Sunday, 7 February 2021

09-02-2021


 
మధురిమలు - తప్పొప్పులు
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

వాసనలేని పువ్వు
అచ్చిరానది కొవ్వు
అనువుకానిది నవ్వు
జలమున్నచో తవ్వు  

బుద్ధిలేని పురంబు
దాచలేని ధనంబు
పొందనీ  సౌఖ్యంబు
తీర్చనీ దాహంబు

భక్తి లేనిది మగువ
శక్తి లేనిది  తెగువ  
ముక్తి రానిది తగువ
రక్తి చూపని కలువ

గుణహీన కుమారుడు
ప్రేమచూపని మగడు
సమయ0 వ్యర్ధ పరుడు
మాయచేసెను నటుడు

పని కే రాని విద్య
జ్ఞానం లేని విద్య
సుఖించలేని విద్య
సేవకు రాని విద్య

గ్రాసము లేని కొలువు
ఆశలు చూపు తనువు  
కాలము తెల్పు మనువు  
బతక లేనిది పరువు

గారెలు లేని విందు
అక్కర రాణి చిందు
సుఖమే లేని పొందు
దగ్గు తగ్గని మందు

చెట్లు లేని వనంబు
శ్రద్ధ లేని తపంబు
మచ్చిక వినయంబు
చూపని సహనంబు

మెరుపు నిచ్చి మరల్చు
అభయమిచ్చి మిగిల్చు
కలలు తీర్చి మరల్చు
మనసు నిచ్చి కదల్చు

 కారణం నీ లోపలిది
 కార్యం నీ వెలుపలిది
మనసు నీలొ  ఉన్నది
సమయం నీ వెలుపలిది
Comments


నేటి ఛందస్సు
UI UI UI UUI   .... 16
బాల భాను కాంతి పుంజాలు
రామ భాణ కాంతి లోకాలు
రామ నామ కాంతి దేహాలు
విశ్వ మాయ కాంతి దేశాలు

 
మిన్ను దేహ కాంతి వర్ణాలు
మన్ను మోహ కాంతి భావాలు
శాంతి దాహ కాంతి ఊహళ్లు
కాలమే మాయ కాంతి విస్తర్లు  
 

మేని వెల్గు వింత కాంతుళ్లు
ఆశ పర్గు  కొత్త పొంతళ్లు
కాల మల్పు  తిప్పె చిందుళ్లు
చూపు కల్పి ఒప్పు మాటళ్లు
 

ప్రేమ మారి మేను నవ్వుళ్ళు
సేవ కోరి శక్తి ముచ్చట్లు
ధ్యాన మిచ్చి మోక్ష మార్గాలు
మాతృ మూర్తి యుక్తి పాఠాలు
 -
 నేర్పించు పంతులమ్మ పాఠాలు
 నేర్పూక  ఎందుకమ్మ భేదాలు  
 పెంచూట వద్దులెమ్మ వాదాలు
  దోషాలు చేయధమ్మ శాపాలు
 

 దీనంగ మాన్యమమ్మ శబ్దాలు
చద్వాలి  నిశ్చమమ్మ వేదాలు
పాఠాలు  నేర్పుమమ్మ శాస్త్రాలు
శోకాలు వద్దులెమ్మ భోగాలు
 

కాఠిన్యమున్ జూప గానిదమ్మా
పంత మ్మూ వద్దు ఎందుకమ్మా        
శాంతంమ్మూ జూపి ఉండువమ్మా
భాగ్యంమ్మూ  పంచు కోవలమ్మా
 

అటాడ కష్టమౌ నజినికొమ్మా
పోరాట ఇష్టమో నజినికొమ్మా  
పేరాశ శాపమో నజినికొమ్మా
వేషాలు కోపమౌ నజినికొమ్మా
 

నామాట లెప్పుడున్ నాణ్యమౌనే
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమౌనే
నాదైవమ్ హృదయం లోనమౌనే
నాప్రాణం ప్రేమంత భద్రమౌనే
 

నీ మీద నిరతమ్ము నెయ్యమేనే
నీ రూపు పదిలమ్ము హృద్యమేనే
నీ మాట మనసమ్ము వుండెనేనే
నీ నవ్వు ఎపుడూను పొందునేనే
 

ఎన్నెన్నొ నేవింటి నీరీతిగా
చెయ్యాలి సేవాలు నీరీతిగా
పొందాలి సంతోష మీరీతిగా
భాగ్యము వచ్చేలె ఈరీతిగా
              --((*))--
Co

ప్రాంజలి ప్రభ
నా కష్టాలు మీకు మీవి నాకు
ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు.. “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.
నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.
ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.
అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.
అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.
నీతి: భగవంతుడు నీకు ఏమి ఇచ్చిన దానికి ఓక అర్థం అంతకు మించి మనకు తెలియని ఏదో పరమార్ధం దాగి వుంటుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comm

*కొడుకు.... కూతురా
ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త  ఇలా మాట్లాడుకుంటున్నారు..
భార్య:
ఏం అనుకుంటున్నావ్..? అబ్బాయి పుడతాడనా ? అమ్మాయనా..??
భర్త:
🤔 అబ్బాయనుకో...వాడికి లెక్కలు నేర్పుతాను..ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం..స్విమ్మింగ్ నేర్పుతా..చెట్లెక్కడం నేర్పుతా..అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా..😉 ఇంకా....
భార్య:
చాలు చాలు! 😄
మరి అమ్మాయి పుడితే..!?
భర్త:
అమ్మాయైతే ఏం నేర్పనవసరంలేదు..! అదే నాకు నేర్పుతుంది..నేనేం తినాలి..ఏం తినకూడదు..ఏం మాట్లాడాలి..ఏం మాట్లాడకూడదు..
నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి..
ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట..
ఇంకా  నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది..నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు..ఎదురు తిరుగుంది.. భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది..మా నాన్న నాకోసం అది చేసాడు..ఇది చేసాడు అనీ..
భార్య:
సో..అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది.. అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??
భర్త:
కాదు..అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు..అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్..
భార్య:
అదేం శాశ్వతంగా మనతోనే
ఉండిపోదు కదా..!
భర్త:
ఉండదు.. కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం..అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు..!
# Daughters are Angles... Born with unconditional love and care forever..
*అందుకని ఆడపిల్లల*
*తల్లిదండ్రులు అదృష్టవంతులు* ....
కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క
కూతురంటే  దీంచెసుకొవలసిన బరువు కాదు..నీ ఇంట్లో వెలసిన  కల్పతరువు
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు ..నీ కడుపున పుట్టిన మరో అమ్మ
కూతురంటే కష్టాలకు,కన్నిళ్ళకు వీలునామ కాదు ...కల్మషం లేని ప్రేమ కు చిరునామా...
కళ్యాణమవగానే నీన్ను విడిచివెళ్ళిన ..పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా..
నీ ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...
కోడుకులా కాటి వరకు తోడురాకపోయినా... అమ్మ అయి నీకు  ప్రసాదించగలదు  మరో జన్మ...
కూతురున్న ఏ ఇల్లు అయిన అవుతుంది.. దేవతలు కోలువున్న కోవేల
కూతురిని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా........🙏🙏🙏
...

  శివలింగాలలోని ప్రత్యేకత ఏంటి? 🌻

🍃🌺పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.

🍃🌺అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి…? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం….


🌻 ఏ లింగాన్ని ఎవరు పూజించాలి…? 🌻

🍃🌺లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.

🍃🌺భర్తజీవించి వున్న స్త్రీలయితే స్ఫటిక లింగాన్ని, భర్తలేనివారు రసలింగాన్నికాని, స్ఫటికలింగాన్ని గాని అర్చిస్తే ఎంతో మంచిదని లింగపురాణంలో పేర్కొనబడింది.

🌻 వాటివల్ల వచ్చే ఫలితం ఏమిటి…? 🌻


🍃🌺ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.


🌻 ఏది అతి పవిత్రమైన లింగం..? 🌻


🍃🌺శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.


🌻 ఎప్పుడు పూజించుకోవాలి..? 🌻


🍃🌺వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

🍃🌺చివరగా…. లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
 

 +91 94414 08564: 🌻 ముక్తి 🌻

🍃🌺శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..

🍃🌺మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్‌ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.

🍃🌺హృదయం వెన్న వలె ఉండాలి.  కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి.  ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.

🍃🌺శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.

🍃🌺దేనికీ అంటక, దేనినీ అంటించు కొనక కాంతి కటక…
 🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 87 🕉

తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లేదని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జేసి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!

📍 తాత్పర్యం: 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును.

🌹అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చిన తర్వాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము.

🌹ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము. నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందును.

🌹ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.


🙏 ఓం నమః శివాయ

🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

 --(())--

 భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.

"అదెలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
🌼🌼🌼🌼🌼

🔱🙏గౌరీ🙏🔱

రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'గౌర్యై నమః' అని చెప్పాలి.
గౌరీ = గౌర వర్ణములో ఉండునది.
'హిమవత్పర్వతరాజు పుత్రిక' అన్నా పార్వతి” అన్నా ఉమా' అన్నా 'గౌరి' అన్నా అమ్మవారే! “యోగాగ్నిలో ఆహుతి అయిన దక్షుని కూతురైన సతీదేవియే హిమవంతునికి కూతురుగా పుట్టిందని, ఆమె దేహచ్ఛాయ - శంఖము, బంగారం, చంద్రుడు ఈ మూడింటి రంగుల సమ్మేళనంగా కనబడుతూ ఉండడంతో 'గౌరీ' అనే పేరు వచ్చిందనీ " దేవి పురాణంలోని ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది.
శ్లో. యోగాగ్ని నాతుయాదగ్దాపునర్జాతా హిమాలయాత్
శంఖుకుందేందు వర్ణా చేత్యతో గౌరీతి సాస్మృతేత్.
అమ్మవారి గౌరవర్ణానికి వేరే ఇంకొక కారణం ఉందని చెప్పే ఒక ఇతి హాసం కూడా ఉంది. 'పరమేశ్వరుడు తన భార్య అయిన కాళీదేవిని చూచి 'నల్ల పిల్లా' అని పరిహసించినపుడు - ఆవిడ తపస్సు చేసి, బ్రహ్మ వరం వలన గౌరవర్ల శరీరాన్ని పొందింది. అప్పటి నుండి ' గౌరీ' అని పిలువబడింది. అని ఈ ఇతి హాసం చెబుతుంది.
దేవీ పురాణంలో ఇంతకు ముందు చెప్పబడిన అమ్మవారి రంగు - 'చాంపేయగౌర, వర్ణమని ఆదిశంకరులు అర్థనారీశ్వర స్తోత్రంలో తెలియపరుస్తారు.
మంత్రశాస్త్ర ప్రకారం - ఉచ్ఛారణకు ముందున్న అమ్మవారు - 'త్రిపురసుందరి అయితే, ఉచ్ఛారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు 'గౌరీ'. మనస్సులో భావాలు కలిగి, ఆ భావాల్ని వ్యక్త పరుద్దామనుకున్నపుడు ఆ భావాలు - అక్షరాలుగా - ఆ అక్షరాలు ఒక పదంగా, రెండు పదాలుగా, నాలుగు పదాలుగా, ఎనిమిది పదాలుగా, తొమ్మిది పదాలుగా ఇలా ఎన్నో - పదాలుగా మారుతూ ఉచ్చరింపబడుతూ నీటి మీద వ్రాసే అక్షరాల్లాగా వ్యక్తమై వెంట వెంటనే నీటిలోనే కలసిపోయినట్లు చోటులో కలిసి పోతాయి.
సరిగ్గా ఈ భావాన్ని తెలిపే ఈ క్రింది మంత్రమే మంత్రశాస్త్రంలో గౌరీదేవికి సంబంధించిన మంత్రంగా చెబుతారు.
“గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరాపరమేవ్యోమన్.
ఉచ్ఛారణ సరిగ్గా రాని వారి కోసం - నమ్మకంతో, త్రికరణ శుద్ధిగా పై మంత్రాన్ని స్మరిస్తూ హోమగుండంలో పసువు కొమ్ములు గాని, వసువుగాని సమర్పిస్తూ హోమం చేస్తే - ఆ ఉచ్చారణ చక్కబడుతుంది. 'ఆనబోయే మాట'- 'పుట్టబోయే కొడుకు పేరు' లాంటిది. ఈ గౌరీ నామం.
1) గౌరవర్ణములో ఉండునది.
2) ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారు. అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.

🙏ఓం ఐం హ్రీం శ్రీo గౌర్యై నమః🙏

🌷శ్రీ మాత్రే నమః🌷
శుభోదయం
 
          ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం.
     ఎన్నటికీ శాశ్వతం కావు.
       
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
శుభోదయం
 -------------------
🌻 మహానీయుని మాట🍁
        -------------------------
"ఒంటరిగా ఉన్నపుడు ఆలోచనల్ని నలుగురిలో ఉన్నపుడు నాలుకని అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం మన అదుపులో తప్పకుండా ఉంటుంది."
       --------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
      ---------------------------
"నీ కళ్ళు అందంగా ఉంటే ఈ ప్రపంచానికి నువ్వు నచ్చుతావు. అదే నీ దృష్టి అందంగా ఉంటే ఈ ప్రపంచం నీకు నచ్చుతుంది."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
 


   ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు!         
               ➖➖➖✍️

ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు.

మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారు తాకితే తనను అనుగ్రహించినట్టు అనుకున్నాడు.

“దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.

పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.

“ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.

అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?”  కాని తప్పకుండా నిజమే మాట్లాడాలి ఏది ఏమైనా సరే.

“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”

“ఏం? ఎందుకు?”

“నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”

స్వామివారు ఆరుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ, కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.

అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో,      “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.

ఇతను నేపాల్ యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.

“పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.

ఇపుడు ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.

అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం ।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

--(())--
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం_✍️

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
📖 మన ఇతిహాసాలు 📓


మాండవ్యముని వృత్తాంతం


మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.

9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣
తేటగీతి
జీవి మనసును మరిగియు జాడ్య ముంచు
జీవి వయసును బట్టియు జాప్య ముంచు
జీవి నిత్యమూ వ్యసనం జోలపాడు
జీవి మంచులా కరిగియు జపము చేయు

నిత్య జీవితం సత్యమై నడక సాగు
నిత్య మాటల తలుపులు నింగి చేరు
నిత్య పరుగులు జీవితం నిన్ను మార్చు
నిత్య గెలుపుకు ప్రేమను నిచ్చి చూడు

జలమ చేరిన చినుకులు జలము కలియు
జలము నందు పెరుగుచుండు జలచరాలు
జలము మానవ దాహపు జీవనమ్ము
జలము త్రాగిన తరువాత జీవ శక్తి

అర్ధ నారీశ్వరల తత్వవమ్ము కలిగి
అర్ధ భావమ్ము జీవితం అర్ధ మవ్వు
వ్యర్ధ సంఘర్షణమ్ములు వ్యర్ధ మవ్వు
అర్ధ మవ్వునా ఈనాటి ఆర్య సూక్తి

రక్త మాంసాల ముద్దను రాజ్య మేలు
రక్త పంజరం వ్యాపించి రాటు తేలు
రక్త మంతయు దోచేటి రవ్వ వెలుగు
రక్త తర్పణతో తల్లి రామ అనుచు

పుడమి నెప్పులు పట్టని ప్రజ నడుగు
పుడమి తల్లి యు బాధను పట్టు యెవరు
పుడమి శక్తిని తోడియు పల్కు వారు
పుడమి కరుణను చూడక పిచ్చి దనుచు

యువత మాంసాల ముద్దను ఏలు చుండు
యువత పంజరం వ్యాపించి యేమి చేయు
యువత అంతయు దోచేసి యతిగ వెలుగు
యువత తర్పణతో తల్లి యాజ్ణ అనుచు

విత్తు పుడమిన నీటితో విచ్చి ఎగసె
విత్తు ఎరువును పొందియు వ్యర్ధ మవ్వ
కుండ విత్తు లు కలిసి యు కమ్ము కొచ్చు
వెలుగు నీడలు పొందియు వ్యాప్తి చెందు

మోక్క మోక్కయు అంటుయే మోక్క యగును
మొక్క కొమ్మరెమ్మలలోను మోగ్గ పువ్వు
మోక్క గాలినీటినిపీల్చి మేను పెంచు
మోక్క గామారి వృక్ష మ్ము మన్న నిచ్చు

పంట పండిస్తున్న ట్టి రైతులలొ శక్తి
పంట ఉత్పత్తి సామర్థ్య ప్రాంతమంత
పంట దేశసంపదగాను పిలుపు వుంచి
పంట దైవసమ్మతిగా పొందు చుండు

కంటిలోనినలసునినాలుకయు తీయు
ఇంటిలోనిఎలకలబోనుగను పట్టు
ఇంటిలో ఈగ మోతలు ఇంతికెరుక
బయటపల్లకీ మోతలు భర్త తెలుపు

--(())--
 


"  ఋషులు చూపిన  భక్తి మార్గాలు

 1.  వేదా ధ్యయనం చేసిన పండితులు, జ్ఞానులు పరబ్రహ్మమును  ఉపాసించడమే " పర భక్తి". 
 2.  ఇష్ట దేవతలను ఉపాసించడం " అపర భక్తి " . 
 3.  యాత్రలు చేసి, దేవతా స్వరూపాలను ఆరాధించటం " భయ  భక్తి "
 4.  ఇష్ట దేవుని ప్రతిరూపాన్ని ఆరాధించడం " అన్వయ భక్తి "
 5.  ఎల్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని ప్రేమించడం   "ఏకాంత భక్తి "
 6.  ఎల్లాంటి ఉద్వేగాలకు పోకుండా ప్రశాంతమైన ప్రార్ధన  "  శాంత భావ భక్తి " 
 7.  నేను నీకు దాసుడను అనే  చేసే ప్రార్ధనను  " దాస్య  భావ భక్తి "
 8.  దేవుణ్ణి ప్రియమిత్రునిగా భావించి చేసే  ప్రార్ధనను  " సఖ్య  భావ భక్తి "
 9.  భక్తులు భగవంతున్ని బిడ్డలుగా భావించి చేసే  ప్రార్ధనను  " వాత్సల్య భావ భక్తి "
 10.  భర్తే దేవునిగా భావించి  చేసే  ప్రార్ధనను  " కాంత  భావ భక్తి "
 11.  మనస్సును పూర్తిగా అర్పించి చేసే  ప్రార్ధనను  " మాధుర్య  భావ భక్తి "
 12.  భగవన్నామస్మరణను నిరంతరం ఒక పద్దతి ప్రకారం చేయడం" అబ్యాస భక్తి"
 13.  మంచి చెడులు వ్యత్యాసాలను గమనించి చేసే  ప్రార్ధనను  "వివేక భక్తి"
 14.  భగవంతుని దూషింస్తూ చేసే స్మరణను " విముఖ భక్తి "
 15.  ఎల్లప్పుడూ సత్యమార్గాన్న చేసే ప్రార్ధనను " సత్య  భక్తి "
 16.  దేవుని కళ్యాణాలు చేస్తూ ప్రార్దిమ్చడమే  " కల్యాణ భక్తి "
 17.  ప్రాణుల పట్ల అహింసను ప్రదర్సిస్తూ పరమను చూపే భక్తిని " అహింస భక్తి " 
 18.  సమాజానికి  చేతనైనంత దానం చేయటమే "దాన భక్తి "
             
  ప్రతి ఒక్కరు భక్తి  మార్గములో నడుస్తూ సమాజానికి, దేశానికి భారం కాకుండ, మనుష్యులు  " బ్రతికి- బ్రతికించుకుంటు" జీవించడమే  " నిజమైన భక్తి "

--((**))--

ప్రాంజలి ప్రభ. ఈ వారం కధ కాదు నిజం(1)
సేకరణ: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

*ఇండియాలో ఎవ్వరికైనా తెలుసా :*

 *లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే*

 టైటిల్ చూసి షాక్ అయ్యారా.. నిజమే.. రాసే ముందే కూడా మేం షాక్ అయ్యాం. రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.
 
తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతి చలానా చూసి అవాక్కవుతున్నారు. అవునా.. అవునా అని అందరూ చర్చించుకోవటం కనిపించింది.


--((***))--
 
తాపత్రయం అంటే ఏమిటి?

మన వాడుక భాషలో 'తాపత్రయం' అనే మాట తరచు గా ఉపయోగిస్తుంటాము... ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలి అనే తాపత్రయం ఎందుకు పడతావు ?.. నా తాపత్రయం అంతా వాడి గురించే... ఇలా చాలా సందర్భాలలో అంటాము / వింటాము.
 
అసలు తాపత్రయం అంటే ఏమిటి?.
హిందూ వాజ్మయం ప్రకారం మనకి సంభవించే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు విధాలుగా ఉంటాయిట... అవి 1. భౌతికమైనవి, 2. దైవికమైనవి మరియు 3. అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి.
 
భౌతిక పరమైన కష్టాలు అనగా భౌతిక ప్రపంచం లో ఉండే క్రూర జంతువులు, సాటి మనుషులు, ప్రక్రుతి వైపరీత్యాలు అంటే భూకంపం, వరదలు, అగ్ని ప్రమాదాలు,ఆకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు మొదలైన వాటివల్ల సంభవించేవి.
దైవిక మైనవి : మనకు కనిపించే ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు భౌతికమైనవి అయితే మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు దైవికమైనవి లేదా ఆది దైవికమైనవి... అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమించేవి.
 
అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి: తనగురించి లేదా ఇతరుల గురించి బాధ పడడం, శరీరం, బుధ్ది అదుపు లో లేక పోవడం, వ్యాధి, శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతం పడడం మొదలైనవి.
 
తాపం అంటే వేడి, త్రయం అంటే మూడు అనగా మూడు రకాల వేడి , మూడు రకాల కష్టాలనమాట. ఈ తాపాలు ఆధ్యాత్మికతాపం,అధిభౌతికతాపం, అధిదైవికతాపం అని మూడు రకాలాన్నారు పెద్దలు.సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయడం కోసం, పెట్టలేని పరుగుకు ప్రయత్నించడంగా చెబుతున్నారు.
ఆధ్యాత్మికతాపం చెప్పుకోవాలంటే, ముందుగా ఆత్మ గురించి చెప్పుకోవాలి. ఆత్మ నశించనిది,శరీరం నశించేది. ఈ శరీరం లో ఆత్మ నివశిస్తుంది, ఈ శరీరం చేసే, మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభుతంగా అనుభవిస్తుంది. మనసు,బుద్ధి,చిత్తం, అహంకారం, మనసు యొక్క వివిధ స్థాయిలు. ఈ మనసనేది  చిత్రమైనది, సంకల్పవికల్పాలు చేస్తూనే ఉంటుంది. మనసు చేసే మరో చిత్రమే పురుషార్ధసాధన. ఇందులో మూడవ పురుషార్ధమే కామం. కామమంటే కోరిక,(స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు) ఏదైనా కావచ్చు. ఇది ధర్మ బద్ధంగా ఉన్నంతకాలం తాపానికి చోటు లేదు. ధర్మ బద్ధమైన కోరిక కూడా జరగని సమయాలూ ఉంటాయి, అప్పుడూ ఈ తాపం తప్పదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో, చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశతృవులుగానూ పెద్దలు చెబుతారు. ఈ అంతఃశతృవులు బయటికి కనపడరుగాని, చాలా తాపాన్ని అనగా కష్టాన్నే కలగచేస్తారు. వీరిబారిన పడనివారుండరు. వీరిబారిన పడనివారు మహామహులే. ఏదో ఒక కోరిక లేనివారు లేరు, కాదు ఉండరు. నాకేకోరికా లేదన్నవారినెవరినీ నమ్మద్దు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. ఈ తాపంలో పై చెప్పినవే కాక కలిగే శరీరానికి సంబంధించినా ఊర్ములు ఆరు, ఆకలి,దప్పిక, జర,రుజ,శోకం,మోహం…వీటినుంచి కలిగే కష్టాలు కూడా అధ్యాత్మిక తాపాలే. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం. ఇది చాలా పెద్ద కష్టం. ‘గోచీ కంటే దరిద్రం ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర ముసలితనం,రుజ అనగా వ్యాధిబారినపడటం ఇవి రెండూ తప్పించుకోలేనివి అనుభవించక తప్పనివీనూ. జర,రుజ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం,మోహం, తప్పించుకోవాలని తంటాలైతే పద్తాం కాని సాధ్యం కాదు, ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి, యీ ఊర్ములన్నీ. ఇవే అధ్యాత్మిక తాపాలు.
 
అధి భౌతిక తాపం.ఈసృష్టిలో ఎవరిమటుకు వారొకరే కాదు, చాలా ప్రాణులు, అప్రాణులూ ఉన్నాయి, ఇవీ కాలంతో పాటువే. ఈ సృష్టితో సహజీవనం తప్పదు. అప్పుడపుడు మనతో జీవించే ఇతర జంతువులవలన, మనుషులవలన కలిగే కష్టాలే అధిభౌతిక తాపాలు. ఉదాహరణకి నల్లులు,దోమలు కుట్టడం, తేలు, పాము లాటివి కాటేయడం, పేలు తలలో ఒంటిని పట్టడం, జంతువులలాటివి గాయపరచదం. వీటికంటే చాలా ముఖ్యం ‘మనిషికాటుకి మందులేదని’ సాటి మనిషినుంచి కలిగే కష్టం కూడా ఇందులో చేరేదే. జంతువులు ఇతరజీవులను హింసించడం,వధించడం అధిభౌతికతాపమే, తప్పించుకోగలదే కాని తప్పించుకోం. నిజానికి దీనినుంచి తప్పించుకోవడమే గొప్ప.
నా ఇల్లు, నాఇష్టం, నిప్పుపెట్టుకుంటాను, నువ్వెవరు కాదనడానికి?నీ ఇల్లు నీ ఇష్టమని తగలబెట్టుకోడానికి లేదన్నా,నా స్వాతంత్ర్యం అని మొండిగా మాటాడేవారినేం చేస్తాం?,పది మంది నమ్మినదానిని కాదనుకోడం, తప్పులేదు, మీరంతా తప్పు చేస్తున్నరని చెప్పడం? అంతదాకానూ బాగానే ఉంది, ఇది నిత్య కలహం చెయ్యడం? ఇద్దరు వ్యక్తుల మధ్య,రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య కలహం, కలహం, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మూడవారు ఇద్దరినీ బాగుంద…

--(())--
 
ఇంద్రియ నిగ్రహం
కౌశికుడు ధర్మవ్యాధుని ” ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి? ” అని అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ” మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మాటలు చెవికెక్కవు. దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం ” అన్నాడు. ” మహాత్మా! ఇంద్…
--(())--

విలువ
విక్రమపుర రాజ్యానికి రాజైన సిద్ధార్థనుడు మంత్రి గుణాఢ్యుని పిలిచి రాజ్య వ్యవహారాలు మాట్లాడుతూ… సమాజంలో మనుషుల మధ్య ఉన్న విలువల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ‘మహా మంత్రి ఈ సమాజంలోని మనుషుల ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆస్తి, అంతస్తులను బట్టి సమాజం విలువనిస్తుంది. కానీ, నోరు, జీవం లేని బంగారం, వజ్రాల విలువ ఎక్కడైనా ఒకటేగా కదా..!’ అన్నాడు.

అందుకు మంత్రి ‘మహారాజా..! మీరనుకున్నట్లే బంగారం, వజ్రాలు విలువైనవే అయినా.. అవి ఎవరి వద్ద ఉంటాయో వారి స్థాయిని బట్టి వాటి విలువలు మారిపోవచ్చు’ అన్నాడు.
‘వాటిని అమ్మినా కొన్నా విలువ ఎక్కడైనా ఒకటి కాదంటారా..!’ అన్నాడు రాజు. ‘వాటి విలువను మోసంతో హెచ్చుతగ్గులు చేయగల మర్మయోగులు కొందరుంటారు రాజా..!’ అన్నాడు గుణాఢ్యుడు.
 
‘ఈ వ్యత్యాసాన్ని ప్రత్యక్షంగా చూపించగలవా?’ అన్నాడు రాజు మహామంత్రి కేసి సూటిగా చూస్తూ .. మంత్రి రెండు క్షణాలు ఆలోచించి ‘అలాగే మహారాజా..! రేపటిరోజున ఖజానా నుంచి విలువైన నాలుగు వజ్రాలు తెప్పించండి.’ చెప్పి వెళ్లిపోయాడు మంత్రి.
మరుసటి రోజు మంత్రి నలుగురు వ్యక్తుల్ని వెంట పెట్టుకుని మహారాజు వద్దకు తీసుకొచ్చాడు. రాజు ‘మంత్రివర్యా.. మీరు కోరినట్లు వజ్రాలు తెప్పించాను.. ఇవిగో’ అన్నాడు. నలుగురికి ఒక్కొక్కటి ఇచ్చి ఏం చేయాలో చెప్పి పంపేశాడు గుణాఢ్యుడు.
వారిలో మొదటివాడు ఆ ఊరి వజ్రాల వ్యాపారి దివోదాసు వద్దకు వెళ్లి వజ్రాన్ని అమ్మదలచానని చెప్పాడు. వజ్రాన్ని పరీక్షిస్తూనే దివోదాసు ‘మిమ్మల్ని చూస్తుంటే గొప్పవారి కొలువులోనో పనిచేస్తున్నట్లున్నారు’. అన్నాడు. ‘ఆ.. నేను మహారాజు కొలువులో పనిచేస్తున్నాను. నా పనితనానికి మెచ్చి ఈ వజ్రాన్ని నాకు బహుమతిగా రాజు గారు ఇచ్చారు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం. అందుకే అమ్మదలచాను.’ అన్నాడు.
‘ముందు మీరు కూర్చోండి.’ అంటూ మర్యాదలు చేసి పైకం ఇచ్చాడు.’ దాన్ని తీసుకుని వాడు వెళ్ళిపోయాడు.
 
రెండోరోజు రెండోవాడు వజ్రాన్ని దివోదాసుకు అమ్మచూపాడు. ఆ వ్యాపారి ‘మిమ్మల్ని చూస్తుంటే పండితుడిలా ఉన్నారు. ఇది మీకెక్కడిది?’ అని ప్రశ్నించాడు. అందుకు ‘నేను రాజు కొలువులో ఆస్థానకవిని నా కవిత్వానికి మెచ్చి నాకీ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. దాని విలువకు తగిన ధనం ఇప్పించండి’ అన్నాడు.

వ్యాపారి లోలోపల ‘రెండు పద్యాలు చెబితే రాజు పొంగిపోయి ఇలాంటివి ఎన్నో ఇస్తాడు. దీని విలువ వీడికెలా తెలుస్తుంది.’ అని మనస్సులో అనుకుని ధనం ఇచ్చి పంపించేశాడు.
మూడోరోజు వ్యాపారి వద్దకు వచ్చిన మూడోవాడిని చూసి ‘నిన్ను చూస్తే రాజుగారి సైనికుడిలా ఉన్నావు.’ అన్నాడు. ‘అవును.. నేను రాజుగారి సైనికుడినే! ‘నా కొడుక్కి నామకరణం చేయాలి నాకు ధనం అవసరం. దాని విలువకు తగిన పైకం ఇప్పించండి’ అన్నాడు. వ్యాపారి మనసులో ‘వీడికి యుద్ధ వ్యూహాలు, పహారా తప్ప దీని విలువ వీడికేమి తెలుస్తుంది.’ అనుకుని ఇదే దీనికి వచ్చే పైకం అని చేతుల్లో పెట్టాడు. నాల్గోరోజు ఆఖరివాడు వ్యాపారి వద్దకు వెళ్లి.. ‘సామీ.. నా కూతురి పెళ్లిసేయాల. దీన్ని కొనుక్కొని పైకం ఇవ్వండి’ అన్నాడు. వ్యాపారి వాడిని ఎగాదిగా చూసి.. ‘ఇది నీకెక్కడిదని గట్టిగా అన్నాడు. ‘అయ్యా..! నన్ను దొంగగా అనుమానించడం ఏం బాగోలేదు.. నేను రాజుగారి వద్ద పనిచేస్తాను. నా పనితనానికి మెచ్చి రాజుగారు నాకు దీన్ని ఇచ్చాడు. కావాలంటే రాజు గారి దగ్గరకు పోదాం రా సామి..’ అన్నాడు. వ్యాపారి ‘ఆ.. సరే..సరే’ అంటూ కొంత పైకం ఇచ్చి పంపేశాడు.

తర్వాత ఆ నలుగురూ రాజమందిరానికి వెళ్లి జరిగినదంతా చెప్పారు. ‘వ్యాపారి మనుషుల వేషాలు, వారి వృత్తిని బట్టి విలువలు కట్టి మోసం చేసి హెచ్చు తగ్గులుగా పైకాన్ని ఇచ్చి పంపాడు. చూశారా ప్రభూ..! విలువలు ఎలా మారాయో..!’ అన్నాడు గుణాఢ్యుడు.
‘నిజమే మంత్రివర్యా..! అర్థమైంది. వెంటనే ఆ వ్యాపారిని పిలిపించండి’ అన్నాడు. ‘చిత్తం ప్రభు!’ అన్నాడు మంత్రి.

మరునాడు సభలోకి వచ్చిన వ్యాపారిని ఉద్దేశించి ‘ఆ నలుగురి వద్ద ఒకే వజ్రాలున్నా.. ఒక్కొక్కరికి ఒక్కో విలువ కట్టి ఇస్తారా..? అని రాజు ప్రశ్నించాడు. తాను చేసిన మోసం రాజుగారికి తెలిసిపోయిందని భయపడి ‘ప్రభూ.. నన్ను క్షమించండి’.. అని చేతులు జోడించి వేడుకున్నాడు దివోదాసు.

‘సమన్యాయం ఎరిగి వ్యాపారం చేస్తే నీ విలువ ఈ సమాజంలో పెరుగుతుంది. ఇకనైనా బుద్ధితెచ్చుకుని బతుకు..’ అని గద్దించాడు రాజు. ‘మంత్రిగారు..! మన రాజ్యంలోని ఇలాంటి మోసపూరిత వ్యాపారస్తులుగా ఉండేవారికి దేశ బహిష్కరణ, వ్యాపారానికి అనర్హులుగా అవుతారని దండోరా వేయించండి’ అనగానే సభ చప్పట్లతో మారుమోగింది. దివోదాసు మరోసారి క్షమించమని అడిగాడు. 

--(())--



మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[16:46, 09/02/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 9.

స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 9.

All the secret of success is there; to pay a much attention to the means as to the end.

లక్ష్యంపై ఉన్నంత శ్రధ్ధాసక్తుల్ని, లక్ష్యసాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యమంతా ఇదే.

🕉🌞🌎🌙🌟🚩
[16:54, 09/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(797)
🕉🌞🌎🌙🌟🚩

"ఆధ్యాత్మిక సాధనకు అవరోధం అవుతున్న మనోవేగాన్ని ఏవిధంగా నియంత్రించాలి !?"

ఆధ్యాత్మిక సాధనల పేరుతో మనం చేసేది, చేయాల్సింది ఈ మనోవేగాన్ని తగ్గించటమే. అంటే మనసును నియంత్రించాలి. మనస్సును నియంత్రించడం అంటే దాని గుణాలను నియంత్రించడమే. మనోవేగం మన రోజూవారి జీవితంలో బయటపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో మనోవేగం ఉంటుంది. ఒకరికి వస్త్రాల విషయంలో, మరొకరికి ఆహారం విషయంలో, ఇంకొకరికి విందులు-వినోదాల విషయంలో ఇలా చాలా మందికి వారివారి బలహీనతల విషయంలో మనసు వేగంగా ఉంటుంది. మన మనస్సు ఏవిషయంలో వేగంగా ఉంటుందో గుర్తించి దాన్ని తగ్గించుకోవటంచేత మనసును స్వాధీనం చేసుకోవచ్చు !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'కనపడే గుణం మారితే కనపడని మనసు మారుతుంది'- (అధ్యాయం -98)

🕉🌞🌎🌙🌟🚩
[16:54, 09/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩

"ఋభుగీత " (264)
🕉🌞🌎🌙🌟🚩

సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము 

ఆశించకుండా జరిగే కార్యాలేవీ కర్తృత్వాన్ని కలిగించవు !

ఆత్మసిద్ధి కలిగే వరకూ మన కర్మలకు మనమే కర్తలమై, వాటి ఫలాలకు మనమే భోక్తలు కావాల్సి వస్తుంది. మనం ఆత్మస్వరూపం అని అర్థమైతే మన సర్వవ్యాపకత్వం మనకు అర్థమౌతుంది. అప్పుడు గ్రహించడం, గ్రహించేవాడు, గ్రహించాల్సిన విషయాలు, అనుసరించాల్సిన విషయాలు, స్నానాది నియమాలు అన్నీ కేవలం దైహికమైన ఒక కార్యకలాపమేగానీ ఏదో ఆశించి జరగవు. ఆశించకుండా జరిగే కార్యాలేవీ కర్తృత్వాన్ని కలిగించవు. కర్తృత్వం లేకపోతే కార్యమునకు ఉన్న కర్మ వాసనలు అంటవు !

🕉🌞🌎🌙🌟🚩
[17:06, 09/02/2021] +91 92915 82862: 🌷150 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩

 దేవతలు - అసురులు

8) వారికీ ఈ జగత్తు సృష్టి సత్యములపై ఆధారపడినది అని నమ్మకం ఉండదు. ఈ సృష్టికి అధీశ్వరుడు అగు భగవంతుడు లేడనిపించును. ఒక కారణం లేక సృష్టి ఎట్లో వెలువడినదనుకొందురు. దానికి ధర్మమను ప్రకృతియందు స్థిరత్వము లేదనిపించును. కామము కారణముగా స్త్రీ పురుష పరస్పర స్పర్శ చేతనే సృష్టి కలుగుచున్నది. అంతకుపైన ఏమియు లేదని నమ్ముదురు.
 

9) ఇట్టి దృష్టిని అవలంబించి వారు ఆత్మజ్ఞానమును కోల్పోవుదురు. దానితో బుద్ధి తక్కువ అగును. ఉగ్రములైన కర్మలను ఆచరించి, జీవుల వినాశమునకు కారకులై అహితులగుదురు.


10) ఆత్మను కోల్పోవుట అనగా తన యందు కానీ, ఇతరుల యందు కానీ 'నే'నను తత్త్వమున్నట్లు గ్రహింపకుండుట. దీనివలన 'నేను' అను పదమునకు దేహేంద్రియ మనస్సులనియే వారి ప్రమాణము.


 11) ఇట్లు అన్వయింపడిన 'నేను' అను పదమే అహంకారమనబడును. అల్పబుద్ధులు అనగా వివేచనము లేనివారు. ఉగ్రకర్మలనగా బంధించుట, బాధించుట, చంపుట మున్నగునవి. జగత్తునకు అహితులనగా సృష్టి క్రమమునకు శత్రువులు.

🕉🌞🌎🌙🌟🚩
[17:06, 09/02/2021] +91 92915 82862: 164) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతౌ శ్రుతమ్ ౹ మేఘాకాశ జలాకాశావివ తౌ సువ్యవస్థితౌ ౹౹155౹౹

155.  జీవుడు ఈశ్వరుడు మాయయందు ప్రతిఫలించిన ఆత్మయని శ్రుతి చెప్పుచున్నది. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము జలమునందు ప్రతిఫలించిన ఆకాశముల వలెనే.

(మొదటిది ఈశ్వరుడు,రెండవది జీవుడు అని పోలికగా చెప్పవచ్చు)
తాపినీయ ఉప.9.


మేఘవద్వర్తతే మాయా మేఘస్థితతుషారవత్ ౹ ధీ వాసనాశ్చిదాభాస స్తుషారస్థఖవత్ త్థ్సితః ౹౹156౹౹

156. మాయను మేఘముతో పోల్చవచ్చు.బుద్ధి యందలి వాసనలు మేఘముగనున్న నీటి కణములతో పోల్చి చెప్పబడినవి. మాయయందు ప్రతిబింబింతమైన కూటస్థ చైతన్యము ఈ జలబిందువులందు ప్రతి ఫలించు ఆకాశము వంటిదని చెప్పబడినది.


 వ్యాఖ్య:- ఈశ్వరతత్త్వమును వర్ణించు ఈ శ్లోకము అద్వైతసిద్ధాంతములో ఒక దుమారమును లేపి ఒక సమస్యను కూడా పరిష్కరించినది.


చైతన్య ప్రతిఫలనము మాయయందైన ఈశ్వరుడనీ అవిద్యయందైన జీవుడనీ మునుపు
(ప్ర.1.16,17) చెప్పబడినది.


ఈ శ్లోకమున మాయను మేఘముతో పోల్చి,బుద్ధి అందలి వాసనలలో ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని సూచింపబడుచున్నది.అనగా ఈశ్వర సత్తను,మేఘములోని నీటిబిందువులందు ప్రతిఫలించె ఆకాశమును వలె ఊహింపవలసిందే గాని అహంత వలె స్పష్టము కాదని ఉద్దేశము.


అంతేగాక ఈశ్వరుని ఉపాధి కేవలము మాయమాత్రమే గాక అందలి బుద్ధి వాసనలు కూడా అని ఏర్పడుచున్నది.
ఇది అనవసరము కదా. మాయయందు సృష్టి అంతా ఉన్నది కనుక మాయను స్వీకరించుట చేతనే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అగుచున్నాడు.


1. వాసనలనేకము లగుటచే వాని యందు ప్రతిఫలించుచు ఈశ్వరులు కూడా అనేకులగుదురు.

2. వ్యష్టి వాసనలని ఉద్దేశమైనచో ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాక అల్పజ్ఞుడు మాత్రమే అగును.

3. సమిష్టి వాసనలనినచో ప్రళయంలో తప్ప ఈ సమిష్టి ఏర్పడదు కనుక సృష్టి స్థితి కాలములందు ఈశ్వరుడు లేకపోవలసి వచ్చును.


కాని మాయను మాత్రమే స్వీకరించిన చాలదు.
ఈశ్వరోపాధియగు మాయ సాత్వికమగుటచే అందు వైవిధ్యముండజాలదు.


కాని ఈశ్వరుడు సర్వజుడు అనేటప్పుడు ఆమూలాగ్రముగ జగత్తు నందలి వైవిధ్యమంతా ఈశ్వరునకు తెలియుననియే భావింతుము.


ఈ వైవిధ్యమునిచ్చునది బుద్ధియందలి వాసనలే.అవి సృష్టి స్థితి ప్రళయ కాలములందుంటూ స్థూలసూక్ష్మకారణా వస్థలయందు మరల మరల మారుచుండును. కనుక ఈశ్వరునికి మాయ ఉపాధి ద్వారా ఐక్యతయు బుద్ధి వాసనలనెడి ఉపాధి ద్వారా వైవిధ్యమును సాధింపబడినవి.


అవాజ్మానసగోచరమైన తత్త్వమును మాటల ద్వారా ఆలోచనల ద్వారా తర్కబద్ధమైన సిద్ధాంతమునందు బంధింపజూచు వారికి ఇట్టి అగచాట్లు తప్పవు.

🕉🌞🌏🌙🌟🚩
[17:16, 09/02/2021] +91 92915 82862: 48)-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

(ఆనందభైరవి - రూపక)

పల్లవి:-
మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు!!

చరణము(లు):-
బాలత్వముననేను బావినీళ్ళకుపోయి
కాలుబెట్టగ చిన్న తేలుపొడిచెనయ్య!! మే!!


చలివచ్చెనని నొప్పిచేత దీనివేడిమి పాపిష్టి ఘాత
యీలాగునైన నే నేలాగు తాళుదు మూలమైన గురుమూర్తి పాదములాన!! మే!!


మిక్కిలి సలుపుచున్నది రాముగ్రక్కున నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను!! మే!!


దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులుచేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరి రామదాసుని బడనీయక కాపాడు తండ్రివి నీవె!! మే!!

🕉🌞🌏🌙🌟🚩
[17:18, 09/02/2021] +91 92915 82862: ||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము 27వ దశకము - కూర్మావతారము వర్ణనము 27-7-శ్లోకము
🕉🌞🌎🌙🌟🚩

 వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో। విస్తారాత్ పరిగతలక్షయోజనేన।
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నివేథః॥

భావము:-

ప్రభూ! విష్ణుమూర్తీ! వజ్రముకంటె గట్టిది, స్థిరమైనది, లక్షయోజనముల విస్తీర్ణముగల మూపు కలిగినది అయిన "కూర్మావతారమున", నీవు సముద్రగర్భమున మునిగియున్న ఆ పర్వతమును పైకి లేవనెత్తి నీ మూపుపై నిలుపుకొంటివి.

వ్యాఖ్య:-

కూర్మావతారాన్ని ఎంతో మధురంగా పోతనవారు తమ పద్యాలలో ఇలా వివరించారు.


దేవతలు అందరూ మునిగిపోతున్న మంథర పర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు, వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు.


సవరనై లక్ష యోజనముల వెడలుపై
కడుఁ గఠోరమునైన కర్పరమును
నదనైన బ్రహ్మాండమైన నాహారించు
ఘనతరంబగు ముఖగహ్వరంబు
సకల చరాచర జంతురాసుల నెల్ల
మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ
నాఁగినఁ గదలని యట్టి కాళ్ళు


వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ
మంబుజంబులఁ బోలెడు నక్షి యుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె.


విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడిచేస్తూ, మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా లక్ష యోజనాల వెడల్పుతో ఉంది. ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్ద నోరు లోకంలోని జీవరాశి అంతటిని లోపల ఇముడ్చుకోగలంతటి కడుపు. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైన కాళ్లు. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన రెండు కళ్ళు ఉన్నాయి. అలా బహు సుందర రూపంతో మహావిష్ణువు అందగిస్తున్నాడు.


కమఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో "నౌనౌఁగదే! బాపురే!
కమలాక్షా! శర"ణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్.

చిన్న ముత్తెము చిప్పంత సుళువుగా, కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలకి వెళ్ళాడు. వాసుకి భూరి నాగేంద్రునితో సహా మంథర మహాపర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగు వారంతా సంతోషంతో తబ్బిబ్బయి, తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కులా, ఆకాశం అంతా మారుమ్రోగేలా “ఆహా! ఓహో! మేలు మేలు శ్రీహరీ! పద్మాక్షా! శరణం శరణం” అంటూ జయధ్వానాలు చేయసాగారు..


ఇలా మందర పర్వతాన్ని ఎత్తి. . .

తరిగాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్!


ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణు లీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మంథరపర్వతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.


సముద్రాన్ని కుండగానూ, పర్వతాన్ని కవ్వంగానూ, సర్పాన్ని కవ్వంతాడుగా చేయగలవాడు, ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని, అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవాడు ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా! స్వస్తి. 

🕉🌞🌎🌙🌟🚩
[17:35, 09/02/2021] +91 92915 82862: ఓం నమః శివాయ:
🚩గీతా మాహాత్మ్యము🚩
🕉🌞🌎🌙🌟🚩

భగవన్‌ పరమేశాన 
భక్తి రవ్యభిచారిణీ,
ప్రారబ్ధం భుజ్యమానస్య
కథం భవతి హే ప్రభో!

భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?


ప్రారబ్ధం భుజ్యమానో౽పి
గీతాభ్యాసరత స్సదా
స ముక్తస్స సుఖీ లోకే
కర్మణా నోపలిప్యతే.

శ్రీ విష్ణువు చెప్పెను - ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.


మహాపాపాది పాపాని
గీతాధ్యానం కరోతిచేత్‌,
క్వచిత్స్పర్శం న కుర్వంతి
నలినీదల మంభసా.

తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.


గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్రవై.

ఎచట గీతాగ్రంథము యుండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.


సర్వే దేవాశ్చ ఋషయో
యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావా౽పి
నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం
యత్ర గీతా ప్రవర్తతే.

ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శవర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.


యత్ర గీతావిచారశ్చ
పఠనం పాఠనం శ్రుతమ్‌,
తత్రాహం నిశ్చితం పృథ్వి
నివసామి సదైవ హి.

ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.


గీతాశ్రయో౽హం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్‌,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాన్పాలయామ్యహం

నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతాజ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.


గీతా మే పరమా విద్యా
బ్రహ్మరూపా న సంశయః,
అర్ధమాత్రాక్షరా నిత్యా
స్వనిర్వాచ్య పదాత్మికా.

గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్ధమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.


చిదానందేన కృష్ణేన
ప్రోక్తా స్వముఖతో౽ర్జునమ్‌,
వేదత్రయీ పరానందా
తత్త్వార్థజ్ఞానమంజసా

సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.


యో౽ష్టాదశ జపేన్నిత్యం
నరో నిశ్చలమానసః,
జ్ఞానసిద్ధిం స లభతే
తతో యాతి పరం పదమ్‌.

ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదునెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.


పాఠే౽సమర్థస్సంపూర్ణే
తదర్ధం పాఠ మాచరేత్‌,
తదా గోదానజం పుణ్యం
లభతే నాత్ర సంశయః

గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.


త్రిభాగం పఠమానస్తు
గంగాస్నానఫలం లభేత్‌,
షడంశం జపమానస్తు
సోమయాగఫలం లభేత్‌.

గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .


ఏకాధ్యాయం తు యో నిత్యం
పఠతే భక్తి సంయుతః,
రుద్రలోక మవాప్నోతి
గణోభూత్వా వసేచ్చిరమ్‌

ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.


అధ్యాయ శ్లోకపాదం వా
నిత్యం యః పఠతే నరః,
స యాతి నరతాం యావ
న్మనుకాలం వసుంధరే.

ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.


గీతాయాః శ్లోక దశకం
సప్త పంచ చతుష్టయమ్‌,
ద్వౌత్రీనేకం తదర్ధం వా
శ్లోకానాం యః పఠేన్నరః.

చంద్రలోక మవాప్నోతి
వర్షాణా మయుతం ధ్రువమ్‌,
గీతాపాఠసమాయుక్తో
మృతో మానుషతాం వ్రజేత్‌.

గీతయందలి పది శ్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.


గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తి ముత్తమామ్‌,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్‌.

అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.


గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా,
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.

మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.


గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విజ్ఞేయో
దేహాంతే పరమం పదమ్‌.

ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.


గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్‌.

ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.


గీతాయాః పఠనం కృత్వా 
మాహాత్మ్యం నైవ యః పఠేత్ | 
వృథా పాఠో భవేత్తస్య 
శ్రమ ఏవ హ్యుదాహృతః || 

గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యమును నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫలమునివ్వక) వ్యర్థమేయగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే యని చెప్పబడినది.(గ్రంథము యొక్క మహిమను తెలుసుకొనినచో, గ్రంథము యెడల శ్రద్ధ కలుగదని భావము.)


ఏతన్మాహాత్మ్యసంయుక్తం 
గీతాభ్యాసం కరోతి యః | 
స తత్ఫల మవాప్నోతి 
దుర్లభాం గతి మాప్నుయాత్ || 

ఈ మాహాత్మ్యముతోబాటు గీతాపారాయణముచేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు. 


సూత ఉవాచ:-
మాహాత్మ్యమేతద్గీతాయా 
మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాన్తే చ పఠేద్యస్తు 
యదుక్తం తత్ఫలం లభేత్ || 

సూతుడు చెప్పెను - ఓ శౌనకాది మహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును, నేను మీకు దెలిపితిని. అద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెలిపిన ఫలమును బొందును. 

ఇతి శ్రీ వరాహపురాణే 
శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్ . 

ఇట్లు శ్రీ వరాహ పురాణమందలి 
శ్రీ గీతామాహాత్మ్యము సమాప్తము. 
ఓమ్.

🕉🌞🌎🌙🌟🚩
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -146 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము  📚
శ్లోకము 29

🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము.  “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే  ఈ అధ్యాయ రహస్యము 🍀


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వ…
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 
87. అధ్యాయము - 42

🌻. దక్షుని ఉద్ధారము   -3 🌻

పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).

నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందర…
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గర్గమహర్షి  🌻

 1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు. 

2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.

3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 168 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు -  మూడవ దివ్య యానము  - 6 🌻

650. సద్గురువు ప్రణతి, పునరావృత్తి ఆధ్యాత్మక మార్గముల ద్వారా, అభావమును యొక్క సంస్కారము లన్నింటిని జయించి, అభావమును కూడా లోపల కలిగియున్న సర్వమ్ తానేయని అనుభూతి నొందెను. సద్గురువు సృష్టి ధర్మమందున్నను, అది వాని నంటదు. 

651. మానవుడు భగవంతుడైన తరువాత ఇంక మానవుడుగా ఉండలేడు. అతడు మానవుని వలెనేవ జీవించవలనన్నెచో, అప్పటికప్పుడు అన్ని విధముల మానవ లక్షణములతో మానవుని వలెనే వ్యవహరించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹.  శ్రీమద్భగవద్గీత - 23  / Bhagavad-Gita - 23 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 23 🌴

23. యోత్స్యమానానవేక్షే(హం య ఏతే(త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేర్యుద్దే ప్రియచికీర్షవ || 

🌷. తాత్పర్యం : 
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.

🌷. భాష్యము : 
తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయమున దుష్టప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరేననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరును అతని లక్షణమునలను పోలినవారే. 

యుద్ధరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవారా యని తెలిసికొనుటయే గాని వారితో శాంతి మంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణభగవానుడు ఉపస్థిత…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24  / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀  24. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |
*భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ‖ 24 ‖ 🍀

🍀 64)  దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - 
దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.

🍀 65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - 
భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
📚. Prasad Bharadwaj 

🌻 24. devarṣi-gaṇa-saṁghāta-stūyamānātma-vaibhavā |
bhaṇḍāsura-vadhodyukta-śaktisenā-samanvitā || 24 || 🌻


🌻 64 )  Devarshi Gana - sangatha - stuyamanathma - vai…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం

🍀 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🍀

🍀 218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.

🍀 219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.

🍀 220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.

🍀 221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.

🍀 222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.

🍀 223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.

🍀 224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.

🍀 225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.

🍀 226) సహస్రాక్ష: - సహ…
[21:25, 09/02/2021] +91 95058 13235: 9.2.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము

అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అక్రూర ఉవాచ

40.1 (ప్రథమ శ్లోకము)

నతోఽస్మ్యహం త్వాఽఖిలహేతుహేతుం  నారాయణం పూరుషమాద్యమవ్యయమ్|

యన్నాభిజాతాదరవిందకోశద్బ్రహ్మాఽఽవిరాసీద్యత ఏష లోకః॥9789॥

అక్రూరుడు ఇట్లు స్తుతించెను శ్రీమన్నారాయణా! అఖిల కారణకారణుడవు అగు నీకు నమస్కరించుచున్నాను (వ్యష్టి ప్రపంచమునకు హేతువులైన మహదాదులకు నీవే మూలము). నీవే ఆదిపురుషుడవు, అవ్యయుడవు, నీ నాభికమలమునుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవునిద్వారా ఈ లోకసృష్టి జరిగినది.

40.2 (రెండవ శ్లోకము)

భూస్తోయమగ్నిః పవనః ఖమాదిర్మహానజాదిర్మన ఇంద్రియాణి|

సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే  యే హేతవస్తే జగతోఽఙ్గ భూతాః॥9789॥

పంచమహాభూతములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవియు,…
[04:32, 10/02/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[04:32, 10/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

811వ నామ మంత్రము 10.02.2021

ఓం పాశహంత్ర్యై నమః

భక్తుల పాశములను నశింపజేయు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి పాశహంత్రీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పాశహంత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ అమ్మవారిని ఉపాసించు సాధకునికి గల వివిధ పాశములనుండి విముక్తిని కలిగించును.

ప్రతీ జీవి  పేగు త్రెంచుకుని పుట్టి ఇలలో వివిధ పాశములకు బంధీ అవడం అనేది సాధారణం.  అందు వల్ల  అరిషడ్వర్గములకు (కామక్రోధలోభమోహమదమాత్సర్యములకు) లోనై జననమరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడం పరిపాటి అవుతుంది. ఈ విషయం తెలిసిన బుద్ధిమంతుడు పరమేశ్వరి పాదములను శరణు వేడుకుంటే తను చిక్కుకున్న పాశముల నుండి ముక్తి ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు పాశహంత్రీ యని అనబడినది. 

అలాగే పాపకర్మలు చేసి, మరణకాలం సమీపిస్తే ఆ కాలుడు యమపాశంతో తనను …
[04:32, 10/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

237వ నామ మంత్రము 10.02.2021

ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః 

త్రైలోక్యమోహనాది తొమ్మిది చక్రములలో గల అరువదినాలుగుకోట్ల యోగినీ గణములచే సేవింపబడు శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా  యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః  అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు అనిర్వచనీయమైన ఆత్మానందానుభూతి కలుగును.

బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవి, వారాహీ, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అను వీరు అష్టమాతృకలు. వీరి అంశచే ఒక్కొక్కరికి ఎనిమిది మంది చొప్పున మొత్తం అరువది నాలుమంది యోగినులు ఉంటారు. 
ఈ అరువది నాలుగు మందికి ఒక్కొక్కరికి కోటిమంది చొప్పున అరువది నాలుగు కోట్ల యోగినులు ఉంటారు. ఆవిధంగా నవచక్రాత్మకమైన లలితాచక్రంలో 
త్రైలోక్యమోహన చక్రము మొదలుగా తొమ్మిది చక్రములలోను ప్రతీ చక్రములోని అరువదినాలుగు కోట్లమంది భిన్నభిన్నలై మొత్తం తొమ్మిది చక్రములకు (8 x 8 x 9) అయిదువందల డెబ్బది ఆరు (576) కోట్లమంది యోగినులు ఉంటారు.  అనగా అయిదు (5) పద్మముల, ఏడు(7) అర్బుదముల, ఆరు (6) కోట్లమంది యోగినులు అగుదురు. ఇంత పెద్దసంఖ్యను చెప్పడానికి మహత్ అను పదమును ప్రయోగించి మహాచతుష్షష్టికోటి యోగినీగణము అనియు ఇంతమంది యోగినులచే సేవింపబడు శ్రీమాత మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితా యని అనబడినది.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[04:32, 10/02/2021] +91 95058 13235: 10.2.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబదియవ అధ్యాయము

అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
40.9 (తొమ్మిదవ శ్లోకము)

సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరమ్|

యేఽప్యన్యదేవతాభక్తా యద్యప్యన్యధియః ప్రభో॥9796॥

స్వామీ! ఇతర దేవతలను నీ కంటె వేఱైన వారినిగా భావించి, వారిని కొందఱు ఆరాధించుచుందురు. నీవు సర్వదేవతా స్వరూపుడవు, సర్వేశ్వరుడవు కావున, వాస్తవముగా ఇతర దేవతలను ఆరాధించినను నిన్ను ఉపాసించినట్లే అగును.

40.10 (పదియవ శ్లోకము)

యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః ప్రభో|

విశంతి సర్వతః సింధుం తద్వత్త్వాం గతయోఽన్తతః॥9797॥

దేవా! పర్వతములనుండి ప్రవహించిన నదులు అన్నియును వర్షజలములతో నిండి, అన్నివైపులనుండియు సముద్రమునే చేరుచున్నవి. అట్లే వివిధములగు ఉపాసనా మార్గములద్వారా పూజించినను అవి అన్నియున…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 635  / Bhagavad-Gita - 635 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 52 🌴

52. వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానస: |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత: ||

🌷. తాత్పర్యం : 
మితాహారము కలిగినవాడును, మనోవాక్కాయములను నియంత్రించువాడును, సమాధిస్థితి యందున్నవాడును, అసంగుడును, 

🌷. భాష్యము  :
దేహాత్మభావన లేని కారణముగా మిథ్యాదర్పమునకు దూరుడై యుండు అతడు భగవానుడు ఒసగినదానిచే తృప్తుడగు చుండును. అట్టివాడు ఇంద్రియప్రీతి లభింపనప్పుడు క్రోధము చెందుట గాని, ఇంద్రియార్థములకై తీవ్రయత్నములు సలుపుట గాని చేయడు. 

ఈ విధముగా మిథ్యాహంకారము నుండి సంపూర్ణముగా విడివడినపుడు, భౌతికవిషయముల యెడ అతడు అనాసక్తుడగును. అదియే బ్రహ్మానుభవస్థితియై యున్నది. అట్టి స్థితియే “బ్రహ్మభూతస…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 280, 281  / Vishnu  Sahasranama Contemplation - 280, 281 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻280. మన్త్రః, मन्त्रः, Mantraḥ🌻

ఓం మన్త్రాయ నమః | ॐ मन्त्राय नमः | OM Mantrāya namaḥ

శబ్దమూర్తిర్హరిర్మంత్రః ఋగ్యజుస్సామలక్షణః ।
అథవా మంత్ర బోధ్యత్వాన్మంత్ర ఇత్యుచ్యతే బుధైః ॥

ఋక్‍, యజుర్‍, సామ వేద మంత్రరూపుడు కావున 'మంత్రః' అనబడును. లేదా అట్టి వేదమంత్రములచేత తెలుపబడువాడు కావున 'ప్రతిపాద్య-ప్రతిపాదకతా' అనగా తెలుపబడునది, తెలుపునది అను సంబంధముచే విష్ణుడు 'మంత్రః' అనబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 280🌹
📚. Prasad Bharadwaj 

🌻280. Mantraḥ🌻

OM Mantrāya namaḥ

Śabdamūrtirharirmaṃtraḥ r̥gyajussāmalakṣaṇaḥ,
Athavā maṃtra bodhyatvānmaṃtra ityucyate budhaiḥ.

शब्दमूर्तिर्हरिर्मंत्रः ऋग्यजुस्सामलक्षणः ।
अ…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 18 🌹
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍀. పంచభూతాలు - 1 🍀

74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలై, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది. 

ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది. 

ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్‌సంబంధమైన ఆనందాలను, దుఃఖాలను పొందుచున్నది.

75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 28 🌹 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 19. కుమారో బుధః  🌻

సూర్యుడు సత్యలోకమును, బుధుడు రజోలోకమును, చంద్రుడు దృశ్యమాన జగత్తును అధిష్ఠించియున్న దేవతలు. వీరు వరుసగా సత్వము, రజస్సు, తమస్సు గుణములకు కూడ అధి దేవతలు. సూర్యుడు ప్రఖకు అధిదేవత, చంద్రుడు పదార్థమునకు అధిదేవత. వీరిద్దరి సంయోగము ఏర్పడు జీవులకు బుధుడు అధి దేవత. వారు సహజముగ రజోమూర్తులు. అనగా వెలుగు మూర్తులు. 

'కుమారో బుధః' అని వేదము తెలుపుచున్నది. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. సూర్యప్రజ్ఞ చంద్రునిద్వారా మరల పుట్టుటయే కుమారప్రజ్ఞ లేక బుధప్రజ్ఞ. బుధుడు మానససృష్టికి ప్రతీకగ
నిలబడును. తండ్రికి సమీపముగ నుండును. రాశి చక్రమున గూడ సూర్యునికి అత్యంత సమీపమున సంచరించు గ్రహము బుధుడే. 

తండ్రియే కొడుకుగ దిగివచ్చెనని, తల్లి ద్వారమున దిగివచ్చెనని అందుచే దిగివచ్…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి  🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.

నిజానికి, భయం పరిస్థితిలో ఒక భాగం మాత్రమే. అలాగే, ఈ సువిశాల సర్వస్వంలో మనిషి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అంటే, ఈ సర్వస్వమంతా సముద్రమైతే మనిషి అందులో ఒక చిన్న నీటి బొట్టన్నమాట. 

అందుకే ‘‘నేను నా గుర్తింపును కోల్పోయి ఈ సర్వస్వంలో లీనమై నాశనమవుతానేమో’’ అనే భయం మీలో కలుగుతుంది. అదే మృత్యుభయం. అందుకే మీలో వణుకుపుడుతుంది. కాబట్టి, అన్ని భయాలు మృత్యుభయాలే.
మనిషి అలా భయంతో వణికిపోవడం సహజమే. 

ఆ సహజత్వాన్ని మీరు సంపూర్ణంగా అంగీకరించినట్లైతే వెంటనే మీ వణుకు తగ్గిపోతుంది, మీ భయం స్వేచ్ఛగా మారుతుంది. అప్పుడు నీటిబొట్టు సమ…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 205  / Sri Lalitha Chaitanya Vijnanam  - 205 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖

🌻 205. 'సర్వ యంత్రాత్మికా' 🌻

అన్ని యంత్రముల మూలము శ్రీదేవి అని అర్థము.

యంత్రములు సృష్టి వ్యూహములు. అవి వరుసగా బిందువు, వృత్తము, త్రిభుజము, చతుర్భుజము, పంచభుజము, షష్ఠభుజము, అష్టభుజము ఆదిగా ఏర్పడుచుండును. ఈ వ్యూహముల నుండియే శ్రీదేవి సమస్త సృష్టిగ ప్రకాశించును. 

యంత్రముల రూపములు కూడ పై తెలిపిన ఆకారములతో యుండును. ఈ యంత్ర వ్యూహము లన్నియూ కూడ శ్రీదేవి నుండియే దిగివచ్చినవి. మంత్రము లాధారముగ యంత్రము లేర్పడును. 

యంత్రమ…
[15:16, 10/02/2021] +91 92915 82862: శ్రీ గణేశ స్తవ రాజః
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

అస్య శ్రీగణేశస్తవ రాజమంత్రస్య భగవాన్ సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీమహాగణపతిర్దేవతా,శ్రీమహాగణపతిప్రీత్యర్థే జపే వినియోగః!!


1) వినాయకైక- భావనా-సమర్చనా-సమర్పితం!

ప్రమోదకైః ప్రమోదకైః ప్రమోద-మోద-మోదకం!

యదర్పితం సదర్పితం నవాన్నధాన్యనిర్మితం!

న కండితం న ఖండితం న ఖండమండనం కృతం!!



2) సజాతికృద్- విజాతికృత-స్వనిష్ఠభేదవర్జితం!

నిరంజనం చ నిర్గుణం నిరాకృతిం హ్యనిష్క్రియం!

సదాత్మకం చిదాత్మకం సుఖాత్మకం పరం పదం!

భజామి తం గజాననం స్వమాయయాత్తవిగ్రహం!!



3) గణాధిప! త్వమష్ట మూర్తిరీశసూనురీశ్వర-!

స్త్వమంబరం చ శంబరం ధనంజయః ప్రభంజనః!

త్వమేవం దీక్షితః క్షితిర్నిశాకరః ప్రభాకర-!

శ్చరాఽచర-ప్రచార-హేతురంతరాయ-శాంతికృత్!!



4) అనేకదం తమాల- నీలమేకదంత-సుందరం!

గజాననం నమోఽగజాననాఽమృతాబ్ధి-చం…
[15:43, 10/02/2021] +91 7013 527 083: ఆరా రంగులు - ఎరుపు - Aura Colours - Red



📚✍️ భట్టాచార్య


     
          మూలాధార చక్రం రంగు ఎరుపు. మూలాధార చక్రం మన భౌతిక శరీరాన్ని, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపు రంగు బలమైన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భయ, భీతులు లేని వ్యక్తులలో ఈ ఎరుపు రంగు తేజోవలయం గోచరిస్తుంది. ఆ వ్యక్తి యొక్క కోరికలను, అభిలాషలను...ఈ ఎరుపు రంగు తేజోవలయం...వ్యక్తీకరిస్తుంది. జీవితంలో సాహస కృత్యాలు చేయడానికి ఇష్ట పడేవారిలో...ఈ ఎరుపురంగు aura ద్యోతకమౌతుంది. ఆరాలో....పసుపు అంచులతో కలిగిన ఎరుపు రంగు, ఇతరుల యోగ క్షేమాల కోసం పాటుపడే తత్వాన్ని తెలియజేస్తుంది. అదే ఎరుపు రంగులో బురద రంగు కలిసి ఉండే ఆరా కలిగిన వ్యక్తులు....దుర్మార్గులు, కఠినాత్ములు. భయంకరమైన స్వార్ధాన్ని నింపుకునేవాడు. తీక్షణమైన ఎరుపు రంగు తేజోవలయం గల వ్యక్తి శారీరకంగా బలిష్టుడై ఉంటాడు. హంతకులు, పరమ దుర్మ…

1 comment: