మధురిమలు - తప్పొప్పులు
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వాసనలేని పువ్వు
అచ్చిరానది కొవ్వు
అనువుకానిది నవ్వు
జలమున్నచో తవ్వు
బుద్ధిలేని పురంబు
దాచలేని ధనంబు
పొందనీ సౌఖ్యంబు
తీర్చనీ దాహంబు
భక్తి లేనిది మగువ
శక్తి లేనిది తెగువ
ముక్తి రానిది తగువ
రక్తి చూపని కలువ
గుణహీన కుమారుడు
ప్రేమచూపని మగడు
సమయ0 వ్యర్ధ పరుడు
మాయచేసెను నటుడు
పని కే రాని విద్య
జ్ఞానం లేని విద్య
సుఖించలేని విద్య
సేవకు రాని విద్య
గ్రాసము లేని కొలువు
ఆశలు చూపు తనువు
కాలము తెల్పు మనువు
బతక లేనిది పరువు
గారెలు లేని విందు
అక్కర రాణి చిందు
సుఖమే లేని పొందు
దగ్గు తగ్గని మందు
చెట్లు లేని వనంబు
శ్రద్ధ లేని తపంబు
మచ్చిక వినయంబు
చూపని సహనంబు
మెరుపు నిచ్చి మరల్చు
అభయమిచ్చి మిగిల్చు
కలలు తీర్చి మరల్చు
మనసు నిచ్చి కదల్చు
కారణం నీ లోపలిది
కార్యం నీ వెలుపలిది
మనసు నీలొ ఉన్నది
సమయం నీ వెలుపలిది
Comments
నేటి ఛందస్సు
UI UI UI UUI .... 16
బాల భాను కాంతి పుంజాలు
రామ భాణ కాంతి లోకాలు
రామ నామ కాంతి దేహాలు
విశ్వ మాయ కాంతి దేశాలు
మిన్ను దేహ కాంతి వర్ణాలు
మన్ను మోహ కాంతి భావాలు
శాంతి దాహ కాంతి ఊహళ్లు
కాలమే మాయ కాంతి విస్తర్లు
మేని వెల్గు వింత కాంతుళ్లు
ఆశ పర్గు కొత్త పొంతళ్లు
కాల మల్పు తిప్పె చిందుళ్లు
చూపు కల్పి ఒప్పు మాటళ్లు
ప్రేమ మారి మేను నవ్వుళ్ళు
సేవ కోరి శక్తి ముచ్చట్లు
ధ్యాన మిచ్చి మోక్ష మార్గాలు
మాతృ మూర్తి యుక్తి పాఠాలు
-
నేర్పించు పంతులమ్మ పాఠాలు
నేర్పూక ఎందుకమ్మ భేదాలు
పెంచూట వద్దులెమ్మ వాదాలు
దోషాలు చేయధమ్మ శాపాలు
దీనంగ మాన్యమమ్మ శబ్దాలు
చద్వాలి నిశ్చమమ్మ వేదాలు
పాఠాలు నేర్పుమమ్మ శాస్త్రాలు
శోకాలు వద్దులెమ్మ భోగాలు
కాఠిన్యమున్ జూప గానిదమ్మా
పంత మ్మూ వద్దు ఎందుకమ్మా
శాంతంమ్మూ జూపి ఉండువమ్మా
భాగ్యంమ్మూ పంచు కోవలమ్మా
అటాడ కష్టమౌ నజినికొమ్మా
పోరాట ఇష్టమో నజినికొమ్మా
పేరాశ శాపమో నజినికొమ్మా
వేషాలు కోపమౌ నజినికొమ్మా
నామాట లెప్పుడున్ నాణ్యమౌనే
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమౌనే
నాదైవమ్ హృదయం లోనమౌనే
నాప్రాణం ప్రేమంత భద్రమౌనే
నీ మీద నిరతమ్ము నెయ్యమేనే
నీ రూపు పదిలమ్ము హృద్యమేనే
నీ మాట మనసమ్ము వుండెనేనే
నీ నవ్వు ఎపుడూను పొందునేనే
ఎన్నెన్నొ నేవింటి నీరీతిగా
చెయ్యాలి సేవాలు నీరీతిగా
పొందాలి సంతోష మీరీతిగా
భాగ్యము వచ్చేలె ఈరీతిగా
--((*))--
Co
ప్రాంజలి ప్రభ
నా కష్టాలు మీకు మీవి నాకు
ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు.. “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.
నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.
ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.
అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.
అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.
నీతి: భగవంతుడు నీకు ఏమి ఇచ్చిన దానికి ఓక అర్థం అంతకు మించి మనకు తెలియని ఏదో పరమార్ధం దాగి వుంటుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comm
*కొడుకు.... కూతురా
ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు..
భార్య:
ఏం అనుకుంటున్నావ్..? అబ్బాయి పుడతాడనా ? అమ్మాయనా..??
భర్త:
🤔 అబ్బాయనుకో...వాడికి లెక్కలు నేర్పుతాను..ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం..స్విమ్మింగ్ నేర్పుతా..చెట్లెక్కడం నేర్పుతా..అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పుతా..😉 ఇంకా....
భార్య:
చాలు చాలు! 😄
మరి అమ్మాయి పుడితే..!?
భర్త:
అమ్మాయైతే ఏం నేర్పనవసరంలేదు..! అదే నాకు నేర్పుతుంది..నేనేం తినాలి..ఏం తినకూడదు..ఏం మాట్లాడాలి..ఏం మాట్లాడకూడదు..
నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి..
ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట..
ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది..నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు..ఎదురు తిరుగుంది.. భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది..మా నాన్న నాకోసం అది చేసాడు..ఇది చేసాడు అనీ..
భార్య:
సో..అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది.. అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??
భర్త:
కాదు..అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు..అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్..
భార్య:
అదేం శాశ్వతంగా మనతోనే
ఉండిపోదు కదా..!
భర్త:
ఉండదు.. కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం..అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు..!
# Daughters are Angles... Born with unconditional love and care forever..
*అందుకని ఆడపిల్లల*
*తల్లిదండ్రులు అదృష్టవంతులు* ....
కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే తులసి మొక్క
కూతురంటే దీంచెసుకొవలసిన బరువు కాదు..నీ ఇంట్లో వెలసిన కల్పతరువు
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు ..నీ కడుపున పుట్టిన మరో అమ్మ
కూతురంటే కష్టాలకు,కన్నిళ్ళకు వీలునామ కాదు ...కల్మషం లేని ప్రేమ కు చిరునామా...
కళ్యాణమవగానే నీన్ను విడిచివెళ్ళిన ..పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా..
నీ ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...
కోడుకులా కాటి వరకు తోడురాకపోయినా... అమ్మ అయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ...
కూతురున్న ఏ ఇల్లు అయిన అవుతుంది.. దేవతలు కోలువున్న కోవేల
కూతురిని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా........🙏🙏🙏
...
శివలింగాలలోని ప్రత్యేకత ఏంటి? 🌻
🍃🌺పరమశివుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది. కొంతమంది వీటిలో తమకిష్టమైన వాటిని ఎంచుకుని నిరంతరం వాటినే పూజిస్తుంటారు. అలాగే ప్రతిఒక్కరూ రకరకాలుగా తమకు అనుగుణంగా వుండే విధంగా, తమకు నచ్చిన సమయంలో పూజించుకుంటుంటారు.
🍃🌺అయితే ఏ లింగాన్ని, ఎప్పుడు, ఎలా పూజించాలి…? వాటివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం….
🌻 ఏ లింగాన్ని ఎవరు పూజించాలి…? 🌻
🍃🌺లింగపురాణాల ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ, వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీ పూజించుకోవాలి. అయితే స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా పూజించుకోవచ్చు.
🍃🌺భర్తజీవించి వున్న స్త్రీలయితే స్ఫటిక లింగాన్ని, భర్తలేనివారు రసలింగాన్నికాని, స్ఫటికలింగాన్ని గాని అర్చిస్తే ఎంతో మంచిదని లింగపురాణంలో పేర్కొనబడింది.
🌻 వాటివల్ల వచ్చే ఫలితం ఏమిటి…? 🌻
🍃🌺ఏ లింగాన్ని పూజిస్తే ఏ ఫలితం లభిస్తుందోనన్న విషయాలు లింగపురాణంలో వివరించి వున్నాయి. అందులో రత్నాజ శివలింగాన్ని పూజించడం వల్ల ఐశ్వర్యంతోపాటు వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. అలాగే ధాతుజలింగం భోగ విలాసాలను అందిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది.
🌻 ఏది అతి పవిత్రమైన లింగం..? 🌻
🍃🌺శివునికి సంబంధించిన లింగాలలో అత్యంత పవిత్రమైన లింగం బాణలింగం. ఇవి తెల్లగా, చిన్న అండాకారలంలో నదీప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి వుంటాయి. ఇది నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తుంది.
🌻 ఎప్పుడు పూజించుకోవాలి..? 🌻
🍃🌺వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తికంలో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
🍃🌺చివరగా…. లింగపూజ చేసుకునేవారు ఉత్తరముఖంగా కూర్చొని వుండాలి. అలాగే రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడువస్తువులు తమతోపాటు తప్పనిసరిగా పూజలో వుంచుకోవాలని శివపురాణంలో చెప్పబడింది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
+91 94414 08564: 🌻 ముక్తి 🌻
🍃🌺శరీరం కేవలం గూడు. అది ఆత్మకు ఆవాసం మాత్రమే..
🍃🌺మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి. కానీ అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత. సమ్యక్ దృష్టితో ప్రాపంచిక కర్తవ్యాలు నిర్వర్తించాలి. మేను మాత్రమే నేను కాదు. ఉన్నది ఒక్క నేనే. మూడు అవస్థలలో వున్న నేను అనే చైతన్యమే.
🍃🌺హృదయం వెన్న వలె ఉండాలి. కాఠిన్యంతో కాకుండా.. కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి. సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి. మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి. ఇది కాదు,ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.
🍃🌺శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు.ఎరుకతో ఉండాలి.
🍃🌺దేనికీ అంటక, దేనినీ అంటించు కొనక కాంతి కటక…
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 87 🕉
తనువే నిత్యముగా నొనర్చు మదిలేదా చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటింపు మాగతుల రెంట న్నేర్పు లేకున్న లేదని నాకిప్పుడ చెప్పు చేయఁగల కార్యంబున్న సంసేవఁ జేసి నినుం గాంచెదఁగాక కాలముననో శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నా ఈ శరీరము ఉన్నంతవరకు నిన్ను శాశ్వతముగా సేవించుచుండవలయును.
🌹అందుకు అనుకూలముగ నా శరీరము శాశ్వతముగా ఉండునట్లు చేయుము. అది కుదరనిచో నేను చచ్చిన తర్వాత మరల పుట్టకుండునట్లు నీతో సాయుజ్యము పొందునట్లు అనుగ్రహించుము.
🌹ఈ రెండును చేయజాలనిచో ఆ విషయము యిప్పుడే చెప్పుము. నేను ఏమి చేయవలెనో ఆలోచించుకొని నిర్ణయించు కొందును.
🌹ఏమియు స్ఫురించనిచో ఇట్లే సేవించి సేవించి నీ యనుగ్రహమును పొంది నిన్ను దర్శించుకొనెదను.
🙏 ఓం నమః శివాయ
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
--(())--
భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?
అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది?" అని అడిగారు.
ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు
ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"
స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"
మళ్ళీ నిశబ్దం.
స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.
అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.
"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.
శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.
"అదెలా" అని అందరూ అడిగారు.
శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.
శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసిపెట్టాడు.
ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
🌼🌼🌼🌼🌼
🔱🙏గౌరీ🙏🔱
రెండు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'గౌర్యై నమః' అని చెప్పాలి.
గౌరీ = గౌర వర్ణములో ఉండునది.
'హిమవత్పర్వతరాజు పుత్రిక' అన్నా పార్వతి” అన్నా ఉమా' అన్నా 'గౌరి' అన్నా అమ్మవారే! “యోగాగ్నిలో ఆహుతి అయిన దక్షుని కూతురైన సతీదేవియే హిమవంతునికి కూతురుగా పుట్టిందని, ఆమె దేహచ్ఛాయ - శంఖము, బంగారం, చంద్రుడు ఈ మూడింటి రంగుల సమ్మేళనంగా కనబడుతూ ఉండడంతో 'గౌరీ' అనే పేరు వచ్చిందనీ " దేవి పురాణంలోని ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది.
శ్లో. యోగాగ్ని నాతుయాదగ్దాపునర్జాతా హిమాలయాత్
శంఖుకుందేందు వర్ణా చేత్యతో గౌరీతి సాస్మృతేత్.
అమ్మవారి గౌరవర్ణానికి వేరే ఇంకొక కారణం ఉందని చెప్పే ఒక ఇతి హాసం కూడా ఉంది. 'పరమేశ్వరుడు తన భార్య అయిన కాళీదేవిని చూచి 'నల్ల పిల్లా' అని పరిహసించినపుడు - ఆవిడ తపస్సు చేసి, బ్రహ్మ వరం వలన గౌరవర్ల శరీరాన్ని పొందింది. అప్పటి నుండి ' గౌరీ' అని పిలువబడింది. అని ఈ ఇతి హాసం చెబుతుంది.
దేవీ పురాణంలో ఇంతకు ముందు చెప్పబడిన అమ్మవారి రంగు - 'చాంపేయగౌర, వర్ణమని ఆదిశంకరులు అర్థనారీశ్వర స్తోత్రంలో తెలియపరుస్తారు.
మంత్రశాస్త్ర ప్రకారం - ఉచ్ఛారణకు ముందున్న అమ్మవారు - 'త్రిపురసుందరి అయితే, ఉచ్ఛారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు 'గౌరీ'. మనస్సులో భావాలు కలిగి, ఆ భావాల్ని వ్యక్త పరుద్దామనుకున్నపుడు ఆ భావాలు - అక్షరాలుగా - ఆ అక్షరాలు ఒక పదంగా, రెండు పదాలుగా, నాలుగు పదాలుగా, ఎనిమిది పదాలుగా, తొమ్మిది పదాలుగా ఇలా ఎన్నో - పదాలుగా మారుతూ ఉచ్చరింపబడుతూ నీటి మీద వ్రాసే అక్షరాల్లాగా వ్యక్తమై వెంట వెంటనే నీటిలోనే కలసిపోయినట్లు చోటులో కలిసి పోతాయి.
సరిగ్గా ఈ భావాన్ని తెలిపే ఈ క్రింది మంత్రమే మంత్రశాస్త్రంలో గౌరీదేవికి సంబంధించిన మంత్రంగా చెబుతారు.
“గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేక పదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరాపరమేవ్యోమన్.
ఉచ్ఛారణ సరిగ్గా రాని వారి కోసం - నమ్మకంతో, త్రికరణ శుద్ధిగా పై మంత్రాన్ని స్మరిస్తూ హోమగుండంలో పసువు కొమ్ములు గాని, వసువుగాని సమర్పిస్తూ హోమం చేస్తే - ఆ ఉచ్చారణ చక్కబడుతుంది. 'ఆనబోయే మాట'- 'పుట్టబోయే కొడుకు పేరు' లాంటిది. ఈ గౌరీ నామం.
1) గౌరవర్ణములో ఉండునది.
2) ఉచ్చారణకు చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారు. అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును.
🙏ఓం ఐం హ్రీం శ్రీo గౌర్యై నమః🙏
🌷శ్రీ మాత్రే నమః🌷
శుభోదయం
ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం.
ఎన్నటికీ శాశ్వతం కావు.
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
శుభోదయం
-------------------
🌻 మహానీయుని మాట🍁
-------------------------
"ఒంటరిగా ఉన్నపుడు ఆలోచనల్ని నలుగురిలో ఉన్నపుడు నాలుకని అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం మన అదుపులో తప్పకుండా ఉంటుంది."
--------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
---------------------------
"నీ కళ్ళు అందంగా ఉంటే ఈ ప్రపంచానికి నువ్వు నచ్చుతావు. అదే నీ దృష్టి అందంగా ఉంటే ఈ ప్రపంచం నీకు నచ్చుతుంది."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఎన్నడూ అబద్ధం చెప్పనివాడు!
➖➖➖✍️
ఒక భక్తుడు నేపాల్ లోని పశుపతినాథ్ మందిరానికి వెళ్లి ఒక రుద్రాక్షమాలతో తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారి ఆశీస్సులతో దాన్ని తను ధరించాలని అనుకున్నాడు.
మహాస్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దాన్ని స్వామివారి ముందు ఉంచాడు. దాన్ని స్వామివారు తాకితే తనను అనుగ్రహించినట్టు అనుకున్నాడు.
“దీనితో నువ్వు ఏమి చెయ్యబోతున్నావు?” అని అడిగారు స్వామివారు.
“పెరియవ ఆశీస్సులతో దాన్ని నేను వేసుకుందామని అనుకుంటున్నాను” అని బదులిచ్చాడు.
పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.
“ఇప్పటినుండి నువ్వు అబద్దం చెప్పడం మానివెయ్యగలవా?” అని అడిగారు.
అతను ఆలోచిస్తున్నాడు. “హఠాత్తుగా ఈ ప్రశ్న ఏమిటి?” కాని తప్పకుండా నిజమే మాట్లాడాలి ఏది ఏమైనా సరే.
“అబద్దాలు చెప్పకుండా ఉండలేను పెరియవ”
“ఏం? ఎందుకు?”
“నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. కొద్దిగా అబద్దాలు వాడకుండా రికార్డ్స్ తయారుచెయ్యడం కుదరదు. వాటిని ఎలా తయారుచెయ్యాలో నా పై అధికారులు సూచిస్తారు. నేను కాదనలేను”
స్వామివారు ఆరుద్రాక్ష మాలను తీసుకుని కాసేపు చేతులతో త్రిప్పుతూ, కొద్దిసేపటి తరువాత, “మరైతే ఎవరు అబద్దం ఆడరో వారికి దీన్ని ఇవ్వు” అని ఆదేశించారు.
అతను ఆశ్చర్యపోయాడు. అక్కడున్న సేవకులతో, “అచ్చంగా నా భార్య సూచించినట్టుగానే జరిగింది” అని అన్నాడు.
ఇతను నేపాల్ యాత్ర ముగించుకుని ఆ రుద్రాక్ష మాలతో వచ్చిన తరువాత అతని భార్య అతనితో పూజ గదిలో ఉన్న పరమాచార్య స్వామివారి చిత్రానికి మాలగా వెయ్యమని చెప్పింది.
“పరమాచార్య స్వామివారు చెప్పినట్టే చేస్తాను” అని అతను రుద్రాక్ష మాలను ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇపుడు ఇంటికి వెళ్ళగానే ఆ మాలను పరమాచార్య స్వామివారి చిత్రపటానికి అలంకరించాడు. తన ఇంటిలో ఎప్పుడూ అబద్ధం చెప్పని ఒక వ్యక్తీ ఉన్నారని ఆరోజే అతనికి అర్థం అయ్యింది.
అతని భార్య కోరికను పరమాచార్య స్వామివారు తీర్చారు. ఆమె కోరిక స్వామివారికి ఎలా తెలిసింది? టెలిపతి గురించి అందరకూ తెలిసిందే. కాని ఇది కేవలం గురుభక్తి. తరువాత ఒకసారి ఆ భక్తుని బంధువు ఒకరు దర్శనానికి వచ్చినప్పుడు అతని గురించి గొప్పగా చెబుతూ, “అతనిలో హరిశ్చంద్రుని పార్శ్వము కూడా ఉంది” అని అన్నారు మహాస్వామివారు.
--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం ।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
--(())--
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం_✍️
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
📖 మన ఇతిహాసాలు 📓
మాండవ్యముని వృత్తాంతం
మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు.రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు. రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపసుని కొనసాగించారు. ఒక రోజు రాత్రి కొంతమంది మహఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాడవ్యుని చూసి " మహానుభాడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు " అని ప్రశ్నించారు.అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవ్వరిని నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని క్రిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి పోయింది. ఆ తరవాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరవాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో " మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు. " అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో " పదునాలుగేళ్ళ వరకూ పిల్లలలు ఏమి చేసినా తెలియక చేస్తారు. అందు వలన ఇక మీదట పదునాలుగేళ్ళ బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు శూద్ర గ్రర్భమందు జన్మించెదవు కాక " అన్నాడు. ఆ కారణంగా వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడు అన్నాడు వైశంపాయనుడు.
9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣
తేటగీతి
జీవి మనసును మరిగియు జాడ్య ముంచు
జీవి వయసును బట్టియు జాప్య ముంచు
జీవి నిత్యమూ వ్యసనం జోలపాడు
జీవి మంచులా కరిగియు జపము చేయు
నిత్య జీవితం సత్యమై నడక సాగు
నిత్య మాటల తలుపులు నింగి చేరు
నిత్య పరుగులు జీవితం నిన్ను మార్చు
నిత్య గెలుపుకు ప్రేమను నిచ్చి చూడు
జలమ చేరిన చినుకులు జలము కలియు
జలము నందు పెరుగుచుండు జలచరాలు
జలము మానవ దాహపు జీవనమ్ము
జలము త్రాగిన తరువాత జీవ శక్తి
అర్ధ నారీశ్వరల తత్వవమ్ము కలిగి
అర్ధ భావమ్ము జీవితం అర్ధ మవ్వు
వ్యర్ధ సంఘర్షణమ్ములు వ్యర్ధ మవ్వు
అర్ధ మవ్వునా ఈనాటి ఆర్య సూక్తి
రక్త మాంసాల ముద్దను రాజ్య మేలు
రక్త పంజరం వ్యాపించి రాటు తేలు
రక్త మంతయు దోచేటి రవ్వ వెలుగు
రక్త తర్పణతో తల్లి రామ అనుచు
పుడమి నెప్పులు పట్టని ప్రజ నడుగు
పుడమి తల్లి యు బాధను పట్టు యెవరు
పుడమి శక్తిని తోడియు పల్కు వారు
పుడమి కరుణను చూడక పిచ్చి దనుచు
యువత మాంసాల ముద్దను ఏలు చుండు
యువత పంజరం వ్యాపించి యేమి చేయు
యువత అంతయు దోచేసి యతిగ వెలుగు
యువత తర్పణతో తల్లి యాజ్ణ అనుచు
విత్తు పుడమిన నీటితో విచ్చి ఎగసె
విత్తు ఎరువును పొందియు వ్యర్ధ మవ్వ
కుండ విత్తు లు కలిసి యు కమ్ము కొచ్చు
వెలుగు నీడలు పొందియు వ్యాప్తి చెందు
మోక్క మోక్కయు అంటుయే మోక్క యగును
మొక్క కొమ్మరెమ్మలలోను మోగ్గ పువ్వు
మోక్క గాలినీటినిపీల్చి మేను పెంచు
మోక్క గామారి వృక్ష మ్ము మన్న నిచ్చు
పంట పండిస్తున్న ట్టి రైతులలొ శక్తి
పంట ఉత్పత్తి సామర్థ్య ప్రాంతమంత
పంట దేశసంపదగాను పిలుపు వుంచి
పంట దైవసమ్మతిగా పొందు చుండు
కంటిలోనినలసునినాలుకయు తీయు
ఇంటిలోనిఎలకలబోనుగను పట్టు
ఇంటిలో ఈగ మోతలు ఇంతికెరుక
బయటపల్లకీ మోతలు భర్త తెలుపు
--(())--
" ఋషులు చూపిన భక్తి మార్గాలు
1. వేదా ధ్యయనం చేసిన పండితులు, జ్ఞానులు పరబ్రహ్మమును ఉపాసించడమే " పర భక్తి".
2. ఇష్ట దేవతలను ఉపాసించడం " అపర భక్తి " .
3. యాత్రలు చేసి, దేవతా స్వరూపాలను ఆరాధించటం " భయ భక్తి "
4. ఇష్ట దేవుని ప్రతిరూపాన్ని ఆరాధించడం " అన్వయ భక్తి "
5. ఎల్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేవుని ప్రేమించడం "ఏకాంత భక్తి "
6. ఎల్లాంటి ఉద్వేగాలకు పోకుండా ప్రశాంతమైన ప్రార్ధన " శాంత భావ భక్తి "
7. నేను నీకు దాసుడను అనే చేసే ప్రార్ధనను " దాస్య భావ భక్తి "
8. దేవుణ్ణి ప్రియమిత్రునిగా భావించి చేసే ప్రార్ధనను " సఖ్య భావ భక్తి "
9. భక్తులు భగవంతున్ని బిడ్డలుగా భావించి చేసే ప్రార్ధనను " వాత్సల్య భావ భక్తి "
10. భర్తే దేవునిగా భావించి చేసే ప్రార్ధనను " కాంత భావ భక్తి "
11. మనస్సును పూర్తిగా అర్పించి చేసే ప్రార్ధనను " మాధుర్య భావ భక్తి "
12. భగవన్నామస్మరణను నిరంతరం ఒక పద్దతి ప్రకారం చేయడం" అబ్యాస భక్తి"
13. మంచి చెడులు వ్యత్యాసాలను గమనించి చేసే ప్రార్ధనను "వివేక భక్తి"
14. భగవంతుని దూషింస్తూ చేసే స్మరణను " విముఖ భక్తి "
15. ఎల్లప్పుడూ సత్యమార్గాన్న చేసే ప్రార్ధనను " సత్య భక్తి "
16. దేవుని కళ్యాణాలు చేస్తూ ప్రార్దిమ్చడమే " కల్యాణ భక్తి "
17. ప్రాణుల పట్ల అహింసను ప్రదర్సిస్తూ పరమను చూపే భక్తిని " అహింస భక్తి "
18. సమాజానికి చేతనైనంత దానం చేయటమే "దాన భక్తి "
ప్రతి ఒక్కరు భక్తి మార్గములో నడుస్తూ సమాజానికి, దేశానికి భారం కాకుండ, మనుష్యులు " బ్రతికి- బ్రతికించుకుంటు" జీవించడమే " నిజమైన భక్తి "
--((**))--
మన వాడుక భాషలో 'తాపత్రయం' అనే మాట తరచు గా ఉపయోగిస్తుంటాము... ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలి అనే తాపత్రయం ఎందుకు పడతావు ?.. నా తాపత్రయం అంతా వాడి గురించే... ఇలా చాలా సందర్భాలలో అంటాము / వింటాము.
హిందూ వాజ్మయం ప్రకారం మనకి సంభవించే ఆటంకాలు లేదా కష్టనష్టాలు మూడు విధాలుగా ఉంటాయిట... అవి 1. భౌతికమైనవి, 2. దైవికమైనవి మరియు 3. అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి.
దైవిక మైనవి : మనకు కనిపించే ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు భౌతికమైనవి అయితే మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్ఛే కష్టనష్టాలు దైవికమైనవి లేదా ఆది దైవికమైనవి... అంటే దైవ దోషాలు, రాక్షసులు, భూతాలు, దయ్యాలు, ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమించేవి.
ఆధ్యాత్మికతాపం చెప్పుకోవాలంటే, ముందుగా ఆత్మ గురించి చెప్పుకోవాలి. ఆత్మ నశించనిది,శరీరం నశించేది. ఈ శరీరం లో ఆత్మ నివశిస్తుంది, ఈ శరీరం చేసే, మనసు, దాని ఇతర స్థాయిలలో చేసే అన్ని చర్యలను సాక్షీభుతంగా అనుభవిస్తుంది. మనసు,బుద్ధి,చిత్తం, అహంకారం, మనసు యొక్క వివిధ స్థాయిలు. ఈ మనసనేది చిత్రమైనది, సంకల్పవికల్పాలు చేస్తూనే ఉంటుంది. మనసు చేసే మరో చిత్రమే పురుషార్ధసాధన. ఇందులో మూడవ పురుషార్ధమే కామం. కామమంటే కోరిక,(స్త్రీ పురుష సంబంధమొక్కటే కామం కాదు) ఏదైనా కావచ్చు. ఇది ధర్మ బద్ధంగా ఉన్నంతకాలం తాపానికి చోటు లేదు. ధర్మ బద్ధమైన కోరిక కూడా జరగని సమయాలూ ఉంటాయి, అప్పుడూ ఈ తాపం తప్పదు. ధర్మం దాటినపుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో, చిక్కులు కలుగుతాయి. వీటినే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలుగాను, అంతఃశతృవులుగానూ పెద్దలు చెబుతారు. ఈ అంతఃశతృవులు బయటికి కనపడరుగాని, చాలా తాపాన్ని అనగా కష్టాన్నే కలగచేస్తారు. వీరిబారిన పడనివారుండరు. వీరిబారిన పడనివారు మహామహులే. ఏదో ఒక కోరిక లేనివారు లేరు, కాదు ఉండరు. నాకేకోరికా లేదన్నవారినెవరినీ నమ్మద్దు. ఈ పురుషార్ధ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం. ఈ తాపంలో పై చెప్పినవే కాక కలిగే శరీరానికి సంబంధించినా ఊర్ములు ఆరు, ఆకలి,దప్పిక, జర,రుజ,శోకం,మోహం…వీటినుంచి కలిగే కష్టాలు కూడా అధ్యాత్మిక తాపాలే. ఆకలికి, ముఖ్యంగా దప్పికకి అసలు ఓర్చుకోలేం. ఇది చాలా పెద్ద కష్టం. ‘గోచీ కంటే దరిద్రం ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం’ లేదని నానుడి. జర ముసలితనం,రుజ అనగా వ్యాధిబారినపడటం ఇవి రెండూ తప్పించుకోలేనివి అనుభవించక తప్పనివీనూ. జర,రుజ రెండూ పెద్ద కష్టాలే. చివరివి శోకం,మోహం, తప్పించుకోవాలని తంటాలైతే పద్తాం కాని సాధ్యం కాదు, ఎవరికి వారు మాత్రమే అనుభవించవలసినవి, యీ ఊర్ములన్నీ. ఇవే అధ్యాత్మిక తాపాలు.
నా ఇల్లు, నాఇష్టం, నిప్పుపెట్టుకుంటాను, నువ్వెవరు కాదనడానికి?నీ ఇల్లు నీ ఇష్టమని తగలబెట్టుకోడానికి లేదన్నా,నా స్వాతంత్ర్యం అని మొండిగా మాటాడేవారినేం చేస్తాం?,పది మంది నమ్మినదానిని కాదనుకోడం, తప్పులేదు, మీరంతా తప్పు చేస్తున్నరని చెప్పడం? అంతదాకానూ బాగానే ఉంది, ఇది నిత్య కలహం చెయ్యడం? ఇద్దరు వ్యక్తుల మధ్య,రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య కలహం, కలహం, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మూడవారు ఇద్దరినీ బాగుంద…
--(())--
కౌశికుడు ధర్మవ్యాధుని ” ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి? ” అని అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ” మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మాటలు చెవికెక్కవు. దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం ” అన్నాడు. ” మహాత్మా! ఇంద్…
విలువ
విక్రమపుర రాజ్యానికి రాజైన సిద్ధార్థనుడు మంత్రి గుణాఢ్యుని పిలిచి రాజ్య వ్యవహారాలు మాట్లాడుతూ… సమాజంలో మనుషుల మధ్య ఉన్న విలువల గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ‘మహా మంత్రి ఈ సమాజంలోని మనుషుల ప్రవర్తన, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, ఆస్తి, అంతస్తులను బట్టి సమాజం విలువనిస్తుంది. కానీ, నోరు, జీవం లేని బంగారం, వజ్రాల విలువ ఎక్కడైనా ఒకటేగా కదా..!’ అన్నాడు.
అందుకు మంత్రి ‘మహారాజా..! మీరనుకున్నట్లే బంగారం, వజ్రాలు విలువైనవే అయినా.. అవి ఎవరి వద్ద ఉంటాయో వారి స్థాయిని బట్టి వాటి విలువలు మారిపోవచ్చు’ అన్నాడు.
‘వాటిని అమ్మినా కొన్నా విలువ ఎక్కడైనా ఒకటి కాదంటారా..!’ అన్నాడు రాజు. ‘వాటి విలువను మోసంతో హెచ్చుతగ్గులు చేయగల మర్మయోగులు కొందరుంటారు రాజా..!’ అన్నాడు గుణాఢ్యుడు.
మరుసటి రోజు మంత్రి నలుగురు వ్యక్తుల్ని వెంట పెట్టుకుని మహారాజు వద్దకు తీసుకొచ్చాడు. రాజు ‘మంత్రివర్యా.. మీరు కోరినట్లు వజ్రాలు తెప్పించాను.. ఇవిగో’ అన్నాడు. నలుగురికి ఒక్కొక్కటి ఇచ్చి ఏం చేయాలో చెప్పి పంపేశాడు గుణాఢ్యుడు.
వారిలో మొదటివాడు ఆ ఊరి వజ్రాల వ్యాపారి దివోదాసు వద్దకు వెళ్లి వజ్రాన్ని అమ్మదలచానని చెప్పాడు. వజ్రాన్ని పరీక్షిస్తూనే దివోదాసు ‘మిమ్మల్ని చూస్తుంటే గొప్పవారి కొలువులోనో పనిచేస్తున్నట్లున్నారు’. అన్నాడు. ‘ఆ.. నేను మహారాజు కొలువులో పనిచేస్తున్నాను. నా పనితనానికి మెచ్చి ఈ వజ్రాన్ని నాకు బహుమతిగా రాజు గారు ఇచ్చారు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం. అందుకే అమ్మదలచాను.’ అన్నాడు.
‘ముందు మీరు కూర్చోండి.’ అంటూ మర్యాదలు చేసి పైకం ఇచ్చాడు.’ దాన్ని తీసుకుని వాడు వెళ్ళిపోయాడు.
వ్యాపారి లోలోపల ‘రెండు పద్యాలు చెబితే రాజు పొంగిపోయి ఇలాంటివి ఎన్నో ఇస్తాడు. దీని విలువ వీడికెలా తెలుస్తుంది.’ అని మనస్సులో అనుకుని ధనం ఇచ్చి పంపించేశాడు.
మూడోరోజు వ్యాపారి వద్దకు వచ్చిన మూడోవాడిని చూసి ‘నిన్ను చూస్తే రాజుగారి సైనికుడిలా ఉన్నావు.’ అన్నాడు. ‘అవును.. నేను రాజుగారి సైనికుడినే! ‘నా కొడుక్కి నామకరణం చేయాలి నాకు ధనం అవసరం. దాని విలువకు తగిన పైకం ఇప్పించండి’ అన్నాడు. వ్యాపారి మనసులో ‘వీడికి యుద్ధ వ్యూహాలు, పహారా తప్ప దీని విలువ వీడికేమి తెలుస్తుంది.’ అనుకుని ఇదే దీనికి వచ్చే పైకం అని చేతుల్లో పెట్టాడు. నాల్గోరోజు ఆఖరివాడు వ్యాపారి వద్దకు వెళ్లి.. ‘సామీ.. నా కూతురి పెళ్లిసేయాల. దీన్ని కొనుక్కొని పైకం ఇవ్వండి’ అన్నాడు. వ్యాపారి వాడిని ఎగాదిగా చూసి.. ‘ఇది నీకెక్కడిదని గట్టిగా అన్నాడు. ‘అయ్యా..! నన్ను దొంగగా అనుమానించడం ఏం బాగోలేదు.. నేను రాజుగారి వద్ద పనిచేస్తాను. నా పనితనానికి మెచ్చి రాజుగారు నాకు దీన్ని ఇచ్చాడు. కావాలంటే రాజు గారి దగ్గరకు పోదాం రా సామి..’ అన్నాడు. వ్యాపారి ‘ఆ.. సరే..సరే’ అంటూ కొంత పైకం ఇచ్చి పంపేశాడు.
తర్వాత ఆ నలుగురూ రాజమందిరానికి వెళ్లి జరిగినదంతా చెప్పారు. ‘వ్యాపారి మనుషుల వేషాలు, వారి వృత్తిని బట్టి విలువలు కట్టి మోసం చేసి హెచ్చు తగ్గులుగా పైకాన్ని ఇచ్చి పంపాడు. చూశారా ప్రభూ..! విలువలు ఎలా మారాయో..!’ అన్నాడు గుణాఢ్యుడు.
‘నిజమే మంత్రివర్యా..! అర్థమైంది. వెంటనే ఆ వ్యాపారిని పిలిపించండి’ అన్నాడు. ‘చిత్తం ప్రభు!’ అన్నాడు మంత్రి.
మరునాడు సభలోకి వచ్చిన వ్యాపారిని ఉద్దేశించి ‘ఆ నలుగురి వద్ద ఒకే వజ్రాలున్నా.. ఒక్కొక్కరికి ఒక్కో విలువ కట్టి ఇస్తారా..? అని రాజు ప్రశ్నించాడు. తాను చేసిన మోసం రాజుగారికి తెలిసిపోయిందని భయపడి ‘ప్రభూ.. నన్ను క్షమించండి’.. అని చేతులు జోడించి వేడుకున్నాడు దివోదాసు.
‘సమన్యాయం ఎరిగి వ్యాపారం చేస్తే నీ విలువ ఈ సమాజంలో పెరుగుతుంది. ఇకనైనా బుద్ధితెచ్చుకుని బతుకు..’ అని గద్దించాడు రాజు. ‘మంత్రిగారు..! మన రాజ్యంలోని ఇలాంటి మోసపూరిత వ్యాపారస్తులుగా ఉండేవారికి దేశ బహిష్కరణ, వ్యాపారానికి అనర్హులుగా అవుతారని దండోరా వేయించండి’ అనగానే సభ చప్పట్లతో మారుమోగింది. దివోదాసు మరోసారి క్షమించమని అడిగాడు.
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
అద్భుతమైన కథలు
ReplyDelete