల్ల విరోధం కలిగి కడపట యుద్ధసన్నద్ధులై ఇక్షుమతీ నదీతీరంలో, ఇద్దరిని, అద్దరిని, ఉభయులు సైన్యాన్ని నిలిపి ప్రజలు భయపడునట్లు అనుదినము ఒకరి నొకరు ఢీకొని యుద్ధం చేశారు. కడకు కేశిధ్వజుని సేనలధాటికి ఆగలేక ఖాండిక్యుడు దీనుడై కతి సయపరివారంతోనూ, భార్యాబిడ్డలతోనూ పాఱిపోయాడు.

అట్లు పాఱిపోయిన ఆ ఖాండిక్యుడొక దుర్గమమైన అడవికి వెళ్ళి దారిపొడుగునను శత్రువుల రాక తన కెరిగించుటకై కొండ కొనలయందు కావలి వారినుంచి ఒక చోట పాళెమునకు ఆవరణగా కంచె నాటించి ఆ యావరణ లోపల వర్ణకుటీరములందు ముఖ్యజనులతో నివసిస్తూ వున్నాడు.

 అక్కడ కేశిధ్వజుడున్నూ రెండు రాఙ్యములు తన కే చేరినను గర్వించక శ్రౌతకర్మచేత ఙనన మరణ ప్రవాహరూపదుఃఖ సహితమైన ఈ సంసారసాగరమును దాటదలచి, బ్రహ్మజ్ఞానాశ్రయుడై, స్వర్గభోగాది ఫలాపేక్షమాని యజ్ఞములు చేస్తూ అందొక్క దానికి దీక్షితుడై వుండగా, ఆ యజ్ఞ ధేనువు చాలా సమీపంలో వున్న పచ్చిక మేస్తూ వెళ్ళి, ఒక దట్టమైన పొదను సమీపించి, అక్కడ యముని జండావలె చలిస్తూ వున్న పులితోకను చూచి అంబా అని అరుస్తూ పరుగెత్తింది. ఆ పులి గోవువెంట పడటం చూచి గోవుల కాపరి మూర్ఛిల్లాడు. ఆ పులి గోవును తన గుహ కీడ్చుకొని, పోతూవుంటె పొలము కాపరులు, స్నానం చేసే బ్రాహ్మణులు చూచి అదలించారు. ఆ పులి ఆ అదలింపులకు బెదరి గోవు మెడకొఱికి విడిచిపోయింది. కాని గోవు బ్రతకలేదు. రాజుకు ఆ వార్త తెలిసి ఋత్విక్కులను ప్రాయశ్చిత్తమడిగాడు. వారు క సేరువు నడుగుమన్నారు. కసేరువు శునకు నడుగుమన్నాడు. ఆ శునకుడున్నూ తనకు తెలియదనిన్నీ చెప్పి, ''ఎవరైతే నీచే జయింపబడి అడవిని వున్నాడో ఆ ఖాండిక్యునకు తప్ప వే రెవ్వరికీ ఈ ధర్మసూక్ష్మం తెలియదు. నీకు తగునని తోచినట్లయిన అతని వద్దకు వెళ్ళుము'' అన్నాడు.

కేశిధ్వజుడు ఆ మునిని చూచి ''స్వామీ ! నా వైరియైన ఖాండిక్యుని ప్రాయశ్చిత్త మడుగుటకై నేను తప్పక పోయెదను. పూర్వ వైరమును దలచి న న్నతడు చంపెనా క్రతుఫలం సిద్ధిస్తుంది. ప్రాయశ్చిత్త మెరిగించెనా క్రతువు. సంపూర్ణమవుతుంది. రెండు విధములా నాకు మేలే గనుక ఇప్పుడే పోగలను'' అని వెంటనే రథం ఎక్కాడు. కేశిధ్వజుడు జింకతోలు ఉత్తరీయం ధరించి ఆయుధం లేకుండా అడవికి వెళ్ళితే అతని కేతనం చూచి కొండకొనల నున్న అక్కడి కావలి వా రాతని గుర్తించి, కూతలిడి వలస వారికి తెలియజేశారు.

వారంతా తమ్ము చంపుటకే శత్రువు వస్తున్నాడని భయపడితే ఖాండిక్యుడు వారి భయం పోగొట్టేందుకు కొందరిని నియమించి, కనుమల రక్షణకు కొందరిని పంపి ముమ్మరమైన కోపంతో కంపకోటయొక్క ద్వారం తెఱచుకొని బయటికి వచ్చి తన శత్రువును చూపులచేతనే దహించునట్లు చూచి వింట బాణం సంధిస్తూ ఇల్లా అన్నాడు. ''ఓయీ! దుష్టుడా! ధనధాన్య సమృద్ధమైన నా ఐశ్వర్యమంతా హరించి ఇంకా తృప్తిలేక మారీచునివలె జింకతోలును ధరించి ప్రశాంత వేషంతో మాలో ప్రవేశించి సమయం చూచి మా ప్రాణాలున్నూ హరించాలని వస్తున్నావా? ఇదుగో! నా వాడి అలుగున నిన్ను పడవేస్తాను" అన్నాడు. కేశిధ్వజుడా మాటలు విని ''ఓహో! కోపగించక నా మాట వినుము. నేను మిమ్ములను చంప రాలేదు. ప్రమాదవశంగా నా యాగంలో ఒక వైకల్యం సంభవించింది. ఋత్విజులనందుకు ప్రాయశ్చిత్తమడుగగా వా రెవరికీ తెలియదనీ, నీవైతే చెప్పగలవనీ నన్ను నీ వద్దకు పంపారు. విషయం ఇది. నీవు నాపై కోపం విడిచి ప్రాయశ్చిత్త మెరిగించినా సరే; వైరినగుట నన్ను సంహరించినా సరే'' నన్నాడు.

ఆ పలుకులు విన్న ఖాండిక్యుడు విల్లెక్కుడించి, కంచెలోపలికి వెళ్ళి సుహృజ్జనుల కావృత్తాంతమంతా చెప్పి ఆలోచన అడిగాడు.

ఆ మంత్రి సామంతులంతా ''దాయాది మనకు ఏ శ్రమా లేకుండా సమీపానికి వచ్చాడు. వెంటనే వానిని చంపిన రెండు రాజ్యములు నీకు రాగలవు. యజ్ఞయాగాదులవల్ల అతనిని చంపిన పాపమును పోగొట్టుకొన వచ్చును.'' అని ఇంకా ఎన్నెన్నో విధాలుగా శుక్రనీతి నంతా బోధించారు. ఖాండిక్యుడు సావధానంగా అంతా విని వారితో ''అయ్యా! మీరు చెప్పిన పని చేయవలసినదే కాని అతనిని చంపుటవల్ల మనకు రాజ్యము, అతనికి స్వర్గము రాగలవు. ఈ రెండు ఫలములలో ఏది గొప్పదో విచారంచండి.

 ఈ పాపకృత్యం నేను చేసినట్లయితే నా శత్రువునకు శాశ్వతమయిన పరలోక సుఖము, నాకు స్వల్పకాల భోగ్యమయిన రాజ్య సుఖము కలుగుతుంది. అంతేగాక శరణాగతుని, దీనుని చంపుట మహాపాపమనే కణ్వముని వాక్యం స్మరణీయమైనది గనుక ఈ పాపకృత్యం నేను చేయజాలను'' అని వారికి చెప్పి కంచె వెలుపలికి వచ్చి కేశిధ్వజుని వలన యజ్ఞధేను హననమును విని తగిన ప్రాయశ్చిత్త మెరిగించి సగౌరవంగా పంపాడు.

కేశిధ్వజుడున్నూ తిరిగి వచ్చి ప్రాయశ్చిత్త మొనర్చి, క్రతువు సమాప్తి చేసి, అవభృథ స్నానాదులన్నీ ముగించుకొని, ఋత్విజులకు వందిమాగధాదులకు, అర్థిజనులకు అభిమాతార్థాలన్నీ యిచ్చి ఇల్లు చేరుకున్నాడు.

 అయినా అతని మనస్సు సంతుష్టి చెందలేదు. ఎందువల్లనా అని యోచించి యజ్ఞ ధేను హననమునకు ప్రాయశ్చిత్త మెరిగించిన గురునకు దక్షిణ ఈయకుండుట జ్ఞప్తికి తెచ్చుకొని, ఇచ్చే నిమిత్తం ఖాండిక్యుని వద్దకు వెళ్ళాడు. ఇతడు తనతో యుద్ధానికే వచ్చాడేమో నని ఖాండిక్యుడు తొక్కట పడ్డాడు. వెలికి వచ్చి వెనుకటివలెనే విల్లెక్కు పెట్టు నాతని సంభ్రమం కేశిధ్వజుడు ఆపి ''అయ్యా! నేను నీతో యుద్ధానికి రాలేదు. ప్రాయశ్చిత్తమెరిగించిన నీకు గురుదక్షిణ ఇవ్వటానికి వచ్చాను. నీకు ఏమి కావాలో అడుగు'' మన్నాడు. ఖాండిక్యుడు తిరిగి తన వారితో ఆలోచించాడు. వారంతా ఉబ్బి ''నేడు గదా మన పుణ్యం ఫలించింది. గురుదక్షిణగా చతుస్సముద్రపరివేష్టితమైన రాజ్యమంతా అడుగుట మంచిది. ఆప్తబాంధవరక్షణ కంటే వేరే పుణ్యం వున్నదా ! మనకెప్పుడు బలం రాగలదు ? ఎప్పుడు జయించగలం ? ఎవరూ చావకుండా, గాయపడకుండా రాజ్యం రాగలదు. తప్పక రాజ్యం అడుగవలసిన'' దన్నారు.

ఖాండిక్యుడా మాటలకు చిరునవ్వు నవ్వి ''అయ్యా ! మీరు అర్థశాస్త్ర పండితులుగాని మోక్షమార్గవిచార పండితులు కారు. అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడు. నే నా మహాభాగుని వద్దకు వెళ్ళి మహాసుఖాన్నిచ్చే మోక్షమార్గం అడుగక అతిచంచలమైన రాజ్యలక్ష్మిని ఇమ్మని ఎట్లడుగ గలను ? నిమివంశసంజాతులమగు మాబోంట్లకు రాజ్యమా లక్ష్యము? అతడు అమలిన యోగాశ్రయుడు.

 అతని వద్ద ఉత్తమమైన యోగవిద్య గైకొనుట గొప్పదా? రాజ్యం గైకొనుట గొప్పదా? చాలు చాలును మీ యోచనలు. ''అని కంచె వెడలివచ్చి, కేశిధ్వజుని చూచి ''గురుదక్షిణ తప్పక యిచ్చెదవా.'' అంటే ''తప్పక ఇవ్వగలను'' అన్నాడతడు. ఖాండిక్యుడది విని ''అయ్యా నీవు అధ్యాత్మరదుడవు. గురుదక్షిణ ఇవ్వదలచి నట్లయితే సకలక్లేశ నాశనమైనది ఏదో ఆ విద్య నాకు బోధించు'' అన్నాడు. కేశిధ్వజుడు నవ్వి ''ఆహా! నిష్కంటకమైన నా రాజ్య మడుగక ఇది యెందు కడిగావు? క్షత్రియులకు రాజ్యంకంటె ప్రియమైనది ఉన్నదా?'' అన్నాడు. ఖాండిక్యుడు ''రాజా ! నేను రాజ్యం అడుగకుండుటకు కారణం విను.

 రాజ్యతృష్ణ అవివేకికి కలుగుతుందిగాని వివేకికి కలుగదు. పరాక్రమంవల్ల శత్రుల జయించటం, ప్రజలను రక్షించటం రాజుకు ధర్మములే అయినప్పటికీ ముందే నీచేత జయింపబడితిని గావున రాజ్యపాలన యందసమర్థుడు నయితిని, అందువల్ల ఆ ధర్మపరిపాలనా విసర్జన దోషం నన్నంటదు. పైగా రాజులు ఇచ్చువారుగాని పుచ్చుకొనువారు కాదు గదా? ఒక వేళ పుచ్చుకొన్నను ఆ భూమి భోగయోగ్యమేగాని ధర్మయోగ్యము కాదు. ధర్మయోగ్యము గాని ఈ రాజ్యభిక్ష నాకు అనర్హమని యెరుగుదును. అందువల్ల రాజ్య మడుగుటకు నే నంగీకరింపను. మమకారం వదలని మూఢమతులవలె పండితులు రాజ్యమునకు ఆశపడుదురా? మమకార ముడిగిన మావంటివారికి రాజ్య మెందుకు'' అన్నాడు.

కేశిధ్యజు డది విని పరమానందభరితుడై ఇల్లా అన్నాడు. ''నేను స్వాభావికమైన బ్రహ్మనిష్ఠనుండి కలిగిన ప్రమాదమును దాటగోరి అందుకు సాధనంగా యజ్ఞ యాగాదులు చేస్తూ వున్నాను.

అయినా పూర్వకృతకర్మఫలము సంసారమును బలపరచు చుండ లేదా? దానినుండి ముక్తియెక్కడిది? అంటే ఆ ఫలమును భోగముచేత క్షయమొందించుటకై రాజ్యం ఏలుతూవున్నాను. ఓ మనుజపరా! మన యీ నిమివంశము అతిపావనమైనది. ఆ వంశమున జన్మించిన మహాభాగ్యవశముననే నీకు తత్త్వ వివేచన చింత కలిగినది. చాలా సంతోషం. నీకిక తత్త్వబోధ చేస్తారు. శ్రద్ధతో వినుము'' అని చెప్పి శ్రద్ధాభక్తి సమన్వితుడగు ఆ ఖాండిక్యునకు ఆత్మతత్త్వమంతా బోధించి అతడు వలదన్నను వినక అతని రాజ్యమంతా (అంటే ఖాండిక్యుని రాజ్యం) గురుదక్షిణగా ఇచ్చాడు.

 అయినను ఖాండిక్యుడు ఏ మాత్రమూ మమతను చెందక, బాలుడగు తన కుమారుని రాజుగా చేసి, మంత్రిప్రధానుల కాతని నప్పగించి తాను ఆ వనమునందే ధర్మపత్సీ సమేతుడై తపోనిష్ఠతో నిలిచిపోయాడు.

 కేశిధ్వజుడున్నూ చాలరోజులు మంత్రులతో సహా వారి రాజ్యమున నిలిచి, తన రాజ్యమునకు తాను వెళ్ళి, ఆత్మవిద్యా తత్పరుడై కొంత కాలమును గడపి స్వాత్మలో లీనమైనాడు. ఈ కథంతా విష్ణుపురాణంలో వివరంగా ఉన్నదని భగవాన్ చూచి చెప్పే ఉన్నారు గదా? ఆ తత్త్వబోధ వివరం తెలుసుకొన దలచినవారు విష్ణుపురాణం చూడగలరని మనవి.


🕉️🌞🌏🌙🌟🚩

 ఇతనాత్మ  పాటల మేనిఫెస్టో


కొందరు పాటను అమ్ముకొని ప్లాట్లు కొంటారు.

మరికొందరు పాటల్ని నమ్ముకొని పాట్లు పడతారు.

మేడగాని శేషగిరి పాటలు అమ్ముకోలేదుగాని వాటిని నమ్ముకొని ఆనందాన్ని సంతోషాన్ని పొందారు.తాను చైతన్య పడి సమాజాన్ని జాగృతి పరిచాడు.పాటకుండే శక్తిని పాటగాడి గొంతులోపలి నిలబడి హిప్నోటైజ్

చేసే కళ మేడగాని పాటకున్న బలం.ఎంత గొప్ప పాటగాడైనా, పాటలోపల ఎంత అర్ధవంతమైన సాహిత్య విలువలు ఉన్నా, కూలి నాలి చేసుకొనే బహుళ ప్రజానికంలో లేకపోతే ఆ పాట అప్పుడే మరణిస్తుంది.ఇది అందరి పాటగాళ్లకు వర్తిస్తుంది.

శేషగిరి పాటలు అందుకు కాస్త బిన్నమైనవి.అమ్మలారా అయ్యాలారా అని తన తల్లిమీద  పాట గట్టినా శ్రీశ్రీ కవితల్ని గానాలుగా మార్చినా, స్వాతంత్రం మీద పెన్ను కదిల్చినా,మేడగాని సంపూర్ణ గాయకుడు.పాటల రచయిత.తన చుట్టూ ఉన్న సమాజానికి చైతన్యనాన్ని ప్రాణంగా పోయటం అతని గళం కలం లక్ష్యాలు.

ఎందరినో  గాయకుల్ని తయారు చేసిన గొప్ప గాయకుడు తను.రెండు వేల ఎనిమిదిలో అనుకుంటా గురువు సీతారాం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన 'వ్యాధులు లేని ఉగాదులు' కార్యక్రమంలో మొదటిసారి మేడగాని గొంతుని టప టప టప టప మని చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట విని డిగ్రీ చదివే రోజుల్లో ఆ పాటని నేను పాడుకొని రోజు లేదు.అది కేవలం శేషగిరి గారి గొంతులో ఉండే మార్మిక నైపుణ్యమేనని నాకెప్పుడూ అనిపిస్తుంది.జానపదాన్ని జనపదాన్ని ఉద్దేశించి పుట్లు పుట్లుగా పాటలు రాసి వాటిని  పాడాడు శేషగిరి.

అతని నరాల్లోపలి రక్తపు జిగటని గొంతులోపలి పాటగా మార్చే పరుసవేది శేషగిరి.అతని పాట చైతన్య స్వరం.

అతని రాత పేదవాడి గుండె చప్పుడు.అతని వాక్యం అమ్మ ప్రేమగా దంచిన గోంగూర పచ్చడి.ఇంకా అతని ఆత్మ పాటల మానిఫెస్టో.రండి ఈ ఐదున అంటే శుక్రవారం మేడగాని పాడతారు...పాటలతో పారతారు.హాయిగా నదిలో నీళ్ల నడుమ కాల్లుపుతూ తన్మయత్నం పొందినట్టు చెవుల్నినిండా పాటలు విని  ఆనందిద్దాం...రండి

                                                  -- పెద్దన్న మారబత్తుల

 

స్పాట్ వ్యాల్యూయేషన్  ఓ అనుభవం
: ఓ చిన్న కథ
   ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి అందరికీ ఉన్న అనుభవమే. పరీక్షల అనంతరం పేపర్స్ దిద్ది, తగిన మార్కులు వేసేటప్పుడు జవాబు పత్రాలు చదువుతుంటే ఒక్కోసారి నవ్వు, ఒక్కోసారి కోపమూ వస్తాయి కదా! జవాబులకు టిక్ మార్కు పెట్టడం ఉంటే పర్లేదు కానీ, వ్యాసరూప ప్రశ్నలకు  రాసే జవాబులు భలే రాస్తుంటారు.
    ఉస్మానియా లో తెలుగు లో పీజీ చేసే రోజుల్లో  ఒక ముస్లిమ్ ప్రొఫెసర్ వుండే వారు. తెలుగు సాహిత్యంలో ఎన్నో పరిశోధనలు చేశారు. మా విద్యార్థుల  గౌరవాభిమానాలు చూరగొన్న ప్రొఫెసర్స్ లో ఈయన ఒకUరు. చాలామంచి వ్యక్తి. పీజీ ఫైనల్ పరీక్షలు జరిగే ముందు తీస్కున్న క్లాసుల్లో పరీక్షల్లో పిచ్చిగా జవాబులు రాయకండి, మాకు విసుగు తెప్పించకండి  అంటూ తన అనుభవాన్ని ఇలా వివరించారు.
    పీజీ ఫైనల్ పరీక్షలు అయిపోయాయి. పరిక్షాపత్రాలు దిద్దడానికి తేదీ నిర్ణయించి ఆ యా ప్రొఫెసర్స్ అందరికీ కేటాయించారు.
  మా ఈ ప్రొఫెసర్ గారికి ఒక పేపర్ వచ్చింది. ఏదో సినిమా కథలు కొంచెం రాసి కొన్ని పేపర్లు నింపి, చివరగా ఇలా రాసాడట ఆ అబ్బాయి....
    " విన్నపము:
      అయ్యా!
     నేను ఫలానా . మీరు ఇంత స్థాయికి, ఒక యూనివర్సిటీ లో పీజీ స్థాయి ప్రొఫెసర్ గా ఉన్నారంటే మీరు చాలా పెద్దవారు అయి వుంటారు. మీకు కూతుళ్లు వుండే వుంటారు.
  దయచేసి నన్ను ఎలాగైనా పాస్ చేశారంటే మీకు రుణపడి ఉంటాను. మీ రుణం ఉంచుకోను. మీ అమ్మాయిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను మీరు నన్ను పాస్ చేస్తే.
   ధన్యవాదాలు
                                  ఇట్లు
                           మీ కాబోయే అల్లుడు
ఇది చదివి మొదట నవ్వు, ఆ తర్వాత కోపం వచ్చాయట. ఆ తరువాత అతన్ని పిలిపించి చివాట్లు పెట్టి, డిబార్ చేశారట. బతిమాలితే  ఒక సంవత్సరానికి తగ్గించారట.
  ఫ్రెండ్స్!
మీరూ ఎప్పుడైనా ఇలా రాసి, టీచర్స్ చేత చివాట్లు తిన్నారా? నేనైతే అస్సలు అలా రాసి,చివాట్లు తినలేదు. మీరు టీచర్ అయితే ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా?
కామెంట్స్ రూపంలో మీ స్పందన తెలియజేయండి.
Co
--(())--
 

స్నేహం విలువ
****🌹****🌹****🌹****
 అంజని గాయత్రి దేశ రాజు
****🌹****🌹****🌹****
చింటు, గణేష్ ,  వరుణ్ మరియు బద్రి... ఈ నలుగురు ఒకే తరగతి చదువుతూ వారి ఇల్లు కూడా దగ్గర దగ్గరగా ఉండేవి... దానివల్ల నలుగురు కలిసికట్టుగా ఉంటూ స్కూలుకి వెళ్లేటప్పుడు కలిసి వెళుతూ వచ్చేటప్పుడు కూడా కలిసి వస్తూ ఉండేవారు..
. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీళ్ళ స్నేహం గురించి చూసినవాళ్లు విన్నవాళ్ళు వీరిని మెచ్చుకుంటూ పెద్దయిన తర్వాత కూడా మీ నలుగురు ఇలాగే ఉండాలి... ఒకరికి ఆపద వస్తే ఇంకొకరు ఆదుకుంటూ కష్టసుఖాలలో కలిసి మెలిసి ఉండాలి... అంటూ స్కూల్ లో టీచర్స్ చెప్పేవారు. వారి మాట విని నలుగురు స్నేహితులు ఉప్పొంగి పోతూ ఎప్పుడు మనం విడిపోకూడదు... ఇలాగే కలిసి మెలిసి ఉండాలి అని అనుకునేవారు..
కానీ వారు నెమ్మది నెమ్మదిగా పెద్ద వాళ్ళు అయ్యి చింటూ టీచర్ గాను.. గణేష్ డాక్టర్ గాను.. వరుణ్ పోలీస్ ఆఫీసర్ గా.. బద్రి లాయర్ గాను ఉద్యోగాలు చేస్తూ ఉంటారు... వృత్తిరీత్యా ఎప్పుడో పండగలకు పబ్బాలకు కలవడం తప్పితే పూర్వము లాగా కలవడానికి కుదరదు వారికి... చింటూ టీచర్ గా మంచి పేరు తెచ్చుకుంటు భార్య, ఇద్దరు పిల్లలతో ఆనందం గా ఉంటూ ఉంటాడు.. గణేష్ డాక్టర్ గా మంచి పేరు సంపాదించి డబ్బు బాగా సంపాదించుతాడు.. వరుణ్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీ నిర్వహిస్తూ రాజకీయ నాయకులతో గొడవ పడుతూ ఉంటాడు వృత్తిరీత్యా.. బద్రి లాయర్ గా కేసులు ఎక్కువ లేక సంపాదనలో వెనక బడతాడు..
 

నలుగురికీ పెళ్లిళ్ళు అయ్యి భార్యా పిల్లలతో ఆనందంగా ఉంటారు.. కానీ బద్రి సంపాదన సరిగా లేక భార్య, పిల్లలను పోషించడానికి కష్టపడుతూ ఉంటాడు.. కానీ ఈ విషయం స్నేహితులకి చెప్పు కోడు... ఎందుకంటే స్నేహితులని సహాయం అడిగి వారిని బాధపెట్ట లేడు... ఇదిలా ఉండగా వరుణ్ పోలీస్ ఆఫీసర్ గా పలుకుబడి గల మరియు గూండా గిరి కలిగిన మంత్రిని ఒక కేసు విషయంలో సాక్ష్యాధారాలతో పట్టుబడటంతో అరెస్టు చేస్తాడు... తర్వాత బెయిల్ పై ఆ మంత్రి విడుదల అయ్యిన తర్వాత వరుణ్ పై లంచం తీసుకుంటున్నాడని తప్పుడు కేసు పెట్టి వరుణ్ ని సస్పెండ్ చేయిస్తాడు ఉద్యోగం నుండి...
 

 నలుగురు స్నేహితులలో చింటూ మరియు గణేష్ బాగానే ఉంటారు.. వరుణ్ కి మరియు బద్రి కి ఉద్యోగరీత్యా కష్టాలు... ఈ విషయం తెలుసుకున్న గణేష్ మరియు చింటూ వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు.. కానీ బద్రి కి వరుణ్ కి అభిమానం ఎక్కువ. అందువలన వారి సహాయం వద్దు వద్దు అంటారు.. కానీ ప్రాణ స్నేహితులు చూస్తూ చూస్తూ స్నేహితులను కష్టాల్లో వదలరు కదా...
 

డాక్టర్ అయిన గణేష్ దగ్గరకు ఆపరేషన్ నిమిత్తం మల్లికార్జున్ అనే వ్యక్తి వస్తాడు.. అతనికి హార్ట్ ఆపరేషన్ చేయాలి డాక్టర్ గణేష్... ఈ లోపుగా స్నేహితుడైన గణేష్ ని కలవడానికి వరుణ్ అక్కడ కు వస్తాడు.... వరుణ్ పోలీస్ ఆఫీసర్ గా సస్పెండ్ అయినట్టు... అదీ మంత్రి వల్ల అని తెలుసుకుంటాడు గణేష్... హాస్పిటల్ కి వచ్చిన వరుణ్ తనను లంచం కేసులో ఇరికించిన మల్లికార్జున్ ను అక్కడ చూసి గణేష్ తో ఇలా అంటాడు.... వీడేంటి ఇక్కడ..? ఈ మల్లికార్జున్ ఆ మంత్రి కుడి భుజం... నన్ను ఆ మంత్రితోపాటు వీడు కూడా కేసులో ఇరికించి సస్పెండ్ అయ్యేలా చేశారు అని చెబుతాడు వరుణ్...
 

అప్పుడు డాక్టర్ గణేష్... హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాడు.. అయితే నేను ఈ మల్లికార్జున్ కి తగిన బుద్ధి చెప్పి నీకు తిరిగి ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని అంటాడు... వరుణ్ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళి పోతాడు... గణేష్ ఆపరేషన్ థియేటర్లో మల్లికార్జున్ ను బల్లపై పడుకున్నాక ఆపరేషన్ కి అన్ని సిద్ధమయ్యాక అప్పుడు అడుగుతాడు మల్లికార్జున్ ని... మంత్రి తో కలసి నువ్వు పోలీస్ ఆఫీసర్ వరుణ్  ని లంచం కేసులో ఇరికించావు... దానివల్ల నీకు ఏంటి లాభం..?
 

నీవల్ల, ఆ మంత్రి వల్ల వరుణ్ ఆపదలో పడ్డాడు.. ఇప్పుడు నీకు నేను ఆపరేషన్ చేయలేదనుకో..?  నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీ కుటుంబం రోడ్డున పడుతుంది.. అని అనగానే మల్లికార్జున్ పశ్చాత్తాపంతో నేను అలా చేయకపోతే నలుగురిలో నా కుటుంబాన్ని నవ్వులపాలు చేస్తాడని ఒప్పుకున్నానని.. మరియు మంత్రి బెదిరించాడని చెబుతాడు. ఈ 

మాటలన్నీ గణేష్ రికార్డ్ చేసి ఉంచుతాడు..
 

కోర్టులో వరుణ్ మంత్రిపై కేసు పెట్టి రికార్డ్ చేసిన క్యాసెట్ ప్లే చేసి నిజం నిరూపించుకొని తిరిగి పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరతాడు... అలాగే వరుణ్ దగ్గరకొచ్చే హత్య కేసులు మరియు దోపిడీ కేసులు ఉంటే వాటిని బద్రి ని లాయర్ గా పెట్టుకొని బద్రి కి ఆదాయం పెరిగే టట్టు గా చేస్తాడు వరుణ్... అలా చింటూ.. గణేష్.. వరుణ్... బద్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ సహాయం చేసుకుంటూ బాల్య స్నేహితులు గానే కాకుండా పెద్దయ్యాక కూడా వాళ్ల" స్నేహం విలువ"  కాపాడుకుంటూ మంచి మిత్రులు గా అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు... వారిని చూసిన ప్రతి వారు స్నేహమంటే ఇదేరా.... అనుకునేలా ఉన్నారు వీళ్ళు..! అని వేనోళ్ల పొగిడేవారు.
 

****🌹 సమాప్తం🌹****
 

No comments:

Post a Comment