🌻 *సహనం* 🌻
🍃🌺పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది.
🍃🌺నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.
🍃🌺అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి.
🍃🌺వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.
🍃🌺ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది.
🍃🌺వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం.
🍃🌺జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.
🍃🌺పశు పక్ష్యాదులు, ఎడారుల్లో సంచరించే జీవులు, ఉభయచరాలు ఎంతో ఓర్పు, సహనంతో కాలం వెళ్ళ బుచ్చుతాయి. మున్ముందు కాలం అనుకూలంగా ఉంటుందన్న ఆశతో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని జీవిస్తాయి.
🍃🌺జీవకోటిలో తెలివితేటలున్న మనిషి మాత్రం అనుకున్నదే తడవుగా ఫలితం వెంటనే కనబడాలని చూస్తాడు.
🍃🌺ఒక పేదవాడు తన ఇంటిముందు ఓ మొక్క నాటాడు. కొన్ని రోజులకు అది పెరిగి పెద్దదయింది. అది పండ్లు ఇచ్చి ఆకలి తీర్చుతుందని ఆశపడ్డాడు. చాలా రోజులు ఎదురు చూశాడు. కాని, అలా జరగలేదు. తగినంత ఆహారం అందక శరీరంతోపాటు మనసూ బలహీనపడింది. ఫలితంగా, అతడి నిరీక్షణ- కాలాన్ని మరింత పొడిగించిన భావన కలగజేసింది. విసుగు తెప్పించింది.
🍃🌺కోరిక నెరవేరలేదని అతడిలో కోపాగ్ని రగిలింది. విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. పూత, కాయ రెండూ లేని చెట్టు ఎందుకని దాన్ని నరికివేశాడు. మరుసటి రోజు తెల్లవారి లేచి చూస్తే పడిపోయిన చెట్టుకు ఒక పువ్వు పూసి ఉంది.
🍃🌺ఆ సన్నివేశం చూశాక అతడిలో దుఃఖం పొంగుకొచ్చింది. ఆ చెట్టును పట్టుకుని విలపించాడు. తొందరపడ్డానని బాధపడ్డాడు. జీవితం ఇలాగే అనూహ్య తీర్పునిస్తుంది. కారణం, అది నిత్యనూతనం.
🍃🌺అందువల్లే ‘ఫలితం పని చేసేవాడి చేతిలో లేదు. అది కాలపురుషుడి నిర్ణయం’ అని గీత చెబుతుంది.
🍃🌺అనుకూలించని పరిస్థితుల్లో ఆకలిగొన్న జంతువు ఒకటి ఎత్తున ఉన్న కొమ్మ ఆకులు తిందామనుకుంది. అందుకోసం దాని పొట్టి మెడ సాచడం మొదలు పెట్టింది. కాళ్లూ పొడుగుంటే బాగుండేదని భావించింది. రోజూ దాని ప్రయత్నాలు సానుకూల వైఖరితో సాగేవి.
🍃🌺కొంత కాలానికి దాని మెడ పొడుగ్గా సాగింది. కాళ్లూ పెద్దగా అయ్యాయి. అదే జిరాఫీగా రూపాంతరం చెందింది. మానసిక భావాలకు అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. అది ప్రాకృతిక నియమం. అమీబా నుంచి చింపాంజీ దాకా జరిగిన జీవ పరిణామ క్రమంలో ‘ఆశావహ దృక్పథం’ కీలకం.
🍃🌺అందువల్లే, ‘యద్భావం తద్భవతి’ అన్నారు వేదాంతులు. ‘నీ ఆలోచనే(సంకల్పం) నువ్వు’ అని బుద్ధుడూ ప్రబోధించాడు. దుందుడుకు వైఖరితో ఏ ప్రయోజనాలూ సిద్ధించవు. సానుకూల ధోరణితోనే మానవుడు ముందుకు వెళ్ళగలడు..
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
మహాభారతం 17 వ భాగము ద్రోణాచార్య వృత్తాంతం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మహాత్ముడైన భరద్వాజ ముని మరియు పాంచాల రాజు వృషతుడు ప్రాణ స్నేహితులు ఈ కారణం వలన పాంచాల రాజు తన ఔరస పుత్రుడైన దృపదుని పసితనం లోనే భరద్వాజమహర్షి దగ్గరే విద్యాభ్యాసానికి గాను ఉంచాడు.
పాలు తాగే పసిప్రాయం నుండి విద్యాభ్యాసం పూర్తి అయినా యౌన దశ వరకు ద్రుపదుడు భరద్వాజ ఆశ్రమం లోనే పెరిగి విద్యావంతుడు అయ్యాడు.
ఈ కారణం చేత భరద్వాజ ముని కుమారుడు ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు బాల్యమిత్రులు అయ్యారు.. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు.
విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట ద్రుపదుడు తన రాజ్యానికి వెళ్లి తన తండ్రి అనంతరం రాజ్యానికి రాజయ్యాడు. ద్రుపదుడు వెళ్లిపోయిన తర్వాత ద్రోణాచార్యుని కి వివాహమైంది కృపాచార్యుని చెల్లెలైన కృపి అతని అర్ధాంగి. వీరి సంతానంగా అశ్వత్థామ జన్మిస్తాడు.
అశ్వత్థామ జన్మించిన సమయానికి ద్రోణుడు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు అతని దగ్గర సరి అయిన పాడి ఆవులు కూడా లేవు. ఒకరోజు పాలు కావాలని అశ్వత్థామ మారాం చేయగా తల్లి అయిన కృపి బియ్యప్పిండిలో నీరు కలిపి అవి పాలని అశ్వత్థామకు ఇస్తుంది..పుత్రుడు పాలు అడిగితే ఇవ్వలేని దౌర్భాగ్యపు తల్లిని అయ్యాను అని బాధపడి భర్తయైన ద్రోణుని తో " స్వామి ! ఈ కటిక దారిద్ర్యాన్ని ఎన్నాళ్ళని అనుభవిస్తాం మన కుమారుడు పాలు అడిగితే బియ్యం పిండి లో నీళ్లు కలిపిచ్చి వాడిని మోసం చేశాను. ఎన్నాళ్ళని ఇలా బాధపడాలి. మీ మిత్రుడు దృపద మహా రాజు ఉన్నాడు కదా ! మనకు సాయం చేయలేడంటావా మన పేదరికాన్ని పోగొట్టే ధనాన్ని ఆయన ఇవ్వలేకపోయినా కనీసం రెండు పాడి పశువుల నైనా ఇవ్వలేక పోతాడా ఒకసారి వెళ్లి ప్రయత్నించండి " అని చెప్పింది. సరే అని చెప్పి ద్రోణుడు పాంచాల రాజ్యం వెళ్ళాడు. ఆ సమయానికి ద్రుపదుడు సభలో కొలువై ఉన్నాడు నగరంలోని గొప్ప గొప్ప ధనికులు ఆయనను పరివేష్టించి దేశ వాణిజ్య ఒప్పందాల గురించి చర్చిస్తూ ఉన్నారు. సభలో ప్రవేశించాడు ద్రోణుడు అప్పుడు ఆయన స్థితి బాగాలేదు మాసిన వస్త్రములు ..అవి కూడా చిరిగి ఉన్నాయి ఎండ పడి వచ్చాడు శరీరమంతా చెమట పట్టి ఉంది దుమ్ము ధూళి తో నిండి ఉన్నాడు. దారిద్ర్యం చేత ఆయన శరీరం కూడా బక్కచిక్కి ఉన్నది దీనమైన స్థితిలో తన మిత్రుడైన దగ్గరికి వచ్చాడు ద్రోణుడు.
చాలా కాలం తర్వాత తనను చూడడానికి వస్తున్న బాల్యమితృనికి ద్రుపదుడుఎదురేగనూ లేదు... రమ్మని ఆహ్వానించలేదు కనీసం కూర్చోమనియైన పలకలేదు.
ఎవరినో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు. నన్ను చూసి చాలా కాలమైంది కదా అందుకని గుర్తించినట్లు లేడు అనుకొని " మిత్రమా సౌఖ్యమేన ఎలా ఉన్నావు. నేను నీ మిత్రుడైన ద్రోణుడిని అని ఆనందంగా పలికాడు ద్రోణుడు.
సభలోని వారంతా " ఏమిటి ఈ బాపడు ద్రుపద మహారాజు కు మిత్రుడా అని చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు ఏవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.
ధన మదంతో ఉన్న ద్రుపదుని కి " మిత్రమా బాగున్నావా " అన్న పిలుపు నచ్చలేదు. ద్రోణుని గుర్తించి కూడా తెలియదన్నట్లు " ఇంతకీ ఎవరి వయ్యా నీవు మిత్రమా అంటున్నావు మహారాజు మైన నేనెక్కడ ? బిచ్చగాడివైనా నీవెక్కడ.?. ఒక మహారాజుతో మాట్లాడవలసిన తీరేనా ఇది. ఇంతకీ నీకేం కావాలి ?!.
రాజులకు అవసర నిమిత్తం సహజంగా శతృమితృత్వాలు ఏర్పడు తుంటాయి. అవన్నీ జ జ్ఞాపకం ఉండడం కష్టం. ఏమైనా కావాలంటే అడుగు ఇస్తాను అంతేగాని మిత్రమా అని ఏదో సన్నిహితుడి లాగా మాట్లాడవద్దు. " అని పలికాడు . ద్రుపదుడు. అందులకు ద్రోణుడు " క్షమించండి మహారాజా ! ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడని వచ్చాను అతడు లేడని తెలిసింది " అని చెప్పి అవమానభారంతో తలదించుకుని తన గృహానికి వచ్చేశాడు ద్రోణుడు.
చెడి బంధువుల ఇంటికి వెళ్ళకూడదు అంటారు పెద్దలు. కానీ విధిలేని పరిస్థితిలో ద్రోణుడు భార్యా పుత్రులతో తన బావమరిది ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
ద్రోణాచార్యుడు హస్థినలో ప్రవేశించే సమయంలోజరిగిన సంఘటన ఆయనను పాండు సుతులకు కౌరవులకు గురువైయ్యేలా చేసింది. పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది. వారు దానిని తీయటానికి విఫల ప్రయత్నం చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన ద్రోణాచార్యుడు. ఆ బంతిని ఒకదాని తరువాత ఒక బాణాన్ని వేస్తూ బయటకు తీసి ఇచ్చాడు. రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు......
తలనెరయటం మొదలైన వాడు... పుణ్యాత్ముడు ధనుర్వేదం ఎరిగినవాడు మహాబలవంతుడు నల్లని బక్కచిక్కిన శరీరం కలవాడు బ్రాహ్మణ శ్రేష్టుడు మంచి గుణాలు చే ప్రకాశించువాడు అయినా ధోని ని తాను ముందే విన్నట్లుగా చూసి భీష్ముడు ఎంతో సంతోషంతో " ఆచార్య ! ఎక్కడ నుండి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఉండడం మీకు ఇష్టమేనా అని అడగగా ...ద్రోణుడు సంతోషించి భీష్మునితో "వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గరికి వెళ్లడానికి,ఇతరుల నుండి చెడు దానాలు తీసుకోవడానికి ఇష్టపడక ధర్మమార్గంలో జీవితం గడుపుతుండగా ఒకరోజు ధనవంతులైన బిడ్డలు ప్రతి దినం పాలు తాగుతుండ గా చూసి నా కుమారుడు అశ్వత్థామ నాక్కూడా పాలు పోయండని ఏర్చాడు.
అభిమానవంతు లకు దారిద్యం అనేది మృత్యువుతో సమానం.
నా దారిద్యం పోవడానికి అన్యులు దగ్గర బిక్షం ఎత్తడానికి ఇష్టపడక నా మిత్రుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్లాను. మిత్రమా అని ఆప్యాయంగా పలకరించారు అంతే నా పిలుపు అతనికి నచ్చలేదు. అంతరం చూసి మాట్లాడమని నన్ను అవమానించాడు దరిద్రానికి ధనవంతునికి, దృష్టునికి మంచి వాడికి, అధికారికి సేవకుడికి ఎప్పుడు స్నేహం కుదరదు అని చెప్పాడు. అతని చేత ఇలా అవమానాల పాలై ఇష్టం లేకపోయినా నా బంధువైన కృపాచార్యుని చెందకు రావాలని వస్తున్నాను అని పలికాడు.
వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు భీష్ముడు ఎంతో సంతోషించి ఆచార్య మీకు ఇక్కడ ఎటువంటి లోటు ఉండదు మా ఆస్థాన పురోహితుడైన కృపాచార్యుడు ఎంతో మీరు కూడా మాకు అంతే దయచేసి నామనవండ్లకు ధనుర్వేదం నేర్పండి అని అభ్యర్థించాడు.
ద్రోణుని రాజకుమారులకు ఆ చార్యునిగా నియమించాడు నియమించాడు భీష్ముడు.
విద్య నేర్పడానికి ముందు అతడు రాకుమారులను చూసి మీలో నాకోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు. అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా నేను మీరు ఏది కోరితే అది చేస్తాను అన్నాడు. దేశదేశాల నుండి వచ్చిన రాకుమారులతో దృపదుని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యనభ్యసించ సాగాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడైయ్యాడు. అశ్వత్థామకు అర్జునుడంటే విద్యామత్సరం ఉండేది.కారణం తన తండ్రి అయిన ద్రోణుడు తన కన్నా కూడా అర్జునుని ఎంతో ప్రేమతో చూస్తున్నాడు దీనివలన అశ్వత్థామకు అర్జునుడంటే తీరని ద్వేషం ఏర్పడింది అసలు పాండవులు అంటే అతనికి సరిపోవడం లేదు ఈ కారణంగా దుర్యోధనునితో స్నేహం చేయ సాగాడు..
ఒక రోజు అర్జునుడు భోజనం చేస్తుండగా దీపం ఆరిపోయింది. అర్జునుడు చీకటిలో అన్నంతింటూ ఉండగా చీకటిలో బాణప్రయోగం కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు. అది చూసి ద్రోణుడు అర్జునుని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న విద్యనంతా నేర్పించాడు. దుర్యోధనాదులు భీముని బలం అర్జునిని విలువిద్యా నైపుణ్యం సహించలేక పోయారు.
ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో పరీక్ష పెట్టాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరిని పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవరికీ తగినంత ఏకాగ్రత లేదని గ్రహించాడు. ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక మొసలి అతని కాలును పట్టుకుంది. అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా దిక్కుతోచక పరుగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని రక్షించాడు. ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే దృపదుని పట్ల తనకు కలిగిన పగ చల్లార్చ గలడని గ్రహించి ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు.
ఏకలవ్యుడు
------------------
ద్రోణుని కీర్తి విని హిరణ్యధన్వునుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు .అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య నేర్పమని కోరాడు. విలు విద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించలేదు. పట్టువదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి భక్తితో విలు విద్యను సాధన చేసాడు. ఒక రోజు పాడవులు, కౌరవులు సమయంలో పాండవుల వేట కుక్క తప్పించుకు పోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశంలో మొరగ సాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు ఆబాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరచింది. వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి అతడు ద్రోణుని శిష్యుడని అతనిద్వారానే అడిగి తెలుసుకున్నారు. అర్జునుడు ద్రోణునితో "గురువర్యా నేను మీ ప్రియశిషుణ్ణి అని చెప్పారు కదా నాకంటే ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు " అని వేదనగా అడిగాడు. ద్రోణుడు అర్జునునితో ఏకలవ్యునికి చూడడానికి వెళ్ళాడు.
తనను చూడడానికి గురు దేవుడే స్వయంగా వచ్చాడని ఎంతో సంతోషించి ఏకలవ్యుడు అతనికి ఘనంగా స్వాగత సత్కారాల ను ఏర్పాటు చేసి పూజించి తన సమస్త సంపదను ఆయన పాదాల ముందు ఉంచి గురుదక్షిణ గా స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు.
అందుకు ద్రోణుడు నాయనా ఏకలవ్య ! నీ కీర్తి జగద్విదితం అయ్యే విధంగా ఒక దక్షిణ అడుగుతున్నాను ఇవ్వగలవా అని ప్రశ్నించాడు.నా సమస్త సంపదను మీ ముందు వుంచాను ఇక మిగిలింది నా ప్రాణం ఒకటే మీరు ఆజ్ఞాపించినట్లైతే అది కూడా సమర్పించుకుంటారు అని ఎంతో వినయంతో పలికాడు ఏకలవ్యుడు..
నేను అడిగే దక్షిణ లోక శ్రేయస్సు కోసం మరియు నీ మేలు కోసమే అని నీవు భావించినట్లయితే నీ కుడి చేతి బ్రొటన వ్రేలును నాకు ఇవ్వు అని ఆజ్ఞాపించాడు. శిష్యుడైన ఏకలవ్యుడు పరమానందంతో గురువుగారికి దక్షిణ సమర్పించుకున్నాడు. నాకు తెలిసి ఏకలవ్యుని అంతటి శిష్యుడు మరి పుట్టడేమో.....
సర్వవ్యాపి అయిన పరమాత్ముడే నిజమైన గురుదేవుడు ఆయననే సకల గురువుల లో ఉంటాడు.. తన గురువులో అట్టి పరమాత్మను దర్శించిన వారు ఎవరో వారు నిజమైన ధన్యులు.
మిత్రులందరికీ శుభ శుభోదయం
తేదీ : 17-02-2021 బుధవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#కప్ప_రూపమును_విడిచిన_స్త్రీ_పూర్వకథ
మునిశ్రేష్ఠా..!
నా వృత్తాంతమును తెలియ జేయుదును గాన ఆల్కింపుము. నా జన్మస్థానము గోదావరి
నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరి శర్మ, నా పేరు మంజుల.
నన్ను నా తండ్రి కావేరి తీరవాసి యగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి
చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట
కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘ మాసము ప్రవేశించినది.
ఒకనాడు
నా భర్త "సఖీ! మాఘ మాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని
మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ
స్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘ మాసమంతయు యీ
కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి,
కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు
ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి
నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి
పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండ
చెక్కర, పటిక బెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసి తీర్థము
లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము
చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవ తనము చల్లగా
వుండును" అని హితబోధ జేసెను.
నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి
అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంత స్వరూపుడు. అయిననూ నేను
హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి "ఓసీ మూర్ఖురాలా! నా యింటికి
వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషిణి వని నాకు
తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా,
అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా
కృష్ణానదీ తీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడి ఉందువు గాక" అని
నన్ను శపించెను.
"అమ్మాయీ! భయపడకుము, నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా
అయినది. ఇంత కాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును
యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను.
అతడిప్పుడు వైకుంఠములో నున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున యెంత
కష్టపడినావో తెలిసినది కదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల
సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనము కూడ.. నీకీ
మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతియైనది
వ్రతము.. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి
వారు.. నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో
నుండెడివాడు. కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయి పోయినవి. నీ మూర్ఖత్వము
వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో
స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు
తొర్రలో జీవించుమని శపించాడు.
ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా
సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజ రూపమును
పొందగలిగినావు.. అందునా యిది మాఘ మాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత
సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు.. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము.
స్త్రీలు కాని, పురుషులు కాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసిన యెడల
విష్ణు సాన్నిధ్యమును పొందుదురు.
ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘ
శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించిన
యెడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడునూ, అటులనే దశమి,
ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ
కాలక్షేపము చేసిన యెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల
వరమిచ్చును. భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును",
అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను...
ఇతి శ్రీ మాఘ పురాణే షష్టమ అధ్యాయం పారాయణం సంపూర్ణం..
--(())--
:
🌻 *మహా భారతం* 🌻
🎈 *భాగము 48* 🎈
💧 *స్వ-పర శక్తి సామర్థ్యాలు* 💧
🍃🌺నిండుసభలో, పెద్దల సమక్షంలో సాగుతున్న చర్చ, పరోక్షంగా స్వ,పర శక్తిసామర్థ్యాలను గురించి బహిరంగంగా లెక్కలు వేస్తున్నట్టు మారింది. భీమసేనునితో సమానంగా గద తిప్పగల వారెవరు? గాండీవికి సాటి రాగలవారెవరు? ధర్మజుని సరితూగగల యుద్ధవేత్తలెవరున్నారు? నకులసహదేవులు కోడెత్రాచులు-యిలా కురువృద్ధులు గురువృద్ధులు ప్రశ్నిస్తూ ప్రశంసిస్తున్నారు.
🍃🌺సుయోధనుడు తమ వర్గంలో గల ధీశాలురను గుర్తుచేస్తున్నాడు. గతంలో ఎదురైన అపజయాలను పెద్దలు గుర్తుచేస్తున్నారు. వాటిని సమర్థించుకోగల కారణాలు చెప్పి వీరు వాదిస్తున్నారు. ధృతరాష్ర్టునికి ఒకింతసేపు అధైర్యము, మరి అంతలోనే ధైర్యము ఆవహిస్తున్నాయి. సంజయుని ముఖతా పాండవేయుల మనోగతాన్ని సాకల్యంగా అవగతం చేసుకున్నాడు.
🍃🌺‘‘సంజయా! ఇరుపక్షాల శక్తిసంపదలు తెలిసిన వాడివి. చిట్ట చివరకు విజయలకి్క్ష ఎవరిని వరిస్తుందో, మనసులో మాట దాచకుండా చెప’’ అన్నాడు కురుపతి. సంజయుడు ఒక్క క్షణం మౌనం వహించి, ‘‘మహారాజా! నీ పితృపాదులు వ్యాసమహర్షి ధర్మాధర్మ రహస్యవేత్త. నీ ప్రస్తుత సందేహాన్ని తీర్చగల మహితాత్ముడు ఆయనొక్కడే. ఆ తపోరాశిని సగౌరవంగా రప్పించండి. గాంధారిదేవి సముఖంలో సర్వవిషయాలు తేటతెల్లం కాగలవు’’ అన్నాడు.
🍃🌺మహారాజుకి సంజయుని సలహా సముచితంగా తోచింది. సేవకుని అంతఃపురానికి వెళ్లి మహారాణిని తోడ్కొని రమ్మన్నాడు.
🍃🌺కృష్ణద్వైపాయనుడిగా పేరుగాంచిన వ్యాసభగవానుని త్రికరణశుద్ధిగా ఆవాహన చేశాడు. తేజోరాశిలా ప్రజ్వరిల్లుతూ వ్యాసమహర్షి సభామంటపంలో ప్రత్యక్షమయ్యాడు. గాంధారి ధృతరాష్ట్రుల సంజయుని సాయంతో మహర్షికి పాదాభివందనాలు అర్పించి, సముచిత సత్కారాలు చేసి స్వర్ణసింహాసనంపై కూర్చుండబెట్టారు.
🍃🌺ధృతరాష్ట్రుని మనసులో వున్న సందేహమేమిటో వ్యాసమహర్షి గ్రహించాడు. అందుకే తనని ఆవాహన చేసి ఆహ్వానించాడని కూడా తెలుసు. వెంటనే వ్యాసుడు సంజయునిపై దృష్టి నిలిపి, ‘‘నాయనా! అన్నీ తెలిసినవాడవు. ఇలాంటి సందర్భాలలో మౌనం వహించడం ధర్మం కాదు. నా సమక్షంలో కురురాజుకి సర్వం సమగ్రంగా తెలియపరుచు’’ అని ఆదేశించాడు.
🍃🌺సంజయుడు ఆ తపోనిధికి ఎంతో అణకువతో నమస్కరించి, సముచిత వాగ్ధోరణితో ప్రారంభించాడు. మహారాజా! వ్యాసదేవుని ఆజ్ఞ శిరసావహించి నేనెరిగిన సత్యాలను వివరిస్తాను. ఇందులో మిమ్మల్ని నొప్పించే అంశాలుంటే క్షంతవ్యుణ్ణి. పాండవ కౌరవ సేనలో గల తారతమ్యం గురించి పదే పదే ప్రశ్నిస్తున్నావు. వాసుదేవుడు పాండవపక్షం వహించి, సదా వారికి తోడునీడై వుంటున్నాడు.
🍃🌺అట్టి మహానుభావుడు ఎవడైనా మనవైపు వున్నాడా? శ్రీకృష్ణుడు సామాన్యుడా? బాణాసురుని తృటిలో మట్టుబెట్టినవాడు. కల్పవృక్షాన్ని పెరటిచెట్టుగా నాటినవాడు. పూర్వజన్మలో కృష్ణార్జునులు ప్రాణమిత్రులు. వారి కలయికతో ఎంతటి సంగ్రామమైననూ వారికి క్రీడ మాత్రమే.
🍃🌺వాసుదేవుని చక్రాయుధం సూక్క్షరూపంలో పాండవేయులకు పరిపూర్ణ విజయం చేకూర్చగలదు. సుదర్ళనానికి దీటైన శక్తి మనవద్ద కలదా? సమస్తలోకాలను త్రాసులో ఒకవైపు వుంచి, మరొకవైపు శ్రీకృష్ణుని వుంచినచో త్రాసు ఆయనవైపే మొగ్గును. సత్యము, ధర్మము, రుజుత్వము విలసిల్లుతావులోనే ఆ దేవదేవుని చేయూత వుంటుంది.
🍃🌺అక్కడ విజయశ్రీ కొలువు తీరుతుంది. శిష్టరక్షణ, దుషశిక్షణ కావిస్తూ, సమస్త భువనాలను పాలిస్తున్నది కృష్ణభగవానుడే. ఆయన ఆడించే జగన్నాటకంలో మనందరం పాత్రధారులం. తాను ధర్మం పక్షాన నిలబడి, అధర్మంతో చెలరేగుతున్న కౌరవేయులను నిర్మూలించడమే ఆయన ధ్యేయం. ఆ పురాణపురుషుని దివ్యత్వం గ్రహించినవారు ఆపదలు గట్టెక్కుతారు. లేనివారు చరిత్రహీనులై మట్టిలో కలిసిపోతారు’’సంజయుని మాటలకు ధృతరాష్ట్రుడు వులికిపాటుకి గురైనాడు.
🍃🌺 ‘‘సంజయా! శ్రీకృష్ణుని సత్యస్వరూపము నీకు అవగతమవడానికి, నాకు కాకపోవడానికి కారణమేమిటి?’’ అని సూటిగా ప్రశ్నించాడు. వెంటనే సంజయుడు ఏమాత్రం సందేహించక, ‘‘విద్యావినయ సంపన్నుడు ధర్మవర్తనుడు దేవుని జాడను గుర్తించగలడు’’ అన్నాడు. ధృతరాష్ట్రుడు ‘‘అయితే విద్య అవిద్యల స్వరూపస్వభావాలెటువంటివి’’ నాకు వివరించాల్సిందని కోరాడు.
🍃🌺రాజా! సత్వరాజస తమో గుణాల ప్రభావాలు లేని స్వభావసిద్ధి విద్యగా ఆధ్యాత్మవేత్తలు చెబుతున్నారు. దీనికి వ్యతిరేక నైజమున్నవారు అవిద్యులు. సంజయుని మాటలకు ధృతరాష్ట్రుడు ఒక్కసారి నిట్టూర్చాడు. సభామంటపంలో వున్న దుర్యోధనుని చేరపిలిచాడు. వ్యాసమహర్షి ధ్యానముద్రలో వున్నాడు. దగ్గరగా వచ్చిన సవ్వడిని గుర్తించి,‘‘కుమారా! సంజయుడు చెప్పిన మాటలు వేదవేత్తలు ఆమోదించినవి.
🍃🌺సాక్షాత్తూ వ్యాసభగవానులే యీతని నోటివెంట ఆ పలుకులు వినిపించారు. ఇప్పటికైనా...’’ అనగానే దుర్యోధనునిలో రోషం పెల్లుబికింది. ‘‘తండ్రీ! ఆ యాద వుడు సర్వలోకాలను ఒక్కుమ్మడిగా కబళించగల సమర్థుడైనా, అర్జునునికి కూరిమి చెలికాడైనా నేను లెక్కచేయను. ఈ మాటలు ఎన్నోమార్లు విని రోసిల్లిపోయాను. తలవంచడం, భయపడడం అంటే ఏమాత్రమూ తెలియనివాడిని. క్షమించి, హితోపదేశాలు కట్టిపెట్టండి’’ అన్నాడు రోషంగా. ధృత రాష్ట్రుడు కుంగిపోయి, పక్కనే కూర్చున్న గాంధారి వైపు తలతిప్పాడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏
🌺 *విష్ణు సహస్రనామాలు* 🌺
🌀 *అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥* 🌀
🌹 *47. హృషీకేశః* 🌹
🌺 *ఓం హృషీకేశాయ నమః* 🌺
🍃🌺హృషీకాణాం ఈశః ఇంద్రియములకు ఈశుడు. శరీరములందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున నుండి ఇంద్రియములను తమ తమ విషయములయందు ప్రవర్తిల్ల జేయువాడు.
🍃🌺లేదా ఎవని ఇంద్రియములు అందరి జీవులకువలె తమ తమ విషయములందు ప్రవర్తిల్లక తన వశము నందుండునో అట్టి పరమాత్ముడు హృషీకేశుడు. లేదా సూర్య చంద్రులును కేశములుగా (కిరణములు) గల విష్ణువు హృషీకేశుడని చెప్పబడును.
🍃🌺సూర్య రశ్మిర్హరికేశాః పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించు కేశమే అను శ్రుతి వచనము ఇందులకు ప్రమాణము.
*:: శ్రీమద్భాగవతము - 4వ స్కంధము - 24వ అధ్యాయము ::*
*నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే ।*
*నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ 36 ॥*
🍃🌺అనిరుద్ధుడూ, ఇంద్రియములు వశమునందున్నట్టి హృషీకేశునకు పరి పరి విధముల వందనములు. స్థిరాత్ముడవూ, పరమహంసవూ, పూర్ణుడవు అయిన నీకు నమస్కారము.
*:: మహాభారతము - శాంతిపర్వము - మోక్షధర్మపర్వము ::*
*నామ్నాం నిరుక్తం వక్ష్యామి శ్రృణుష్వైకాగ్రమానసః ।*
*సూర్య చంద్రమసౌ శశ్వక్తేశైర్మె అంశుసంజ్ఞితైః ।*
*బోధయంస్తాపయంశ్చైవ జగదుత్తిష్ఠతే పృథక్ ॥ 66 ॥*
*బోధనాత్తాపనాచ్చైవ జగతో హర్షణం భవేత్ ।*
*అగ్నీషోమకృతైరేభిః కర్మభిః పాణ్డునందన ।*
*హృషీకేశోఽహమీషానో వరదో లోకభావనః ॥ 67 ॥*
🍃🌺పరమాత్ముడు కేశములను సంజ్ఞకలవియు తనకు సహజములును తనకు నేత్రములునగు కిరణములతో లోకమును మేలుకొలుపుచును, నిదురింపజేయుచును తన వేరు వేరు రూపములతో లోకమును తన స్థితియందు నిలుపుచుండును.
🍃🌺ఇట్లు ఆతడుచేయు బోధన స్వాపనములచే (మేలు కొలుపుట, నిదురింపజేయుటలచే) లోకమునకు హర్షము కలుగును. అదియే భగవదంశములగు అగ్నీ షోములు జరుపు కార్యములు.
🍃🌺వీని చేతనే పాండునందనా (ధర్మరాజా!) మహేశానుడును (సృష్టిస్థితిలయాది సర్వ కార్యకరణ సమర్థుడును) పై వ్యాపరములచే హృషీకేష నామము కలవాడును అగు విష్ణుడు వరదుడుగాను, లోకభావనుడుగాను నున్నాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏
🌺 *విష్ణు సహస్రనామాలు* 🌺
🌀 *అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥* 🌀
🌹 *48. పద్మనాభః* 🌹
🌺 *ఓం పద్మనాభాయ నమః* 🌺
🍃🌺(సర్వజగత్కారణం) పద్మం నాభౌ యస్య సః సర్వజగత్కారణమగు పద్మము నాభియందు ఎవనికి కలదో అట్టివాడు.
*:: పోతన భాగవతము - తృతీయ స్కందము, విదురమైత్రేయ సంవాదము ::*
🍃🌺క.తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సాధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్.సీ.పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁదన తేజమునఁ బ్రవృద్దంబైన జలముచే జలజాప్తు గతిఁ బ్రకాశంబు నొందఁజేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందుతే.నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయ మయుఁడును వరగుణుండునాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁ జతురాననుండు నా జనన మయ్యె.
🍃🌺తన కడుపులో దాచుకొని వున్న సకల లోకాలను తిరిగి సృష్టించడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.
🍃🌺ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సు చేత నీటినడుమ వృద్ధిపొందిన ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు.
🍃🌺లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగుణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌻 *తెలిసుకోవాల్సిన మంచి విషయాలు.....* 🌻
🍃🍒86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
🍃🍒87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
🍃🍒88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
🍃🍒89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
🍃🍒90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹
[17:46, 17/02/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 17.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 14.
Do not spend your energy in talking, but meditate in silence. Accumulate power in silence and become a dynamo of spirituality.
మీశక్తిని వ్యర్ధమైన మాటల్లో వృధా చేయక, మౌనంగా ధ్యానం చేయండి. మనశ్శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తిజనకయంత్రంగా అవతరించండి.
🕉🌞🌎🌙🌟🚩
Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 17.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 17.
Fill the brain with high thoughts, highest ideals, place them day and night before you, and out of that will come great work.
బుధ్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపుకోండి. రేయింబవళ్ళు వాటినే స్మరించండి. అప్పుడే అధ్భుతాలు సాధించగలరు.
🕉🌞🌎🌙🌟🚩
[17:46, 17/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
ఆచార్య సద్భోదన
మన యొక్క ఆలోచనలనీ, భావాలనీ నిర్లక్ష్యం చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని సాధించలేము. మన ఆంతరిక జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవాలి. ఇది మనకి మనమే చేసుకోవాలి కానీ ఇంకొకరు చేసేది కాదు. ఎప్పుడైనా ఉత్సాహం తగ్గితే దానిని రెండింతలు, మూడింతలు చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడూ ఆధ్యాత్మిక ప్రమత్తత ఆవులిస్తూ ఉంటుంది. దానిని సాహస హృదయంతో అధిగమించాలి. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో లేదు. మనం ఇలా భావించినందువల్లే అతడు దూరంగా ఉన్నట్లు అగుపిస్తున్నాడు. పవిత్రత, విశ్వాసాల ద్వారా ఆయన సామీప్యాన్ని పొందాలి.
శుభంభూయాత్
🕉🌞🌎🌙🌟🚩
[17:53, 17/02/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -152 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 4
🍀 4 - 2. సంకల్ప సన్యాసము - ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు? అంతరంగ మాధుర్యము బహిరంగ మాధుర్యముకన్న మిన్నయని జీవునకు తోచినపుడే ఇది సాధ్యము. సత్సాంగత్యము, సద్గురు బోధ అమిత మధురమగు విషయము నావిష్కరింపగ దానియందు ఆసక్తి కలుగుట కవకాశ ముండును. దైవమును గూర్చిన రుచి పెరుగుచుండగ ప్రవృత్తి యందు మార్పునకై కృషి కూడ సమాంతరముగ సాగవలెను. అట్లు సాగుటకే ప్రవృత్తి కార్యములందు అనగా బాహ్య ప్రవర్తన యందు కర్తవ్య నిర్వహణము మాత్రమే నిర్వర్తించుట నొక దీక్షగ గైకొనవలెను. కర్తవ్యేతర సంకల్పములు సాధకుని వీడినపుడే అతడు యోగమున పురోగతి చెందు అవకాశము కలిగి యుండును. ఈ స్థితినే భగవంతుడు సంకల్ప సన్యాసమని పలికినాడు. 🍀
యదా హి చేంద్రియార్డేషు న కర్మ స్వనుషజ్…
[17:53, 17/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 351 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
90. అధ్యాయము - 02
🌻. సనత్కుమారుని శాపము - 1 🌻
నారదుడిట్లు పలికెను
హే విధే! హే ప్రాజ్ఞా! ఇపుడు మేన యొక్క జన్మను గురించి, మరియు శాపమును గరించి విస్తరముగా చెప్ప నా సందేహములను తొలగించుము(1)
బ్రహ్మ ఇట్లు పలికెను
ఓ నారదా! నాకుమారులలో నీవు శ్రేష్ఠుడవు. మహా పండితుడువు. నేను మేనా దేవి యొక్క జన్మ వృత్తాంతమును వివేకపూర్వకముగా చెప్పెదను . నీవు మనులతో గూడి మి క్కిలి ప్రీతితో వినము(2) ఓ మహర్షీ! నా కుమారడగు దక్షుని గురించిన నీకు పూర్వమే చెప్పియుంంటిని. అతనికి అరవది కుమర్తెలు కలిగిరి. వారే ఈ సృష్టికి మూలము అయిరి(3) అతడు వారిని కశ్యపుడు మొదలగు వరుల కిచ్చి వివాహమును చేసిన వృత్తాంతమంతయు నీకు తెలిసినదే. ఓ నారదా! ప్రస్తుత గాథను వినుము(4) వారిలో స్వధ అను పేరుగల కుమార్తెను ఆయన పితృదేవల కిచ్చి వివాహమును చేసెను. ఆమెకు ధర్మమూర్తులు, సుందరీమణులు అగు ముగ్గురు కుమర్తెలు కలిగిరి(5)
ఓ మహర్షీ| పవిత్రము చేయునవి, నిశ్చయముగా సర్వదా విఘ్నములను పారద్రోలి మహా మంగళములనిచ్చునవి అగు వాని నామములను చెప్పెదను వినుము(6) పెద్దకుమార్తెపేరు మేన, రెండవకుమార్తె ధన్య, మూడవ ఆమె కలావతి, ఈ ముగ్గురు పితృదేవతల మానస పుత్రికలు(7) వీరు అయెనిజలు, కాని లోకములో స్వధాదేవి యొక్క కుమార్తెలుగా ప్రసిద్ధిని గగాంచిరి. మానవుడు వారి పవిత్ర నామములనుచ్ఛరించినచో కోర్కెలన్నిటినీ, పొందును(8) వీరు సర్వజగత్తులకు పూజింపదగినవారు. ముల్లోకమలకు తల్లులు, గొప్ప ఆనందమును ఇచ్చువారు. యోగనిష్ఠలు. ముల్లోకముల యందు సంచరించే వీరు పరమజ్ఞాననిధులు(9)
ఒకనాడు ఈ ముగ్గురు సోదరీమణులు విష్ణువును దర్శించుట కొరకై శ్వేత ద్వీపమునకు వెళ్లిరి. ఓ మహర్షీ! (10) అచట వారు విష్ణవునకు ప్రణమిల్లి, బక్తితో గూడిన వారై ఆయనను స్తుతించి నిలబడిరి. విష్ణువు ఆజ్ఞచే అడట గొప్ప సభ సమాయోజితమాయెను(11) ఓ మహర్షీ! బ్రహ్మపుత్రులగు సనకాది సిద్ధులు అపుడచటకు విచ్చేసి, విష్ణువునకు నమస్కరించి, స్తుతించి, ఆయన ఆజ్ఞచే అచట ఉండిరి(12) సనకాది మహర్షులను చూచిన సభా సదులందరు వెనువెంటనే లేచి నిలబడిరి. ఆమహర్షులు అచట నున్న దేవతలను, లోకపూజితులగు ఇతర మహర్షులను దర్శించి ప్రణమిల్లిరి.(13)
ఓ మహర్షీ! కాని ఆ సభలో ఆసీనలైయున్న ఆ ముగ్గురు సోదరీమణులు పమాత్మయుగు శంకరదేవుని మాయచే మోహితులగుటచే వివశులై నిలబడలేదు(14) సర్వలోకమును మోహింపజేయు శివమాయ మిక్కిలి బలమైనది. జగత్తంతయు ఈ మాయకు అధీనమైయున్నది ఈ మాయయే శివుని సంకల్ప శక్తియని కీర్తింపబడును(15) ఆ మాయకే ప్రారబ్ధమని కూడా పేరు గలదు. ఆమాయకు అనేక నామములు గలవు. అది శివుని ఇచ్ఛచే లోకములను మోహింపజేయును. దీని విషయములో చేయగలగినది ఏదీ లేదు(16) ఆ ముగ్గురు ఆ మాయకు వశులై, ఆ మహర్షులను చూచి విస్మితులై అటులనే చూచుచూ కూర్చుండిరేగాని, లేచి వారిక నమస్కరించరైరి(17).
సనకాది మహర్షులు జ్ఞానులే అయిననూ, వారి స్థితిని చూచి మిక్కిలి, సహింపశక్యము గాని క్రోథమును పొందిరి(18) శివుని ఇచ్ఛచే మోహితుడైన సనత్కుమారుడను ఆ యోగి పుంగవుడు కోపించి దండరూపమగు శాపమునిచ్చువాడైన వారితో నిట్లనెను(19)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 235 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దేవలమహర్షి - 6 🌻
30. ఒకడు ఎంతటిపాపంచేసాడో, ఎలాంటిపాపంచేసాడో, ఆ పాపానికి – ఆ లక్షణానికి – అనుగుణమైన శరీరాన్ని అతడికి మహర్షులు ప్రసాదిస్తారు. దానినే శాపం అంటారు.
31. ఎవరైనా బిడ్డలను దేసంకోసం కనాలి. తనకోసం కాదు. మంచి సంతానాన్ని కనడం ఎందుకంటే – వార్ధక్యంలో తనకు వాళ్ళు సేవచేస్తారా లేదా అని ఆలోచించటం కంటే, ఈ దేశానికి మంచిపౌరులను ఇచ్చి ఋనం తీర్చుకొంటాననే ఉద్దేశ్యంతో కనాలి. సంతానాన్ని ఆ కారణంతో కోరుకున్న వారికి ఆ ఫలం లభిస్తుంది.
32. మరి వార్ధక్యంలో ఎవరు చూస్తారు అంటే, తన జాతకంలో పుణ్యంఉంటే అలా చూచే సంతానం కలుగుతుంది. దేశానికి తన పుణ్యం ఇస్తాను అంటే, ఆ ఫలంగా అట్టి సంతానం కలుగవచ్చు. ఎవరైనా సంతానంలేక దుఃఖపడుతున్నాడంటే అది సామాన్యమే.
33. కాని సంతానాన్ని దేసంకోసం అడగాలి. ఆర్యులు అలా అడిగారు. వారు దానికోసం తపస్సుచేసారు. కాబట్టి భారతీయులందరూ కూడా సంతానాన్ని పెద్దలను తెరింపచేయడానికి కోరటం అని సామాన్యవాక్యంగా చెప్పినప్పటికీ; ఇందులో పరమార్థం ఏమిటంటే – దేశానికి సేవచేసేవాళ్ళు, ధర్మాన్ని నిలబేట్టేవాళ్ళు, దేవతలను మెప్పించే వాళ్ళను కోరి పొందమని, అలా పొంది సమాజానికి ఇచ్చినవాడు శాశ్వతమైన మోక్షానికి అర్హుడవుతాడని. అది ప్రధానమైన అంశం. అందుకోసమని పుత్రలాభం ఉంటుంది.
34. సంసారం ఒక విషవృక్షం అని ఒక వంక మన పెద్దలు చెబుతున్నారు. విషవృక్షమే అయినప్పటికీ, దానికి రెండు మధురఫలాలు ఉన్నాయని అన్నారు. విషవృక్షానికి మధుర ఫలాలు ఉంటాయా అంటే, ఆ సంసారమనే విషవృక్షానికి మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. ఆ రెండు ఫలాలకోసమే ఈ సంసారవృక్షాన్ని భరించమని చెప్పారు.
35. అవి రెండూ ఏమిటంటే – ఒకటి, అనుకూలవతియైన భార్య – అంటే ధర్మాచరణలో తనకు అనుకూలంగా, తోడుగా ఉండే భార్య; రెండవది, వంశవర్ధనుడై ధర్మాన్ని పాలించే పుత్రుడు. అట్టివాడి ముఖంచూచే భాగ్యం రెండవ మధురఫలం. ఈ రెండు మధురఫలాలు లభిస్తే సంసారం విషవృక్షం అయితే మాత్రం ఏమవుతుంది? భరిస్తారు. అలా చెప్పారు మన పెద్దలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 174 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 12 🌻
663. పరమ ముక్తునకు సృష్టిలో కర్తవ్యము (అధికారము) ఉన్నది.
664. సద్గురువు= కుతుబ్ (పూర్ణగురువు)
=అనంత అస్తిత్వము+అనంత
జ్ఞానము+అనంత ఆనందము+
చైతన్యము = అనంతమందు,
సాంతమందు ఏకకాలమందే ఎరుకతో యుండును.
665 సద్గురువు:- భగవంతుడు ,మానవునిగా ,తనను ప్రతి వారిలో ప్రతి దానిలో చూచును.
666. నిజమైన జ్ఞానము:-
అటు భగవంతుని యొక్క ఇటు విశ్వం యొక్క సంపూర్ణ జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణతను హస్తగతము చేసికొన్న సద్గురువుల యొక్క అవతార పురుషుని యొక్క దివ్యజ్ఞానము (సత్యానుభూతి యొక్క దివ్యత్వము).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[17:53, 17/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(805)
🕉🌞🌎🌙🌟🚩
"ఆధ్యాత్మిక జీవనం అంత సులభంగా ఉండేట్లు కనిపించడం లేదే !?"
సత్యాన్ని అర్థం చేసుకోవడం, తేలికైన తెలిసిన మార్గంలోనే అర్థం చేసుకోవటం ఆధ్యాత్మిక జీవనాన్ని సులభతరం చేస్తుంది. ముందు దేవుడున్నాడని తెలుసుకునేందుకు, ఆయన సమర్థతను గుర్తించేందుకు, ఆయనను ఎలా ఆరాధించాలో తెలియజేసేందుకు, దైవాన్ని ఎలా దర్శనం చేసుకోవాలో చెప్పేందుకు, చివరికి తాను ఆ దైవానికి భిన్నంగాలేనని రూఢీ చేసుకునేందుకు.. ఇలా అంచలంచలుగా ప్రతి ఒక్కరూ తమలోని దివ్యత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన, వివేకవంతమైన, నాణ్యమైన జీవనంతో ఆదర్శంగా నిలుస్తారు. ప్రార్థనగా మొదలైన భక్తి ఆరాధనగా పరిణమించి మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికతలోని అంతర్యం !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'ప్రార్థన ఆరాధనగా పరిణమించాలి'- (అధ్యాయం -99)
🕉🌞🌎🌙🌟🚩
[17:53, 17/02/2021] +91 92915 82862: "ఋభుగీత "(272)
🕉🌞🌎🌙🌟🚩
"నామరూపాలు"
19వ అధ్యాయము
పరమశాంతి సొంతమైతే ఇక ప్రత్యేక సాధనలతో పనిలేదు !!
లౌకికజీవనం, భౌతికజీవనం అంతా గతానుభవంపై ఆధారపడి ఉంటుంది. దైవానుభవం అలాంటిది కాదు. దానికి గతానుభవంతో పనిలేదు. ఎందుకంటే అది నిరంతరం ఉంటుంది. నిత్యనూతనంగా ఉంటుంది. అది మరొకదానితో పోల్చదగింది కాదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిదికాదు. అది నిరంతరాయ వర్తమానం. భూత, భవిష్యత్ లతో సత్యానికి నిమిత్తం లేదు. ఆధ్యాత్మికత అంటేనే శాంతి సాధన. పవిత్రమైన జీవనంతో పరమశాంతి మన సొంతమైతే, ఇక ప్రత్యేక సాధనతో పనిలేదు !
🕉🌞🌎🌙🌟🚩
[17:53, 17/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 29 / Bhagavad-Gita - 29 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 29 🌴
29. వవేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే |
🌷. తాత్పర్యం :
నా దేహమంతయు కంపించుచున్నది. నాకు రోమాంచమగుచున్నది.
🌻. భాష్యము :
రెండువిధములైన దేహకంపనములు కలవు. అదేవిధముగా రోమాంచితమగుట కుడా రెండు విధములు. అట్టి విషయము ఆధ్యాత్మిక తన్మ్యత్వములో గాని, భౌతికపరిస్థితియందు తీవ్రభయములో గాని కలుగుచుండును.
దివ్యానుభవమునందు భయమనునది ఉండదు. ఇట్టి పరిస్థితిలో అర్జునుని యందు గోచరించు లక్షణములు ప్రాణహాని యనెడి భౌతికభయము వలన కలుగుచున్నవి. అతని ఇతర లక్షణముల నుండి సైతము ఇది ప్రతీతమగుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 29 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prapbhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 1 - Vishada Yogam - 29 🌴
29. vepathuś ca śarīre me
roma-harṣaś ca jāyate
🌷. Translation :
My whole body is trembling, my hair is standing on end.
🌻. Purport :
There are two kinds of trembling of the body, and two kinds of standings of the hair on end. Such phenomena occur either in great spiritual ecstasy or out of great fear under material conditions. There is no fear in transcendental realization. Arjuna’s symptoms in this situation are out of material fear – namely, loss of life.
🌹 🌹 🌹 🌹 🌹
: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 30 / Sri Lalita Sahasranamavali - Meaning -30 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 30. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ‖ 30 ‖ 🍀*
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా -
విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా -
కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 30 🌹
📚. Prasad Bharadwaj
🌻 30. Vishuka prana harana varahi veeerya nandhitha |
Kameshwara mukaloka kalpitha sri Ganeshwara || 30 || 🌻
76 ) Vishuka prana harana varahi veeerya nandhitha -
She who appreciates the valour of Varahi in killing Vishuka (another brother of Banda-he is personification of ignorance)
77 ) Kameshwara mukaloka kalpitha sri Ganeshwara -
She who created God Ganesh by the mere look of the face of her Lord , Kameshwara
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 30 / Sri Vishnu Sahasra Namavali - 30 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
కర్కాటక రాశి - పుష్యమి నక్షత్రం 2వ పాద శ్లోకం
🌻. 30. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ‖ 30 ‖ 🌻
🍀 275. ఓజస్తేజోద్యుతిధరః ---
పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు
🍀 276. ప్రకాశాత్మా ---
ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.
🍀 277. ప్రతాపనః ---
సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.
🍀 278. ఋద్ధః ---
అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.
🍀 279. స్పష్టాక్షరః ---
స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.
🍀 280. మంత్రః ---
తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.
🍀 281. చంద్రాంశుః ---
చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.
🍀 282. భాస్కరద్యుతిః
సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Vishnu Sahasra Namavali - 30 🌹
Name - Meaning
📚 Prasad Bharadwaj
🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻
Sloka for Karkataka Rasi, Pushyami 2nd Padam
🌻 30. ōjastejōdyutidharaḥ prakāśātmā pratāpanaḥ |
ṛddhaḥ spaṣṭākṣarō mantraścandrāṁśurbhāskaradyutiḥ || 30 || 🌻
🌷275. Ōjas-tejō-dyuti-dharaḥ:
One who is endowed with strength, vigour and brilliance.
🌷276. Prakāśātmā:
One whose form is radiant.
🌷277. Pratāpanaḥ:
One who warms the world through the power manifestations like the Sun.
🌷278. Ṛddhaḥ:
One who is rich in excellences like Dharma, Gyana (knowledge), Vairagya (renunciation) etc.
🌷279. Spaṣṭākṣaraḥ:
He is so called because Omkara, the manifesting sound of the Lord, is Spashta or high pitched.
🌷280. Mantraḥ:
One who manifests as the Mantras of the Rk, Sama, Yajus etc., or one who is known through Mantras.
🌷281. Candrāṁśuḥ:
He is called 'Chandramshu' or moonlight because just as the moon-light gives relief to men burnt in the heat of the sun, He gives relief and shelter to those who are subjected to the heat of Samsara.
🌷282. Bhāskara-dyutiḥ:
He who has the effulgence of the sun.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌷157 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
శ్రద్ధలో పోకడలు
10. తపస్సు రజస్తమో దోషములను హరించును. అది మూడు విధములు. ఒకటి శరీరము. రెండు వాంగ్మయము. మూడు మానసము. అందు శారీర తపస్సునందు ఈ లక్షణములు ఉండును.
(1)దేవతాపూజ,
(2)బ్రాహ్మణ పూజ,
(3)గురుపూజ,
(4)పండిత సన్మానము, (5)స్నానాదిశుచిత్వము,
(6)ఋజుప్రవర్తనము,
(7)బ్రహ్మచర్యము,
(8)అహింస.
(ఈ లక్షణముల వలన దేహము నందలి రజస్తమః ప్రకోపములు నశించును. యోగాభ్యాసమునకు శరీరము అనుకూలమగును.
15. వాంగ్మయ తపస్సున ఈ లక్షణములు ఉండును.
(1)ఇతరులకు క్లేశము, భయము, దుఃఖము మున్నగు ఉద్వేగములను కలిగించు వాక్యములను పలకకుండుట. (2)సత్యము పలుకుట.
(3)ప్రియముగా పలుకుట
(4)హితము కోరి పలుకుట
(5)వేద శాస్త్రాదులు అధ్యయనము చేయుట.
(దీనివలన వాగ్దేవి శుద్ధి అయి వాక్కు శక్తిమంతమగును. వాక్సిద్ధి, కవిత్వ శాస్త్ర స్ఫురణము, శబ్దార్థ సమన్వయము ఔచిత్యము అలవడును.)
16. మానస తపస్సు నందీలక్షణములు ఉండును.
(1)మనస్సున సంతోషము నిలుపు కొనుట
(2)ఇతరులను గూర్చి సౌమ్యముగా భావించుట
(3)మౌనము
(4)ఆత్మనిగ్రహము
(5)భావములు పరిశుద్ధిగానుంచుకొనుట.
(సౌమ్యత్యమనగా ఇతరులకు కీడు భావించుట, తప్పులు పట్ట చూచుట మున్నగు లక్షణములను విడుచుట. మౌనమనగా ఆవశ్యకము కాని వానిని భావింపకుండుట. దీనిని బట్టి మౌనము వాక్కునకు సంబంధించినది కాదనియు, మనస్సునకు సంబంధించినదనియు తెలియుచున్నది. భావనం శుద్ధి అనగా ఇతరులకు చెప్పుటకు వీలు లేనివి ఊహింపకుండుట. దీనివల్ల రహస్యబుద్ధి, పాప చింత, బుద్ధి సంకోచము తొలగును.
🕉🌞🌎🌙🌟🚩
172) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
జానామి ధర్మం న మే ప్రవృత్తిః జానామ్యధర్మం న చ మే నివృత్తిః ౹ కేనాపిదేవేన హృది స్థితేన యథా నియుక్తోఽ స్మి తథాకరోమి ౹౹176౹౹
176. ఏది ధర్మమో నాకు తెలుసు. కాని దానిని అనుసరించి ప్రవర్తింపను.
అధర్మమేదో తెలుసు.కాని దాని నుండి విరమింపను. హృదయమునందు ఆసీనుడైన ఏ దైవమో ఎట్లు నియమించిన అట్లు చేయుదును.
వ్యాఖ్య:- ప్రసన్నగీత యందలి దుర్యోధనుని పలుకులు
"కేనేపి దేవేన" అనే మార్పుతో భగవంతుడే కర్తయని భావించే జ్ఞాని వాక్కుగా చెప్పబడినవి.
పరమార్థ మందు ఆత్మజ్ఞానికి కర్మలతో సంబంధమే లేదు. అయినను లోకదృష్టి యందు చేయువాడుగానూ,చేయించువాడుగానూ కనపడుచున్నాడు.
అయినప్పటికి సంపూర్ణ అపరోక్షజ్ఞానముగల మహానుభావుడు నూరుకోట్ల అశ్వమేథయాగముల నాచరించుగాక,సమస్త దానముల సల్పుగాక,అఖిల జీవులకు సుఖకరములైన సుకర్మములను చేయుగాక,కానీ
తత్తత్కృత్యముల వలన,కర్తృత్వ బుద్ధి లేక పోవుటచే పుణ్యము లేదు పాపము లేదు.
తత్త్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసియు చేయని వాడు.కనుక వినిన,తినిన,తిరిగిన,తాకిన,
గ్రహించిన,మూకొనిన,
పరిహరించిన - ఏమి చేయుచున్ననూ ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించు చున్నవే గాని తాను యేమియు చేయుట లేదని నిశ్చయము.
ఎట్లనగా,ఆయా ఇంద్రియములు దేహమునకే గానీ ఆత్మయైన తనకు కరణములు(కొరముట్లు)కానేరవు.
కాన కరణ రహితమగు తనకు కర్మయే లేదని జ్ఞాని నిశ్చయమై యున్నది.
🕉🌞🌏🌙🌟🚩
[19:11, 17/02/2021] +91 92915 82862: అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 263-6
సంపుటము: 3-366
ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు
మక్కళించి మక్కళించి మాయకింతాఁ దగులు!!
॥పల్లవి॥
పుట్టినప్పుడే పాపపుణ్యములు దగులు
అట్టె దేహమున కన్నమూఁ దగులు
గట్టిగా నీరెండూనై తే కర్మమూఁ దగులు
యెట్టునుఁ బోరాదు మాయకింతాఁ దగులు!!
॥ఎక్క॥
మనికి సంసారియైతే మమతలుఁ దగులు
పెనగఁగఁ బెనగఁగా బిడ్డలూఁ దగులు
అనువై యీలంపటాన కాసలెల్లాఁ దగులు
మన సొక్కటొక్కటై మాయకింతాఁ దగులు !!
॥ఎక్క॥
అరయ శ్రీవేంకటాశుఁ డాత్మలోనే తగులు
శరణన్నవారికి విజ్ఞానము దగులు
గరిమ నిందువల్లనే ఘన మోక్షమూఁ దగులు
మరిగినప్పుడే సుమ్మీ మాయకింతాఁ దగులు !!
🕉🌞🌎🌙🌟🚩
-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
6- యజ్ఞం
((((((((((🕉))))))))))
కర్మల వల్ల మూడు విధాలైన ప్రయోజనాలు : కర్మలకు ప్రయోజనాలు మూడు విధాలుగా ఉంటాయి. ఈ లోకంలో మనమున్నంత కాలం మనకీ మనచుట్టూ ఉన్న వారికీ దేవతల అనుగ్రహం వల్ల క్షేమం కలగటం. రెండు: చనిపోయిన తరువాత దేవలోకంలో ఆనందంగా గడపగలగటం. దేవలోకంలో నివాసం శాశ్వతం కాదు. మన పుణ్యాన్ని బట్టే అక్కడ నివాసముంటుంది.
దేవలోకంలో లభించే సౌఖ్యం భక్తునికి గాని జ్ఞానికి గాని కలిగే ఆనందంతో పోల్చలేం. ''మనీషా పంచకం''లో ఆది శంకరులు ఇంద్రుని ఆనందంకూడా, ఆత్మసాక్షాత్కారం పొందినవాని ఆనందంలో సహస్రాంశం కూడా ఉండదన్నారు. అయినప్పటికీ, ఈ భూమి మీద జీవితంతో పోలిస్తే స్వర్గలోకంలోని నివాసం ఎంతో హృద్యం. ఈ సౌఖ్యం లభించటం యజ్ఞాల నిర్వహణవల్ల కలిగే ఫలితాలలో రెండవది.…
[20:35, 17/02/2021] +91 95058 13235: 17.2.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది మూడవ అధ్యాయము
బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీశుక ఉవాచ
43.1 (ప్రథమ శ్లోకము)
అథ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప|
మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుముపేయతుః॥9908॥
శ్రీశుకుడు పలికెను అంతశ్శత్రువులను జయించిన పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతఃకాలస్నానాది విధులను నిర్వర్తించుకొనిరి. పిమ్మట వారు మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.
43.2 (రెండవ శ్లోకము)
రంగద్వారం సమాసాద్య తస్మిన్ నాగమవస్థితమ్|
అపశ్యత్కువలయాపీడం కృష్ణోఽమ్బష్ఠప్రచోదితమ్॥9909॥
రంగస్థల ద్వారము కడకు రాగానే శ్రీకృష్ణుడు అచటనున్న కువలయాపీడనము అను ఏనుగును చూచెను. దానిని ఒక మావటివాడు అదుపు చేయుచుండెను.
43.3 (రెండవ శ్లోకము)
బద్ధ్వా పరికరం శౌరిః సముహ్య కుటిలాలకాన్|
ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా॥9910
అప్పుడు కృష్ణప్రభువు ఉత్తరీయమును నడుమునకు బిగించి, ముంగురులను సవరించుకొని, మేఘధ్వనులవలె గంభీరములైన వాక్కులతో మావటివానిని ఱెచ్చగొట్టుచు ఇట్లనెను-
43.4 (నాలుగవ శ్లోకము)
అంబష్ఠాంబష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ మా చిరమ్|
నో చేత్సకుంజరం త్వాద్య నయామి యమసాదనమ్॰9911॥
"ఓరీ మావటీ! వెంటనే తప్పుకొనుము. మా ఇరువురికి మార్గమునిమ్ము. లేనిచో నిన్ను, ఏనుగును ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను".
43.5 (ఐదవ శ్లోకము)
ఏవం నిర్భర్త్సితోఽమ్బష్ఠః కుపితః కోపితం గజమ్|
చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపమమ్॥9912॥
శ్రీకృష్ణుడు హెచ్చరించినంతనే మావటివాడు మిగుల క్రుద్ధుడయ్యెను. పిదప అతడు మృత్యుదేవతవలె భయంకరమైన ఆ మదపుటేనుగును కృష్ణుని మీదికి ఉసిగొల్పెను.
43.6 (ఆరవ శ్లోకము)
కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాగ్రహీత్|
కరాద్విగలితః సోఽముం నిహత్యాంఘ్రిష్వలీయత॥9913॥
వెన్వెంటనే ఆ కువలయాపీడము ఱెచ్చిపోయి, శ్రీకృష్ణుని తన తొండముతో చుట్టివేసెను. అంతట ఆ స్వామి నేర్పుగా ఆ తొండమునుండి జాఱుకొని (తప్పించుకొని) దానిపై పిడికిలితో ఒక్కపోటు పొడిచి, తాను దాని కాళ్ళసందున దాగికొనెను.
43.7 (ఏడవ శ్లోకము)
సంక్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణదృష్టిః స కేశవమ్|
పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః॥9914॥
43.8 (ఎనిమిదవ శ్లోకము)
పుచ్ఛే ప్రగృహ్యాతిబలం ధనుషః పంచవింశతిమ్
విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా॥9915॥
శ్రీకృష్ణుడు తన యెదుట ఎక్కడను కనబడకపోవుటతో ఆ మదపుటేనుగు ఒడలు తెలియని కోపముతో తొండముతో వాసన చూచుచు వెదకి వెదకి ఆ పురుషోత్తముని పట్టుకొనెను. అప్పుడు ఆ ప్రభువు శక్తియుక్తులను చూపుచు దాని పట్టునుండి బయటపడెను. పిదప ఆ స్వామి దాని తోకను పట్టుకొని, గరుత్మంతుడు సర్ఫమునువలె అవలీలగా దానిని ఇరువదియైదు బారల దూరము లాగివేసెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
🌀👂🍯🎊💖🎊👂🍯🌀
[శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
820వ నామ మంత్రము 18.02.2021
ఓం సత్యై నమః
సత్యస్వరూపిణిగాను, పరమశివుని భార్య సతీదేవిగాను తేజరిల్లు జగజ్జననికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి సతీ యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం సత్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు సకలార్థసిద్ధియు, సర్వశుభప్రదము గలుగును.
సతి అనగా పాతివ్రత్యమను సద్రూపత్వముగలిగినది.
సతీదేవి దక్షప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య..ఆష్టాదశశక్తి పీఠాలకు ఆది దేవత పరమశివుని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకున్నది. అందుకు ధక్షుడు పరమశివుని అవమానించదలచి యజ్ఞం ప్రారంబించి దేవతలనందరినీ అహ్వానించి శివుని మాత్రం ఆహ్వానించడు. పరమేశ్వరుడు ఆగ్రహం చెంది మౌనంగా ఉంటాడు. సతీదేవి పోవాలని పట్టుబడగా తనను ఒక్కదాన్నే ఆమె పుట్టినింటికి పంపుతాడు. ఎంతో సంతోషంగా పుట్టినింటికి పోయిన సతీదేవిని ఎవరూ పట్టించుకోరు. కనీసం పలకరించరు.తండ్రి ఆమెను దూషిస్తాడు.అవమానం భరించలేక సతీదేవి ఆ యజ్ఞం లో ప్రాణత్యాగం చేస్తుంది.ఆ విషయం తెలిసిన శివుడు ఆగ్రహంతో ఆ యజ్ఞ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి ధక్షున్ని ఆంతం చేసి సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకుని రోధిస్తూ విశ్వాంతరాల వైపు బయలు దేరుతాడు శివుని ఆవేదన తీర్చుటకొరకు తన సుదర్శనచక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక ఖండాలుగా ఖండిస్తాడు అ శరీరభాగావు పడిన ప్రధేశాల్లో అమ్మవారు మహాశక్తి గా అవతరించి శక్తి పీఠాలుగా విలసిల్లినవి. అటువంటి శక్తిపీఠాలు ఏబై ఒకటి ఉండగా ప్రధానమైనవి పదునెనిమిది. వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అందురు.
అష్టాదశ శక్తిపీఠాలకు ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం ఒకటి ఉన్నది.
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
1. శాంకరీదేవి- శ్రీలంక*- ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును.
2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
5. జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' మరియు కృష్ణా నదులు కలిసే స్థలంలో ఉంది.
6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది.
(శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి)
7. మహాలక్ష్మి- కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
8. ఏకవీరిక మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11. గిరిజ - ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.
12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13. కామరూప- హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
15. వైష్ణవి జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17. విశాలాక్షి- వారాణసి, ఉత్తర ప్రదేశ్.
18. సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం సత్యై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌸💐💐💐
[ శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
245వ నామ మంత్రము 18.02.2021
ఓం చక్రరాజ నికేతనాయై నమః
శ్రీచక్రమే నివాసస్థానముగా విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి చక్రరాజ నికేతనా యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఓం చక్రరాజ నికేతనాయై నమః అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఉపాసించు సాధకుడు ఆ పరాశక్తి కరుణచే బ్రహ్మజ్ఞానసముపార్జనదిశగా తన మనసును మరల్చుకొని దీక్షాబద్ధతతో ప్రవర్తించును.
త్రైలోక్యచక్రము మొదలు తొమ్మిది చక్రములు గల శ్రీచక్రమే తన నివాసస్థానముగా విరాజిల్లుచున్నది పరమేశ్వరి.
శ్రీ చక్రమును శ్రీ యంత్రము అనికూడా అంటారు. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణురాలైన శ్రీలలితా దేవి లేదా త్రిపురసుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం అని లేదా నవ చక్రం అని కూడా పిలుస్తారు.
శంకరభగవత్పాదుల వారు శ్రీచక్రమును గూర్చి సౌందర్యలహరిలో పదకొండవ శ్లోకంలో ఇలా చెప్పారు.
చతుర్భిః శ్రీకంఠైః - శివయువతిభిః పంచభిరపి|
ప్రభిన్నాభిః శంభో ర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశ - ద్వసుదల-కలాశ్చ్త్రివలయ
త్రిరేఖభిః సార్ధం - తవ శరణకోణాః పరిణతాః
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, నలబై నాలుగు (44) అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.
భావము:
శ్రీచక్రంలో శివకోణములు నాలుగు(4), ( వీటి కోణములు క్రిందకు ఉండును.) శక్తికోణములు ఐదు (5), శక్తి కోణములు పైకి ఉండును. మూలప్రకృతులు తొమ్మిది (9), అష్టదళములు ఎనిమిది(8) , షోడశదళములు పదహారు (16) , త్రివలయములు మూడు (3) , భూపురత్రయములు మూడు (3), ఈ విదంగా శ్రీచక్రంలో మొత్తం నలబై నాలుగు (44) కోణములు ఉండును. అటువంటి శ్రీచక్రము నీకు నిలయముగా నీ స్థానమై ఉన్నది తల్లీ. శ్రీచక్రము నందు సృష్టికి మూల కారణమైన మూల ప్రకృతులను పేరుగల తొమ్మిది త్రికోణములు గలవు. ఇంకను శ్రీచక్రమునందు నలబై నాలుగు కోణములేగాక, ఇరువది ఎనిమిది మర్మ స్థానములు, ఇరువది నాలుగు సంధులు గలవు. తొమ్మిది త్రికోణములు గలవు గనుక నవయోన్యాత్మక మందురు. ఈ నవ యోనులు నవ ధాతువులై సృష్టి మూలకము లగుచున్నవి. త్వక్కు, రుధిరము, మాంసము, మేధస్సు, ఆస్థి అనునవి ఐదు శక్తి మూలకములు, ధాతువులు మజ్,శుక్రము, ప్రాణము, జీవుడు అను నాలుగు ధాతువులు శివ మూలకములు. మన దేహము నవ ధాతుమయము, నవ యోని సముద్భవము. దశమ యోని బైన్ధవ స్థానము. ఇట్లు పిండాండము, బ్రహ్మాండము వీని వలన జనించినది. పంచ మహా భూతములు, పంచ తన్మాత్రలు,
పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు,మనస్తత్వము, మాయ, శుద్దవిద్య, మహేశ్వరుడు,సదాశివుడు, అను పంచ వింశతి తత్వములు శ్రీచక్రమునందంత ర్భూతములై యున్నవి. శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము చరాచర జగత్తునకు సృష్టికి మూలమై యున్నది. షట్చక్ర భేదనముచే శ్రీచక్రోపాసన చేసే శ్రీదేవీ భక్తులకు అణిమాది అష్ట సిద్దులు అతి సునాయాసముగా సిద్ధించును. సిద్ధించే ముందు పరీక్షలు చాలా తీవ్రముగా వుండును. మానసిక, శారీరిక పరీక్షలు వుండును. ఎన్నో రకముల భ్రమలు గల్పించబడును. కంటి ముందు మెరుపు తీగలు మెరియును. చెవులు హోరెత్తును. తల పగలి పోవునట్లుగా వుండును. భరించలేని మాడు పోటు, తల గిర్రున తిరుగును. ఒకే సమయములో శీతోష్ణస్థితులు గలుగును. వున్నది లేనట్టుగా లేనిది వున్నట్టుగా అగుపించును. రకరకాల మాయలు గనిపించును. మనస్సు తీవ్ర భయాందోళనలకు లోనగును. శరీరము తీవ్ర కంపనములకు లోను అగును. శరీరము చెమట పట్టును. వెన్నులోని నాడులు తీవ్రముగా స్పందించును. తరువాత శరీరము నెమ్మదిగా తేలిక అగును. నాగ బంధములో కదలిక గల్గును. మూలాధారములో శక్తి చలనము, ఉత్కీలనము, ఆ తరువాత షట్చక్ర భేదనము.
ఆజ్ఞాచక్రములో త్రికోణ దర్శనము, త్రికోణాంతర దీపికా దర్శనము కలుగును.
ఆ తరువాత ఆనందమే బ్రహ్మానందం. ఇక మిగతా విషయములు చెప్పకూడదు. అవి అతి రహస్యములు. స్వయముగా ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి. మొదటి సారి మాత్రమే ఈ సాదృశ్యములు అగుపించును. ఆ తరువాత నీ మానసిక, శారీరిక స్థితిగతులను బట్టి, నీకు తెలియకుండానే కుండలినీశక్తి సహస్రారము వరకు గమనము చేయుచూ వుండును. రహస్యమైన విషయమేమంటే సాధకుడు అఖండ బ్రహ్మచర్య నిష్ఠలో, పంచదశీ మంత్ర పునఃశ్చరణ దీక్షలో వుండవలెను. అప్పుడే ఇది సాధించగలడు. లేనిచో ఇది కుదరదు. గురు ముఖతః దీక్ష తీసుకొన్నవారిలో మాత్రమే ఈ సిద్ధి కలుగును. ఇతరులు ఈ సాధన చేయకూడదు. చాలా తీవ్ర పరిమాణాలు వుంటాయి.
ఎవరికి వారు తమ్ము తాము ఉద్దరించుకోవడానికి మాత్రమే ఈ సాధన చేయవలెను. అన్యధా తగు మూల్యము చెల్లించుకోక తప్పదు. శ్రీవిద్య మోక్ష సాధనకు మాత్రమే అని గుర్తెరిగి ప్రవర్తించవలయును.
సాధకుడు అమ్మ పెట్టే పరీక్షలకు నిలబడాలి. సాధన తీవ్రముగా వుండాలి. మధ్యలో చలించగూడదు. ఏకోన్ముఖులై వుండాలి. ఎవరికి ఏయే బలహీనతలు గలవో, అవే పరీక్షలకు తావుగా నిలబడును. మెట్టు మెట్టుకూ చిత్ర విచిత్రమైన పరీక్షలు కల్గును.
మానవశరీరము - శ్రీచక్రము
బిందువు - బ్రహ్మరంధ్రము (గమనిస్తే పసిపిల్లలకు నడునెత్తి లేదా మాడపట్టు మెత్తగా ఉంటుంది. ఇదే బ్రహ్మరంధ్రము)
త్రికోణము- మస్తకము (తల ముందుభాగము)
అష్టకోణము - లలాటము (నుదురు)
అంతర్దశారము - భృకుటి (కనుబొమల మధ్య)
బహిర్దశారము - కంఠము
చతుర్దశారము- హృదయము
అష్టదళపద్మము- నాభి
షోడశదళ పద్మము - కటి (మొల భాగము)
వృత్తత్రయము - ఊరువులు (తొడలు)
భూపురము - పాదములు
బిందువు నందే కామేశ్వరీ, కామేశ్వరులు ఉంటారు. గనుకనే అమ్మవారు చక్రరాజనికేతనా యని అనబడినది.
ఇంతటి మహిమాన్వితమైన శ్రీచక్రమే తన నివాసస్థానమై జగన్మాత విలసిల్లుచున్నది గనుక చక్రరాజనికేతనా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం చక్రరాజనికేతనాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment