Saturday, 13 February 2021

14--92--2021

 

 

తండ్రి విలువ 🌹🌹🌹

ప్రాంజలి ప్రభ కధలు

           తండ్రి జీవించి ఉన్నప్పుడు  వారి విలువ తెలియదు ఎవరికైనా,  మరణానంతరం, మానాన్న అలా చేసేవాడు,  ఇలా చేసేవాడని గుర్తుకు వస్తాడు, తండ్రి నిన్ను మందలించాడు 

అంటే,  నా కంటే నీవు ఎత్తుకు ఎదగమని అర్ధం,  తండ్రి నిన్ను బొజ్జగించాడంటే ప్రేమతో,   అదే ప్రేమలో కొంత వృద్ధాప్యంలో మాపై చూపించమని అర్ధం,   ఎక్కడకి వెళ్లిన నిన్ను బరువనుకోకుండా ఎత్తుకు వెళ్లాడంటే వృద్ధాప్యంలో మమ్మల్ని బరువనుకోవద్దని, 

తండ్రి ఆవేదన తండ్రి విలాస జీవితాన్ని మాని,   ఆ ఖర్చు పిల్లల విలాసాలకు కొరకు, తన కోరికలు చంపుకొని పిల్లలకోసం తాపత్రయ పడేవాడు,  అటువంటి తండ్రిని,  "  మనం ఎలా సంబోధిస్తున్నాం "  

    మనమందరం బాగా ఎదిగి  సంస్కృతిని మరిచే విధంగా ఎదిగిపోయాం ! 

      మన ఫ్రెండ్ మనకి ఫోన్ కాల్ చేసి రమ్మంటే మనం చెప్పేమాట !

    అరేయ్ మామ "  లేక "అరేయ్ బాబాయ్ !  

మా   బాబు,      లేక   మా 

అయ్య  (  నాన్న ) ని   ,     

ఉన్నాడ్రా ఇంట్లో !  బయటకు వచ్చానో,     మాబాబు   సావగొడతాడ్రా !  అని సంబోధిస్తారు,    

     తండ్రి విలువ తెలియాలంటే నీవు తండ్రివి ఐతేనే,  ఆ  బంధం విలువ తెలుస్తుంది !  

    నాన్నని నాన్న అని పిలవలేకపోతున్నాం ! 

ఒకొక్కరు ఒకొక్కరుతో పిలుస్తారు,   తండ్రిని, నాన్న అనే     ఈ  రెండుఅక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు,    

       నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకు వెళ్లే దారిలో,    శ్మశాన దగ్గరలో,       నాన్న బాడీని నేలపై ఉంచి,   కొడుకుని తండ్రి చెవిలో !   

నాన్న... నాన్న...... నాన్న..... అని మూడు సార్లు పిలవమన్నప్పుడు!

కొడుకు రెండు సార్లు పిలిచి,  మూడవసారి పిలుపులో జీవితంలో ఎన్నడూ చలించనంత విధంగా  ఊపిరి బిగబట్టి, అతికష్టం మీద  మాటరాక,  గుండెల్లో బాధ,   గొంతులో తెలియని నొప్పితో,       కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరుగుతాయి,   ఎందుకంటే !

  ఆ కొడుకు తండ్రిని "నాన్న " అని పిలిచేది అదే ఆఖరిసారి వారు జీవితంలో" నాన్నని " నాన్న,   అని పిలవలేని ఆఖరి నిమిషం !    

కాని ఒక్కవిషయం,  నాన్న ఐనా,   అమ్మ అయినా,  

మరణానంతరం,  అమ్మకి నాన్నకి,  అదిచేసాను,   ఇది చేశాను అదిపెట్టాను, ఇది పెట్టాను,  అనే దానికన్నా !

ఇంతమందికిభోజనం పెట్టాను,  అంతమందికి భోజనం పెట్టాను అనేదానికన్నా,  కనపడని దైవం కన్నా,  కనపడే ఈ దైవం మిన్న,  మరణానంతరం ఫొటోస్ పెట్టి,  దండలేసి, భోజనం పెట్టేదానికన్నా ,  భౌతికంగా ఆ ప్రయత్నం చేయండి,  " "తాతకి పెట్టిన బొచ్చే తర తరాన "  అనే సామెతని మర్చి జీవించి ఉన్నప్పుడే, 

మీభాధ్యత నిర్వహించండి !

"జీవించినప్పుడు పట్టెడు అన్నంతో పోయేది,  పోతే లక్షలు పట్టుకోవాలి,  ఇది పెద్దల సందేశం,  మన గొప్పగా చెప్పుకునే, మన దేశ సంస్కృతి,  కాపాడండి,  ఆచరించండి,  ఆచరణలో పెట్టించండి,  

ఈ  జన్మ వారితో సార్ధకత చేస్తే,  శివానుగ్రహం పొందినట్లే ! 

సర్వే జనా సుఖినో భవంతు 

ఈ  నాటి యువతే రేపటి తల్లి తండ్రులు, 

మాతృదేవో భవ. 

పితృదేవో    భవ 

సర్వే జనాసుఖినోభవంతు  ... ఓం శాంతి :ఓం శాంతి :ఓం శాంతి :

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి .. ఇదే నా కోరిక

--(())--


మాఘ పురాణం – 2వ అధ్యాయం
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు
తేదీ :14-02-2021 ఆదివారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#గురు_పుత్రికా_కథ*
మంగళదాయినీ..! సర్వమంగళా..! మాఘ మాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి.. స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నా ననగా శివుడిట్లు పలికెను...
దేవి వినుము.., పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచార వంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు గురు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ వుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ వుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది., పద్మాలు. వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో నున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగ నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది.. మన మిద్ధరమును పడుచు వారము, మన కలయిక సుఖప్రద మగును.. ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగా నున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని పిలిచెను.
సుమిత్రుడు మంచిదానా..! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు.. మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను.నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదము రమ్ము, గురువు గారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖము నందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరము నొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితo అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుట కంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మధ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖముల ననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను.
తండ్రి యామెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణకిచ్చి వివాహము చేసెను. కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖముల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి..? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించు చుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి.. 'జ్ఞానస్వరూపా..! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నంది యిట్లు పలికెను. ఓయీ..! వినుము.. నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగి యుండెను. సౌందర్యవతి, యౌవనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశమున నెట్లు జన్మించినదా యని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘ మాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము నాచరించు వారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషము వలన నీమె తమ కర్మ ఫలముల యిట్ల ననుభవించుచున్నది.. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా..!
సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి.. 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట యేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము..
మాఘ మాసమున ప్రాతఃస్నానము చేసి ఆ నదీ తీరమున గాని, సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారము లతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో  గౌరీదేవిని సమర్పించ వలయును. ఈ విధముగ ఈమె తో ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజ చేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింప జేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘ మాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరివ్రత మాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారి యనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు..అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను.
కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలో గాని, సరస్సున గాని, కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను...
ఇతి శ్రీ మాఘ పురాణం తృతీయ అధ్యాయం పారాయణ సంపూర్ణం...

రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే?

 

అత్తగారు! స్వీట్ ప్యాకెట్ లో మైసూర్ పాక్ లేదు, ఏమైందత్తయ్యగారు!

ఏమోనే నాకేం తెలుసు? రాత్రి నువ్వో, మీ ఆయనో తినేసి వుంటారులే, అయినా సంసారంలో అన్ని లెఖ్ఖలేంటే కోడలా!

అత్తయ్యగారు! మీ కడుపులో చక్కెర ఫేక్టరీ వుంది, నిన్న రక్త పరీక్ష లో 450 వుంది!

మీ అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ హెచ్చరిస్తున్నారు, మీ అబ్బాయి అయితే మరో అడుగు ముందుకేసి "నీ అశ్రద్ధ తో మా అమ్మని చంపేసేలాగున్నావు" అంటారు, మీరు చూస్తే ఇలా, చావేదో నాకొచ్చినా బాగుణ్ణు!

కోడలు పిల్లా! ముందు కంటతడి ఆపి ఇలారా తల్లీ!

చెప్పండత్తయ్యగారూ!

నాకు చిన్నప్పటినుంచి మిఠాయిలంటే ప్రాణం!

మంచి వయసులో వుండి, మిఠాయిలు అందుబాటులోనున్నా తినలేకపోయాను,

కారణం మా అమ్మ "ఒసే! నువ్విలాగ మితం లేకుండా మిఠాయిలు తింటే బాగా వొళ్ళొచ్చేసి నీకు పెళ్ళి అవకుండా పోతుందే "

శోభనముగదిలో అన్నీ వున్నా ఆయనేమనుకుంటారోనని తినలేకపోయాను, రింటిలో వుమ్మడి కుటుంబం మూలాన"భగవంతుడా! ఈ పనులెప్పుడు పూర్తౌతాయి, మగవాళ్ళ భోజనా లెప్పుడవుతాయి, నా కడుపులోకి పిడికెడు మెతుకులెప్పుడెళతాయి" అనిపించేది!

క్రమేపీ నా సంసారమన్నది ఏర్పడ్డాక అంతులేని భాద్యతలతో తిండి మీద ధ్యాస పోయింది!

అమ్మయ్య! కొడుకు బుద్ధిమంతుడు, కోడలు బంగారం ఇక నాకు కావలసిన మిఠాయిలు తినేయొచ్చనుకునేసరికి తోబుట్టువుల్లాగ ఈ చక్కెర, రక్తపోటూ వచ్చి పడ్డాయి, నన్నర్దము చేసుకో తల్లీ!

నిజమే అత్తగారు! ఈ విషయం లో భగవంతుడు మీకు అన్యాయం చేసాడు, ఇకమీదనుండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయాల్సిన పని లేదు, నేనే స్వయంగా నేతి మిఠాయిలు కొని తెచ్చి మీకిచ్చేస్తా, మీ కెన్ని కావాలంటే అన్ని తినొచ్చు!

అయితే మీరు నన్ననుగ్రహించి నా ప్రశ్నకు జవాబు చెప్పాలి!

ఏమిటమ్మ అది?

మీకు కడుపుతీపి అంటే ఎక్కువిష్టమా?

నోటితీపి అంటే ఎక్కువ ఇష్టమా?

కోడలా! నీ అంతరంగం నాకు అద్దంలా కనిపిస్తోంది, నా కొడుకు మీద ఒట్టేసి చెపుతున్నాను "ఇక నేను మిఠాయిలు ముట్టను " ఇదిగో నీ మైసూర్ పాక్!

--((**))--


రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే?


తెలివైన చిట్టి చిలుక

ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.

ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.

ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?

అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."

"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.

మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.

సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.

అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.

యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.

"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.

మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.

యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 

చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.

గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.

గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.

కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."
అని అన్నాడు.
యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.
దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

నీతి : సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి,భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి.

--((**))--

రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే?

మనం ఒక్క సారి ఆలోచిస్తే మనకు ప్రతి రోజూ కొత్తగా కనిపిస్తుంది, నిద్రపోవటం తెల్లవారితే లేవటం కష్ట బడటమ్ ఇదే జీవితం అని అందరికి తెలుసు కానీ రేపు ఏమి జరుగుతుందో మాత్రం ఎవ్వరు కనుగొనలేరు ఎందుకు? మనం అద్దం  లో చూసామనుకో మనబొమ్మే కనబడుతున్నది కానీ వేరే బొమ్మ అక్కడ కనబడదు.

మంచి చెడు గమనించి బ్రతికే శక్తి మానవులకు ఉన్నది, కానీ జ్ఞానేంద్రియాలు తెలిపే ఆనందాన్ని దు:ఖాన్ని సమానంగా అనుభవిస్తాం.

సినిమా చూసి మనసు ఉల్లాసం ఉత్సాహం గా మార్చుకోవడం, లేదా  భయాందోలనకు దిగుతాం, అది  తెలిసి వెళతాం కానీ దాని వెనుక ఎందరో కృషి ఉన్నది, తెరమీద బొమ్మల రావటానికి ఒక ప్రొజక్టర్ ఉన్నది, దానికి కనిపించని కరంటు పంపితే గాని చిత్రాన్ని చూపలేదు. అనగా ఎదో శక్తి మనచుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నది అనగా ప్రకృతిలో మారే ప్రతి చర్యకు ఎదో ఒక కారణం  తప్పక ఉన్నది అని గ్రహించవలెను.

మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎవరినయినా ఆశ్రయించాలి, లేదా మనమే శోధన ద్వారా తెలుసు కోవాలి, తెలుసుకున్న దానిని ప్రపంచానికి తెలియ పరిస్తే అర్ధం చేసుకున్నవారికి కొంత మంచి ఉండవచ్చు, అర్ధం కానివారికి తేలిక భావంగా ఉండవచ్చు,  అర్ధాన్ని ఆచరించటం, గమనించటమే మనకు అవసరము, చెడును వేలెత్తి చూపి మంచిని పెంచుట అవసరం, మానవులలో మార్పు రావటానికి సహకారం మరీ అవసరం.

ఎవరి శక్తి వారికి తెలియదు, ఎందు కంటే మన ఆలోచన మన సంసారం భాదలు సుఖాలు కమ్మి వేస్తాయి, ఏదైనా అడిగిన దానికి వెంటనే చెప్పలేరు. అంత మాత్రాణ శక్తి హీనులు కాదు, ఎందుకంటే మనలో అహం అడ్డు పడుతుంది, మనకెందుకు జరిగేవి జరుగక మానవు అని వాదనలో ఉండుట మంచిది కాదు. మనలో ఉన్న శక్తి తో ఎదుటి వానిలో ఉన్న జీవాన్ని ఉత్తేజ పరుచుటకు ప్రోత్సహించాలి. అది మంచి మాటలతో అందరిని ఉత్తేజ పరచాలి .

మానవులకు మానసిక పరిస్థితిని గ్రహించటం ఎవరి వళ్ళ కాదు, మెలుకవలో అంతర్గతముగా మనస్సులో కలిగే మార్పులే నిగ్రహ శక్తిని పెంచు తాయ్ నిద్రలో ఎటువంటి కలలు రాకుండా మనసు ప్రశాంతముగా నిద్రపోతే ఉషోదయం ఎప్పుడు ప్రశాంతముగా ఉంటుంది.

మన హృదయంలో విజ్ఞాన సంపద నిండి ఉంటుంది, అదే ప్రేమగా మారి సుఖ మార్గముగా చూపు తున్నది, గడియారం కదిలినట్లు గుండె చప్పుడుతో నిజమేదో గ్రహించు అని హెచ్చరిస్తున్నది అని తెలుసు కోవాలి. బుద్ది వికసించి బలహీనత నుండి బయట పడితే మానవ బలం పెరుగు తుంది.

సూర్యుని బింబము నీటిలో చూసి పట్టుకోవటానికి ప్రయత్నిమ్చే మనస్సు మనది, అది సాధ్యము కాదని మనకు తెలుసు, ఒక మూర్ఖుడుగా ప్రయత్నీమ్చితే ఫలితము ఉంటుందా ? మొండి వాదనకు దిగటం తప్ప,  అది అవసరమా ?

కుండ నీళ్లలో ఉన్న సూర్యుణ్ణి పట్టలేము, తలయెత్తి నింగి నున్న సూర్యుణ్ణి చూడలేము కానీ నిత్యమూ దర్శనముగా ప్రత్యక్షంగా కనిపించే దేవుణ్ణి ఒక్కసారి రెండు చేతులతో నమస్కరించుటే మనం చేయగల నిజ స్థితి . 

అదేవిధముగా ప్రతిఒక్కరు తన తోటి వారికి వెలుగు చూపటం నేర్చు కోవాలి, కొవ్వొత్తి వెలుగు చూపి కరిగినట్లు మనం పరులకు సహాయం చేయటం, వెలుగును పంచటం వళ్ళ కష్టములు ఎదురైనా సంతృప్తి వళ్ళ మానవులకు జీవనా ధారము అని గమనించాలి .    

సర్వే జానా సుఖినో భవంతు ... ఓం శాంతి: శాంతి: శాంతి:

--((*))--

రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే? ..2 


:::::::::::::::::::::::::::::::::::::::
భాగవతం, మహాభారతం
:::::::::::::::::::::::::::::::::::::::
1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్

11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.

21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.

31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, 
రాజస్థాన్.
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.

41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.

:::::::::::::

రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే? ..2 

మానవులు సుఖములను ఆశించు, ఆశతో క్రీడించి, "క్రీడలో జంట ఆలింగనమే సౌఖ్యమని భ్రమించి "

"మదిన మమతను చూపియు, ఊరడించియు, అనురాగపు ప్రేమ కూపములో చిక్కుటే"  

" సమస్యలు మంచగా , భయాన్ని తోడుగా, ఆరోగ్యము ధైర్యముగా సంతోష పరా ఆలింగనము కొరకు వెంపర్లాటలు అవసరమా ",    

"అమ్మ నాన్న అరిచారని, అలిగిన వేళ, ఆలోచన లేని విధముగా చేయు పనులు అవసరమా, ఆప్తుల కలయికలు, కలయిక లో నవ్వులు, నవ్వులు ఎప్పటికీ పువ్వులు కావు అవసరానికి పనికి రానివే,  విరహ వేదన తోను  బాధ కలిగినను ఊరట ఆలింగనము " 

కలియుగములో అత్యవసరము తప్పదు ఒకరికొకరు జీవితము సాగించుట వీర పోరాట మున

పోరాడు పటిమను చూపి ధరణి భారమును తగ్గించుట ధర్మము.  


"మాఘ మాసము మధురంతొ చరిత తెలుపు 

బ్రహ్మ తెలిపేటి వేళలు కలల తలపు 

వెన్నెల విరజిమ్ము టవని ల్లొ  హాయి 

నేల పువ్వుల పాన్పుగా సుఖము పంచు "  


నవ్వు కొనుచు,  పాపల కేరింతలు "కేరింతలతో ఆలింగనము" లో సౌఖ్యము 
మంచు నీరుగా మారినట్లు, నీరు వేడి తగలగానే మాయ మయినట్లు, స్త్రీని పురుషుడు తాకగానే తెలియని అనిర్వచనయమైన ఆనందము నీరులా చాపకింద నీరులా సంసారము సాగి వేడి పెరిగి చల్లఁదనము సహకారము తగ్గి ఉడుకుట యే సౌఖ్యము

ప్రతి మనిషి ఎదో సాధించానని అది నాగొప్పే నని భ్రమలో చిక్కి అందరికి ఎదో చెప్పాలని అనుకుంటాడు కానీ, తాను అల్లుకున్నటువంటి గూటిలో, తానే చిక్కుకుని అక్కడే మరణించేటటువంటి సాలె పురుగు వలే, తాను అల్లుకున్న గూటిలో తానే చిక్కుకుని, తన మనోజాలంలో తానే చిక్కుకుని, తన మనో భ్రాంతిలో తానే చిక్కకుని, తన బుద్ధిగతమైనటువంటి వివేకాన్ని, అవివేకంగా మార్చుకుని, అజ్ఞానంగా మార్చుకుని, అవిద్యగా మార్చుకుని, అభ్యాస దోషం చేత, అనేకత్వం అనేటటువంటి భ్రాంతికి గురై, అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై, భేద స్థితికి లొంగిపోయి, చిట్టచివరికి మృత్యువు పాలౌతున్నాడు.

తల్లి అవయవాల పేర్లు తెలిపిన, తండ్రి లోక విషయాలు తెలిపినా, గురువు మంచి విషయాలు తెలిపినా, పరమాత్ముడు శాంతిని కల్పించినా గుర్తించ లేని మానవ జన్మ అయినా తనలో ఉన్న దైవాన్ని గుర్తించేవిధముగా ప్రతిఒక్కరు ప్రయత్నిమ్చాలి అదియే దైవ లీల. అదియే ఈరోజు ఆలోచన హేళ . 


" సమ యోన్నతమేగ కసీ తొలగీ  

శ్రమ ఐ నను విశ్వము శాంతిగనే 

సుఖదాం వరదాం సమసౌఖ్యమునే

విదితం వినయం వినువారికియే "  


సర్వే జానా సుఖినో భవంతు ... ఓం శాంతి: శాంతి: శాంతి:

     --(())--

రోజువారీ కధలు .. ప్రాంజలి ప్రభ

📷ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

విశ్వములో జీవితం -1 రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఒక్క సారి ఆలోచిస్తే? ..2 

         

ఉపవాసం చూస్తూ,  తిండి మేస్తూ,  ధ్యానించటం దేనికి మోహనా 

శ్రేష్టమె భుజించాక,  నిద్రపోక.   జపించుట మేలే మోహనా 

బ్రహ్మజ్ఞాని యగుట ఓంకారమనుట, పరబ్రహ్మ ముయె మోహనా   

తాను అల్లిన గూడు, తానే చిక్కి సాలెపురుగు  కూడు లేక మరణించే మోహనా   


తనువు గొప్ప అనుట,  బ్రాంతి డగుట తోను ఆశ పాశ మవ్వు మోహనా 

వివేక మవివేకము, ఏకము సమగమనము,గమనము తప్పితే పతనపు కళ మోహనా 

జ్ఞాని అజ్ఞానిగా, అజ్ఞాని వాదిగా సత్యము పై గ్రహణమ్మే  మోహనా      

అభ్యాస దోషముయె, దోషము నమ్ముటయె, మోసపోవుట జీవితం మోహనా 


అనేకత్వ ఆశలు ఆశలే రోగాలు అశాంతి అవసరమేన మోహనా 

 స్త్రీకి లొంగి పోవుట, ఈ భేద స్థితగుట, స్థితితో దైవాన్ని మరచేను మోహనా 


సంసారము నందు కలుగు దుఃఖములచే  బాధించబడినపుడు. పోగొట్టుకొను మార్గము చెప్పు  సద్గురువు   ఎక్కడ దొరకునా అని ప్రయత్నించును. ఇదే  మోక్షమందు ఆపేక్ష కలుగుట.

మోక్షము అంటే నేను అసంత్రుప్తుడను , అసంపూర్ణుడను అను భావన నుండి విముక్తి.

నేను ఆత్మ స్వరూపుడను , నేను పరిపూర్ణుడను అను జ్ఞానము కలుగుట వలన మాత్రామే ఈ విముక్తి సాధ్యము.

*నేను అనుకొని ఆత్మాభిమాన ముంటె

మనషి మనసుకు పైపైకి శాంతి కలుగు

అహము చేరియు నేనేను అనుచు ఉంటె

మనిషి దిగజారు మనసుయు కలిగి ఉండు


*రంద్రములు ఉన్న వేణువు బోలు గున్న

వేణు వును ఊదితే స్వర శబ్ధ హాయి

జీవితము గాలి వాటము పడవ లాగ

పడవ నడుపుశక్తి మనకు దైవ మిచ్చె

మోక్షమందు ఆపేక్ష లేక  ముముక్షత్వము జిజ్ఞాసగా, తనను తానూ తెలుసుకోవాలి అనే కోరికగా మారినప్పుడు అది సద్గురువు   దగ్గరకు నడిపిస్తుంది.

మనిషి ఆహార విహార యందు ప్రీతి 

నిద్ర మెలుకువ మైధున జ్యాస కలుగు 

యుక్త యుక్తా విచక్షణ పెరిగి ఉండు 

మనసు సంతోష దుఃఖము మేళవింపు 

అనువగు ఆహారము, విహారము, చేష్టలు, కర్మలు యుక్తములు అనబడును. అట్లే నిద్ర, మెలకువ యుక్తములు కావలెను. యోగికి దేహేంద్రియ మనస్సు లందు మెలకువ, వానికి తనయందు నిద్ర, తాను 'నా' యందు నిద్ర, మెలుకువలు కలుగవలెను. ఇది దుఃఖహరమైన యోగము.

గాలి వలన దీపజ్యోతి వెలుగు వొంగు 

ఇంద్రి యాదికర్మల వైపు ప్రజ్ఞ వొంగు

దీప జ్వాల ఊర్ధ్వమునకు గాలి వల్ల 

ప్రజ్ఞలకు సస్వరూపము కలుగు చుండు 

 

 దీపజ్యోతికి వీచే గాలి వైపునకు ఆకారము వంగును. యోగి కాని వానికి ఇంద్రియాది కర్మల వైపునకు ప్రజ్ఞ వంగును. గాలి వీచనప్పుడు దీపమునకు ఊర్థ్వ జ్యోతి స్వరూపము ఏర్పడును. ఇది స్వస్వరూపము. అట్లే యోగికి తన యందు సమస్త ప్రజ్ఞలకు స్వస్వరూపము ఏర్పడును.

సద్గురువు వలన  ఆత్మ జ్ఞానము తెలసికొనుట ద్వారా అహంకారము మొదలుకొని  స్తూల  దేహము వరకు ప్రతి దశలోను తాధాత్మ్యత చెందుట వలన బంధము కలుగుచున్నది, ఇదే సమస్త దుఃఖములకు  మూలము అని గ్రహిస్తాడు.

 స్వస్వరూపం గుర్తించుట ద్వారా అజ్ఞానము చేత కల్పించబడిన బంధములను  తోలగించుకోవాలి  అనే  కోరిక కలుగుతుంది. అదే  ముముక్షత్వము.

--(())--


🙏🙏🙏🙏🙏

🌹🌹🌹🌹🌹

భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది ?


 భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పేది ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం లోకం గాలిస్తానంటారు. కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.


దానలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. దీనివల్ల తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), భీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మనవ వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరికి   చస్తే పాతిపెట్టాల్సింది ఈభుమిలోనే. 


 సువర్ణదానం : ఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారు పేరు   మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.


అన్నదానం : ఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.


దేవుడంటే ఏంటి?


పూజ చేయకపోతే ఏమవుతుంది? అని.

చిన్నపిల్లలే కాదు .నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది..

మన పెద్దవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.

" అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని.

మనకు భగవంతుని గురించి అవగాహనలేనప్పుడు.చెప్పడం చేతగానప్పుడు..l 

మనంవాడే మాట అదే.

 

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా.

మనం చెప్పాల్సిన సమాధానం  అది కాదు..

తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.... 

 

పూజ అనేది కూడా ఒక

యోగ ప్రక్రియ.మనసుతో చేసే 

వ్యాయామం

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి..మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే  ప్రక్రియ..

దీప ప్రజ్వలనం అనేది.. త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు

నూనె దీపాన్ని తదేకంగా చూస్తే, కంటి జబ్బులను అరికట్టవచ్చుఅని పెద్దలు చెప్పిన మాట..

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే, నాలుక మొద్దుబారదు..

అది నాలుకకు వ్వాయామం.. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది..

ధారణ శక్తి పెరుగుతుంది..

భాష మీద పట్టు పెరిగితే, స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది. 


పూజ అంటే  చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని  చెప్పండి..

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి..........

అదే సమయంలో మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.


సర్వేజనా సుఖీనోభవంతు 

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏


[21:14, 14/02/2021] +91 95058 13235: 14.2.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఒకటవ అధ్యాయము

బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
41.46 (నలుబది ఆరవ శ్లోకము)

భవంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరమ్

అవతీర్ణావిహాంశేన క్షేమాయ చ భవాయ చ॥9863॥

"మీరు ఈ సమస్త జగత్తునకు మూలకారణము. ఈ ప్రపంచముయొక్క అభ్యుదయము కొఱకును, సాధుపురుషుల యోగక్షేమముల కొఱకును మీ జ్ఞాన, బల, ఐశ్వర్యాది అంశములతో సంకల్పమాత్రమున మీరు ఈ లోకమునందు అవతరించిన మహాత్ములు".

41.47 (నలుబది ఏడవ శ్లోకము)

న హి వాం విషమా దృష్టిః సుహృదోర్జగదాత్మనోః|

సమయోః సర్వభూతేషు భజంతం భజతోరపి॥9864॥

41.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

తావాజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణి వామ్|

పుంసోఽత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే॥9865॥

"మీరు ఈ అఖిల జగత్తునకు ఆత్మస్వరూపులు, హితైషులు. మిమ్ములను సేవించెడివారిపై మీకుగల అనుగ్రహము అపారము. ఐనను మీరు ఎవ్వరియెడలను ద్వేషభావమును వహింపక సకలప్రాణులపట్లను సమదృష్టినే కలిగియుందురు. నేను మీ సేవకుడను. నేను మీకు ఎట్టి సేవలు చేయవలెనో ఆజ్ఞాపింపుడు. జీవులను ఏదైనను కార్యమునందు నియోగించుటయనగా మీరు వారిని అనుగ్రహించుటయే యగును".

41.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)

ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః|

శస్తైః సుగంధైః కుసుమైర్మాలా విరచితా దదౌ॥9860॥

పరీక్షిన్మహారాజా! ఇట్లు విన్నవించిన పిమ్మట సుదాముడు వారి అభిమతములను గ్రహించి, పరిమళభరితములగు పుష్పములతో సిద్ధపఱచబడిన మాలలను మిగుల భక్తిశ్రద్ధలతో ఆ మహానుభావులకు సమర్పించెను.

41.50 (ఏబదియవ శ్లోకము)

తాభిః స్వలంకృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ|

ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్॥9857॥

సుదాముడు ప్రేమానురాగములతో సమర్పించబడిన పూలమాలలను బలరామకృష్ణులు తమ అనుచరులతో సహా ధరించిరి. అతని సేవలకు వారు మిగుల సంతృప్తులైరి. భక్తులకు కోరిన వరములను ప్రసాదించెడి ఆ మహాపురుషులు తమకు ప్రపత్తితో ప్రణమిల్లిన ఆ సుదామునకు పెక్కు వరములను అనుగ్రహించిరి.

41.51 (ఏబది ఒకటవ శ్లోకము)

సోఽపి వవ్రేఽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని|

తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్॥9868॥

అప్పుడు ఆ మాలాకారుడు కృష్ణప్రభువును ఇట్లు అర్ధించెను- 'స్వామీ సకల చరాచరాత్మకమైన జగత్తునకు ఆత్మస్వరూపుడవైన నీయందు (నీ పాదారవిందములయందు) అచంచలమైన భక్తిని నాకు ప్రసాదింపుము. నేను నీ భక్తులయందు ప్రగాఢమైన మైత్రియు సకల ప్రాణులయెడ అహేతుక దయను కలిగియుండునట్లు అనుగ్రహింపుము,

ఈ సందర్భమున పోతనమహాకవి  రచించిన ఈ పద్యము తెలుగువారి నాల్కలపై నాని నాని, వారి హృదయములలో అమృతపుసోనలను నింపినది.

కంద పద్యము

నీ పాద కమల సేవయు ,
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూత దయయను ,
తాపస మందార నాకు దయసేయగదే

భావము

"ప్రభూ! నీవు తాపసులకు కల్పవృక్షమువంటివాడవు. నీ పాదకమలములను సేవించుచుండెడి భాగ్యమును నాకు ప్రసాదింపుము. నిన్ను సేవించెడి భక్తులతో మైత్రిని అనుగ్రహింపుము (నన్ను నీ దాసానుదాసునిగా ఆదరింపుము). నాకు ప్రాణులయెడలను అపారమైన దయయుండునట్లుగా చూడుము".

(దశమస్కంధము, పూర్వార్ధము)

41.52 (ఏబది ఒకటవ శ్లోకము)

ఇతి తస్మై వరం దత్త్వా శ్రియం చాన్వయవర్ధినీమ్|

బలమాయుర్యశఃకాంతిం నిర్జగామ సహాగ్రజః॥9869॥

ఇట్లు సుదాముడు వేడుకొనగా, అతడు కోరుకొనిన వరములను ఇచ్చుటయేగాక- శ్రీకృష్ణుడు అతనికి వంశాభివృద్ధికరములైన సకలసంపదలను, చక్కని బలమును, దీర్ఘాయువును, యశస్సును, ఘనమైన తేజస్సును ఒసంగెను. పిమ్మట ఆ స్వామి బలరామునితోగూడి అతని గృహమునుండి బయలుదేఱి వెళ్ళెను.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే పురప్రవేశో నమైకచత్వారింశోఽధ్యాయః (41)

ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట యను నలుబది ఒకటవ అధ్యాయము (41)

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[04:04, 15/02/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[04:04, 15/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

817వ నామ మంత్రము 15.02.2021

ఓం సత్యవ్రతాయై నమః

నిత్యము, సత్యమైన పరబ్రహ్మమే ఇష్టముగా గల తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి సత్యవ్రతా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం సత్యవ్రతాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు అనుగ్రహించును.

పరబ్రహ్మము అంటేనే సత్యము.  అటువంటి పరబ్రహ్మమే ఇష్టముగా గలిగినది పరమేశ్వరి. ఇంకనూ చెప్పాలంటే సత్యవాక్పరి పాలనయందు ఇష్టముగా గలది.  సత్యవాక్పరి పాలకులైన తన భక్తులు కూడా అమ్మవారికి ఇష్టమే. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని ఋణము తీర్చుటకై వారణాసిలో,  కాశీ విశాలాక్షి శక్తి సాక్షిగా తన భార్యాబిడ్డలను విక్రయించాడు.  దొంగతనము నేరముతో రాజు హరిశ్చంద్రుని భార్యకు మరణ దండన విధించగా,  రాజాజ్ఞను  అనుసరించి తనచేతి కరవాలముతో తన భార్య శిరస్సును తానే ఖండింప సిద్ధమయాడు ఆ హరిశ్చంద్రుడు. అతని సత్యసంధతకు ఆ కాశీవిశాలాక్షి సంతసించి హరిశ్చంద్రుని యొక్క పోగొట్టుకున్న రాజ్యము, చనిపోయిన పుత్రుని జీవమును తిరిగి అనుగ్రహించినది ఆ తల్లి కాశీవిశాలక్షీ స్వరూపురాలైన జగన్మాత. సత్యసంధత (సత్యవ్రతము) అనిన అంత ప్రియము గలిగినది పరమేశ్వరి. గనుకనే అమ్మవారు సత్యవ్రతా యని అనబడినది.

పరబ్రహ్మము అంటేనే నిత్యము, సత్యము, అనంతము. వీనిలో సత్యమునకు అత్యంత ప్రాధాన్యత గలదు. గనుక పరబ్రహ్మ స్వరూఫిణియైన జగన్మాతకు సత్యమనిన ఇష్టమైన వ్రతముగా గలది. గనుక పరమేశ్వరి సత్యవ్రతా యని అనబడినది.

పరమేశ్వరి సత్యవ్రతుడను బ్రాహ్మణ స్వరూపురాలు

సత్యవ్రతుని కథ

కోసల దేశములో దేవదతద్తుడనే వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాలనూ ఆకళింపు చేసికొని, ప్రశాంత జీవనం గుడుపుతూ వచ్చాడు. నగరంలోని సంపన్నుల ఆదరాభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటూ లేదు. కాని, సంతానం లేక అసంతృప్తితో అలమటించి పోయేవాడు దేవదత్తుడు.

ఒకనాడు అతడు తనలో తాను విచారించ సాగాడు. ఏ జన్మలోనో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయినదని విలపించాడు. ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత, యజ్ఞాదుల చేత, దానధర్నాల చేత అధిగమించవచ్చు. సంచిత కర్మలను దైవప్రార్థనల చేత , తీర్థయాత్ర చేత, పుణ్యకర్మాచరణం చేత, సత్యవాక్పాలనం చేత జయించవచ్చు, కాని ప్రారబ్ధకర్మను ఎంతటి వారికైనా అనుభవింపక తప్పదు కదా ! అనుకుంటూ, ఇంత వరకు పాపఫలాన్ని అనుభవించిన తాను ఇకపై యథావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తి ని పొంద గలనని సంకల్పించాడు దేవదత్తుడు.

ఒక సుముహూర్తాన దేవదత్తుడు తమసానదీ తీరంలోఒక వేదికను నిర్మించుకొని, వేదవేదాంగ విదులైన బ్రాహ్మణులను పిలిపించి యాగం ప్రారంభించాడు. పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింప చేయవలసినదని, తాను పుష్కలంగా దక్షిణలిచ్చి, సంతోష పెట్టగలనని వేదవిప్రులకు విన్నవించాడు. గోభిలుడు ఉద్గాతగా, బృహస్పతి హూతగా, యాజ్ఞవల్క్యుడు ఆధ్వర్యుడుగా యజ్ఞం ప్రారంభమైంది.

యజ్ఞం జరుగుతూ ఉండగా, ఉద్గాత అయిన గోభిలుడు మంత్రోచ్ఛారణ చేస్తూండగా, మధ్యలో శ్వాస అడ్డువచ్చి స్వరభంగం కలిగింది. దేవదత్తుడు ఎంతో బాధపడి "మహాత్మా ! పుత్రార్థినై నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది. నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రోచ్చారణం సాగించండి" అని కోరాడు. దేవదత్తుని మాటలకు గోభిలుడు కోపగించాడు. "శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరములోని మార్పుని దోషంగా భావించి నన్ను అవమానించావు. ప్రతి ప్రాణికీ ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు సహజం కదా! అవి మానవ ప్రయత్నం చేత నివారింప బడేవికావు. అయినా. చేయని తప్పును నా పై మోపి నన్ను అవమానించావు. కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యావిహీనుడై ముర్ఖుడగు గాక!" అని శపించాడు గోభిలుడు.

శాపం వింటూనే దేవదతేతుడు గొల్లున ఏడ్చాడు, జన్మించబోయే కొడుకు మూర్ఖుడైతే, జీవితమంతా దుఃఖమయమే కదా !దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేక

పోయాడు. "మహాత్మా! మీరు ఇలా శపించడం న్యాయమేనా? మూర్ఖుడైన పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకపోవడం కొంత ఉపశాంతిని కలిగిస్తుంది కదా ! బ్రాహ్మణునికి విద్యయే సర్వస్వం కదా ! విద్యావిహీనుడు, మూడ్ఢుడు అయిన బ్రాహ్మణుడు సర్వత్రా నిరాదరింప బడతాడు కదా ! ప్రపంచంలో మార్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా ! కనుక, నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించి, నన్ను అనుగ్రహించండి. " అని ప్రార్థించాడు.

దేవదత్తుని దీనాలాపాలకు గోభిలుని మనస్సు కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా ! సామాన్యుని కోపం రెండు ఘడియల కాలం ఉంటుంది. అధముని కోపం రోజంతా ఉంటుంది. పాపాత్ముని కోపం జీవితమంతా కొనసాగుతుంది. వేద విద్యా సంస్కారంతో పునీతమైన మనస్సు గల గోభిలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు. కోపాన్ని వదలి శాంతించాడు. " నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టుకతో మూర్ఖుడైనా, తరువాత తప్పక మహావిద్వాంసుడు కాగలడ " ని అభయమిచ్చాడు.

కొంత కాలానికి దేవదత్తునికి కుమారుడు జన్మించాడు. తండ్రి అతనికి ఉత్యథుడని నామకరణం చేశాడు. దేవదత్తుడు కుమారునికి ఉపనయనం చేసి వేదవిద్యలను అధ్యయనం చేయడానికి గురువు వద్దకు పంపించాడు. గురువు ఎంతగా బోధించినా ఉతథ్యునికి విద్య అబ్బలేదు. మూర్ఖుడై అటూ ఇటూ సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు.

అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచింది. ఉతథ్యునకు సంధ్యావందనం అలవడలేదు. చదువు అసలే అంటలేదు. వేదవిద్య అతనికి అందని మ్రాని పండే అయింది. ఉతథ్యుణ్ణి చూచి తోటిబాలురు పరిహాసం చేయసాగారు. తల్లిదండ్రులు కూడా ఉతథ్యుని మూర్ఖత్వానికి బాధపడేవారు. ఇలా అందరూ తనను ఏవగించు కోవడం, చులకనగా చూడడం ఉతథ్యుణ్ణి ఆవేదనకు, తర్వాత ఆలోచనకు గురిచేసింది. అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికిచేరి, ఒకచోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించు కోవడం ప్రారంభించాడు. 'నిత్యమూ సత్యమునే పలుకుతాన'ని సంకల్పించి, నిర్జన అరణ్యాలకు బయలుదేరాడు.

ఉతథ్యునిలో నానాటికీ అంతర్మథనం తీవ్రతరం అయింది.

"నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని, నా తల్లిదండ్రులు భావించారు. గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా, నాకు విద్యాగంధం బొత్తిగా అంటక పోవడం దైవయోగం తప్ప మరేమీ కాదు. బ్రాహ్మణ జన్మ పొంది కూడా నా జీవితం నిరర్థకమైంది పూర్వజన్మలో సరస్వతీ దానంగా ఏ బ్రాహ్మణునికీ నేను గ్రంథాలను దానం చేయలేదేమో! ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని . తిరిగి ఇవ్వకుండా, లోభంతో ప్రవర్తించి. తిరిగి ఇచ్చానని అసత్యం పలికానేమో! సరస్వతీ స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో! సభల్లో పండితులను పరిహసించానేమో! పండితుడనేగర్వంతో ఎవ్వరినీ లెక్కచేయకుండా, ఎవ్వరికీ విద్యా దానము చేయకుండా విఱ్ఱ వీగుతూ, కాలం గడిపి ఉంటాను. ఇదంతా పూర్వజన్మ కర్మయోగం వల్ల జరిగింది. మానవుని సంకల్పం దైవబలంచేత వ్యర్థమవుతుంది. త్రిమూర్తులైనా కాలానికి లొంగి పోవలసిన వారే. సత్యవ్రతము గొప్పదని పెద్దలు చెప్తున్నారు. సత్యవ్రతాన్ని స్వీకరించి, అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగిస్తాను." అని ఉతథ్యుడు తనలో తాను నిర్ణయించుకొన్నాడు.

ఇలా కృతనిశ్చయుడై ఉతథ్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా, ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ, తరుముకొంటూ వెళ్ళాడు. ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి'ఏ' 'ఏ' అను ధ్వని వెలువడగా విని, ఆ శబ్దము వింతగా ఉన్నదను కొని ఉతథ్యుడు ఆశబ్దాన్నే మాటిమాటికీ పలుమారులు ఉచ్చరించాడు.

ఉతథ్యుని సతవ్రత దీక్షను పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి శివుణ్ణి కిరాతరూపంలో ఉతథ్యుడున్న ప్రదేశానికి పంపించింది. ఆ మాయా కిరాతుడు పందిని తరుముతూ రాగా, పంది ఉతథ్యుని ఎదురుగానే కిరాతుణ్ణి తప్పించుకొని పోయింది. వెనుక వచ్చిన కిరాతుడు పంది జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని ఉతథ్యుడు కోరాడు. తనకు, తన కుటుంబానికి ఆకలి తీరి, ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని, కనుక, దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకొని , తమ ప్రాణాలను రక్షించవలసిందిగా ఆర్థించాడు.

ఉతథ్యుడు మీమాంసలో పడ్డాడు. పందిజాడ చేప్తే , కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు. తన సత్యవ్రత దీక్షవల్ల హింస జరుగుతుంది. చెప్పకపోతే తనకు అసత్యదోషం సంక్రమిస్తుంది. సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది. అహింసకు ప్రాధాన్యమిస్తే సత్యవ్రతం భంగమవుతుంది. ఉతథ్యునికి కర్తవ్యం

స్ఫురించలేదు. ఒక్కక్షణం ఆలోచించి" ఓయీ! కిరాతుడా !వరాహం జాడ చెప్పమంచున్నావు కదా! చూచేది కన్ను. దానికి చెప్పే శక్తిలేదు. పలికేది నోరు. దానికి చూడగల లక్షణం లేదు. చూచేది ఒకరు, చెప్పేది మఱొకరు. అందువల్ల నీకు లాభంలేదు. "అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించాడు. పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన "ఐ" అను అక్షరములోని అర్థభాగమైన 'ఏ' 'ఏ' అను ధ్వనిని పలుమార్లు ఉచ్చరించిన పుణ్యఫలంగా ఉతథ్యునికి వాగ్భాప బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశీర్వదించి, అంతర్థాన మయ్యాడు పరమేశ్వరుడు.

ఉతథ్యుడు జగన్మాతను వాగ్భవ బీజంతో ఆరాధించి, ఆమె కరుణా కిరమ ప్రసారంచేత "సత్యవ్రతుడు"గా ప్రఖ్యాతిని పొంది, మహా విద్వాంసుడై పరమేశ్వరీ పరిపూర్ణ కృపకు పాత్రుడయ్యాడు.

పరాశక్తి మంత్రాక్షరంలో అర్థబాగాన్ని తెలియకుండా ఉచ్ఛరించిన మాత్రాననే ఆమో అనుగ్రహం కలిగినపుడు, సంపూర్ణంగా యథావిథిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఎంతటిదో ఆలోచించ వలసినదని సూతుడు శౌనకాది మహామునులకు వివరించాడు.

సత్యవ్రతుని కథను చదివినా , విన్నా పరమేశ్వరి అనుగ్రహం వల్ల అలాంటి వారికి పాండిత్యం ఆలోచనా శక్తి కలుగుతాయని ఫలశ్రుతి ని

అనుగ్రహిస్తూ సూతుల వారు ఈ ఉపఖ్యానాన్ని ముగించారు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సత్యవ్రతాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాదభూ పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[04:04, 15/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

242వ నామ మంత్రము 15.02.2021

ఓం చారుహాసాయై నమః

శరత్కాల పున్నమి బింబము వంటి ముఖ సౌందర్యమున మనోహరమైన మందహాసముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి చారుహాసా యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం చారుహాసాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు, ఆ తల్లి వారి జీవితమంతయు ఆనందమయముగా, పరమానందభరితముగా అనుగ్రహించును.

శరత్కాల పున్నమినాటి చంద్రబింబము వంటి శ్రీమాత ముఖబింబములో పగడముల మరియు దొండపండ్ల నూతన కాంతులు గలిగిన పెదవుల నుండి వెడలు మనోహర మందహాసముతో  పరమేశ్వరి తేజరిల్లుచున్నది. అందుకే అమ్మవారు చారుహాసా (మనోహరమైన మందహాసము గలిగినది) యని అనబడినది.

ఆ సుందర వదనం నుండి వెలువడే దరహాస చంద్రికలు భక్తులకు మోక్షానందమును గలిగించును.

28వ నామ మంత్రము మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా అవధులు లేని ఆ దరహాస చంద్రికల   కాంతిప్రవాహంలో కామేశ్వరుని (పరమేశ్వరుని) మనసుకూడా దోచుకున్నది.

ఆ తల్లి చిరునవ్వులు సామాన్యుని భక్తినిగాను, ఆ భక్తిని తన్మయునిగాను, ఆ తన్మయత్వంలో బ్రహ్మానందానుభూతులుగాను చేయును. గనుకనే అమ్మవారు చారుహాసా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చారుహాసాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[04:04, 15/02/2021] +91 95058 13235: 15.2.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది రెండవ అధ్యాయము

శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీశుక ఉవాచ

42.1 (ప్రథమ శ్లోకము)

అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగవిలేపభాజనామ్|

విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాంతీం ప్రహసన్ రసప్రదః॥9870॥

శ్రీశుకుడు చెప్పెను పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిమ్మట ఆత్మీయులతోగూడి రాజమార్గమున సాగిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి ఒకయువతిని జూచెను. ఆమె ముఖము సుందరముగా నుండెను. కాని, ఆమె గూని కలిగి యుండుటవలన కుబ్జ అను పేరుతో పిలువబడుచుండెను. ఆమె  తన చేతులలో చందనాది అనులేపన ద్రవ్యములుగల పాత్రలను పట్టుకొని పోవుచుండెను. సకలప్రాణులపై కరుణరసమును ప్రసరింపచేయుచుండెడి ఆ కృష్ణప్రభువు ఆమెపై కృపజూపుటకై నవ్వుచు ఇట్లు ప్రశ్నించెను.

42.2 (రెండవ శ్లోకము)

కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధు నః|

దేహ్యావయోరంగవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి॥9871॥

"సుందరీ! నీవు ఎవరు? ఈ చందనానులేపనములను ఎవరి కొఱకు తీసికొని వెళ్ళుచున్నావు? యథార్థమును తెలుపుము. మేలైన ఈ అంగరాగములను మా ఇరువురికిని ఇమ్ము. ఇచ్చితివేని త్వరలోనే నీకు మిగుల శ్రేయస్సు కలుగును".

సైరంధ్ర్యువాచ

42.3 (మూడవ శ్లోకము)

దాస్యస్మ్యహం సుందర కంససమ్మతా త్రివక్రనామా హ్యనులేపకర్మణి|

మద్భావితం భోజపతేరతిప్రియం వినా యువాం కోఽన్యతమస్తదర్హతి॥9872॥

అంతట కుబ్జ ఇట్లనెను "సుందరా! నేను కంసుని దాసిని. నన్ను త్రివక్ర అని యందురు. నేను అనులేపనములను అలదుటకై నియమింపబడితిని. నేను సిద్ధపఱచిన చందనాది - అంగరాగద్రవములనిన కంసునకు మిక్కిలి ఇష్టము. అందువలన ఆ రాజు నన్ను ఎంతగానో ఆదరించును. ఈ అంగలేపనములను అలదుకొనుటకు నిజముగా మీరే అర్హులు".

42.4 (నాలుగవ శ్లోకము)

రూపపేశలమాధుర్యహసితాలాపవీక్షితైః|

ధర్షితాత్మా దదౌ సాంద్రముభయోరనులేపనమ్॥9873॥

శ్రీకృష్ణుని రూపవైభవమునకును, సౌకుమార్యమునకును, రసికత్వమునకును, సుందర మందహాసమునకును, మధురాలాపములకును, ఆకర్షణీయమైన చూపులకును ఆ కుబ్జ ముగ్ధురాలయ్యెను. వెంటనే ఆమె మనస్సు కృష్ణపరమయ్యెను. అంతట ఆమె చొక్కమైన (మనోహరమైన)  ఆ అనులేపనములను ఆ ఉభయులకును సమర్పించెను.

42.5 (ఐదవ శ్లోకము)

తతస్తావంగరాగేణ స్వవర్ణేతరశోభినా|

సంప్రాప్తపరభాగేన శుశుభాతేఽనురంజితౌ॥9874॥

పిమ్మట వారు ఆ మైపూతలను నాభికి పైభాగమునగల వక్షస్థలాది అంగములయందు అలదుకొనిరి. శ్రీకృష్ణుడు శ్యామవర్ణశోభితమైన తన శరీరముపై పసుపుపచ్చని అంగరాగములను, బలరాముడు శ్వేతవర్ణరంజితమైన తన దేహముపై ఎర్రని అనులేపనములను పూసికొని తేజరిల్లిరి.

42.6  (ఆరవ శ్లోకము)

ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్|

ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలమ్॥9875॥
అనులేపనములను సమర్పించిన కుబ్జపై కృష్ణభగవానుడు ప్రసన్నుడయ్యెను. తనను దర్శించినందులకు ప్రత్యక్ష ఫలమును ప్రసాదించుటకై వంకరలు తిరిగియున్న (మువ్వంకలతోనున్న) ఆమె దేహమును చక్కజేయుటకై (సర్వాంగసుందరముగా చేయుటకై) ఆ ప్రభువు నిశ్చయించుకొనెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 640  / Bhagavad-Gita - 640 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 57 🌴

57. చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పర: |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త: సతతం భవ ||

🌷. తాత్పర్యం :
సర్వకర్మల యందు నా పైననే ఆధారపడి సదా నా  రక్షణమునందే కర్మ నొనరింపుము. అట్టి భక్తియుతసేవలో సంపూర్ణముగా నా యందే చిత్తము కలవాడగుము.

🌷. భాష్యము  :
మనుజుడు కృష్ణభక్తిభావన యందు వర్తించినపుడు తాను జగమునకు ప్రభువునన్న భావనలో వర్తించడు. వాస్తవమునకు ప్రతియొక్కరు సంపూర్ణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశమునందు సేవకుని వలె వర్తించవలసియున్నది.

సేవకుడైనవాడు కర్మ విషయమున స్వతంత్రతను కలిగియుండక యజమాని ఆజ్ఞానుసారమే వర్తించవలసివచ్చును. అదే విధముగా దివ్య యజమానుడైన శ్రీకృష్ణుని తరపున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టములతో ప్రభావితుడు గాకుండును.

అతడు కేవలము తన విధ్యుక్తధర్మమును ఆ భగవానుని ఆజ్ఞానుసారము ఒనరించుచుండును. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వర్తించియుండెను. కాని శ్రీకృష్ణుడు లేని సమయమున మనుజడు ఎట్లు వర్తించవలెనని ఎవరైనను వాదించు అవకాశము కలదు.

ఈ గీతాగ్రంథమునందు శ్రీకృష్ణభగవానుడు తెలిపిన నిర్దేశానుసారము మరియు ఆ దేవదేవుని ప్రతినిధియైన గురువు యొక్క నేతృత్వములో మనుజుడు కర్మనొనరించినచో శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములో వర్తించిన ఫలమే కలుగుననుట దానికి సమాధానము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 640 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga -  The Perfection of Renunciation  - 57 🌴

57. cetasā sarva-karmāṇi
mayi sannyasya mat-paraḥ
buddhi-yogam upāśritya
mac-cittaḥ satataṁ bhava

🌷 Translation :
In all activities just depend upon Me and work always under My protection. In such devotional service, be fully conscious of Me.

🌹 Purport :
When one acts in Kṛṣṇa consciousness, he does not act as the master of the world. Just like a servant, one should act fully under the direction of the Supreme Lord. A servant has no individual independence.

He acts only on the order of the master. A servant acting on behalf of the supreme master is unaffected by profit and loss. He simply discharges his duty faithfully in terms of the order of the Lord.

Now, one may argue that Arjuna was acting under the personal direction of Kṛṣṇa but when Kṛṣṇa is not present how should one act? If one acts according to the direction of Kṛṣṇa in this book, as well as under the guidance of the representative of Kṛṣṇa, then the result will be the same.
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 290, 291 / Vishnu  Sahasranama Contemplation - 290, 291 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻290. భూతభవ్య భవన్నాథః, भूतभव्य भवन्नाथः, Bhūtabhavya bhavannāthaḥ🌻

ఓం భూతభవ్య భవన్నాథాయ నమః | ॐ भूतभव्य भवन्नाथाय नमः | OM Bhūtabhavya bhavannāthāya namaḥ

యో భూతభవ్యభవతాం భూతానాం నాథ ఈశ్వరః ।
తైర్యాచ్యతే తాంస్తపతి తేషామీష్టేచ శాస్తివా ।
భూతభవ్యన్నాథ ఇతి స ప్రోచ్యతే బుధైః ॥

గడచిన, గడువనున్న, గడచుచున్న కాలములందలి ప్రాణులకు రక్షచేయ శక్తుడు. ఈ మూడు విధములగు ప్రాణులచే ప్రార్థించ బడువాడు. వారిని ఉపతపింప అనగా స్వస్వకర్మానుసారము బాధించ సమర్థుడు. ఆ ప్రాణులను శాసించు అనగా స్వస్వప్రవృత్తులయందు ప్రవర్తిల్లునట్లు చేయువాడు..

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 290🌹
📚. Prasad Bharadwaj

🌻290. Bhūtabhavya bhavannāthaḥ🌻

OM Bhūtabhavya bhavannāthāya namaḥ

Yo bhūtabhavyabhavatāṃ bhūtānāṃ nātha īśvaraḥ,
Tairyācyate tāṃstapati teṣāmīṣṭeca śāstivā,
Bhūtabhavyannātha iti sa procyate budhaiḥ.

यो भूतभव्यभवतां भूतानां नाथ ईश्वरः ।
तैर्याच्यते तांस्तपति तेषामीष्टेच शास्तिवा ।
भूतभव्यन्नाथ इति स प्रोच्यते बुधैः ॥

One who is the master for all the beings of the past, future and present. He is the object of their prayers. He subjects them to ordeals as per their past deeds and He is their master. Or He is the one who exercises discipline, control etc., over them.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 46
Dr̥ṣṭaṃ śrutaṃ bhūtabhavadbhaviṣyat
     Sthāsnuścariṣṇurmahadalpakaṃ ca,
Vinācyutādvastu tarāṃ na vācyaṃ
     Sa eva sarvaṃ paramātmbhūtaḥ. (43)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे षट्चत्वारिंशोऽध्यायः ::
दृष्टं श्रुतं भूतभवद्भविष्यत्‌
     स्थास्नुश्चरिष्णुर्महदल्पकं च।
विनाच्युताद्वस्तु तरां न वाच्यं
     स एव सर्वं परमात्म्भूतः ॥ ४३ ॥

Nothing can be said to exist independent of Lord Acyuta - nothing heard or seen, nothing in the past, present or future, nothing moving or unmoving, great or small. He indeed is everything, for He is the Supreme Soul.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥
Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 291 / Vishnu  Sahasranama Contemplation - 291🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻291. పవనః, पवनः, Pavanaḥ🌻

ఓం పవనాయ నమః | ॐ पवनाय नमः | OM Pavanāya namaḥ

పవనః, पवनः, Pavanaḥ

పవనః పవతామస్మిత్యుక్తేర్గీతాసు యోహరిః ।
భగవాన్ పవతే యస్మాత్తస్మాత్స పవనః స్మృతః ॥

'పవిత్రతను కలిగించువానిలో వాయువు నేనే' అని భగవద్గీతయందు భగవద్‍వచనము. పవిత్రతను కలిగించువాడు. వాయు రూపుడు.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ ।
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31 ॥

నేను పవిత్రమొనర్చువారిలో వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, చేపలలో మకరమును, నదులలో గంగానదిని అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 291🌹
📚. Prasad Bharadwaj

🌻291. Pavanaḥ🌻

OM Pavanāya namaḥ


Pavanaḥ pavatāmasmityuktergītāsu yohariḥ,
Bhagavān pavate yasmāttasmātsa pavanaḥ smr̥taḥ.

पवनः पवतामस्मित्युक्तेर्गीतासु योहरिः ।
भगवान् पवते यस्मात्तस्मात्स पवनः स्मृतः ॥

Makes blow as the wind. One who is the purifier. Says the Gīta.

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Pavanaḥ pavatāmasmi rāmaśśastrabhr̥tāmaham,
Jhuṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī. (31)

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
पवनः पवतामस्मि रामश्शस्त्रभृतामहम् ।
झुषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥

Of the purifiers I am air; among the wielders of weapons I am Rāma. Among fishes too, I am the shark; I am Gangā among rivers.


🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 23 🌹
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పంచభూతాలు - 6 🍀

89. జీవాత్మ తాను ఈ శరీరమును ఆవాసముగా పొంది, తాను వేరైనప్పటికి, ప్రాపంచిక వస్తు సముధాయమును, మాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో శరీరము యొక్క బాహ్య అంగముల ద్వారా అనుభవించు చున్నది. అందువలన ఈ శరీరము మెలుకవ స్థితిలో ఆత్మకు ఒక ఆట వస్తువుగా ఉపయోగ పడుచున్నది.

90. ఈ భౌతిక శరీరము ఆత్మకు ఒక నివాస స్థానము. ఏలానంటే గృహానికి గృహ యజమాని వలె తాను ఈ ప్రాపంచిక వ్యవహారాలన్ని ఈ ఇంటి నుండే కొనసాగించినట్లు.

91. ఈ భౌతిక శరీరము పుట్టుక, పెరుగుదల, చావు అను వివిధ స్థితులతో; కుల, మత, భేదాలతో; రోగాలు వాటి నివారణ చర్యలు; దైవ పూజలు, అవమానాలు, గౌరవాలతో జీవిస్తున్నది.

92. పంచజ్ఞానేంద్రియాలైన కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మములతో భౌతిక పరిజ్ఞానమును పొంది; నోరు, చేతులు, కాళ్ళు మొదలగు కర్మేంద్రియములతో వాటి వాటి ధర్మానుసారము అవి పనిచేయుచున్నవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 33 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 24. పూర్వకథ  - 2 🌻

మానవుని పూర్వ వృత్తాంతము, భూగోళపు చరిత్ర తెలియుటకు బాహ్య పరిశోధనలతోపాటు అంతశ్శోధన కూడ చాల ముఖ్యము. అంతశ్శోధనలో కలుగు దర్శనముల ఆధారముగా బాహ్య పరిశోధనలు నిర్వర్తించుకొన్నచో సూక్ష్మ విషయములు తెలియగలవు. ఒకప్పటి శిఖరములు ఇప్పుడు సముద్ర గర్భమున నున్నవి.

ఇప్పటి ఉన్నత శిఖరములు ఒకప్పుడు సముద్ర గర్భములో నున్నవియే. ఈ భూమి యిప్పటికి రెండుమార్లు జలప్రళయమును, మరి రెండుమార్లు అగ్నిప్రళయమును చవిచూచినది! యుగముల మార్పిడి జరిగినపుడెల్ల కొన్ని నాగరికతలు, కొన్ని భూభాగములు అదృశ్యమై పరిశోధనమునకు అందక నిలచును. పూర్వము ఈ భూమిపై మూడు కన్నులు కల మానవులు యున్నారు. నాలుగు చేతులు, మూడు కన్నులు కలిగిన మానవులు కూడ జీవించిరి.

వారిని సంకేతించుటకే ద్వాపర మున శిశుపాలుడు వికృత రూపమున జన్మించెననియు, కృష్ణ స్పర్శచే అతనికి అప్పుడు జనబాహుళ్యమునకుండిన రూప మేర్పడినదనియు తెలుపబడినది.

పూర్వమేవిధముగ భూఖండములు మార్పు చెందినవో ఇక ముందుకూడ అట్లు మార్పులు చెందుట సంభవము. మానవాకారములకు కూడ ఇట్టి మార్పులు తప్పనిసరి. మార్పు సృష్టియొక్క సహజ లక్షణము కదా!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది   🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

మనోవైజ్ఞానిక  విశ్లేషణ విజయ రహస్యమదే. అది చాలా చిన్నరహస్యమే అయినా, దాని మొత్తం రహస్యమంతా అదే.

మీ అచేతనంలో ఉన్న దానిని సచేతన స్థాయికి తెచ్చేందుకు, మీ ఉనికి చీకటి ప్రపంచంలో ఉన్న దానిని మీకు తెలిసేలా చేసేందుకు మనోవైజ్ఞానిక  విశ్లేషకుడు చక్కగా సహాయపడతాడు. అప్పుడే వాటిని మీరు చూడగలరు, ఇతరులు కూడా చూడగలరు. అవి మీ దృష్టిలో పడగానే వాటికి మృత్యువు ఆసన్నమైనట్లే. మీలో గొప్ప మార్పులు రావాలంటే వాటిని మీరు ఏ ఒక్కరికి వివరించినా సరిపోతుంది. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి.

మనోవైజ్ఞానిక విశ్లేషణకుని మీ వివరాలన్నీ ఎలాంటి దాపరికం లేకుండా చెప్తారు. మనోవైజ్ఞానిక  విశ్లేషణలో మీరుచేసే పని అదే. కానీ, దానికీ పరిమితులుంటాయి. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతానని హామీ ఇచ్చినప్పుడే- అది మనోవైజ్ఞానిక  విశ్లేషణకుని వృత్తి రంగంలో ఒక భాగం.

అలా ప్రమాణం చేసేవారు ఆ వృత్తిని స్వీకరిస్తారు- వాటిని మీరు ఏకాంతంలో అతనికి చెప్పేందుకు సిద్ధపడతారు. అంతా వృత్తిపరమైన పరిమితుల్లోనే జరుగుతుంది కాబట్టి, అది కొన్ని రోజుల్లో ముగించే పని కాదు. అయినా మీకు మేలు జరుగుతుంది. అందుకే మనో విశ్లేషణ చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా అది ఎప్పటికీ పూర్తికాదు, పూర్తయిన దాఖలాలు కూడా ఇంతవరకు లేవు.

ఎందుకంటే, మీ మనో విశ్లేషకులు కూడా పూర్తిగా మనో విశ్లేషణ చేసుకున్నవారు కాదు. ఎందుకంటే, వారుకూడా కొన్ని నిబంధనల పరిమితులకు లోబడి చెప్పినవారే. అందుకే మనో విశ్లేషకుడు మీరు చెప్తున్నవి వినీవిననట్లుగా వింటారు. అయినా మీ మనోభారం తగ్గుతుంది. ఎందుకంటే, వాటిని అతడు ఎవరికీ చెప్పడు. అలా మీకు మేలు జరుగుతుంది.

మీరు మీ వాస్తవాలను- పరిమితులకు లోబడి ఎవరితోనో రహస్యంగా చెప్పడం కాకుండా- మీతో ధైర్యంగా చెప్పుకోగలిగితే మీరు ధార్మికులైనట్లే. సన్యాసమంటే అదే. మీ నగ్నత్వాన్ని మీరు తెలుసుకోవడమే సన్యాసం.

అది అన్నిరకాల పరిస్థితులలోను, సంబంధాలలోను- మీ భార్యతో, బంధువుతో, శత్రువుతో, స్నేహితునితో, అధికారితో, సేవకునితో-నిరంతరాయంగా చేసుకునే స్వీయ మనోవైజ్ఞానిక  విశ్లేషణ. అలా మిమ్మల్నిమీరు తెలుసుకునే పనిలోముందు మీకు నిజంగా అనేక భయాలు కలుగుతాయి.

కానీ, త్వరలోనే మీరు మరింత శక్తిని పుంజుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, ఒకసారి సత్యం బయటపడగానే అది మరింత బలపడుతుంది, అసత్యం అంతరిస్తుంది.

అలా బలపడిన సత్యంతో పాతుకుపోయిన మీరు కేంద్రంగా మారతారు. దానితో మీ వ్యక్తిత్వం అంతరించి మీ వాస్తవ స్వరూపం బయటపడుతుంది. అలా మీరు వాస్తవమైన విశిష్ట వ్యక్తిగా మారడం ప్రారంభిస్తారు.

సామాజిక ఆడంబరాల మెరుగులతో బయటినుంచి వేయబడ్డ ముసుగే మీ వ్యక్తిత్వం. అందుకే అది నకిలీ. మీ విశిష్ట అస్తిత్వమే మీ వాస్తవం. అదే అసలైనది. ఎందుకంటే, మిమ్మల్ని ఆ దేవుడే తయారుచేశాడు. అందుకే అది అద్భుతమైన శక్తితో చాలా పచ్చిగా, దృఢంగా, విశృంఖలంగా ఉంటుంది.

భయం చాలా సహజం. ఎందుకంటే, చిన్నప్పటినుంచే మీకు అవాస్తవాలు బోధించడం జరిగింది. మీరు వాటితోనే ఎక్కువగా గుర్తింపు పొందారు.  వాటిని వదులుకోవాలంటే దాదాపు ఆత్మహత్య చేసుకుంటున్నట్లనిపిస్తుంది.

ఆ గుర్తింపు సంక్షోభంనుంచి బయట పడాలంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే, యాభై, అరవై ఏళ్ళపాటు ఒక రకమైన గుర్తింపుతో ఉన్న మీరు ఇప్పుడు జీవిత చరమాంకంలోకి ప్రవేశించారు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[05:23, 15/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 210 / Sri Lalitha Chaitanya Vijnanam  - 210 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖

🌻 210. 'మహాలక్ష్మీ' 🌻

దేవి వైభవము అని అర్థము. శ్రీదేవి శక్తి స్వరూపిణిగ పార్వతిగను, వైభవరూపిణిగ లక్ష్మిగను, విద్యారూపిణిగ సరస్వతిగను ఆరాధింపబడుచున్నది. సృష్టి వైభవమే శ్రీమహాలక్ష్మి. మహాలుడను రాక్షసుని చంపినందున ఆమె మహాలస, మహాలక్ష్మి అని ప్రసిద్ధి చెందినది. ఆమె అత్యంత సౌందర్యవతి. సర్వమనోహరి కూడ.

ఎప్పుడునూ పదమూడు సంవత్సరముల వయస్సుగల కన్యగ ఆమె గోచరించును. భూమిపైన మహలక్ష్మి పడమటి సముద్ర తీరమున సహ్యాద్రి కొండచరియలలో వసించుచున్నదని పురాణములు తెలుపు చున్నవి. కరవీర పురమున కూడ వసించు చున్నదని పురాణములు తెలుపుచున్నవి. ప్రస్తుతమున ఈ కరవీరపురమును కోల్హాపూర్ అని పిలుచుచున్నారు.

లక్ష్మి అను పదమునకు సంకేతమని అర్థము కలదు. రూపము లన్నియూ సంకేతములే. ఇది ఉప్పు అని, ఇది పప్పు అని రూపమును బట్టే జీవులు గుర్తించు చుందురు. అట్లే ఇతడు ఇంద్రుడని, ఇతడు విష్ణువని రూపములనుబట్టే తెలియబడు చున్నది. కోటానుకోట్ల
రూపములుగ సృష్టి వున్నప్పటికిని అందరి జీవులను, లోకములను గుర్తించుటకు రూపమే ఆధారము. రూపములన్నియూ గుణములను పట్టి ఏర్పడుచున్నవి.

గుణములన్నియూ త్రిగుణముల నుండి పుట్టినవే.  త్రిగుణములు శ్రీమాత యందు పుట్టినవి. మహాలక్ష్మి యనగా శ్రీమాత రూప సంపద. నీరును నీరుగా గుర్తించుటకు, అట్లే అగ్ని, వాయువు, ఆకాశములను గుర్తించుటకు, లోకములను, అందలి జీవులను గుర్తించుటకు ఆవశ్యకత ఎంతయూ కలదు. పులిని - పిల్లిని, కుక్కను - నక్కనూ భేద మెరిగి జీవించుటలో సదుపాయమున్నది.

రూపమును బట్టి గుణమును కూడ అంచనా వేయవచ్చును. పులిని - పిల్లిని అట్లే అంచనా వేయుచున్నాము. మానవుల యందు కూడ వివిధ స్వభావములను (గుణములు) బట్టియే వారి రూపము లేర్పడుచున్నవి. వికృత రూపములు వికృత గుణములను సంకేతించు చుండును. రామ లక్ష్మణులను జూచిన హనుమంతుడు వెంటనే వారిని దివ్యపురుషులుగా గుర్తించెను.

హనుమంతుని చూచిన శ్రీరాముడు అతనిని వెంటనే వేదవిదుడని గుర్తించెను. అట్లే విభీషణుని జూచిన హనుమంతుడు అతనిని సత్పురుషునిగ గుర్తించెను. సృష్టి యందు లక్ష్మీరూపములు, అలక్ష్మీ రూపములు కలవు. వానిని తెలియుటకే సాముద్రిక శాస్త్రము. అలక్ష్మీ రూపముల యందు రజస్తమస్సులు అధికమై యుండును. లక్ష్మీప్రద రూపములందు సత్త్వగుణ మబ్బును. సత్వగుణ మధిక మగుచున్నకొలదీ ఆరాధించు వారి రూపము కూడ తదనుగుణమైన అందము, ఆకర్షణము కలిగి యుండును.

కోతి రూపమున నుండిననూ హనుమంతుడు అందము గనే గోచరించును కదా! అట్లే గజముఖుడగు గణేశుడు. అట్లే ప్రమథ గణములు కూడ. ఇవి విశిష్టమగు లక్ష్మీ రూపములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 210 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahālakṣmī महालक्ष्मी (210) 🌻

The great (mahā) wife of Viṣṇu.  Śiva manifests in the form of Viṣṇu for sustenance and His wife is Mahālakṣmī.  Liṅga Purāṇa says that Mahālakṣmī is the mother of the universe.

 “May Lakśmī who is endowed with all attributes, who has all three characteristics, who is the goodness that bestows all and who is omnipresent, dispel my sin” is a hymn in Liṅga Purāṇa. Mahālakṣmī also means a girl of thirteen years.

If Mahālakṣmī is worshipped on every 13th lunar day (trayodaśa) with Her bīja (śrīṃ- श्रीं), there will no dearth of prosperity and auspiciousness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
https://t.me/ChaitanyaVijnanam
[13:52, 15/02/2021] +91 92915 82862: ఓం నమః శివాయ:
శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ కాశీ విశ్వనాథ స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

1) కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతీ !

 నంది స్కంద గణాధిరాజసహితా శ్రీవిశ్వనాథప్రభుః కాశీమందిరసంస్థితోఽఖిలగురుర్దేయాత్సదా మంగలం !!



2) యో దేవైరసురై ర్మునీంద్రతనయైర్గంధర్వయక్షోరగై- ర్నాగైర్భూతల వాసిభిర్ద్విజవరైః సంసేవితః సిద్ధయే !

 యా గంగోత్తర వాహినీ పరిసరే తీర్థేరసంఖ్యైర్వృతా సా కాశీ త్రిపురారి రాజనగరీ దేయాత్సదా మంగలం !!



 3) తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసారపారాపరా- నందా నంది గణేశ్వరైరుపహితా దేవైరశేషైః స్తుతా !

యా శంభోర్మణి కుండలైకకణికా విష్ణోస్తపోదీర్ఘికా సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయాత్సదా మంగలం !!



4) ఏషా ధర్మపతాకినీ తటరుహాసేవా వసన్నాకినీ పశ్యన్పాతకినీ భగీరథతపః సాఫల్యదేవాకినీ !

 ప్రేమారూఢపతాకినీ గిరిసుతా సా కేకరాస్వాకినీ కాశ్యాముత్తర వాహినీ సురనదీ దేయాత్సదా మంగలం !!



 5)విఘ్నావాసనివాసకారణ మహా గండ స్థలాలంబితః సిందూరారుణపుంజచంద్రకిరణప్రచ్ఛాదినాగచ్ఛవిః !

 శ్రీవిశ్వేశ్వర వల్లభో గిరిజయా సానందకానందితః స్మేరాస్యస్తవ ఢుంఢిరాజముదితో దేయాత్సదా మంగలం !!



 6) కేదారః కలశేశ్వరః పశుపతిర్ధర్మేశ్వరో మధ్యమో జ్యేష్ఠేశో పశుపశ్చ కందుకశివో విఘ్నేశ్వరో జంబుకః !

చంద్రేశో హ్యమృతేశ్వరో భృగుశివః శ్రీవృద్ధకాలేశ్వరో మధ్యేశో మణి కర్ణికేశ్వరశివో దేయాత్సదా మంగలం !!



 7) గోకర్ణస్త్వథ భారభూతనుదనుః శ్రీచిత్రగుప్తేశ్వరో యక్షేశస్తిలపర్ణసంగమశివో శైలేశ్వరః కశ్యపః !

 నాగేశోఽగ్నిశివో నిధీశ్వరశివోఽగస్తీశ్వరస్తారక- జ్ఞానేశోఽపి పితామహేశ్వరశివో దేయాత్సదా మంగలం !!



 8) బ్రహ్మాండం సకలం మనోషితరసై రత్నైః పయోభిర్హరం ఖేలైః పూరయతే కుటుంబనిలయాన్ శంభోర్విలాసప్రదా !

 నానాదివ్యలతా విభూషితవపుః కాశీపురాధీశ్వరీ శ్రీవిశ్వేశ్వరసుందరీ భగవతీ దేయాత్సదా మంగలం !!



9) యా దేవీ మహిషాసురప్రమథనీ యా చండముండా పహా యా శుంభాసుర రక్తబీజదమనీ శక్రాదిభిః సంస్తుతా !

 యా శూలాసిధనుః శరాభయకరా దుర్గాదిసందక్షిణా- మాశ్రిత్యాశ్రితవిఘ్నశంసమయతు దేయాత్సదా మంగలం !!



10) ఆద్యా శ్రీర్వికటా తతస్తు విరజా శ్రీమంగలా పార్వతీ విఖ్యాతా కమలా విశాల నయనా జ్యేష్ఠా విశిష్టాననా !

 కామాక్షీ చ హరిప్రియా భగవతీ శ్రీఘంటఘంటాదికా మౌర్యా షష్టిసహస్ర మాతృసహితా దేయాత్సదా మంగలం !!



11) ఆదౌ పంచనదం ప్రయాగ మపరం కేదార కుండం కురు- క్షేత్రం మానసకం సరోఽమృత జలం శావస్య తీర్థం పరం !

 మత్స్యోదర్యథ దండఖాండసలిలం మందాకినీ జంబుకం ఘంటాకర్ణ సముద్ర కూప సహితో దేయాత్సదా మంగలం !!



 12) రేవాకుండ జలం సరస్వతిజలం దుర్వాసకుండం తతో లక్ష్మీతీర్థ లవాంకుశస్య సలిలం కందర్ప కుండం తథా !

 దుర్గాకుండమసీజలం హనుమతః కుండప్రతాపోర్జితః ప్రజ్ఞానప్రముఖాని వః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 13) ఆద్యః కూపవరస్తు కాలదమనః శ్రీవృద్ధకూపోఽపరో విఖ్యాతస్తు పరాశరస్తు విదితః కూపః సరో మానసః !

జైగీషవ్యమునేః శశాంకనృపతేః కూపస్తు ధర్మోద్భవః ఖ్యాతః సప్తసముద్ర కూపసహితో దేయాత్సదా మంగలం !!


 14) లక్ష్మీ నాయక బిందుమాధవహరి ర్లక్ష్మీనృసింహస్తతో గోవిందస్త్వథ గోపికాప్రియతమః శ్రీనారదః కేశవః !

 గంగాకేశవ వామనాఖ్యతదను శ్వేతో హరిః కేశవః ప్రహ్లాదాదిసమస్తకేశవగణో దేయాత్సదా మంగలం !!



 15) లోలార్కో విమలార్కమాయుఖరవిః సంవర్తసంజ్ఞో రవి- ర్విఖ్యాతో ద్రుపదుఃఖఖోల్కమరుణః ప్రోక్తోత్తరార్కో రవిః !

 గంగార్కస్త్వథ వృద్ధవృద్ధివిబుధా కాశీపురీసంస్థితాః సూర్యా ద్వాదశ సంజ్ఞకాః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 16) ఆద్యో ఢుంఢివినాయకో గణపతిశ్చింతామణిః సిద్ధిదః సేనావిఘ్న పతిస్తు వక్త్రవదనః శ్రీపాశపాణిః ప్రభుః !
 ఆశాపక్షవినాయకాప్రశకరో మోదాదికః షడ్గుణో లోలార్కాది వినాయకాః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 17) హేరంబో నలకూబరో గణపతిః శ్రీభీమచండీగణో విఖ్యాతో మణికర్ణికాగణపతిః శ్రీసిద్ధిదో విఘ్నపః !

 ముండశ్చండముఖశ్చ కష్టహరణః శ్రీదండహస్తో గణః శ్రీదుర్గాఖ్యగణాధిపః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 18) ఆద్యో భైరవభీషణస్తదపరః శ్రీకాలరాజః క్రమా- చ్ఛ్రీసంహారక భైరవస్త్వథ రురుశ్చోన్మత్తకో భైరవః !

 క్రోధశ్చండకపాల భైరవవరః శ్రీభూత నాథాదయో హ్యష్టౌ భైరవ మూర్తయః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 19) ఆధాతోఽమ్బికయా సహ త్రినయనః సార్ధం గణైర్నందితాం కాశీమాశు విశన్ హరః ప్రథమతో వార్షధ్వజేఽవస్థితః !

 ఆయాతా దశ ధేనవః సుకపిలా దివ్యైః పయోభిర్హరం ఖ్యాతం తద్వృషభ ధ్వజేన కపిలం దేయాత్సదా మంగలం !!



 20) ఆనందాఖ్య వనం హి చంపకవనం శ్రీనైమిషం ఖాండవం పుణ్యం చైత్రరథం త్వశాకవిపినం రంభావనం పావనం !

 దుర్గారణ్యమథోఽపి కైరవవనం వృందావనం పావనం విఖ్యాతాని వనాని వః ప్రతిదినం దేయాత్సదా మంగలం !!



 21) అలికులదలనీలః కాలదంష్ట్రాకరాలః సజలజలదనీలో వ్యాలయజ్ఞోపవీతః !

అభయవరదహస్తో డామరోద్దామనాదః సకలదురితభక్షో మంగలం వో దదాతు !!



 22) అర్ధాంగే వికటా గిరీంద్రతనయా గౌరీ సతీ సుందరీ సర్వాంగే విలస ద్విభూతిధవలో కాలో విశాలేక్షణః !

 వీరేశః సహనందిభృంగిసహితః శ్రీవిశ్వనాథః ప్రభుః కాశీమందిర సంస్థితోఽఖిలగురుర్దేయాత్సదా మంగలం !!



23) యః ప్రాతః ప్రయతః ప్రసన్నమనసా ప్రేమప్రమోదాకులః ఖ్యాతం తత్ర విశిష్టపాదభువనేశేంద్రాదిభిర్యత్స్తుతం !

 ప్రాతః ప్రాఙ్ముఖ మాసనోత్తమగతో బ్రూయాచ్ఛృణోత్యాదరాత్ కాశీవాస ముఖాన్యవాప్య సతతం ప్రీతే శివే ధూర్జటి !!


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాశీ విశ్వనాథస్తోత్రం

🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment