Tuesday, 16 February 2021

16--02--2021

 

 Album No. - 170 Rama Hanuman | Lavanya Pictures | Flickr

చిన్నపిల్లలకి పెద్దలు చెప్పే కథ, "రాజుగారికి ఏడుగురు కొడుకులు -వేటకివెళ్ళి ఏడు చేపలు తేవడం" చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ, మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ. ఈకథలోని వేదాంత తాత్వికత, పరమార్ధం, భగవద్గీత మూలంనుండి:

ఎవరో పంపితే అందరికీ పంచాలనిపంచింది.

ఓపికగా చదవితే మీకు కూడ పంచాలనిపించుతుందేమో!

అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు.

ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.

వేటాడిన చేపలను ఎండబెట్టారు.

అందులో ఒక చేప ఎండలేదు.

చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు.

గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.

గడ్డిమేటూ, గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు.

ఆవు మేయలేదు అంది.

ఆవా, ఆవా ఎందుకు మేయలేదు అని అడిగారు

గొల్లవాడు నన్ను మేపలేదు అంది.

గొల్లవాడా, గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.

అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు.

పిల్లవాడు ఏడ్చాడు అంది.

పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ అని అడిగారు.

చీమ కుట్టింది అన్నాడు.

చీమా చీమా  ఎందుకు కుట్టావ్‌ అన్నారు.

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.

ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...

కారణాలు‌ అడగకుండా, ఆలోచించకుండా చెప్పే, వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.

నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది.

అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా! అని ఎవరూ తర్కించరు.  మీరు చెప్పినపుడు మీరూ ఆలోచించి ఉండరు.

చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం.

వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా, అనే సందేహం కూడా రాదు.

ఎవ్వరూ అడగలేదు కదా అని వివరించక పోవడం  విజ్ఞుల లక్షణం కాదట.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనించమంటున్నారు. అలా గమనిస్తే, అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి.

ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.

కొడుకులు వేటకు వెళ్ళడం అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.

జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే అరిషడ్వర్గాలు: 1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ  5.మద 6.మాత్సర్యాలు

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.

అందుకే కథలో ఆరు  చేపలను  ఎండగట్టినట్టు చెప్పారు.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.

ఏమిటా చేప. అది మనస్సు  

దీన్ని జయించడం చాలా కష్టం.

ఎంత ప్రయత్నించినా అది ఎండదు.

మనస్సు  అంటే ఏమిటి?

మనస్సు అంటే సంకల్ప వికల్పాలు

ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.

మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.

కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.

ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.

ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏమిటి?

గడ్డిమేటు

గడ్డిమేటు అంటే ఏమిటి?

కుప్పపోసిన అజ్ఞానం.

గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా?

మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.

కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే!!

ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.

దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.

మరి అది పోవాలంటే ఏం చేయాలి?

ఆవు వచ్చి మేయాలి.

ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి?

ఆవు అంటే జ్ఞానం.

జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.

లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)

జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.

 ఈ గోవును ఎవ్వరు మేపాలి?

గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు?

సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.

జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా!!

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.

ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.

ఏమిరా నాయనా, ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు?

అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.

ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.

ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.

ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు?
ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు?

వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా?

దానికి ఇంకోపేరే సంసారం.

సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.

ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన  తన విధిని నిలిపి వేసాడా? లేదు.
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,

మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.

చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట?

మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.

ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

 సర్వేజనా సుఖినోభవంతు

🌹🌹🌹🌹🌹


తేదీ :16-02-2021 మంగళావారం రోజున🍁
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🌺మాఘ పురాణం - 5 వ భాగం🌺
🌹మృగ శృంగుని చరిత్ర🌹
ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక ‘కౌత్సు’డని పిలవబడుచున్ననూ ఆతనిని “మృగశృంగు”డను పేరుతొ పిల్చుచుండిరి. అదెటులనగా అతడు కావేరీ నదీతీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా! అప్పుడాతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకొను సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే నతనిని గీకెడివి. అందుచేత అతనికి ‘మృగశృంగు’డను పేరు సార్ధకమయ్యెను.
వివాహమాడు కన్య గుణములు
మృగశృంగునాకు యుక్తవయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలెనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగ శృంగుడు వారిమాట లాలకించి ఇట్లు పలికెను. “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయము గూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణ మేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికీ ఉదాహరణగా స్త్రీయెటులుండవలయుననగా –
శ్లో: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా
శయనేషు రంభా రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ!
ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లి వలెను, రూమున లక్ష్మి వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ ఆరువిధముల వ్యవహరింప వలెను.
అంతియేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవసరం. ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏవిధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకొనే ముందు కన్యయోక్క గుణగణములు తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమయినది. కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక, అట్టి మనుజుడు ధర్మ-అర్థ-కామ-మోక్షములను అవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై యున్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూపమునకే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగాగ్రస్తురాలై ఉండకూడదు. యెంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవా బ్రాహ్మణులను పూజించునదియై, అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు. గాన అటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదెటుళ సాధ్యపడును? అని మృగ శృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో నున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరల ఇట్లు పలికెను. “కుమారా! నీమాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న ణా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము” అని పలికెను.
--(())--
మహాభారతం 16 వ భాగం కౌరవ పాండవ బాల్య క్రీడలు
=====================================
పాండవులు ఐదుగురు ధృతరాష్ట్ర రాజభవనంలో ఏ విధమైన కొరత లేకుండా ఎదుగుతున్నారు. పెద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు ఏ భేదభావం ప్రకటించకుండా తన కుమారుల వలె వారిని అలరిస్తున్నాడు.
హస్తినాపురం చేరాక పాండవులకు వేదోక్త సంస్కారాల లన్నీ జరిపించ బడ్డాయి. కౌరవ పాండవులందరు కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ పెరుగుతున్నారు అందరికన్నా అత్యధికంగా భోజనం చేయడం వల్ల భీముడు " మృష్టాన్న భోజనుడు "   అని ...ఎంత తిన్నా అతని పొట్ట తోడేలు తీరుగా ఉండడం వల్ల " వృకోధరుడు "అని పిలువబడుతూ ఉండేవాడు
కురుపాండవ క్రీడా సమయాలలో,పరుగు పందాలలో, పాద ఘట్టన క్రీడలలో భీమసేనుడు కౌరవకుమారులను తన పాద ఘట్టంతో మర్ధించేవాడు. కౌరవులందరినీ పట్టుకొని పాండవుల తలలతో వారి తలలను ఢీ  కొట్టించేవాడు. మహాబలులైన కౌరవ సోదరులలో 10 ,15 మందిని... వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేల మీద ఈడ్చేవాడు.స్నాన సమయాలలో కూడా ఐదారు గురు కౌరవులను,తన చంకలలో ఇరికించుకొని నీళ్ళలో ఉంచి తేల్చేవాడు. కౌరవులు చెట్లు మీద ఆడుతూ ఉంటే భీముడు తన పాదాలతో తన్నేవాడు అతని తన్నుకు చెట్లు ఊగిపోయి పైనుండి ఫల పుష్పాదులతో సహ కౌరవులు కూడా క్రింద పడేవారు..... నిజానికి ఇవన్నీ కూడా భీముడు బాల్యచాపల్యం తో సాగించిన క్రీడలు... కానీ ఇవన్నీ కూడా దుర్యోధనుని గుండెల్లో చెరగని ముద్రలు గా నిలిచిపోయాయి, ద్వేషాగ్నులను రగిలింప చేశాయి. ఎలాగైనా సరే భీముని అడ్డు లేకుండా చేయడం ఎంతైనా తనకు మేలు చేస్తుందని భావించాడు దుర్యోధనుడు.
భీముని చంపుట కై దుర్యోధనుని పన్నాగములు
-----------------------------------------------------------------
పాండవుల మీద పగ పెంచుకుంటున్న దుర్యోధనుడు శకుని దుశ్శాసనుల తో ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు గంగానదీ తీరంలో " ప్రమాణ కోటితీర్థం " దగ్గర ఉన్ని - నూరు వస్త్రాలతో గుడారాలను నిర్మింపజేసి దానికి  "ఉదక క్రీడనం " అని పేరు పెట్టి జలక్రీడల కు రమ్మనమని పాండవులను ఆహ్వానించాడు. అక్కడ ఆడి పాడి అలసి నిద్రపోయిన భీముడి ని గుట్టుచప్పుడు కాకుండా తాళ్లతో బంధించి గంగా నదిలో పడేశారు. భీముడు కట్లు తెంచుకుని పైకి వచ్చాడు.
మరునాడు నిద్రపోతున్న సోదరుడిని పాముల చే కరిపించ బోయారు చటుక్కున మెలకువ వచ్చి పాము లన్నింటిని చంపేశాడు కానీ తను చావలేదు ఆ ప్రయత్నంలో భాగంగా అన్నంలో విషం కలిపి పెట్టారు పడిపోయిన మారుతి మంచి మంచి మోకులతో కట్టివేసి, గంగ లో విసిరేశారు. పావని సరాసరి నాగలోకంలో పడ్డాడు. విషం జీర్ణం అయిపోయి  భీమునికి మెలకువ వచ్చేసింది.లేచి నిలబడ్డ బాల భీముని చూసి అక్కడ గల నాగ సైనికులు వీడెవడో  పరాయివాడు మా లోకం మీదికి వచ్చాడు అనుకొని భీముని కాటు వేశాయి.
వజ్ర శరీరుడైన భీముని కరచిన నాగులకు కోరలు ఊడిపోయాయే కానీ అవి ఆయన శరీరం లో దిగ లేకపోయాయి....
ఈ ఘటనతో నాగులు భయపడిపోయి తమ రాజు ఆర్యకుడి వద్దకు పరుగులు పెట్టాయి. విషయం తెలుసుకున్న ఆర్యకుడు అంతటి బలశాలి ఎవరో చూద్దామని వచ్చాడు. అతడు వచ్చి భీముని చూసి ఆనందించాడు.కుంతికి కన్న తండ్రి అయినా సూర్యసేనుడికి ఆర్యముడు తాతగారు అవుతారు. ఆ బాంధవ్యయంతో తన మునిమనవరాలైన కుంతీ కొడుకును యిట్టే  పోల్చేసుకున్నాడు. అతనికి బలవర్ధక రసం ఇవ్వవలసిందిగా నాగులను జ్ఞాపించాడు . ఎనిమిది కుండల నాగాంమృతాన్ని ఎనిమిది గుటకల్లో తాగి , ఎనిమిది రోజుల పాటు అక్కడే నిద్రపోయి 9వ రోజున లేచాడు. ఆర్యకుడిచ్చిన, తెల్లని పాల నురుగు లాంటి దుస్తులు మరియు తెల్లని పూలమాలలు ధరించి , నాగులు గంగాతీరాన దింపగా ...మెల్లగా నగరోన్ముఖుడు అయ్యాడు. అప్పటికే ... భీముని జాడ తెలియక కలవరపడుతున్న కుంతీ యుధీష్టరులు -  రహస్యంగా వచ్చిన భీముని  చూసి ఆనందించారు. జరిగినదంతా అమ్మకు అన్నయ్యకు చెప్పాడు భీముడు. " సర్లే ఈ  విషయం ఎవరికీ చెప్పకు. ఏమీ తెలియని వాడిలాగా ఉండు "  అని హితవు చెప్పాడు యుధీష్టరుడు. అన్నయ్య చెప్పినట్లు నడుచుకో అంది కుంతీ.
రోజులు ఇలా దొర్లుతున్నాయి పాండవుల్ని నాశనం చేయడానికి దుర్యోధనుడి ఎత్తు లేమి సాగడం లేదు. ఇదిలా ఉండగా భీష్ముడు కురుపాండవులకు అస్త్ర విద్యా భ్యాసం నిమిత్తంగా కృపాచార్యుల ను మరియు ద్రోణాచార్యులను నియమించాడు.
ఈ సందర్భంలో జనమేజయుడు కృప ద్రోణుల వృత్తాంతం తెలియజేయవలసిందిగా కోరాడు అందుకు వైశంపాయనుడు ఇలా చెబుతున్నాడు
                     కృపాచార్యుడు
గౌతమ మహర్షి కుమారుడగు శతానంద కు
సత్యధ్యుతి అనే కుమారుడున్నాడు. సత్య ధృతి జన్మించడమే విల్లంబులతో జన్మించాడు కనుక శరధ్వంతుడు అనే పేరుతో పిలువబడసాగాడు.. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా కూడా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలవరపడసాగాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శరధ్వంతుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు తో పాటే అతని వీర్యం కూడా జారి క్రిందపడింది..    అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తన కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. ఈ సంగతి గ్రహించిన సత్యధృతి శంతనునితో తన సంగతి చెప్పి కృపునకు వేద పండితుల వద్ద వేదాలను నేర్పించాడు. అలాగే చతుర్విధ ధనుర్వేదములును నానా విధ శాస్త్రములను తానే స్వయంగానేర్పాడు. అతడే విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు.
 ద్రోణాచార్యుడు దృపదుల జన్మ వృత్తాంతం .
సమస్త జనుల చేత నమస్కరించ తగిన వాడైనా భరద్వాజముని గంగా తీరంలో తపసు చేసుకుంటున్నాడు.ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడు తున్నప్పుడు ఆమె వస్త్రం గాలి చేత తొలగిన సమయంలో భరద్వాజుడు చూసాడు. అది చూసిన భరద్వాజునకు వీర్యపతనం జరిగింది. అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో (కలశంలో) దాచాడు. ఆ వీర్యం నుండి శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశ రాజైన పృషతుడు. అతడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసాడు. అతడికి ఒకరోజు మేనక అనే అప్సరసను చూసి వీర్యపతనం జరుగగా దాని నుండి దృపదుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాలదేశానికి వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు దృపదుడు కలసి విద్య నభ్యసించారు. దృపదుడు పాంచాల దేశానికి వెళ్ళి రాజయ్యాడు. దృపదుడు అగ్నివేశుని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుని చెల్లెలు కృపిని ద్రోణుడికి ఇచ్చి భరద్వాజుడు వివాహం చేసాడు. వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు కలిగాడు.. ఆ సమయంలో ద్రోణాచార్యుడు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాడు.పరశురాముడు తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకుని ధనార్ధియై ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. కానీ అప్పటికే ధనమంతా బ్రాహ్మణులకు కుదానంచేసాను, సముద్రమనే వస్త్రాన్ని మొల నూలు గా కలిగిన భూమిని కశ్యప మహర్షికి దానం చేశాను . మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు పరుశరాముడు .ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశత్రాలను ప్రయోగ ఉపసంహారాలతో సహా నేర్చుకున్నాడు. .
మిత్రులందరికీ శుభ శుభోదయం
                  
--(())--
 

భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది ?

 భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పేది ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం లోకం గాలిస్తానంటారు. కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.


దానలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. దీనివల్ల తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), భీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మనవ వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరికి   చస్తే పాతిపెట్టాల్సింది ఈభుమిలోనే. 


 సువర్ణదానం : ఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారు పేరు   మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.


అన్నదానం : ఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.


దేవుడంటే ఏంటి?


పూజ చేయకపోతే ఏమవుతుంది? అని.

చిన్నపిల్లలే కాదు .నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది..

మన పెద్దవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.

" అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని.

మనకు భగవంతుని గురించి అవగాహనలేనప్పుడు.చెప్పడం చేతగానప్పుడు..l 

మనంవాడే మాట అదే.

 

కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా.

మనం చెప్పాల్సిన సమాధానం  అది కాదు..

తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.... 

 

పూజ అనేది కూడా ఒక

యోగ ప్రక్రియ.మనసుతో చేసే 

వ్యాయామం

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి..మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే  ప్రక్రియ..

దీప ప్రజ్వలనం అనేది.. త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు

నూనె దీపాన్ని తదేకంగా చూస్తే, కంటి జబ్బులను అరికట్టవచ్చుఅని పెద్దలు చెప్పిన మాట..

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే, నాలుక మొద్దుబారదు..

అది నాలుకకు వ్వాయామం.. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది..

ధారణ శక్తి పెరుగుతుంది..

భాష మీద పట్టు పెరిగితే, స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది. 


పూజ అంటే  చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని  చెప్పండి..

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి..........

అదే సమయంలో మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.


సర్వేజనా సుఖీనోభవంతు 

🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏

[14/02, 7:15 am] Sriram: *నా ఆలోచన అభిప్రాయం* 

🕉️🌞🌎🏵️🌈🌼🚩

 *నేను ఎప్పుడూ వాస్తవంలోనే బ్రతుకుతాను. కలలు, ఊహలు లాంటివి అలవాటు లేదు. అందుకే కథలు రాసేటప్పుడు వాస్తవంగా నాకు కనపడినవి, నేను గమనించిన విషయాలు, సంఘటనలమీదే రాయడానికి ఇష్టపడతాను. అలాటిదే ఈ కథ.  2019 ఫిబ్రవరిలో మనతెలంగాణ పత్రికలో ప్రచురించబడింది. నా ఆలోచన, అభిప్రాయం మీకు నచ్చుతుందనుకుంటా..* 

 *పిల్లలు తమ పుట్టినరోజును తమ ఫ్రెండ్స్, కొలీగ్స్ ని పిలుచుకుని గొప్పగా పార్టీ చేసుకుంటారు కానీ తమ పుట్టినరోజును కారణమైన తల్లిదండ్రులను ఎంత మంది పిలుచుకుంటారు పార్టీకి..* 

***********************************************

నన్ను కన్నరోజు

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది. ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 

 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 

 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజునాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడుగారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 

 *“అమ్మా! పదిరోజుల* *మందునుండి చెప్తున్నా ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 

 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది. 

పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..

ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు కాని తన ధోరణిలో మార్పు రాలేదు.

“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”

“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం. అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.  వాళ్లను నేనేమీ అనడం లేదు కాని ఈ ఒంటరితనాన్ని కాదుగాని  ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను. మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.

“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.

“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది. 

*****

సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది. అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు. 

వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు. తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది. “అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు. కదా నాన్నగారు?” అని అడిగింది. 

అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.

మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా.. 

భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.  

*****

మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు. వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు. అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు. సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.

పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.

కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.

మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని.. అయోమయంగా కూతురివైపు చూసింది. 

భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది.. “అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి? అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..  

అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.

అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్... మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..

సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..

సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది. 

భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.  

కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు.

అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే.. అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ. కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి... ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు. 

సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. 

“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు.. 

“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని. 

“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..

భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.

“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను. కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు. తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే.. 

మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది. 

కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.

భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని. ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.

ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది. సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. 

తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు.. 

“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.

“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది. 

పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.

సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.

అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.


సేకరణ వే శ్రీ.


🕉️🌞🌎🏵️🌼🚩

[15/02, 6:48 am] Sriram: #సుప్రసిద్ద_అజ్మీర్_దర్గా_దాని_వెనుక_దాగున్న_మన_చక్రవర్తుల_రక్తచరిత్ర:

 

  అజ్మీర్ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దర్గాలో ప్రార్థన చేసే ప్రతి హిందువు మన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ గారిచేతిలో 16 సార్లు ఓడి క్షమాభిక్ష పొంది తర్వాత వెన్నుపోటు పొడిచి ఆయననూ ఆయన పట్టపు రాణి 'సంయోగితా దేవి' గారిని ఏవిధంగా చిత్రహింసలు పెట్టి హతమార్చాడో తెలిస్తే మీ రక్తం మరుగుతుంది.


 భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన అజ్మీర్ షరీఫ్ దర్గా ఇస్లాం సూఫీ ప్రచారకుడు ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ మరియూ ఈతనిని ఘరిబ్ నవాజ్ ( పేద ప్రజల ఉద్దారకుడు) అని కూడా పిలుస్తారు అతని తదనంతరం అతని పేరున ప్రసిద్ధికెక్కిన ఈ దర్గా అజ్మీర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి 1.2 కిలోమీటర్ల దూరంలో తారఘర్ కొండ కింద వుంటుంది ఇందులో రెండు పెద్ద సమావేశ మందిరాలతో బాటు పలు పాలరాతి కట్టడాలు నిర్మింపబడ్డాయి, నిజాం పాలకులు నిర్మించిన అతి భారీ ద్వారము, షాజహాన్ నిర్మించిన అక్బరి మసీదుతో బాటు ఈతని పెద్ద పాలరాతి గుమ్మటము గా ఉండేది.

   ఈ ప్రసిద్ధ దర్గా ఒకప్పుడు మొఘలుల దండయాత్రకు ముందు మన హిందువుల గుడి దానిని వారు కూలకొట్టి ఆ ప్రాంతంలో దర్గా నిర్మించారని చెప్తారు, భారతదేశంలోని ప్రతి ఒక్క పురాతన మసీదు ఒకప్పుడు మనం పూజించే మందిరాలే అంటే అతిసయోక్తి కాదేమో. ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీ దివి నుండి దిగివచ్చిన దేవుడో లేదంటే సూఫీ సన్యాసో కాదు ఈతను ఒక మూర్ఖుడు, ఉన్మాది. అతనికి భారతదేశంలో ఇస్లాం వ్యాపింపచేయాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఇక్కడకు వచ్చాడు.


  ఘోరి మహమ్మద్ ను భారతదేశం పైకి దండయాత్రకు వురుకోల్పింది ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీనే అనే విషయం చాలమందికి తెలియదు.  అతనికి ఏ మహిమలు లేవు పైగా ఆవు మాంసం తినే ఒక ఉన్మాదిత్వానికి రూపకర్త అతడు. హిందువులకు ఈతని దుష్క్రుత్యాలు తెలియకుండా అతని అనుయాయులు మరియు కుహానా  చరిత్రకారులు అతని అసలు స్వరూపం దాచి అతనికి చరిత్రలో సుస్థిర స్థానం కల్పించారు.


 దురద్రుష్టవశాత్తు మన చరిత్రలో భారతదేశాన్ని మనలను కాపాడిన మహారాజులకు తగిన స్థానం దక్కలేదు. పిరికిపంద, లక్షల మంది హిందువులను చంపిన మహమ్మద్ ఘోరీని 16 సార్లు ఘోర పరాజయం పాల్జేసిన వీర యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ ని హిందువులు గుర్తించటంలో విఫలమయ్యారనే చెప్పుకోవాలి.😰


#మరగుపరచబడిన_చిష్తీ_అసలు_స్వరూపం.

 ఈ ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీయే మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ భార్యయైన ‘సంయోగిత దేవి’ని ఇస్లాంకు మారలేదని మహమ్మద్ ఘోరి చేత లైంగిక హింసలకు గురి చేసి బందించి ఒక లైంగిక బానిసగా మార్చి చంపించేసాడు. కొందరు హిందువులు ఇక్కడ దర్గాలో ప్రార్థన చేయటం యెంత సిగ్గుమాలిన పని? ఇంత నయవంచకుడైన  ఖ్వాజ మొయినుద్దీన్ చిష్తీని  ఇక్కడ ఒక దేవదూతగా ఆరాధిస్తున్నారు. ఇది మన ఆత్మగౌరవాన్ని మనమే వంచిన్చుకోవడం కాదంటారా..??


   👉 మహమ్మద్ ఘోరిని 16 సార్లు యుద్ధంలో ఘోరంగా ఓడించి దయాదాక్షిన్యాలతో ప్రాణాలతో వదిలిపెట్టాడు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ కాని ఒక సారి వెన్నుపోటుతో యుద్ధంలో గెలిచి ఏ మాత్రం కూడా దయలేకుండా కళ్ళను పెకలించి చిత్రహింసలు పెట్టి తలను నరికించి వేశారు ఈ నరరూప రాక్షసులు.

 *పాండవుల వారసుడైన ధర్మ ప్రభువైన పృథ్వీరాజ్ చౌహాన్ కు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ఆలోచించండి.


మన తీవ్రమైన దురదృష్టం ఏమిటంటే చరిత్రలో కోట్లాది మంది హిందువులని చంపించి రక్తక్షరాలు లిఖించిన హింసోన్మాదులైన మహమ్మద్ ఘోరి, అలావుద్దీన్ ఖిల్జీ , టిప్పు సుల్తాన్ , మొఘలులు, ఇంకా చాల మంది ఇస్లామిక్ పాలకుల చరిత్రలను మన పిల్లలు చదివే చరిత్ర పాఠాలలో స్వర్ణాక్షరాలతో లిఖించడం. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత కూడా మనకు ఇటువంటి పాలకులు లభించటం మనం చేసుకున్న దౌర్భాగ్యం ప్రజలు వీరు చేసే పనులు తెలియక వీరిని ఆదరించడం అత్యంత దౌర్భాగ్యం.😰


 ప్రతియొక్క పురాతనమైన మసీదు పునాదులు మన కూలగొట్టబడిన మందిరాలనే అనడంలో అతిశయోక్తి కాదేమో కాని ఇది చాల మంది చెవిటి, గుడ్డి వారైన హిందువులకు తెలియడంలేదు. అదే వారు చూడగలిగిన, వినదగిన వారైతే మహారాజ పృథ్విరాజ్ చౌహాన్ కు  ఆయన ధర్మపత్ని సంయోగిత దేవికి జరిగిన ఘోరం గురించి దర్గాలోకి అడుగుపెట్టే ముందే ఆలోచిస్తారు. చిష్తీ ఎటువంటి ప్రచారకుడంటే అతను 7లక్షల మంది హిందువులను తన హింసాత్మక చర్యలతో మతం మార్చగలిగాడు దీనికి ఇస్లామిక్ పాలకుల అండదండలు మెండుగా వున్నాయి మరి. అతను మూడు సార్లు హిందూ స్త్రీలను పెండ్లి చేసుకుని ఇస్లాం లోనికి మార్చుకున్నాడు. ఈ చిష్తీ ఇలా గర్వంగా చెప్పుకుంటాడు “ మేము మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ అత్యంత కష్టంతో వెన్నుపోటు పొడిచి  చంపి  అతని సంధినుండి ఇక్కడ ఇస్లాం ని స్తాపించాం, అతని అందాలరాసియైన భార్య సంయోగితాదేవి ఇప్పుడు మహమ్మద్ ఘోరితో ఒకే మంచంపైన లైంగిక బందీ అని చెప్పుటకు గర్వపడుతున్నాను” అని అన్నాడు...

 ఈ దుర్మార్గుడు ఇక్కడ ఒక దైవ దూతగా ఆరాధించబడుతున్నాడు ఇంతకన్నా ఘోరాతిఘోరము , దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా..??

 దీనికి ఇంకా ఆజ్యం పోసే సంగతేంటంటే. మన మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ ఎంతటి ధీరుడు అంకితభావం కలవాడంటే అతను తన రెండుకన్నులు పెకలించినా కూడా, ఘోరి అతనికి ఆవుమాంసం తినిపించినా కూడా, ఆఖరుకు తన ధర్మపత్నియైన సంయోజితా దేవిని లైంగిక బానిసను చేసుకున్నాం, నిన్ను నీ భార్యను సజీవంగా విదడిచేస్తామన్నా కూడా అవన్నీ తనకు త్రునప్రాయమని సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి మన మహారాజు. అది మన మహారాజు యొక్క త్యాగనిరతి, తుదిశ్వాస వరకు మోఘలులని ఎదిరించన ధీరుడు పూజనీయుడు కానీ ఈ దెయ్యాలను మనం పూజించాలంటారా? ఎంతటి దౌర్భాగ్యం ఈ హిందూదేశానికి

  ఈ దీరోదాత్తుడిని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లోని మహమ్మద్ ఘోరి యొక్క స్మారక చిహ్నం ముందు సమాధి చేసారు. ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలు మహారాజు పృథ్విరాజ్ చౌహాన్ యెడల విపరీతమైన ద్వేషం చూపిస్తారు కాని ఆ మహానుభావుడిని, ధర్మరక్షకుడిని, మనల్ని కాపాడిన ధీరోదాత్తుడిని చంపిన కర్కసులను మాత్రం ఇక్కడ సిగ్గులేకుండా, ఆత్మగౌరవమనేది కించిత్తు కూడా లేకుండా పూజిస్తున్నాం. మనం ఆ మహావీరునికి అర్పించే నివాళి ఇదేనా? మనల్ని మనం ఒక సారి ప్రశ్నించుకుందాము, మన భావితరాలకు అసలైన చరిత్రను తెలిపి రానున్న “ఇస్లాం” అనే ఉపద్రవం గురించి ముందే హెచ్చరించుదాము...

  

    ఇది మన భాద్యత గుర్తుంచుకోండి.

           భారత్ మాతాకీ జై!!

[16/02, 9:55 am] +91 94919 12128: *హిందువుల పట్ల నెహ్రూ యొక్క మోసం యాక్ట్ 30 ఎ*


హిందువులపట్ల నెహ్రూ చేసిన మోసం సరిచేయవలసిన సమయము అస్సన్నమైనది


మీరు "యాక్ట్ 30", "యాక్ట్ 30 ఎ" గురించి విన్నారా ????? * * "30 ఎ" అంటే ఏమిటో మీకు తెలుసా? * * ఇంకా తెలుసుకోవడానికి ఆలస్యం చేయవద్దు ...... * * 30 A * అనేది రాజ్యాంగంలోని ఒక చట్టం.

నెహ్రూ మొదట ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు ....ఎందుకంటే  "ఈ చట్టం హిందువులకు గొప్ప ద్రోహం, కాబట్టి ఈ కర్ణి చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకువస్తే, నేను కేబినెట్ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను ... ఆపై ఈ ద్రోహానికి వ్యతిరేకంగా కర్ణి చట్టం, భారతీయులందరితో కలిసి వారికి ముందుండి  ఆందోళనకు నాయకత్వం వహిస్తాను” అని సర్దార్ పటేల్ అన్నారు.

అప్పుడు తాత్కాలికంగా సర్దార్ పటేల్ సంకల్పానికి ముందు నెహ్రూ మోకాలొడ్దారు. దురదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ కొన్ని నెలల్లో మరణించాడు.

పటేల్ మరణించిన వెంటనే, నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. 

ఇప్పుడు * 30 A * యొక్క లక్షణాల గురించి మాట్లాడుదాం. * ఈ చట్టం ప్రకారం - హిందువులలో తమ "హిందూ మతాన్ని" బోధించడానికి అనుమతి లేదు. "యాక్ట్ 30 ఎ" దీనికి అనుమతి లేదా అధికారం ఇవ్వదు.

హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు.  హిందూ మతాన్ని బోధించడానికి కళాశాలలను, పాఠశాలలను ప్రారంభించకూడదు.

ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలలో హిందూ మతం బోధించడానికి చట్టం 30 ఎ కింద అనుమతి లేదు.

కానీ .. విచిత్రం ఏమిటంటే, దీనితో (30A తో పాటు) నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన మరో చట్టం ఉంది, అది "చట్టం 30". ఈ "చట్టం 30" ప్రకారం ముస్లింలు తమ మతపరమైన అధ్యయనాల కోసం ఇస్లామిక్ మత పాఠశాలలను స్థాపించవచ్చు,  ప్రారంభించవచ్చు.

ముస్లింలు తమ మతాన్ని బోధించవచ్చు. చట్టం 30 ముస్లింలకు వారి స్వంత 'మదర్సా' ప్రారంభించడానికి పూర్తి అధికారం మరియు అనుమతి ఇస్తుంది. మరియు క్రైస్తవులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మత పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు వారి మతాన్ని స్వేచ్ఛగా బోధించడానికి మరియు ప్రచారం చేయడానికి పూర్తి అధికారం మరియు అనుమతి ఇస్తుంది.

దీనికి మరో చట్టపరమైన అంశం ఏమిటంటే, హిందూ దేవాలయాల యొక్క డబ్బు మరియు సంపద అంతా ప్రభుత్వానికి ఇష్టానుసారం పొందవచ్చు. హిందూ దేవాలయాలలో హిందూ భక్తులు చేసిన డబ్బు మరియు ఇతర విరాళాలను పూర్తిగా ప్రభుత్వ ఖజానాకు తీసుకెళ్లవచ్చు.

అదే సమయంలో, మసీదులు మరియు క్రైస్తవ మసీదులలోని డబ్బు మరియు విరాళాలను పూర్తిగా క్రైస్తవ-ముస్లిం సమాజానికి ఇవ్వవచ్చు.

ఈ విధంగా, "యాక్ట్ 30 ఎ" మరియు "యాక్ట్ 30" అనేది హిందువులపై తీవ్రమైన వివక్ష మరియు స్పష్టమైన ద్రోహంగా పరిగణించవచ్చు.

ప్రతి ఒక్కరూ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇతరులకు  అవగాహన కల్పించాలి. 

మనలో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి సంరక్షకులుగా ఉండాలి.. జైహింద్. జైభారత్.

[16/02, 8:17 pm] D Krishnamurthy: ఒకప్పుడు మన అర్చక కుటుంబాలవారు దేవాలయాలకు అర్చక ఈనామ్ దారులుగా వంశపారంపర్య అర్చకులుగా ధర్మకర్తలుగా తరతరాలుగా దేవాలయ వ్యవస్థలను నడిపిస్తూ వచ్చారు. మన పూర్వీకుల హిందూ ధర్మ పరిరక్షణ అకుంటిత దీక్ష శ్రమ త్యాగాలను దేవాదాయ శాఖ కాంప్రమైజ్ ఆర్డర్ ద్వారా మన  ఆస్తులను స్వాధీనం చేసుకుని కేవలం '  సర్వీసు  ' అనే పదాన్ని తగిలించి మన ఆస్తులు అన్నిటినీ కొల్లగొట్టారు. ఇలా ఎందుకు అంటున్నాను అంటే అర్చక ఈనామ్ గా ఉన్న  మన ఆస్తులను మన పెద్దలు ఎంతో సహృదయంతో దేవుడు మనము ఒకటే అని భావించి నిష్కల్మషంగా స్వాధీన పరిచారు. అలా మరే ఇతర ఈనామములను నేటి వరకు దేవాదాయశాఖ తీసుకోవడం గాని గుర్తించిన దాఖలాలు లేవు. కేవలం ధర్మ పరిరక్షణ కోసం శ్రమించిన అర్చకులకు మాత్రమే ఈ పంగనామాలు పెట్టారు. మనం స్వాధీనపరచిన భూములలో 1/3 వంతును సర్వీసు భూమిగా మార్చారు. అంటే భూముల యజమానులను హక్కులు లేని కౌలుదారులు గా మార్చారు అన్నమాట. నాడు కాంప్రమైజ్ కొరకు మన అర్చకులు దగ్గరనుండి కాంట్రిబ్యూషన్ రూపంలో వేలాది రూపాయలను 1960వ సంవత్సరంలో వసూలు చేసిన ఘనత మన దేవాదాయ శాఖదే. ఈ కాంట్రిబ్యూషన్ డబ్బులు చెల్లింపుల కోసం  ఆనాడు మన పెద్దలు  ఇంటిలో బంగారాలు  ఆస్తులను అమ్మీ మరి కట్టారని నాకు మా పెద్దలు చెబుతూ ఉండగా విన్నాను .ఆ వేల రూపాయలను ఆనాటి భూమి విలువ ప్రకారం కనీసం 10 లేదా 15 ఎకరాల వరకు కొనగలిగిన మొత్తం. కానీ మన పెద్దలు ఆ విధంగా ఆలోచించక దేవాలయ వ్యవస్థ లో మమేకమై ఆ భూమిలో కోసం డబ్బులు కట్టడానికి మాత్రమే సిద్ధమయ్యారు. దీనిని బట్టి ధర్మం కోసం మనవారు ఎంత త్యాగానికైనా సిద్ధమయ్యారు అని అర్థం అవ్వడం లేదా. సర్వీసు అనే పదం ఎవరికీ పెట్టాలి? ఒకవేళ మరి సర్వీసు మనది అన్నట్లు అయితే మిగతా వారికి వేతనాలు ఎలాగ ఇస్తారు.?

ఎడారిలో ఒంటికి చోటు ఇచ్చినట్లుగా ఇది కూడా నాకు ఒక పెద్దలు చెప్పిన సామెత రాత్రివేళ ఎడారిలో టెంట్ కనిపిస్తే మందు ఒంటే ఒక తల పెడుతుంది అట... తెల్లారి చూస్తే ఆ టెంట్లలో ఒంటె ఉంటుంది ...ఆ టెంటు యజమాని బయట పడుకుని ఉన్నట్లుగా ఉంది మన పరిస్థితి. ( ఇంకా ఉంది)

మీ

శ్రీకంఠం బాబి

సీనియర్ జర్నలిస్ట్

రాజమండ్రి

[17/02, 10:22 am] Sriram: శ్రీనివాస  సిద్ధాంతి.9494550355.


*జ్యోతిష్య శాస్త్రం లో నక్షత్ర వృక్షాలు....*


జ్యోతిష్య శాస్త్రం లో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు , అధిదేవతలు ఉన్నట్లుగానే , వాటికి సంబంధించిన వృక్షాలు/చెట్లు కూడా ఉన్నాయి

జన్మ నక్షత్రాన్ని అనుసరంచి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు

అశ్వని నక్షత్రం - వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటి గా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

భరణి నక్షత్రం - వారు ఉసిరి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యము , పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువ గా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రం - వారు అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షింపబడతారు, అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రం - వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా చక్కెర వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన ఎక్కువ గా కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది

మృగశిర నక్షత్రం - వారు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రం - వారు చింత చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు, అంతే కాకుండా విషజంతువుల బాధ కుడా వీరికి కలగదు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది

పునర్వసు నక్షత్రం - వారు వెదురు లేదా గన్నేరు చెట్టు ను పెంచడం , మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తుల కి సంబందించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుండి, మరియు రొమ్ము క్యాన్సర్ నుండి ఉపశమనం పొందుతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యం గా పాల కి లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా , చక్కటి చాకచక్యం తో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రం - వారు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచడం, పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు. అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది. రోగ, రుణ భాధల నుండి విముక్తి లభిస్తుంది . స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రం - వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం , పూజించడం వల్ల శ్వేతకుష్ఠు మరియు చర్మ సంబంధిత వ్యాదుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందు చూపు తో వ్యవహరించి జీవితం లో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైన తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రం - వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాదుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యం గా ఉండడానికి, తల్లితండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితం లో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రం - వారు మోదుగ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు .ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రం – వారు జువ్వి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలని వారి చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రం - వారు సన్నజాజి , కుంకుడు చెట్లను పెంచడం, పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి . దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రం - వారు మారేడు లేదా తాళ చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా పేగులు, అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు. ఎవరిని నొప్పించకుండా వారి తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రం - వారు మద్ది చెట్టు ను పెంచడం, పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయట పడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. అన్ని రకములైన విద్యలలోను రాణిస్తారు, ఆత్మవిశ్వాసం అధికం గా ఉంటుంది. భావోద్వేగాలు అధికం గా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రం - వారు వెలగ , మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణసంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రం - వారు పొగడ చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు. పదిమంది లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రం - వారు విష్టి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చిన్నతనం నుండే బరువు భాద్యతలు సమర్దవంతం గా మొయగలగడానికి. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రం - వారు వేగి చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా పళ్ళ కి సంబంధించిన , మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణ లో ఉంటుంది. శాస్త్ర ప్రవీణం, మంచి వ్యక్తిత్వము, ఔన్నత్యం కలగడానికి, సంతానం వల్ల జీవితం లో ఆనందాన్ని ఆనందం పొందడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాషాడ నక్షత్రం - వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం, పూజించడం ద్వారా కీళ్ళు, సెగగడ్డలు , వాతపు నొప్పులు మరియు జననేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ది . వినయవిదేతలు కలగడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాషాడ నక్షత్రం - వారు పనస చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరి చేరవు. అలాగే ఆర్దికం గా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూముల కి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అబివృద్ది లోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రం - వారు జిల్లేడు చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరమవుతాయి. అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రం - వారు జమ్మి చెట్టును పెంచడం, పూజించడం ద్వారా మెదడు కి సంబంధించిన సమస్యలు రావు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాబివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రం - వారు కడిమి చెట్టు లేదా అరటి చెట్టు ను పెంచడం ద్వారా శరీర పెరుగుదల కి సంబంధిచిన , మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం , చక్కటి ఉద్యోగం కొరకు, జీవితం లో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం - వారు మామిడి చెట్టు ని పెంచడం ద్వారా కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు రావు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి ని పొందడానికి . కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాల లో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాల లో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రం - వారు వేప చెట్టు ని పెంచడం ద్వారా శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యల ను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందం గా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రం - వారు విప్ప చెట్టు ని పెంచడం, పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపు లో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితం లో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.

 *ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

*లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం.*

*9494550355*

 *ధర్మో రక్షతి రక్షితః*

🕉️🌞🌎🏵️🌈🌼🚩

 *ప్రజలందరూ ధర్మాన్ని రక్షణ కవచంగా ధరించాలి.* *ప్రజలందరిని ధర్మం ధరిస్తుంది. ఏది సంఘాన్ని కట్టుబాటులో నిలుపుతుందో అదే ధర్మం. ధర్మ మార్గంలో నడిచిన వాడికి సుఖశాంతులు, శాశ్వతకీర్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి. ‘ధర్మమే సర్వ జగత్తుకూ ఆధారం’ అని* *నారాయణోపనిషత్తు చెబుతోంది. ధర్మం కంటే బలమైనది ఈ సృష్టిలో మరేదీ లేదని.. ధర్మాన్ని అనుసరించే బలహీనుడు రాజుకన్నా బలవంతుడని బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతోంది. అట్టి ధర్మాన్ని విస్మరిస్తే జరిగేది పతనమే.* 

 *చాలాకాలం క్రితమే మన పూర్వీకులు మనిషి చావు, పుట్టుకల గురించి, మరణానంతర పరిణామాల్ని గురించి ప్రశ్నించుకొని సమాధానాల్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు. అనేక మంది ఋషులు, మునులు, జ్ఞానులు నిరంతరం సత్యాన్వేషణకై తపస్సు చేశారు. వాళ్లు తపస్సమాధిలో ఉన్నప్పుడు అత్యున్నత సత్యాన్ని, ధర్మాన్ని వేదం రూపంలో తెలుసుకున్నారు.* *తపస్సమాధిలో ఉండగా వాళ్లకు లభించిన జ్ఞానాన్ని వేదాలుగా వ్యవహరిస్తున్నాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాళ్లకు అవి పరమాత్ముడి వాణిగా వినిపించాయి కాబట్టి వాటిని శ్రుతులు అన్నారు.* 

 *వేదాల ద్వారా లభించిన జ్ఞానంతో మన ఋషులు ఎంతో కృషి చేసి కొన్ని శాశ్వత సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు విశ్వమంతటికీ అన్ని యుగాల్లోనూ వర్తిస్తాయి. మానవులు ఏయే దశలలో ఎటువంటి నియమాలు పాటించాలి? కుటుంబం, సమాజం, ప్రకృతి, దేశం పట్ల ఎవరి బాధ్యత ఏమిటి?* *తదితర విషయాల గురించి అన్ని విధాలా ఆలోచించి..* 

 *ఎలా వ్యవహరిస్తే ధర్మం నిలబడుతుందో ఆ విధంగా మార్గదర్శనం చేయగలిగిన అద్భుత జీవన విధానాన్ని మన ఋషులు, మునులు రూపొందించారు. సమస్త జగత్తునూ క్షేమంగా ఉంచగల ఈ శాశ్వత సూత్రాలే ధర్మానికి ఆధారంగా నిలిచాయి.* 

 *మానవులందరికీ శుభం చేకూర్చగల శక్తి ధర్మానికి ఉంది గనుక దీన్ని మానవ ధర్మం అన్నారు. శాశ్వత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది గనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. అనాదిగా ఉన్న చైతన్యాన్ని దేవుడని, సనాతనుడనీ పిలుచుకున్నారు. కాబట్టి దీన్ని దైవ ధర్మమని, సనాతన ధర్మమని అన్నారు.* 

 *ఋషులు మనకు అందించింది కాబట్టి దీన్ని ఆర్ష ధర్మం అని కూడా అన్నారు. అదే విధంగా మనదేశాన్ని హిందూదేశం అని పిలవడం వల్ల మనం అనుసరించే ఈ ధర్మాన్ని హిందూ ధర్మం అన్నారు.మానవజీవితానికి పరమ ప్రయోజనమైన మోక్షం.. కేవలం ధర్మంతోనే సాధ్యం.* 

 *ధర్మబద్ధమైన ఆర్జన (అర్థం), ధర్మబద్ధమైన కామంతోనే మనిషి నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలడు. అందుకే మన పెద్దలు చతుర్విధ పురుషార్థాల్లో ధర్మాన్ని ముందుపెట్టారు. సంపాదన అయినా, కోరికలైనా ధర్మాన్ని అనుసరించి ఉండాలని దీని అర్థం.* 

 *అటువంటి ధర్మాన్ని పాటించి..*

 *మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః* 

 *సేకరణ వే శ్రీ* 

-------/భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య/

ఇవాళ్టి తరానికి ఆశ్చర్యం కలిగించే ఓ సంఘటన

ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవినీతి మితిమీరిపోయిందని,అక్రమంగా ఆస్తులను కూడగట్టుకొని కులుకుతున్నారని ప్రధానమంత్రి నెహ్రూ కు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని శక్తులు ఫిర్యాదు చేశాయి.వాటిని నిర్థారించుకోవడానికి నెహ్రూ అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫర్మార్ నూ ఆయనకు సహాయకునిగా అప్పటి యువనేత చక్రపాణి(ఆంధ్రప్రదేశ్ విధానమండలి ఛైర్మన్ గా చేశారు)ని పంపారు.వారి కారు సంజీవయ్య గారి ఇంటి ముందు(పూరి గుడిసె)ఆగింది. ఫర్మార్ గారు 'ఇదేమిటి కారు పూరి గుడిసె ముందు ఆపారేమిటి.సంజీవయ్య గారింటికి కదా మనం వెళ్ళళలసింది'అని అడిగారు. చక్రపాణి గారు 'ఇదే

 ఆయనిల్లు.ఆమె సంజీవయ్య గారి తల్లి శ్రీమతి సుంకులమ్మ గారు' అని కట్టెలపొయ్యి పైన వంట చేసుకుంటున్న సంజీవయ్య గారి తల్లి గారిని పరిచయం చేశారు. ఫర్మార్ గారు ఆమెకు పాదాభివందనం చేసి వెనుదిరిగారు.

అదీ సంజీవయ్య గారి ఆర్థిక పరిస్థితి!!

ఏమాత్రమూ నేరచరిత్ర లేని వాడు

నిజాయితీగా బ్రతికినవాడు

ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్దికి పునాదులు వేసిన వాడు

కవి,రచయిత సంస్కరణాభిలాషి

ఇన్ని గుణాలు కలగలసిన రూపం శ్రీ దామోదరం సంజీవయ్య!!!

అందుకే మహాకవి గుఱ్ఱం జాషువ:

ఘనతంజెందిన మూడువన్నెల పతాకచ్ఛాయలో వాడిత

గ్గనిసత్యాగ్రహఖడ్గమున్ గరమునన్ గైసేసి సాబర్మతీ

మునితో ఆంగ్ల మృగేంద్రఏమున్ గెలిచి సంపూర్ణ స్వరాజ్యంబు దె

చ్చిన వీరాగ్రణి లేడొకండనుచు వాసింగన్న సంజీవయా

ఖ్యునకున్ కాంగ్రెసు ప్రాణనాథునకు వేయిన్నూరు పద్యాంజలుల్

అని ప్రస్తుతించారు.

ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి,నీలం సంజీవరెడ్డి గార్ల క్యాబినెట్ లలో పనిచేసిన ధీమంతుడు సంజీవయ్య!

నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు గార్ల కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా పనిచేసింది. సంజీవరెడ్డి రాజీనామా తరువాత సహజంగానే అల్లూరి సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కాని అలా జరిగితే తన ఆధిపత్యం పోతుందని సంజీవరెడ్డి అల్లూరి కి వ్యతిరేకంగా బ్రహ్మానందరెడ్డి ని ముఖ్యమంత్రి గా ప్రతిపాదించారు.ఆ సమయంలో అల్లూరి సత్యనారాయణ రాజు చాణక్యంతో తన మనిషి గా సంజీవయ్య గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆవిధంగా భారతదేశంలో తొలిసారిగా ఓ దళితుడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.

1960-62 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చేసిన సంజీవయ్య గారు తీవ్ర ఒత్తిళ్లు తట్టుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరే ముఖ్యమంత్రి చేయలేన్నన్ని శాశ్వత అభివృద్ధి పనులను చేశారు.


శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు శంకుస్థాపన

(దీని మూలంగా వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి)

రాయలసీమకు గాజులదిన్నె ప్రాజెక్టు శంకుస్థాపన

ఆత్మకూరు వరదరాజుల స్వామి ప్రాజెక్టు శంకుస్థాపన

గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు శంకుస్థాపన

ఆరులక్షల ఎకరాల బంజరు భూమిని నిరుపేదలకు పంచిపెట్టారు

అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు

వృద్దాప్య జీవన భృతి, కార్మికుల కు బోనస్ పద్దతి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగు లోనే కొనసాగించాలనే ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లా కమిషన్ ఏర్పాటు

వేరువేరుగా ఉన్న హైదరాబాద్, సికంద్రాబాద్ కార్పొరేషన్ లను ఏకంచేసి GHMC ఏర్పాటు

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటు

దేశంలోనే తొలి మహిళా పాలిటెక్నిక్(కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల)కళాశాల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(APIDC)ఏర్పాటు,

బలిజ, కాపులను బి.సి.లలో చేర్పు

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగాలలో పదోన్నతులు పాటింపు........

మరెన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య. తన ఆరాధ్య దైవం ప్రకాశం గారిలాగే ఏమీ సంపాదించుకోకుండానే వెళ్ళిపోయిన త్యాగజీవి సంజీవయ్య!!

ఈరోజు14_02_1921___14_02_2021 ఆ మహనీయుని శతజయంతి.

కాని ప్రభుత్వం కాని మీడియా కాని(ఏవో రెండు పత్రికలు మినహా)ఆ మహనీయుని పేరును స్మరించుకోలేదు.

ఆయనకు అంజలులు ఘటించలేదు.

ఈ కృతఘ్న సమాజాన్ని అభిశంశిస్తూ......

##చక్రావధానుల రెడ్డప్ప ధవేజి

     నరసాపురం

*ఎదుటివారి తప్పొప్పులు*

*నవ్వుతూ భరించినంతకాలం*

*మంచివాళ్ళమే....*

*ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి*

*సరిచెయ్యాలి అని చూస్తామో*

*అప్పుడే.. మనలో మనకి తెలియని*

*లోపాలని వెతికి మరీ..ప్రపంచానికి*

*మరో రకంగా పరిచయం చేస్తారు...*

*అప్పటివరకూ మనం చూపిన*

*ప్రేమాభిమానాలు అన్నీ మరుగున*

*పడిపోతాయి..ఇదే నేటి మనుషుల తీరు...!!*🤔

 *నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది!* 

 *అలాగే  . . .* 👌👌👌

 *నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది!* 

🙏🙏

🌹🌹🌹

No comments:

Post a Comment