Sunday, 31 December 2023



మానస మేకమవ్వావిధి మార్గము నేస్తము మోహనాకృతీ
జ్ఞానము నిత్యకళ్యాణము జ్ఞానిగ లక్ష్యము సేవలాకృతీ
ధ్యానము సర్వవిద్యామది దాతగనిత్యము విశ్వ సించుచున్
మౌనమనస్సు సాహాయము మోక్షము సత్యము యీశ్వరా సతీ.. 82

కాలము లీలలన్నీవిధి కామ్యమనస్సగు విశ్వమాయగా
జ్వాలల నీడలన్నీవిధి జాడ్యతపస్సగు తత్వ మార్పుగా
గాలుల సవ్వడి శ్వాసగు గాధ ఉషస్సగు విద్య నేర్పుగా
డోలల చందమామాగతి రోగనిరోధగు పార్వతీ పతీ  83

విధి విశ్వాసమొ, నామదీకృతమొ, నిన్వీక్షించ గానేమొ, నా 
వ్యధలందీర్పగనేమొ నీ చరణ సంప్రాప్యంబు సిద్ధించె, నా 
క్షుధలార్పన్వినుతింతు, నిల్తునిట దృక్కుల్నిల్పి, సద్భక్త ర 
క్ష ధురీణాంకిత దేవ, విశ్వజయ వాసా, పార్వతీశా, నమో॥  84

పలుకుల్ జేర్చిన జీవజాలములలో పాఠమ్ము రూపంబునన్
చిలుకెన్ మోహము దాహమార్గములలో చిన్మాయ తీరమ్ముగన్
విలువల్ మారెను విద్య వాహినిగనే విశ్వాస భావమ్ము గన్ 
తెలిపెన్ న్యాయము సర్వసృష్టి గనుటే తత్త్వమ్ము గా యీశ్వరా  85

జీవాత్మ ప్రపంచ నియమాలు

*Q:- మనుషులు దేవుడ్ని సులువుగా నమ్మరెందుకు? ఏ విధంగా ఉంటే దేవునికి ప్రీతిపాత్రులవతారు?*

*A:--1) గంటలకొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా,జనాన్ని,భగవంతుని మోసం చేయడానికి వేలాది రూపాయిల దానం కన్నా,సాధారణమైన నిజాయితీ గల కారుణాపూరితమైన,నిస్వార్ధమైన పని ఎంతో విలువైనది.*

*2) కొంతమంది దేవుడ్ని బాగా ప్రార్దించి కోరుకున్నది జరగక పోతే దేవుడ్ని నమ్మరు.  కానీ -----* *--ప్రార్ధనకు సమాధానం లభించలేదంటే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాదని అర్థం.*

*3) కొంతమంది అన్యాయం జరిగితే కూడా దేవుడ్ని నమ్మరు----*-----
*ఆ అన్యాయం మన కర్మ, అది మనల్ని పరీక్షించడానికో శిక్షణ ఇవ్వడానికో అది మనకు జరిగింది అని అర్థం చేసుకోవాలి.*

*4) కొంతమంది కి ఆరోగ్యం క్షీణించినపుడు ప్రార్ధిస్తారు---- *-----మనకు రోగం వచ్చిందంటే చేడు కర్మని చెల్లిస్తున్నామని గుర్తుంచుకోండి.*

*5) దేవుడు వున్నాడని మనకు ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. logical thinking తో మనిషి రుజువు అడుగుతాడు, కనిపించనంత మాత్రాన సత్యం లేదని కాదు, ----- చూడలేని దానిని నమ్మడమే పరీక్ష.*

*6) దేవుడు మోసాల్ని అన్యాయాల్ని ఆపడెందుకు అని అనుకుంటారు. ఆయన మనకు సంకల్ప స్వేచ్ఛని ఇచ్చాడు, అది కొంత మంది చేడు పనులకు ఉపయోగించు కుంటున్నారు.*

*7) ప్రతియుగం లో చెడు పెరిగినపుడు ఒక ఉన్నత సదాత్మ ను మార్గదర్సునిగా ఉండమని భూమి పైకి పంపిస్తాడు, ఆ విధంగా వచ్చిన అంశాత్మలే మనమనుకుంటున్న దేవుళ్ళు.*

*కానీ వారు జ్ఞానాన్ని తెలుసుకుని ఎదిగిన వారు మాత్రమే, వారు దేవుని అంశలు మాత్రమే, వారిని పూర్ణాత్మ అనవచ్చు, వారిలోను , అన్ని అంశాత్మలలోను ఒకే చైతన్యం ఉంది. ఒక అంశాత్మ, జ్ఞానం తెలుసుకున్న తర్వాత పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. ఈ భూమి మీద జీవించే ప్రతి ఆత్మకు ఆ శక్తి ఉంది.*
🌹 🌹 🌹 🌹 🌹

 



*భగవంతుని లీలలు* 02--01--2022 daily Stories from pranjali prabha 

*వీధులు ఊడ్చేవాడు..... ఒకరోజు దేవుడితో మొర పెట్టుకున్నాడు.*

 *"రోజూ హాయిగా నీవు పూజలందుకుంటూ ఉంటావు.*
*నా బతుకు చూడు. ఎంత కష్టమో.*

*ఒక్క రోజు... ఒకే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"*

*అని సవాలు విసిరాడు.* 
*దేవుడు విని.... 'సరే' నన్నాడు.* 

*"అయితే ఒక్క షరతు. ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు.*
*నోరు మెదపకూడదు."అన్నాడు దేవుడు.*
*"సరే" అన్నాడు మనోడు.* 

*తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.* 

*కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.*
*"దేవా ... నేను కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు"* 
*అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు.* 
*అప్పుడు జేబులోని పర్సు కింద పడిపోయింది.*
*అతను చూడకుండా వెళ్లిపోయాడు.* 

*మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.*
*కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.*

*ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.*
*"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను.* *దయచూడు తండ్రీ"* 
*అంటూ మోకరిల్లాడు.*
*కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.*
*"ఇలా దయ చూపించావా తండ్రీ"*
*అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.*

*"ఒరేయ్ దొంగా.... "*
*అని అరుద్దామనుకున్నాడు మనోడు.*
*కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.*

*ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.*
*"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ"*
*అన్నాడు.*  
*అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చి...*
*"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.*

*ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.*
 *"ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు."*
*అని అరిచేశాడు.*

*దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.*

*ఇచ్చిన ఒక్క రోజు గడువు అయి పోవడంతో...* 
*సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.*
*దేవుడు కూడా తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.*  

*"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాలని. ఒక దోషిని

ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 (కల్పవృక్షవాహనం) 🎈


🍃🌹బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉదయం శ్రీదేవి - భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు. కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, లతలు - ఇలా: వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో, కళాకౌశలం ఉట్టిపడేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు.

🍃🌹ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం. సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం. క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె అంటే దేవతలు, రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు: అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది.

🍃🌹ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఆ వాహనాన్ని అధివేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగా ఇలా వర్ణించాడు -

గౌతము భార్యాపాలిటి కామధేను వితడు,
ధాతల కౌశికుపాలి కల్పవృక్షము,
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు,
ఈతడు దాసులపాలి ఇహపరదైవము ||


🍃🌹కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను యీడేర్చడం కోసం - శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు.

🍃🌹వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం. చెట్టు తొర్రలు, బొరియలు, వ్రేళ్ళు, శాఖలు - సమస్తం పక్షులకు, చీమలకు, పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి. చెట్లు మానవజాతికి ఫల, పుష్పాదులను ప్రసాదించడమే గాకుండా - జీవం కోల్పోయిన తర్వాత కూడా కలప నిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి. అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి.

🍃🌹అదేవిధంగా, కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే "పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు" అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు.


🌻 సర్వభూపాలవాహనం 🌻


🍃🌹బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి - భూదేవిలతో సర్వభూపాలవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మేలిమి బంగారంతో, అచ్చెరువొందే శిల్పకళా సోయగంతో, ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు. అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం - వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది.

🍃🌹"సర్వభూపాల" అంటే "రాజులందరూ" అని అర్థం. దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు. విష్ణు అంశ లేనిదే రాజభోగం లభించదు. "రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే" అనే వేదస్మృతి ననుసరించి, శ్రీహరి రాజాధిరాజు. మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు. లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై, వారి కనుసన్నల్లో వెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది.

🍃🌹సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి. వాటి సహాయంతో, దుష్టశిక్షణ - శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే, వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి. సర్వభూపాలవాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుణికిపుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది.

🍃🌹ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకొని, శాశ్వత ఫలితాన్ని పొందుతారు. ఇతిహాసాల్లో చెప్పబడినట్లు - సాటి నరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు. రాజు కోపిస్తే, దేవుడు రక్షిస్తాడు. అంటే, దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకేమాత్రం హాని తలపెట్ట లేరు. ఈ వాహనం దర్శించడం ద్వారా, దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు.


🌻 మోహిని అవతారం 🌻


🍃🌹ఐదవ నాటి ఉదయం శ్రీవేంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి, రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకి పై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు. మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే - మిగతా అన్ని వాహనాలు వాహనమండపం నుండి మొదలైతే, ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

🍃🌹శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది - మొదటగా, క్షీరసాగరమధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు.

🍃🌹విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి - శ్రీహరి జగన్మోహన రూపంతో సమ్మోహింప జేసి ఆ దానవుడి పీచమణుస్తాడు. మూడవసారి - దారుకావనం నందు జగన్మోహిని రూపంలో నున్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది.

🍃🌹మరోసారి, భోళాశంకరుడిచ్చిన వరగర్వంతో
మోహిని అవతారంలో, మలయప్పస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింప బడతాయి. మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టు చీర, రవిక, కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య చంద్ర - సావేరిలను అలంకరిస్తారు. స్వామివారికి వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు.

🍃🌹సాధారణంగా, వరదభంగిమలో ఉండే స్వామివారి కుడి చెయ్యి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుక తోనూ, మరికొన్ని సార్లు అభయ హస్తంగానూ దర్శనమిస్తుంది.

🍃🌹జగత్తంతా మాయా మోహానికి లొంగబడి ఉంటుంది. తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. మాయా పూరితమైన ఈ ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేశుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు.

🍃🌹"బలగర్వితులు, అహంకారులు కార్య ఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించిన వారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరనే" సందేశం మోహిని అవతారం ద్వారా ప్రకటిత మవుతుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారములు చేసేది. ఏకపాదుడు వేదవేత్త కావడంవల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేస్తున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.
తండ్రి శాపం :-
ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు. అంతే కాదు నిద్రాహారము లేకుండా శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టినాడు. తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని, వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.
తండ్రికి శిక్ష :-
సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి 'నాథా నేయి ,ధాన్యము, నూనె తెండనీ చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లగా.ఆ సమయమున అచ్చట ఒక పందెము జరుగుచుండెను. వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదనని, ఓడినవారు జలమజ్జితులై వుండవలెనని విన్నాడు ఏకపాదుడు . వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయినాడు.
అష్టావక్రుడు జన్మించుట :-
సుజాత కుమారుని ప్రసవించింది. పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నకారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు శ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు, శ్వేతకేతు బాల్యము నుండి ఉద్ధాలకమహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగించాడు.
అష్టావక్రుని వాదన :-
కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జలమజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని నిశ్చయము చేసుకొని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని జనక రాజు మందిరద్వారము కడ చేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు. మారు మాట్లాడక ద్వారపాలకులు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు. బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు. అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తిసామర్థ్యాలు తెలియజేశాడు. జనకుడు వాదనకు అంగీకరించాడు. వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి. అనేక విషయాలపై వాదన సాగుతుంది. చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడు ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు 'మహాజ్ఞానీ అజ్ఞాపింపుమనీ అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు
తండ్రిని విడిపించుట :-
ఇక్కడ ఒక రహస్యమున్నది. వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు. వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు. ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించాడు. అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించింది. ఏకపాదుని, అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు. అద్వైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.
అష్టావక్రుని శాపవిముక్తి :-
తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు. పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు. నది యందు సాన్నం చేయించి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు. ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగానే తండ్రి కుమారునకు పెళ్ళి చేయతలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు. కుమారుడు అంగీకారము తెలిపి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభను
వివాహము చేసికొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సునందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. పుత్రులను పొందాడు.
గోపికల పూర్వ వృత్తాంతం  :-
ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు. అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు. మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి పరమపదించాడు. అనంతరం అతడు గోలోకమునకు పోయి మోక్షము పొందాడు.
అష్టావక్రుని పూర్వజన్మ :-
పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు . దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగెను. అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగెను. ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు. అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించింది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడా తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయింది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత లేక అష్టావక్రగీత

***

*👌*ఆస్తి పాస్తులు, డబ్బు డాబాలు, బంగారం భూములు పంచిన వాడు మాత్రమేనా తండ్రంటే?**

         _**ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.*_


       _**కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.*_


     _**ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.*_


       _**ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.*_


      _**బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.*_


       _**వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.*_

 

       _**ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.*_


       _**మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.*_


       _**వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.*_


        _**సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.*_


       _**నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.*_


       _**ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..*_


         _**ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.*_


        _**మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది. మరి  మీకు తెలిసిన వారికి ఈ కథను పంపండి. ఏ ఒక్కరు మారినా మీ జన్మధన్యమే కదా.. చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "...*_


     _**సర్వే జనా సుఖినోభవంతు.**_


596.. వేదశ్రీ..ర జ ర భ స గ..9


 రామచంద్ర భూమి రాజ్యపాలనయేలే 

 క్షేమమే మనస్సు క్షేమమే తులచేలే 

స్వామసుందరుండు సామ్యమౌ సుఖమిచ్చే

ప్రేమతోను కామ్య ప్రీతిగా విధి దేవీ


597.. వేలా.. న య ర ర గ..7


కళలను తీర్చే కామ్య తత్త్వమ్ముయేలే

పలుకుల మాయే ప్రేమతత్త్వమ్ముయేలే

పిలుపుల వల్లే ప్రీతి తత్త్వమ్ముయేలే

తలపుల వల్లే తృప్తి తత్త్వమ్ము దేవీ


598.. వేల్లిత.. స స స స మ గ..7

వలెపే చిలికే వయసే కదిలే మాధుర్యమ్మున్ 

మలుపే జరిగే మనసే తెలిపే సౌందర్యమ్మున్

కులుకే సొగసే సుఖమైన విదీ ప్రాబల్యమ్మున్

పలుకే తెలిపే పరువమ్ము గనేలే శ్రీదేవీ


599..వేళ్ళితా.. స స న న మ గ..8


ఎవరింటనవారు యెరుకగన యే కత్వమ్మున్

సవరించగవారు సమయమును సంతృప్తీగన్

నవరంగములేను నటనలగు విశ్వాసమ్మున్

నవరత్నములౌను నయన కళలే శ్రీదేవీ 


600.. వేశ్వా రత్న.. తన తన తన గగ..13


సర్వజ్ఞతగల సర్వమ్ము గనుట సందర్భమగట లక్ష్మీ

నిర్వాహముగను నిర్మాణ మనుట విశ్వమ్ము యనుట లక్ష్మీ

పర్వంబు గనుట సంతోష మగుట పాఠమ్ము తెలుపు లక్ష్మీ

గర్వమ్ము విడిచి నిన్నూ మనసున గొల్చేదను దేవీ

Friday, 29 December 2023




నీతి కోరి ఒప్పు చేయు నిష్ట కాగ వోర్పుతో

చేత నైన ఒప్పు మాట చింత మాపు నేర్పుతో

భీతి చెంద ముప్పు వచ్చె బేల జూపు మార్పుతో

ఖ్యాతి నెంచ గల్గు బుద్ది కర్మ వల్ల యీశ్వరా            82


నమ్మి నెంచగల్గు సాధనే విదీ మదీయ మౌ

బిమ్ముగా మహేశ్వరీ విచిత్రమే వినోద మౌ

ఇమ్ము శాంతి సహాయమ్ము యీశ్వరీ విధానమౌ

బి మ్మహీన రక్ష ధర్మ శీల విద్య యీశ్వరా                 83


కన్ను కానకే కధళ్ళు కాలమాయ దేనికో

మిన్ను నమ్మియే సహాయ మిధ్యయో దేనికో

మన్ను తిన్న మాట బుద్ధిమంద హాస మేలనో

వెన్నెలమ్మ యున్నతేను వేద తీర్పు యీశ్వరా          84


చిన్న విత్తుఁ దీసి మన్ను చిత్తు చేయు సందడే 

కన్న వారి వేడి తీరు కాయ కష్టమే సుధీ 

విన్న మౌన బుద్ధి మేలు విశ్వ మాయ వెల్గుగా 

కన్న సృష్టి చిత్రమే సకామ బుద్ధి యీశ్వరా              85


సీస పద్యము


ఢమఢమ శబ్దము డమరీకము కదల

నటరాజు నర్తించే నవ్య రీత

ఆనంద తాండవ  నర్ధంబు హరుడాడె

మూడుకన్నుల వేల్పు మదన హారి

తన్మయాభినయమై తత్త్వము ధ్యానమై

సకలశోకనివార శ్యామకంఠ

పార్వతీ వల్లభా పాఠము తెలుపుమా

పాప వినాశుని పాద పూజ


వినయమునున్న నవీన విహారి కవిత్వ శివా 

పనితనమున్న నుపాయ విధానము భక్తి హరా 

అణుకువయున్న శుభంకర వెల్పగు భాగ్యధరా

మనమనసన్న సురక్ష సహాయ సమర్ధ  శివా       86


మధువు కోరిసమస్య తెచ్చుట మందభాగ్యము యేలనో

వధువు చెంతసుఖమ్ము పంచక వెర్రి వేషము లేలనో

అదుపులేక వితండ వాదపు యాస లన్నియు యేలనో

పొదుపుయంటు సహాయమేయని పోరుచేమదియీశ్వరా.. 87

=--=

ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 73 (కల్పవృక్షవాహనం) 🎈


🍃🌹బ్రహ్మోత్సవాలలో నాల్గవరోజు ఉదయం శ్రీదేవి - భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, కల్పవృక్షవాహనంపై విహరిస్తూ భక్తులను అలరిస్తారు. కాండము, శాఖలు, పత్రాలు, పుష్పాలు, లతలు - ఇలా: వృక్షభాగాలన్నింటినీ మేలిమి బంగారంతో, కళాకౌశలం ఉట్టిపడేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతారు.

🍃🌹ప్రకృతికి శోభనిచ్చేది వృక్షం. సృష్టిలోని వృక్షాలన్నింటికీ మేటి కల్పవృక్షం. క్షీరసాగరమధనంలో ఉద్భవించిన ఈ కల్పవృక్షం మనోవాంఛా ఫలాలను సిద్ధిస్తుంది. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చువారి కోర్కులు నీనెడు వేల్పుమాను పాలివెల్లి బుట్టె అంటే దేవతలు, రాక్షసులు క్షీరసముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్నప్పుడు: అన్ని ఋతువులలోనూ పచ్చగా నుండి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ఉద్భవించింది.

🍃🌹ఆది ఐహిక సుఖాలను మాత్రమే అందిస్తుంది. కానీ, ఆ వాహనాన్ని అధివేష్ఠించి ఉన్న శ్రీనివాసుడు ఐహిక, ఆముష్మిక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. అన్నమయ్య రామావతారుడైన శ్రీమహావిష్ణువును కోర్కెలు తీర్చే కల్పవృక్షము, కామధేనువు, చింతామణిగా ఇలా వర్ణించాడు -

గౌతము భార్యాపాలిటి కామధేను వితడు,
ధాతల కౌశికుపాలి కల్పవృక్షము,
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు,
ఈతడు దాసులపాలి ఇహపరదైవము ||


🍃🌹కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సత్యభామ కోర్కె తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భువికి తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు కలియుగంలో ఆశ్రిత భక్తజన వాంఛితాలను యీడేర్చడం కోసం - శ్రీవారు కల్పవృక్షవాహనంపై విహరిస్తున్నారు.

🍃🌹వృక్షం అనంతమైన జీవజాలానికి ఆలవాలం. చెట్టు తొర్రలు, బొరియలు, వ్రేళ్ళు, శాఖలు - సమస్తం పక్షులకు, చీమలకు, పాములకు ఇంకా అనేక రకాల క్రిమికీటకాలకు ఆవాసం కల్పిస్తాయి. చెట్లు మానవజాతికి ఫల, పుష్పాదులను ప్రసాదించడమే గాకుండా - జీవం కోల్పోయిన తర్వాత కూడా కలప నిచ్చి శాశ్వత నివాసం కల్పించడానికి తోడ్పడతాయి. అనేక ఔషధాలు చెట్ల నుండి తయారవుతాయి.

🍃🌹అదేవిధంగా, కల్పవృక్షవాహనంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటే "పండిన పెరటి కల్పము వాస్తవ్యుండు" అన్నట్లు స్వామి వారు కల్పవృక్షంలా భక్తుల కోర్కెలను కాదనకుండా తీర్చుతారు.


🌻 సర్వభూపాలవాహనం 🌻


🍃🌹బ్రహ్మోత్సవాల్లో నాల్గవనాటి రాత్రి మలయప్ప స్వామి శ్రీదేవి - భూదేవిలతో సర్వభూపాలవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తారు. మేలిమి బంగారంతో, అచ్చెరువొందే శిల్పకళా సోయగంతో, ఇంద్రభవనాన్ని తలపించే రాజప్రాసాదాన్ని ఈ వాహనంపై ఆవిష్కరిస్తారు. అన్ని వాహనాల్లో కెల్లా అత్యంత బరువైన ఈ సర్వభూపాల వాహనం - వెయ్యి కిలోలకు పైగా ఉంటుంది.

🍃🌹"సర్వభూపాల" అంటే "రాజులందరూ" అని అర్థం. దిక్కులను కాచే అష్టదిక్పాలకులు కూడా ఈ కోవకే చెందుతారు. విష్ణు అంశ లేనిదే రాజభోగం లభించదు. "రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే" అనే వేదస్మృతి ననుసరించి, శ్రీహరి రాజాధిరాజు. మిగిలిన రాజులందరూ శ్రీనివాసుణ్ణి తమ భుజస్కంధాలపై మోస్తూ ఆదరిస్తున్నారు. లోకపాలకులందరూ శ్రీవారి పాదాక్రాంతులై, వారి కనుసన్నల్లో వెలుగుతూ ఉన్నట్లుగా ఈ ఉత్సవం ద్వారా మనకు గోచరిస్తుంది.

🍃🌹సమస్తలోకాలలో ఉన్న రాజులందరికీ విశేషమైన అధికారాలు ఉంటాయి. వాటి సహాయంతో, దుష్టశిక్షణ - శిష్టరక్షణ గావిస్తూ మనోరంజకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటారు. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే, వారికి శ్రీవారి పట్ల అపరిమితమైన భయభక్తులు కలిగి ఉండాలి. సర్వభూపాలవాహన వీక్షణం ద్వారా రాజులందరూ ఈ సద్గుణాలను పుణికిపుచ్చుకొనటం వల్ల పరిపాలన సజావుగా సాగుతుంది.

🍃🌹ఈ సేవను దర్శించడం ద్వారా భక్తులు తమ అహంకారం నశింపజేసుకొని, శాశ్వత ఫలితాన్ని పొందుతారు. ఇతిహాసాల్లో చెప్పబడినట్లు - సాటి నరుడు కోపిస్తే రాజు రక్షిస్తాడు. రాజు కోపిస్తే, దేవుడు రక్షిస్తాడు. అంటే, దేవుని కృప ఉంటే వేరెవ్వరూ మనకేమాత్రం హాని తలపెట్ట లేరు. ఈ వాహనం దర్శించడం ద్వారా, దేవదేవుని కృపను సంపూర్ణంగా పొందవచ్చు.


🌻 మోహిని అవతారం 🌻


🍃🌹ఐదవ నాటి ఉదయం శ్రీవేంకటేశ్వరుడు మోహిని రూపం ధరించి, రాక్షసులను మోహింప చేసిన జగన్మోహినిగా బంగారుపల్లకిలో సోయగాలు ఒలకబోస్తూ దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడు దంతపు పల్లకి పై స్వామివారిని అనుసరిస్తూ ఊరేగుతాడు. మోహిని అవతారం ప్రత్యేకత ఏమిటంటే - మిగతా అన్ని వాహనాలు వాహనమండపం నుండి మొదలైతే, ఈ వాహనం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.

🍃🌹శ్రీ మహావిష్ణువు యొక్క మోహిని అవతార ప్రసక్తి పురాణాల్లో అనేకసార్లు గోచరిస్తుంది - మొదటగా, క్షీరసాగరమధనంలో శ్రీహరి జగన్మోహిని వేషధారియై రాక్షసులను తన ముగ్ధమోహన అవతారంతో మైమరిపింపజేసి అమృతభాండాన్ని అమరులకు అందజేస్తాడు.

🍃🌹విర్రవీగుతూ ముల్లోకాలలో కల్లోలం సృష్టించిన భస్మాసురుణ్ణి - శ్రీహరి జగన్మోహన రూపంతో సమ్మోహింప జేసి ఆ దానవుడి పీచమణుస్తాడు. మూడవసారి - దారుకావనం నందు జగన్మోహిని రూపంలో నున్న విష్ణువును చూసి మోహించిన శివునితో జరిగిన సంగమం వల్ల శాస్తా ఉద్భవం జరిగింది.

🍃🌹మరోసారి, భోళాశంకరుడిచ్చిన వరగర్వంతో
మోహిని అవతారంలో, మలయప్పస్వామి కూర్చున్న భంగిమలో కనిపిస్తారు. స్త్రీలు ధరించే సర్వాభరణాలు శ్రీవారికి అలంకరింప బడతాయి. మోహిని వేషధారణలో ఉన్న మలయప్ప స్వామికి పట్టు చీర, రవిక, కిరీటం స్థానంలో రత్న ఖచ్చితమైన సూర్య చంద్ర - సావేరిలను అలంకరిస్తారు. స్వామివారికి వజ్రపు ముక్కుపుడక, ముత్యాల బులాకీని సైతం ధరింపజేస్తారు.

🍃🌹సాధారణంగా, వరదభంగిమలో ఉండే స్వామివారి కుడి చెయ్యి మోహిని అలంకరణలో కొన్నిసార్లు రాచిలుక తోనూ, మరికొన్ని సార్లు అభయ హస్తంగానూ దర్శనమిస్తుంది.

🍃🌹జగత్తంతా మాయా మోహానికి లొంగబడి ఉంటుంది. తన భక్తులు కానివారు మాయాధీనం కాక తప్పదని గీతలో శ్రీ కృష్ణ భగవానుడు సెలవిచ్చారు. మాయా పూరితమైన ఈ ప్రపంచం నుండి తన భక్తులను రక్షించడానికి తిరుమలేశుడు మోహిని వేషధారియై తిరువీధుల్లో దర్శనమిస్తున్నాడు.

🍃🌹"బలగర్వితులు, అహంకారులు కార్య ఫలితాన్ని పొందలేరని, వినయవిధేయతలతో భగవంతుని ఆశ్రయించిన వారే కృషి ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలరనే" సందేశం మోహిని అవతారం ద్వారా ప్రకటిత మవుతుంది.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 ----- శుభోదయం ----- సుభాషితాలు -------  


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"


భావము:

శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.(కుంతీ స్తుతి)


కవిజనంబుల కుపద్రవము దాల్చుట ముప్పు  బలవంతునితో  వైరపడుట  ముప్పు 

దేశాధిపతిని నిందించ బూనుట ముప్పు   గ్రామాధికారితో కక్ష ముప్పు    

చెడి చుట్టమింటికి  జేరబోవుట ముప్పు  చెడుగులతో బొందుచేత  ముప్పు 

భార్యకు జనువిచ్చి పాతిసేయుట ముప్పు  పదిమంది కాదన్న పనులు ముప్పు 

        తే :--మొండికొయ్యలమాట నమ్ముకొని బుధులు 

                పాడుతంటాల పనికడ్డపడుట ముప్పు 

                 భూరిమయవాస  కోలంకపురనివాస

                మదన గోపాల కోలంక పూరి నివాస!


పదునా ల్గేలె మహాయుగంబు లొక భూపాలుండు, చెల్లించెన

య్యుదయాస్తాచలనసంధి నాజ్ఞ నొకడాయుష్మంతుడై వీరి య

భ్యుదయంబెవ్వరు చెప్పగా వినరొ! అల్పుల్మత్తులై యేల చ

చ్చెదరో రాజుల మంచు నక్కట కటా శ్రీ కాళహస్తీశ్వరా!     ౩౮


శంకరా! ఒక రాజు పద్నాలుగు మహాయుగములు పాలించెను. (మహాయుగమనగా కృత త్రేత ద్వాపర కలియుగములు నాలుగూ కలిసినది.) మరొక రాజు ఉదయగిరి నుండి అస్తగిరి వరకు ఉన్న భూమిని నిరాఘాటంగా పాలించాడు. ఇటువంటి మహారాజుల చరిత్రలను ఈ అల్పులైన రాజులు వినలేదా? తాము కూడా రాజులమే అని ఎలా గర్వపడుతున్నారో!


అలఘ గుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొకడిష్టుడై తనున్ వలచి 

యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా

తెలిసి కుచేలుడొక్కని యందె౦ దటుకులు తనకిచ్చినన్ మహా 

ఫలదుడు కృష్ణు డత్యధిక  భాగ్యము లాతనికీడే భాస్కరా!


తా:--గుణవంతునకు తన స్నేహితుడైన వాడు ప్రేమతో లేశమైన పదార్థము నిచ్చిననూ, 

అతనికి గొప్ప మేలు కలుగజేయును. అని ఈ గాథ తెలియజేయుచున్నదని శతకకర్త

చెప్పుచున్నాడు.. 

------------------------------------------------------ 

ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లేదు

ఈ కడ భూలోక మందు యెందు లేదు

పైకొని ఆశ లెల్ల పారద్రోలి వెదికితే

శ్రీకాంతు పోగిడేటి చిత్తములో నున్నది


తా:-- ముక్తి ఎక్కడో ఆకాశము లోనో,పాతాళం లోనో భూమి పైననో లేదు.ఆశలవలయం లో చిక్కుకో కుండా

ఆ శ్రీకాంతుని స్మరించుకునే మనసులోనే మోక్షము వుండి.మనో నైర్మల్యమే ముక్తికి దారి.


రసవాదంబులు పెక్కు నేర్చిన, మహా రాజేంద్రులన్

వెసతో మంత్రములుచ్చరించిన, మహా విద్యల్ ప్రసంగించినన్

అసహాయంబగు శూరత౦ గనిన, దా నంభోధి లంఘించినన్

నొసటన్ వ్రాసిన వ్రాలు కనగలడా?నూరేండ్లు చింతించినన్


భావము:--రసవాదములు నేర్చిననూ, రాజులదగ్గర మంత్రములు చదివిననూ,మహావిద్యలు ప్రదర్శించిననూ,అసహాయ శూరత చూపించిననూ, సముద్రము లఘించిననూ,నూరేండ్లు చింతించిననూ  బ్రహ్మ నుదుటవ్రాసినవ్రాతను చూడగలడా?


సిరిపొయిన సమయంబున 

ధరలో నెవ్వారు వాని దలపరు సుమ్మీ

సరి, రాత్రిబోవ జంద్రుని

నరులేక్రియ జూతురయ్య  నాథా! కృష్ణా!


నీచ మావమాన మలినంబు నిష్ఠురంబుఁ

నైన పరసంపదకు నాస నొందువాడు

కాలకూట విషాక్తమౌ గందరసము

నాలాడికొనువానితో సాటియగును గాదె


ఇల్లు భుజంగమైన, దన యిష్టుడు వైరికి మర్మమిచ్చినన్

గల్ల నిజంబు నేర్పరుప గానక భూపతి జంప వచ్చినన్

దల్లి విషంబు బెట్టినను, దండ్రి ధనాఢ్యుల కమ్మ జూపినన్

వల్లభు డొల్ల కున్న, నిక వారల కెవ్వరు దిక్కు?భైరవా!


ఇల్లే పామైన, తన సొంతవారే శత్రువుకు తన రహస్యము శత్రువులకు  చెప్పిన, ఏది సత్యము, ఏదసత్యమని విచారించకుండా రాజే చంప జూచిన, తల్లియే విషము పెట్టిన, తండ్రి ధనవంతులకు తనను అమ్మజూపిన, భర్త తనను యిష్టపడకున్న నిక వారందరికీ దిక్కెవరు భైరవా?


 మనసులోన నున్న మమతలన్నియు గోసి

దృఢము చేసి మనసు తేటపరచి

ఘటము నిల్పు వాడు ఘనతర యోగిరా

విశ్వదాభిరామ వినురవేమ!


సిరి తా వచ్చిన వచ్చును

నారికేళ సలిలము భంగిన్

సిరి దాపోయిన పోవును

కరిమ్రింగిన వెలగ పండు కరిణిని సుమతీ!


అర్థము:- సిరి అంటే ధనము వచ్చేటప్పుడు కొబ్బరికాయలో నీళ్ళుతెలియకుండా ఎలా వచ్చాయో అలాగే వస్తుంది.పోయేటప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండు లాగా వెళ్ళిపోతుంది.ఏనుగు వెలగ పండు మింగితే దానిలోని గుజ్జును పండు పగల కొట్ట కుండానే తినేస్తుందట.దాని లద్దేలో డొల్ల మాత్రమె బయటకు వస్తుందట సలిలము అంటే నీరు కరిణి=విధము


తరిగిపోనట్టి సిరివిగా పరిఢవిల్లు

పద్యమన్నది మాకు పాలసంద్రంబులో

పుట్టిన పీయూష పూర్ణఘటము

పద్యమన్నది మాకు పారాయణాస్పద

మహితమౌ గాయత్రి మంత్రం జపము

పద్యమన్నది మాకు పాతాళమందున్న

కడు పవిత్ర గంగా జలమ్ము  


తన గుణములు గొప్పవంచు

తలపోయును ప్రతియొక్కడు

లోకము గుర్తించదంచు

లోలోన వ్యధ చెందును.


తనయందము రంభ కైన

తలవంపను  కొనును తన్వి

పరుని  పత్ని వైపు చూచు

పతి తత్వము నెరుగలేదు.  (మిరియాల రామకృష్ణ )


స్థాన విశేష మాత్రమున తామర పాకున నీటి బొట్ట నిన్

పూనిక మౌక్తికం బనుచు పోల్చిన మాత్రాన యింత గర్వమా

మానవతీ శిరోమణుల మాలికలందున గూర్పగ వత్తువో

కానుక లియ్యవత్తువొ వికాసము నిత్తువొ విలవ దెత్తువొ


అర్థము:-- నీవున్న స్థానాన్ని బట్టి నిన్ను ముత్యము లాగ మెరిసి పోతున్నావు అని పొగడి నంత మాత్రమున నీవు గర్వముతో

మిడిసి పడుతున్నావు. అందమైన ఆడవాళ్ళ .మెడలోని హరములోనికి పనికి వస్తావా?కానుకలాగా ఇచ్చేందుకు పనికి వస్తావా?వికాసన్నిస్తావా?నీకు విలువమైనా వుందా?అంటే పదవిలో వున్న నాయకుల గురించి ఈ చురక.నీవు వున్న స్థానాన్ని బట్టి నిన్నుఅందరూ పొగడుతున్నారు కానీ పదవి లేకుంటే నీకు విలువ లేదు.అంత మిడిసి పడకు అని కవి చెప్పుచున్నాడు.


తొలినాడు కలకండ పలుకులంబోని, ధూర్జటి సుకవి

పలుకులంబోని దాహమ్ము, చూచెడు వరకాగ రాని

యలనటై నిను వచ్చి చూచి యప్పటి కారియు మరల

నలసట యగుచు శృఈ కాళహస్తీశ్వరా! మహాదేవ!


అతో విముక్టై  ప్రయతేత విద్వాన్ 

సంన్యస్త  బాహ్యార్థ సుఖస్ప్రుహస్సన్ 

సంతం మహాంతం సముపేత్య దేశికం 

తేనో పదిషార్థసమాహితాత్మా 


తా:-- విద్వా౦సుడైనవాడు బాహిరములైన భోగములమీద యచ్ఛను వీడవలెను. సాధు

పుంగవుడైన గురుదేవు నాశ్రయింపవలయును. అతని చేత నుపదేశింపబడిన విషయమందు సమాహితమైన చిత్తముతో ప్రవర్తిస్తూ ముక్తి కొరకు ప్రయత్నము చేయుచుండవలెను.

***

విశ్వహిత కాంక్ష

మనిషి పుట్టుక ఒక వరం. ఎన్నో జన్మల పుణ్య విశేషంతో మనిషి వివేకవంతు డిగా ఈ పుడమిపై జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఉండే శైశవదశలో అతడిలో ఏ వికారాలూ ఉండవు. భగవంతుడిలా మాయకు అతీతుడిగా, ఆనందంలో మునిగి తేలతాడు. శైశవదశ తరవాత బాల్యంలోకి అడుగు పెట్టి, విద్యాబుద్ధులు నేర్చుకొం టాడు. తదనంతరం యౌవనదశకు చేరుకుంటాడు. ఆ దశలో మనిషికి ఏర్పడే శక్తియుక్తులు, లోకజ్ఞానం కారణంగా రాగద్వేషాలు, శత్రుత్వమిత్రత్వాలు, స్వార్ధ పరమార్థాలు సంక్రమిస్తాయి. అవి వృద్ధాప్యందాకా కొనసాగుతాయి. జన సత్యాలన్నీ ఉడిగిపోయిన ముసలితనంలో మనిషి క్రమంగా నిశ్చేష్టుడిగా కాలం గడుపుతాడు. చివరికి మరణ చక్రంలోకి చేరుకుంటాడు.

మనిషి తన నూరేళ్ల జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మంచి మార్గాలు.. న్నాయి. మనిషి తన స్వశక్తితో దేన్నైనా సాధించగలుగుతాడు. అసాధ్యాలను సుసా ధ్యాలు చేసుకుంటాడు. ఎవరూ ఊహించని అద్భుత చరిత్రలను సృష్టిస్తాడు. మనిషి తలచుకుంటే సంభవం కాని పనులు లేవు. మనిషికి ఆశలు మాత్రమే ఉంటే చాలదు. ఆశలను సఫలీకృతం చేసుకోగలిగే కృషి తోడు కావాలి.

***

నిరంతరం

ప్రయత్నం చేసే మనిషికి దైవం

కూడా తోడవుతుందని పెద్దల మాట. మనిషి తన జీవితావసరాలు తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తాడు. ఆపారధనాన్ని కూడబెడ తాడు. ఆస్తులను పెంచుకుంటాడు. తాను, తన కుటుంబం ఏ లోటూ లేకుండా ఉండాలని తపిస్తాడు. మనిషి తన సొంత లాభం మాత్రమే చూసుకొంటే జీవితంలో సంతృప్తిని సంపూర్ణంగా పొంద లేదు. తన చుట్టూ ఉన్న ప్రపం చాన్నీ మనిషి చూడాలి. తానూ బతకాలి, అందరూ బతకాలి అని. ఎప్పుడూ భావిస్తూ ఉండాలి.

మహాత్యులు పరోపకారంతో చరి త్రలో నిలిచిపోయారు. వారి చరి త్రలు స్ఫూర్తిదాయకాలు, వారు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. 'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంపూర్ణారోగ్యంతో ఉండాలి. అందరూ ఎల్లవేళలా మంచినే చూడాలి. ఏ ఒక్కరూ దుఃఖించరాదు' అని ప్రాచీనుల సదుపదేశం అందరి సుఖాన్ని కోరే మనిషి తాను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సహిస్తాడు. సహనం ఒక ఆభరణం, అందరి ఆరోగ్యాన్ని ఆశించే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఎవ్వరికీ హాని కలగని రీతిలో పరిసరాలను కాపాడ తాడు అందరూ మంచినే చూడాలని కోరుకుంటే మనిషి తాను మొదట మంచివాడు. కావాలి. తాను మారితేనే లోకమంతా మారుతుందని గ్రహించాలి.

విశ్వక్షేమమే మనిషికి దక్ష. విశ్వమంతా అల్లకల్లోలం అయితే, తాను ఒక్కడు మాత్రమే బతికి బట్టకట్టగలడా? లోకంలో కనిపించే సృష్టి అంతా పరోపకారం కోసమే. ప్రపంచం అందరి యోగక్షేమాల కోసమే తప్ప కొందరి లాభాల కోసం | ఏర్పడలేదు. విశ్వం అంతా ప్రకృతి ప్రసాదించిన దివ్యఫలం. దాన్ని అమృత ఫలంలా భావించి, ఆస్వాదించాలే కానీ ధ్వంసరచనలతో కలుషితం చేయరాదు. విశ్వహితంలోనే వ్యక్తిహితం అంతర్భవించి ఉంటుందనేది సత్యం.

వేల ఏళ్ల క్రితం ఎవరో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో మధు రఫలాలను, చల్లని నీడను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనిషి తాను చేసే మంచి పనులవల్ల భవిష్యత్తులో మానవాళికి శ్రేయస్సును అందించాలి. అదే జీవన పరమార్ధం. మనసును విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

                          

కుమార చరిత్ర..18.. 👇

ఈ భాగం అడిషనల్ 👉తిరుప్పరంకుండ్రం


శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరు దివ్య  క్షేత్రాలలో ఒకటైన తిరుప్పరంకుండ్రం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం..!!


తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.


ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన శ్రీ వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరు శ్రీ మహా విష్ణువు యొక్క కుమార్తెలు. వీరి యొక్క పేర్లు అమృత వల్లి, సుందర వల్లి. (మహా విష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్య పోకూడదు. మన పురాణములలో చెప్పే ఆఖ్యానములకు అనేక స్థూల, సూక్ష్మ, కారణ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు. వాటిలోని సూక్ష్మములు గురువుల ద్వారా తెలుసుకోవాలి).


అయితే ఒక రోజు వల్లి, దేవయానీ అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృత వల్లితో “నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు. తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను” అని అభయం ఇస్తారు. అలాగే సుందర వల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. తరువాత అమృత వల్లి చిన్న ఆడ శిశువుగా మారి, మేరు పర్వతం దగ్గరకి వెళ్లి, ఇంద్రుడిని కలిసి “ నేను శ్రీ మహా విష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉంది“ అని చెప్తుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృత వల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్ళి చేసుకునే వయసు వచ్చే వరకు. అమృత వల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతము పెంచడం వల్లనే, ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. (తమిళంలో “యానై” అంటే ఏనుగు). అదే విధంగా సుందర వల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు (గిరిజన నాయకుడు) పెంచుకుంటారు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు.


తిరుచెందూర్ లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత, మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి, ఆ దేవతలందరితో కలిసి, తిరుప్పరంకుండ్రం వస్తారు. అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్ళిచేసుకోమని సుబ్రహ్మణ్యుని అర్ధిస్తారు. అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మ గారికి, శ్రీ మహా విష్ణువుకి తన ఈ కోర్కెని తెలియజేస్తాడు ఇంద్రుడు. బ్రహ్మ  గారు, నారాయణుడు కూడా చాలా సంతోషించి, సుబ్రహ్మణ్యునికి తెలుపగా, స్వామి అంగీకరిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి, దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరంకుండ్రం లోనే జరిగింది. శివ పార్వతులు, లక్షీనారాయణులు, సరస్వతీ బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది.


ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. ఆలయం లోకి ప్రవేశించగానే, అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు, ఒక్కో స్తంభం మీదా ఒక్కో భగవన్మూర్తి ఉంటుంది. అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మ వారు ఉంటారు.  మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు, పార్వతీ దేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది. చాలా బాగుంటుంది. 


ఇంకా లోపలి వెడితే, ముందుగా స్వామి వారి యొక్క వివాహం మయూరము, విఘ్నేశ్వర వాహనం మూషికము, శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము. ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు, ఆయనకి ఎడమవైపు దేవయానీ అమ్మ, కుడి వైపు నారద మహా ముని క్రిందకి కూర్చుని ఉంటారు. ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు. అంతేకాక, అక్కడే విఘ్నేశ్వర స్వామి వారు “కర్పగ వినాయగర్” అనే పేరుతో ఉంటారు. పెద్ద మూర్తి, చాలా బాగుంటారు. ప్రక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు. దుర్గా అమ్మ వారు మధ్యలో ఉంటారు. దుర్గ అమ్మకి ఎడమవైపు వినాయకుడు, కుడి వైపు సుబ్రహ్మణ్యుడు ఉంటారు. శివలింగం ఎదురుగా పెరుమాళ్, అంటే శ్రీ మహా విష్ణువు కూడా ఉంటారు. ఈ స్వరూపాలన్నీ, ఆలయం లోపలకి వెళ్ళాక, మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది.


పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, శివ లింగము, దుర్గా అమ్మ, పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు. ముందు కొత్తగా వెళ్ళిన వాళ్లకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో, ఎక్కడ ఉన్నారో వెంటనే అర్ధం కాదు. చాలా చక్కని అనుభూతి.


ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమః 


సర్వే జనాః సుఖినోభవంతు


BkR:

కుమారచరిత్ర -18 


యుద్ధానంతరం సూరపద్ములు ఆక్రమించిన అమర సింహసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యము కట్టపెట్టాడు .


అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం ప్రదేశములో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకు వచ్చి 

" కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను చేపట్టవలదినిదిగా ప్రార్ధించగా " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు. అమర వైభవంతో దేవ గణాలన్నీ వారి వివాహాన్ని జరిపాయి . రంగ రంగ వైభవం తో దేవసేన సుబ్రమణ్యుల వివాహం జరిగింది 


అల్లునికి కానుకగా ఐరవాత సమేతంగా అమూల్య వస్తువులను ఇంద్రుడు బహూకరించాడు . 

మహా విష్ణువు తన మేనల్లుడు / అల్లుడుకు అపూర్వ యశస్సును ప్రసాదించాడు .

సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. 

శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మేల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి.

‘మరుమగన్’ అంటే అల్లుడు.


పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే  సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటారు.

మహేశ్వరుడు కుమారస్వామి ని కుజగ్రహాని కి అధిదేవత గా చేసారు 


( అప్పటినుండి జాతకం లో కుజదోషం కల్గి వెతలు అనుభవించే వారందరు కార్తికేయుని పూజించి ఆయన కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవించారు) .


లోకమాత తన అపూర్వ శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాధి దేవత ( షష్ఠి దేవత గా ) చేసింది . ముల్లోకాలు ఆ కల్యాణ వైభోగాలతో తరించారు .


#షష్టీ_దేవి_ఉపాఖ్యానం :


ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.


ఈ దేవి పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. 

శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ,కధ ఇది. 


స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు

చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. 

ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది.

ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి 

అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు.


అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది.

ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. 

నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది. 


ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు. అని అన్నది.  

వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.


ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.


పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,

పుట్టిన శిశువుకు క్షేమం.

అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.

సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. 

బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి. 

ఇది షష్టీ దేవి కధ.


🍁🍁🍁🍁🍁


#శ్రీ_షష్ఠీదేవీ_స్తోత్రం:


నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః

శుభాయై దేవసేనాయై, షష్ఠీ దేవ్యై నమో నమః  1 


వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః

సుఖదాయై మోక్షదాయై, షష్టీ దేవ్యై నమో నమః 2 


సృష్ట్యై సృష్టశ్వరూపాయై, సిద్దాయై చ నమో నమః

మాయై సిద్ధయోగిన్యై, షష్ఠీ దేవ్యై నమో నమః  3 


సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

బాలాదిస్త్యై దేవ్యై షష్ఠీ దేవ్యై నమో నమః  4 


కళ్యాణ దాయై కళ్యాన్యై ఫలదాయై చ కర్మాణాం

ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ఠీ దేవ్యై నమో నమః  5 


పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు

దేవ రక్షణకారిన్యై షష్ఠీ దేవై నమో నమః  6 


శుద్ధసత్వ స్వరూపయై, వందితాయై నృణాం సదా

హింసాక్రోధ వర్జితాయై, షష్ఠీ దేవ్యై నమో నమః  7 


ధనం దేహి ప్రియం దేహి, పుత్రాం దేహి సురేశ్వరి

మోక్షం దేహి జయం దేహి, యశోదేహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవీ నమో నమః  8 


దేహి భూమిం, ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే

కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః 9 


#ఫలస్తుతి


ఇది దేవీం సంసుత్మోలేకే పుత్రం ప్రియపుత్ర

యశ్మినం చ రాజేంద్రం షష్ఠీ దేవి ప్రసాదత

షష్ఠీ స్తోత్రం ఇదం బ్రహ్మ య శ్మనోతి చ వత్సరం

అపుత్రో లభతే పుత్రాన్ వరం సుచిర జీవనం

వర్షమే కంచ యోభక్త్య సంపూజం సృనోధిచ

సర్వపాప వినిర్ముఖ్తో మహావంధ్యా ప్రసూయతే

వీరపుత్రం చ గుణీనం, విద్యావంతం యశశ్మినం

సుచిర్ ఆయుష్యన్త్రచ షష్టిమాతృ ప్రసాదితత్


శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం సంపూర్ణం

      

    ఓం శరవణ భవ 


సనాతన హిందూ ధర్మం 


శ్రీ సుబ్రహ్మణ్య దివ్య చరిత్ర లో  మరికొన్ని అంశాలు తదుపరి సంపుటిలో తెలుసుకుందాం...

.

Thursday, 28 December 2023



నే నను కసువు నీ వను ప్రగతి

నానుడి పరువు నీదను జగతి

నా నట ఋతువు నీదయ సుమతి 

నేను పశువుని నీవు పశుపతి          75


విభవముజూడగాదగును,విద్యలన్ కదా 

రభసనుజేయగాదగదు,రాజ్యమున్ కదా 

సభలను సాహితీగరిమ,సన్నుతిన్ కదా 

ప్రభలనునెన్నగాదగును, పార్వతీ పతీ         76


ప్రలోభ క్షేత్రజ్ఞ ప్రగతి దహనమ్మున్ విధిపనే

స్వలాభ ప్రేమత్వ స్వపర మదనమ్మున్ గతిగనే

బలాల స్నేహమ్మోప్ప నడక మనమ్మున్ స్థితిగనే

పొలాలే దేహమ్మో తొడుకగుట శంభో భవ హరా       77


పలుకు నేస్తము నిత్య సత్యము పాఠమౌనును తృప్తిగా

తలపు లన్నియు విద్య వాకిట తత్వ మాయెను సేవగా

మలుపు లున్నటి దారినందున మానసమ్ముయు ప్రేమగా

తెలుపు చుంటిమనస్సు వేగము తీర్పు నీదియు యీశ్వరా         78


శ్రీరామ శ్రీకృష్ణ సమాన

 శ్రీ రాజ్యమ్మున్ సామరస్వమ్ము దేవా 

 శ్రీ రమ్య శ్రీతృప్తి సుకీర్తి

శ్రీ రక్ష మ్మున్ సాధు తత్త్వమ్మహేశా              80


మ. కో. ఏమిటన్నను చెప్పలేనులె యేదిజర్గిన కష్టమే

అక్కడేయిక బత్కుసాగును నాశదేనికి నష్టమే

ఎక్కడైనను తెల్పవచ్చును ఎన్ని మాటలు యిష్టమై

ఏమిటేమిటి నీవు యన్నది యెదొమాయయె యిశ్వరా..81

***

రమ్మని పిలిచే రాత్రిగ నున్నా 

రమ్యత జూపగ రాశిగ నున్నా 

చిమ్మిన  వేళన చీకటి  గున్నా 

చెమ్మను తుడ్చెద చిత్తము నన్నా


కళ్ళను చూచా గాలము యన్నా

కాళ్ళను తిప్పా గానము విన్నా

చేతులు కల్పా  చేష్టలు యున్నా

రాతలు మార్చా రాణిగ మిన్నా


మానము హారము మానస మన్నా

ధ్యానము నిత్యము దానము యన్నా

అర్చన చేసెద యలుపే నన్నా

తీర్చెద యాశలు తీపిగ నున్నా


స్వప్నము తీర్చెద స్వర్గము నున్నా

స్వప్నము నందున సంఘము నున్నా.

సుందర రూపము పూజ్యమి నన్నా

పందిరి నీదియు పంతము మిన్నా


జోరుగ నున్నది దోపిడి యున్నా

ధోరణ మారక భోజ్యము మిన్నా 

 కంచే మేసెను కాపును యున్నా

ముంచే బుద్ధియు ముంగిట యున్నా


 నీతియు లేదును నిత్యమదన్నా

ఖ్యాతిగ యాశలు ఖర్మరత న్నా

రాజ్యపు వైద్యము రత్నవిధ న్నా

భోజ్యము మంత్రియు భోక్తగ యున్నా


ప్రపంచ మంతయు పాలకు లున్నా

విపంచి వ్రాసెను విశ్వము కన్నా 

జపమ్ము చేయుట జాతర యున్నా

తపమ్ము వృద్ధియు తప్పదు నన్నా

***

576.. వివరవిలసితం.. తన సమ..6

కాలమ్ము వణక కధలే కల్లోలౌ

మేళమ్ము మహిమ మనసే కల్లో లౌ

తాళమ్ము చరితము కథే కల్లో లౌ

జ్వాలా తరుణ జపముగా శ్రీదేవీ


577.. కలగీత.. సతయగ..6


మనసే మాయా మహిమే సేవా

తణువే తీపీ తమకం సేవా

అణువే తృప్తీ యధరం సేవా

క్షణికం ప్రేమా క్షమ శ్రీదేవీ


578.. విశల్యం ప్రమీల.. య య య.. యతి లేదు

సమత్వం సకార్యం సహాయం

ప్రమేయం ప్రమాదం ప్రమాణం

 భ్రమత్వం బలత్వం భయత్వం

క్షమత్వం క్షకారమ్ము దేవీ


579.. విశాలాం భోజాలి.. త స య మ..7

సాహిత్య సహనం సమత్వం ప్రాణమ్మున్

దేహమ్ము దహనం దినిత్వం ధర్మమ్మున్

దాహమ్ము దమమం దరాద్యం కర్మమ్మున్

ద్రోహమ్ము సమయం దొరత్వం శ్రీదేవీ


580..విశేష కదలితం..న న మ మ జ జ జ గగ..10,19


కరుణకలలు నిత్యమ్మున్ కాలాన్నే మనస్సు సమర్ధతనెంచ గల్గున్

దరి సతిపతి యేకమ్మున్ దాతృత్వం సమస్య సహాయము నెంచ గల్గున్

పరిపరి విధి ధర్మంమ్మున్  పాశమ్మున్ విశాలము హృద్యమునెంచ గల్గున్

నరుల నయన సమ్మోహం  నాట్యమ్మున్ సహాయ సమర్ధత నెంచ దేవీ

***

ఎంత మందియున్న యదలోన ధైర్యము

కష్టమైనచోట గుట్టు విప్పె 

స్థాన బలము యున్న సమయ మందు

సహన ప్రాంజలి కళ శారదాంబ


నేను అన్న ఎరుక నీడలాకదులుటే

నమ్మలేవు ఇదియు నటన కాదు

నీవు నేను కాదు నిజము నిత్యమగుటే

సహన ప్రాంజలికళ శారదాంబ


కన్నవారులేరు కావడి కుండలా

కాల మందు బ్రతుకు కామ్యచరిత

కథల కాల నాగు కాటువేయ దళచే

సహన ప్రాంజలి కళ శారదాంబ


కట్టుకున్న పతిని నాటేటిలోముంచి

మన్నుతిన్న పాము మనసు పంచి

కధలు చెప్పు చున్న అపరంజి కోసమే

సహన ప్రాంజలి కళ శారదాంబ


సత్య వచన ప్రేమ సమరము కోరుటే

ప్రేమ వినయ సేవ ప్రీతి కొరకు

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యమై

సహన ప్రాంజలి కళ శారదాంబ


అక్షరంబు వలయు ఆత్మతృప్తికొరకు

అక్షరంబు మనసు కక్ష మార్చు

అక్షరంబు తన్ను రక్షించ గలుగుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ


అక్షరంబు నేర్వ ఆశయసాధన

అక్షరంబు లోక రక్షితంబు

అక్షరంబు జిహ్వ అందరి అక్షయం 

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఎందు దాగి యున్న యదను తాకుటుగాను

ఘడియ ఘడియ యందు గాళ మగుట

ఎంత రుచిగ యున్న ఏమనకను ఇంక 

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఒరిమిగాను నుండి ఒరుగుల బ్రతుకగా

ప్రజ్ఞ లన్ని చలవ ప్రియము లేక

భూషణంబు రారి భూరివిజయ మగు

సహన ప్రాంజలి కళ శారదాంబ

*--*

వసంతకోకిల

25.  మిశ్రగతి (తకిటతకధిమి)

త్రిపుటతాళం 

,

మానవత్త్వము పరిమళించెడు

   మంచిమనసు కానరాడిక. 

మానవత్త్వము మమతపంచెడు 

   మాననీయుడె కానరాడిక. 


రాళ్లలోనను  వెదకికాంచిన 

    రత్నమొకటి దొర్కనట్లుగ,

తల్లిదండ్రుల కాచి బ్రోచెడు

    ధర్మతనయ కానరాడిక. 


ఇనుప వైనము వెదకిచూసిన

     కనకమెక్కడ కాంచనట్లుగ,

మనుజులందున మచ్చుకైనను 

    మహాపుర్షుడె కానరాడిక.


కాకులందున చూసి వెదకిన

     కోకిలేచట లేని విధ్య మాలిక 

లోకమందున సత్యవంతుడు 

   లోకమాన్యుడె కానరాడిక. 


తుమ్మ తోపుల వెదకి కాంచగ 

    తులసి ఒక్కటి లేనిరీతిగ,

ఇమ్మహీనము దారి నెంచుట 

   మహాశయడే కానరాడిక. 


కాననమ్మున  తిరిగిచూడగ

    గంధమృగ్యమె లేనిరీతిగ,

మానవంతుల రక్షచేసెడు 

    మహాత్ముండగు కానరాడిక. 


బాతులందున హంసఒక్కటి 

    పాఱచూచిన దొర్కనట్లుగ

నీతిమంతుడు కపటరహితు

    ఖ్యాతిమంతుడె కానరాడిక. 


గురుని దైవము  అనితలుస్తులు 

     కొలువ రాయడు బ్రహ్మచారులు,

గరుడగమనుని శరణుపొందెడు 

    పరమభక్తుడె కానరాడిక.


అంత్యాను ప్రాస మాత్రాబద్ధ ప్రక్రియ ....005

*వర్షంతో హర్షం 


హృదయాంతరంగ సంతోషం  ముక్తి గీత హర్షం

 సర్వ క్షేమంగా జూడ బ్రహ్మ వాక్కుల హర్షం


ప్రకృతి ప్రభావ జనరక్ష నింగి నుండి నే వర్షం

హృదయ తపనలు తీర్చగా పుడమి తడిపేను వర్షం


 పగలైనా రాత్రైనా  వెన్నెల చీకటి వర్షం

 చెలిమి కిరణాల తాకిడి కలువలు కులుకే వర్షం


 హృదయపూర్వక చల్లదనం  మగువ మురుసే వర్షం

 మరువని మమతను కలిపే  కడలి పొంగులతొ వర్షం


సమయానా ఆదుకునే ప్రతిభతొ బిడ్డల వర్షం

మంచి గుణ సంపదతో చిత్తము మెలకెత్తు వర్షం


 నిత్య బ్రతుకు సంసారం  మౌన పోరాట హర్షం

 సత్యమార్గ జీవ ప్రయాణం  సంపదతో హర్షం


మీ ప్రాంజలి ప్రభ

మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


మనుషుల మర్మం తెలియాలి

మానవత్వం బ్రతికించే విధానము రావాలి 

మనిషి మనిషికి మధ్యతారతమ్యం  సరిచేయాలి

అనుభవ జీవిత పాఠం తెలపాలి


అందులో కొందరు


యీ మనుషుల బ్రతుకులు వెలిగించని దివ్వెలు

కన్నీటి కడలిలో ఉగిసలాడే పడవులు


అనుమానపు ఆశల నడుమున కరిగిపోయే కొవ్వొత్తులు

 వెలుగులతో చిందులు వేసే తారాజువ్వలు


 చీకటి లో కదిలేటి మినుగురు  పురుగులు

 కాలాన్ని అర్థం చేసుకోని కందిరీగలు


జీవితంలో చదరంగ పావులు

 గాలికి రెపరెపలాడి చిక్కిన గాలిపటాలు


గట్టుపై ఎగసి పడే కడలి కెరటాలు

దాహం తీర్చలేని ఏండ మావులు


అందుకే 


విద్యతో కళల నైపుణ్యం ఎదగాలి

నిత్య దాన ధర్మం బోధ పడాలి


అన్నార్తులను ఆదుకొని మెలగాలి

**--**

ప్రాంజలి ప్రభ అంతర్జాల పాతిక - కవిత

రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :


నేటి కావిత : *నాపేరు ణపరమాత్మ


అనంత జీవన మార్గాన్ని

అమృత వర్ష బాండాగారాన్ని

ఆస్రితులకు సహాకారాన్ని

అందరికి  అందించే అమృత జలాన్ని


బంధాలకు ఆధారాన్ని

నేనొక ప్రణయ ప్రభందాన్ని   

వసంతంతో వికసించేవాన్ని

అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని


సరస సల్లాప సారాగాన్ని

ఆకట్టు కుంటున్న అను రాగాన్ని

అర విరిసిన అందాన్ని

అందరికి  ఆనందాన్ని అందించే గుణాన్ని


ప్రకృతిలో వైవిధ్యాన్ని

వైవిద్యంలో ఏకత్వాన్ని

సుందర స్వప్నాన్ని

అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని


దైవ దత్తమైన వరాన్ని

లలిత సంగీత స్వరాన్ని

వెదజల్లే చల్లని సమీరాన్ని

 పంచ భూతాలకు సహకారాన్ని


మధుర భావాల్లో సత్యాన్ని

కవి హృదయంలో సాహిత్యాన్ని

స్మృతి సుమధర పరిమళాన్ని

 కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని


నేనొక ప్రేమ తత్వాన్ని

తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని

కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని

భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని


ఇంతకూ నేనెవరో తెలిసిందా

ఆధరాలలో ఉన్న లాలాజలాన్ని

కాదు జిహ్వాచాపాన్ని

కాదు కాదు అమృత జలాన్ని


కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి


--((*))--

కృషితో నాస్తి దుర్భిక్షం కనిపించాలి


మనుషుల మర్మం తెలియాలి

మానవత్వం బ్రతికించే విధానము తెలియాలి

మనిషి మనిషికి మధ్యతారతమ్యం  సరిచేయాలి

అనుభవ జీవిత పాఠం తెలపాలి


Wednesday, 27 December 2023



ఎప్పుడో యనకుమా... యేదియో పలుకుగా

సప్పుడే తలపుగా..సత్యమే తెలపగా

నిప్పు నే పట్టుతీ... నిజమ్మే బ్రతుకుగా

ఒప్పులే తప్పులై... ఓటమే భవశి వా


ప్రతి పరిచయం ప్రీతిగ వికసితం

ప్రతి పరిణయం ప్రేమగ సముచితం

ప్రతి యనుభవం ప్రేమ చెలిమిగతం

ప్రతి జపమయం ప్రేమ మనసు శివా


ప్రేమ పంచె సంబంధమె ప్రీతి నిచ్చు బాం ధవ్యమె

క్షేమ మయ్యె సుఖత్వమ్మె క్షేమ స్వర్గ బంధుత్వమె

సామ బేధ కర్తవ్యమె సంఘ సర్వ కర్తృత్వమె

సాక్షి గమ్య మార్గమ్ముయె సాధ్య ధర్మ సత్య శంభు


ప్రవాహమ్మేసాగే ప్రభలు కదులుస్త్రోత్రముగనే

వివాహమ్మే యోగమ్ము విధిగను బంధమ్ముయగుటే

నివాసమ్మే ప్రాణమ్ము నిధిగను విద్యా కదలికే

నవాభ్యు స్సాద్యమ్మేను నటనలు విశ్వేశ్వరునివే


ప్రలోభమ్మే భారమ్ము  ప్రగతికి కీడే జరుగుటే

విలోలమ్మే సర్వమ్ము విజయము కష్టమ్ము యగుటే

బలో పేతమ్మే నష్ట ప్రతిభ గనే బాధ గనుటే

కళో ళ్లాసమ్మే దృష్ట కళలగు శంభో మది శివా


నటించే వారే స్వేచ్ఛ పలుకుల యాకర్షణగుటే

ఫటించే వారే ప్రాభవ మగుట వేదమ్మగుటయే

ఝటించే వారే ఝాఝమగుటయు నాట్యమ్ముగుటయే

తటించే వారే వింత గమనము భవ్యల్ శివ శివా


పరంధామా శిద్దేశ్వర వినయ విద్యా ప్రతిభ యే

జ్వరంతత్త్వమ్మే బుద్ధి గుణమగు ప్రజ్ఞా ప్రభవ మే

నరం సాగేయుద్ధమ్ము గతియగు భావమ్ము కళ యే

స్వరం రాగమ్మేలే సరిగమలు శంకర ప్రభువా 


సతతము నిన్ను గొల్చెద ప్రశాంత మూర్తి స

న్మతి ,సుముఖా, ప్రజాపతి సనాతనా ,శివా

గతియగు ,పాపనాశక, వినిర్మలాకృతీ!

చతురవచోవిదా, సుగుణజాల బ్రోవరా.


సుకేసర వృత్తము

(న జ భ జ ర  యతి..11)

****

అమ్మానాన్న గురువుల ఆశీస్సులు అమృతవల్లీ

అమ్మ వారి దీవెనలు అందు కొనుము తల్లీ


తళ్లడిల్లు లోకములో తత్వమ్ము బోదన లీలా

కల్ల లాడని తన్మయత్వపు భయము జపము లీలా

అత్తమామల సేవలతో ఆదమరుచు లీలా

కాలమాయకు చిక్కక ఉండాలి లతలా...// అమ్మ..//


మరువలేని నీ తత్త్వం మహాభారతమ్ము గా

తిరుగులేని నీ  భావం మహా మానవత్వం గా

విశ్వానికి ఆదర్శం నీ విరూపాక్ష సత్వం గా

విశ్వమాయకు చిక్కక కదలాలి కాలములా / అమ్మ..//


నీ ఉనికిని ప్రశ్నించు పరమాత్మ ఉనికిని గ్రహించు

నీలో నువ్వు జ్వలించు వాస్తవాన్ని గ్రహించు

జ్ఞానం వైపు కదలు అజ్ఞానాన్ని దహించు

ధర్మ మార్గాన పయనించు అధర్మాన్ని ఎదురించు  //అమ్మ..//


అమ్మానాన్న గురువుల ఆశీస్సులు అమృతవల్లీ

అమ్మ వారి దీవెనలు అందు కొనుము తల్లీ


***

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

"దయచేసి బ్రాహ్మణ బంధువులకు షేర్ చేయండి"

1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు... సేవ చేసింది సూర్య వంశానికి,

2.చాణక్యుడు బ్రాహ్మణుడు. పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,

3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు  పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..

4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర శివాజీకి..

5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..

అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు. ము బ్రాహ్మణులమ్

మేము క్షత్రియుడైన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం


గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని పరమాత్ముడు అని ఆరాదిస్తాం

స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.

బ్రాహ్మణుడైన బ్రహ్మకు  నమస్కారం చేయము..

బ్రహ్మణుడైన రావణుడి..దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.

ఇంతచేసినా కూడా పరుల కళ్ళకు జాతీయవాదులం

ఎందుకంటే,....మేము బ్రాహ్మణులం..

ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.

కళా, సాంసృతులను ఆరాదిస్తాం..ఉచితంగా విద్యాబోధన చేస్తాం

ఎవరైనా ఎదుగుతుంటే వారికి  నిచ్చెన వేస్తాం..  వారి బాబుకు శ్రమిద్దాం. 

ఇంత చేసినా కూడా పరుల కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..

ఎందుకంటే..మేము బ్రాహ్మణులం..!!

అన్నo పెట్టకున్నా గంజిని  పెట్టి ఆకలి తీరుస్తాం.

అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..

ఎందుకంటే...మేము బ్రాహ్మణులం.

గవర్నమెంట్ పథకాలు లేకున్నా దేవుడు ఇచ్చాడని అనుకుంటాo

రిజర్వేషన్లు లేకున్నా మా పిల్లలను అప్పుచేసి చదివించి సర్కారు బళ్లకు, కంపినిలకు

పంపిస్తాం.

మేము దేశానికి సేవకులై, శ్రామికులమై ఈ మట్టికోసం.సమస్త విద్యలో బోధ కొరకు పోరాడు

తాం..

ఎందుకంటే,...మేము బ్రాహ్మణులo.!!

అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..అందరితోనూ... "మెప్పు"పొందుతాం

      బ్రాహ్మణులను గౌరవింపు దేశానికి వెన్నెముక  బ్రాహ్మణల మంత్రమే లోకాలకు శాంతి మార్గము

***

ఎవరు రాసారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉంది


ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .


మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  - ఆదర్శ పురుషుడు


మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన -  అద్దం - రాముడు .


ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే రాముడు .

అందం పోగుపోస్తే రాముడు 

ఆనందం నడిస్తే రాముడు


వేదోపనిషత్తులకు అర్థం రాముడు

మంత్రమూర్తి రాముడు .

పరబ్రహ్మం రాముడు .

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు


ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -


శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా


వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ


భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు


కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా


వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !


తిరుగులేని మాటకు - రామబాణం 


సకల సుఖశాంతులకు - రామరాజ్యం .


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన


ఆజానుబాహుడి పోలికకు - రాముడు


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 


రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;


Ravana was Killed by Rama .


ఆదర్శ దాంపత్యానికి సీతారాములు


గొప్ప కొడుకు - రాముడు


అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు


గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .


మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).


మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).


సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .


తెలుగులో కూడా అంతే .


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం


కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .


వికారంగా ఉంటే -

శూర్పణఖ

చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.

మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర

పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .

ఎంగిలిచేసి పెడితే -

శబరి

ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .

పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.

సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని

యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)

కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు

రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

జై శ్రీ రామ్.....

|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది


జై శ్రీరామ్

 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక

"దయచేసి బ్రాహ్మణ బంధువులకు షేర్ చేయండి"

1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు... సేవ చేసింది సూర్య వంశానికి,

2.చాణక్యుడు బ్రాహ్మణుడు. పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,

3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు  పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..

4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర శివాజీకి..

5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..

అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు. ము బ్రాహ్మణులమ్

మేము క్షత్రియుడైన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం

గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని పరమాత్ముడు అని ఆరాదిస్తాం

స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.

బ్రాహ్మణుడైన బ్రహ్మకు  నమస్కారం చేయము..

బ్రహ్మణుడైన రావణుడి..దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.

ఇంతచేసినా కూడా పరుల కళ్ళకు జాతీయవాదులం

ఎందుకంటే,....మేము బ్రాహ్మణులం..

ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.

కళా, సాంసృతులను ఆరాదిస్తాం..ఉచితంగా విద్యాబోధన చేస్తాం

ఎవరైనా ఎదుగుతుంటే వారికి  నిచ్చెన వేస్తాం..  వారి బాబుకు శ్రమిద్దాం. 

ఇంత చేసినా కూడా పరుల కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..

ఎందుకంటే..మేము బ్రాహ్మణులం..!!

అన్నo పెట్టకున్నా గంజిని  పెట్టి ఆకలి తీరుస్తాం.

అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..

ఎందుకంటే...మేము బ్రాహ్మణులం.

గవర్నమెంట్ పథకాలు లేకున్నా దేవుడు ఇచ్చాడని అనుకుంటాo

రిజర్వేషన్లు లేకున్నా మా పిల్లలను అప్పుచేసి చదివించి సర్కారు బళ్లకు, కంపినిలకు

పంపిస్తాం.

మేము దేశానికి సేవకులై, శ్రామికులమై ఈ మట్టికోసం.సమస్త విద్యలో బోధ కొరకు పోరాడు

తాం..

ఎందుకంటే,...మేము బ్రాహ్మణులo.!!

అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..అందరితోనూ... "మెప్పు"పొందుతాం

      బ్రాహ్మణులను గౌరవింపు దేశానికి వెన్నెముక  బ్రాహ్మణల మంత్రమే లోకాలకు శాంతి మార్గము

***

శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు?*

త్రిమూర్తులు లో ఒక్కడైనా పరమశివుడు కైలాసం లో, కాశీ లో వశిస్తుంటాడు. అయితే ఈయన స్మశానం లో కూడా వశిస్థాడని చెపుతారు. అంతటి మహిమన్వితునికి స్మశానం లో ఉండవలసిన అగత్యం ఏమిటి?ఈ ప్రశ్నలకు మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో సమాధానం దొరుకుతుంది.

    ఒక సారి కైలాసం లో పార్వతీపరమేశ్వరులు ఇరువురు మాట్లాడు కుంటుండగా, పార్వతీదేవి పరమేశ్వరుని, స్వామి మీరు స్మశానం లో ఎందుకు నివసిస్తారు?అని ఆడిగిన0ది. దానికి సమాధానం గా శివుడు.

          దేవి ఒకమారు బ్రహ్మదేముడు నన్ను కలిసి మహేశ్వర స్మశానం లో ఉగ్రభూతాలు జనావాసాల మీద పడి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అనిచెప్పాగా నేను వాటిని నియంత్రి0చడానికి స్మశాన వాసినయ్యాను. అంతే కాకుండా మరణించిన వ్యక్తి ని దహనం చేసి బంధువులు వెనుతిరిగిన తరువాత ఆ జీవుడు ఒంటరిగా ఏడుస్తుంటే నేను అతనిని ఓదార్చి స్వాంతన చేకూరుస్తాను. అంతే తప్ప మరొక కారణం లేదు అని చెప్తాడు.

 ఈ చిన్ని కధ వల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే. మనిషి జీవన పర్యంతం భగవత్ స్పృహ లేకుండా, సంసార బంధం అనే చట్రం లో ఇరుక్కొని, లోక వ్యవహారం లో ఇబ్బడి ముబ్బడిగా కూరుకు పోయి అంత్యకాలం లో భార్యాపిల్లలు బంధువులచే వదిలివేయ బడి ఆ జీవుడు ఏకాకి అయి విలపిస్తుండగా, అప్పుడు ఆ ఆసుతోషుడు అక్కున చేర్చుకుని స్వాంతన చేకూరుస్తాడు. 

అందుకే దూర్జటి తన కాళహస్తీశ్వర శతకం లో ఇలా అంటాడు

దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే

వింతల్మేన చరించునప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే

చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!

 పరమశివా ఈ శరీరం లో సకల శక్తులు ఉన్నప్పుడే ధనసంపాదన ఎలా చేస్తామో అలాగే భగవంతుని పైన కూడా చిత్తము ఉంచి పర్యంతం దేవుని సేవలో తరించాలి.!

 *హర హర మహాదేవ*

.....

చల్లని అనుభూతులు

ఒక్కొక్కసారి మనసు ఆనందంతో నిండిపోతుంది. గతదినం వేదనలో మూగబోయి రాత్రి నిదుర అనంతరం నిన్నటి కలతకు అంతగా కారణం కనిపించకపోయేసరికి మనసు తేలికపడుతుంది. చల్లని దేశాల్లో సూర్యభగవానుడి నులివెచ్చని కిరణాలు సోకినప్పుడు, వేడి దేశాలలో వాతావరణం చల్లబడి నాలుగు చినుకులు రాలి చలచల్లని మలయ సమీరం వీచినప్పుడు- మనసుకు ఎంతో హాయి కలిగి ఏనో తెలియని లోకాలకు వెళ్ళిపోతుంది. మనిషి ఆనందానుభూతులకు వాతావరణం ఓ పెద్ద కారణం అన్నప్పుడు ఆశ్చర్యం. కలుగుతుంది. మనసు ఆనందంతో నిండి ఆహ్లాదంగా ఉన్నప్పుడు అడిగిన వారికి, ఆడగనివారికి దానధర్మాలు చేయాలని కొందరికి అనిపిస్తుంది. అందుకే అంటారు. పెద్దలు సంతోష సమయాలలో వాగ్దానాలు చేయవద్దని

శ్రావణ, ఆశ్వీయుజ, కార్తికమాసాలు శుభ కార్యక్రమాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి. _మాసాలలో دان ఈ వైదిక, ఇటు ప్రార్ధనల రూపేణా మన్నించమని భగవంతుడిని మన సారా కోరుకోవడం కనిపిస్తుంది. శ్రావణమాసంలో చల్లని సాయం కాలాలు ఉవ్విళ్లూరిస్తాయి. శీతాకాల ప్రారంభమైన కార్తీకం ఇటు భక్తికి అటు ముక్తికి మార్గం చూపుతుంది. చల్లదనం ఎందుకు ఆహ్లాదం కలిగిస్తుంది. మనసుకు చలి ప్రదేశాలలో నీరు గడ్డకట్టే చలిలో ప్రజలు శీతల దుస్తులు ధరించి.. నులివెచ్చని అనుభూతులు సృజిం చుకొని ఆనందాన్ని అనుభవిస్తారు. శరీరం పిత్తదోషయుక్తమైనప్పుడు రక్తం వెచ్చని అనుభవాన్ని పంచుతుండగా శరీరానికి తగిలే చల్లనిగాలి మనసును సేదదీరుస్తుంది. ప్రకృతి తాపాన్ని పంచుతున్నప్పుడు చల్లని అనుభూతిని, శీత ప్రకోపం చెందినప్పుడు నులివెచ్చని అనుభూతిని మనసు కోరుకోవడంలో తప్పేముంది! అయినా అందులోని వైచిత్రి ఆశ్చర్యం గొల్పుతుంది. మనిషి తనకు దక్కింది చాలక మరేదో గొప్పదాన్ని కోరుకోవడం చిత్రమైన అనుభవమే! చీకటి రాత్రులలో వెలుగు కోసం, వెలుగు(ఎండ) ఉష్ణ ప్రకోసం చేస్తున్నప్పుడు చల్లని నీడ కోసం ప్రయత్నించడం ప్రాణుల సహజ లక్షణం. చెట్లను, నీడనిచ్చే చల్లని లోగిళ్లను ఆశ్రయించడం జీవులకు పరిపాటి

పెద్దలు పిన్నలను దీవించడం సంప్రదాయం. ఏదైనా పండుగను, పబ్బాన్ని పురస్కరించుకొని పెద్దలు, పండితులు తమకన్నా చిన్నవారిని నూరేళ్లు చల్లగా వర్ధిల్లమని దీవిస్తారు. చల్లదనం ఆయుష్షును పెంచే పదంగా ఉపయోగించడం విశేషం. సూర్యరశ్మిలో జీవకణాలు ప్రవర్ధిల్లుతాయి. విత్తనాలు జీవం పోసుకుంటాయి. మొక్కలు ఆకుల ద్వారా సూర్యకాంతిని స్వీకరించి పిండిపదార్థం తయారు చేసుకుంటాయి. అయినా చంద్రుడికే ప్రాముఖ్యం ఇచ్చి (ఔషధ మొక్కలకు చంద్రకాంతి కావాలట) చల్లదనాన్ని ఆహ్వానించి పిల్లలకు, ఆశీర్వాదం అందించడం పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.

- గోపాలుని రఘుపతిరావు

కనికరం తేటగీతి మాలా 


అప్పుడప్పుడూ గుండెలో యలుపు చేరి

గుండె లయ తప్పినప్పుడు గుర్తుచేయు 

కళ్ళరెప్పలచప్పుడు కానలేను 

ఏది తోచనప్పుడు బంధ మెరుగ లేను


పరిమళాలు గుప్పెడు చేరి పలకరింపు 

అప్పుడప్పుడూ మాటలే పెగల లేవు 

రెప రెపమనికదులు గుండె రెచ్చి పోవు 

జ్ఞాపకాల బావుటగాను జ్ఞాన మేది


నేను చోరునికే జిక్కి నీడలేక

నిద్ర లేక యాతన యగు నిజముతెలుప

పాపము తెలిసిచేయని పాపినైతి

మనసు ఆశదురాశగు మాయ కమ్మి


పరుల స్వత్వముహరణ పదము కదలె

పగలు రాత్రి భ్రమణమేను పాశవిద్య

బెడద తట్టుకొని బ్రతుకు బిడియ మదియు 

సర్వ నిష్ఠ కదల కార్య సమయ మిదియు


భార్య పుత్రులు కుశలమే బంధ మగుట

దేహప్రేమ కలిగి యుండు దినదినమగు

చింత లేని హితము తోడు చెలి చెరితమె

కాంతుని కదులు లీలలే కాల మార్పు 


అప్పుడప్పుడూ నిస్తేజ యలక జేరి 

హృదయ మేకమ్మినప్పుడు హాయి యేది 

ప్రణయ కవితలు సంపుట ప్రభలు మిగులు 

కాల తీర్పు కని కరమ్ము కదులు చుండ

Tuesday, 26 December 2023




శుభ శుభోదయం మనమౌను సుఖము కోర

అభయ యుక్తియు సర్వము యాశ్రయమ్ము

సభలు తీరుమారు జయము సాధ్య మౌను 

ప్రభల గీతభావముగాను ప్రతిభ భవుడు                  59


అక్షర సత్యమున్ మదీయ భావమున్ ననేక రీతులన్

శిక్షణ బుద్ధిగన్ సకాల శీఘ్రమున్ జయంబు రీతిగన్

రక్షణ చేయవేళగన్ నిరాజ్యమున్ విశాల భావమున్

కక్షలు లేని రీతిగన్ నికామ్యమున్ సహాయ మీశ్వరా  60


త్రికాలజ్ఞానమే త్రివిక్ర తీరుగా త్రినేత్ర జూపులే

వికాస సత్య భావమేను విశ్వమందు వర్ణ తీరుగా

ప్రకాశ లక్ష్యమే ప్రపంచ ప్రా భవమ్ముగాను తృప్తియే

సకాల గొల్పు రీతిలోన సహాయ మే సుధీ యీశ్వరా   61


కలమ్ము వ్రాతలేలు నిత్యకాల నిర్ణయమ్ము కావ్యమున్

ప్రలోభ భావమే మదీయ ప్రాభవమ్ముగాను తెల్పగన్

జలమ్ము గాలితీరు యంబరమ్ముగాను ప్రథ్విలీలగన్

బలమ్ము శక్తి యుక్తి రక్తి బంధమే పరాత్ప రాశివా        62


సమమ్ము వృద్ధి చెందు లీల సార్థకమ్ము గాను లక్ష్యముల్

సమర్ధ లొక్కటైనవేళ దాపునేస కాల సర్పముల్

సుమమ్ము మొంద జేసెవీధి సు ష్టపరంపరమ్ము హేతువుల్

రమత్వ కోతలై, నిజంబు  రాజుకున్న చిక్కులే శివా     63


జీవితం క్షణమ్ము స్వర్ణమున్  జపమ్ము యేలగన్ దుఃఖమున్ 

జీవసత్యమౌను కాలమున్ జయమ్ము నష్టమున్ వ్యర్థమున్

భావ భాగ్యమేను సేవలే భయమ్ము  నీడగన్ తోడుగన్

సేవలక్ష్యమే గతీమతీ విశాల ధ్యానమే యీశ్వరా        64


జయన్తి కోరిసేవలే నిజంబుగా జయమ్ము నిచ్చుటన్

నయంబు తోడ వెల్గుచున్న నారతంబు కాతువే ల్పుగన్

ప్రియంబుగా కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్ జూడున్

జయంబు గొల్తు రీతిలో ప్రశస్తిగా నొసంగు యీశ్వరా    65


 శ్రీ నివాస సేవలన్ని శీఘ్ర మున్ నె జేయ శక్తి నీదిగా

ప్రాణమున్ మనస్సు నిత్య ప్రాకృతీ వినీల యుక్తి నీదిగా

దానమున్ మనమ్ము సత్యధామమున్ యశోకుయుక్తి నీదిగా

మానమున్ సహాయ నిత్యమార్గమున్ చిదంబరా సదాశివా  66


అన్నమన్న రీతి బట్టియే యాదరమ్ముగాను యాత్రమున్

కన్నవారి పేరు యూరునే కానకుండగాను తిర్గుతన్

 విన్నమాటలన్ని నమ్ముటే గీతభావ మేల బుద్దిగన్

సన్నుతింతు సేవలన్నియు శీ ఘ్ర లక్ష్యమౌను యీశ్వరా  67


*🍀 91. టీవీ చూడటం 🍀*

*🕉. ధ్యానం యొక్క మొత్తం రహస్యం ఏమిటంటే,  అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ కాకుండా, ఆందోళన లేకుండా, ఎలాంటి ఇష్టాలు మరియు అయిష్టాలు లేకుండా, ఎలాంటి ఎంపిక లేకుండా ఉండడం.  🕉*

*ధ్యానం ఒక సాధారణ పద్ధతి. మీ మనసు టీవీ స్క్రీన్ లాంటిది. జ్ఞాపకాలు గడిచిపోతున్నాయి, చిత్రాలు గడిచిపోతున్నాయి, ఆలోచనలు, కోరికలు, వెయ్యినొక్క విషయాలు గడిచిపోతున్నాయి; ఇది ఎల్లప్పుడూ రద్దీ సమయం. మరియు రహదారి దాదాపు భారతీయ రహదారి వలె ఉంటుంది: ట్రాఫిక్ నియమాలు లేవు మరియు ప్రతి ఒక్కరూ ప్రతి దిశలో వెళుతున్నారు. ఒక వ్యక్తి మనస్సును ఎటువంటి మూల్యాంకనం లేకుండా, ఎటువంటి తీర్పు లేకుండా, ఏ ఎంపిక లేకుండా చూసుకోవాలి, దానితో మీకు సంబంధం లేనట్లు మరియు మీరు కేవలం సాక్షి మాత్రమే అన్నట్లుగా ఆందోళన చెందకుండా చూసుకోవాలి. అది ఎంపికలేని అవగాహన.*

*మీరు ఎంచుకుంటే, 'ఈ ఆలోచన మంచిదే-నాకు ఇది ఉండనివ్వండి' లేదా 'ఇది ఒక అందమైన కల, దాన్ని మరికొంత ఆనందించాలి' అని మీరు ఎంచుకుంటే, మీరు సాక్షీతత్త్వాన్ని కోల్పోతారు. మీరు, 'ఇది చెడ్డది, అనైతికం, పాపం, నేను దీన్ని విసిరివేయాలి' అని చెప్పి, మీరు కష్టపడటం మొదలుపెడితే, మళ్లీ మీరు మీ సాక్షీతత్త్వాన్ని కోల్పోతారు. మీరు మీ సాక్షీతత్త్వాన్ని రెండు విధాలుగా కోల్పోవచ్చు: అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండడం ద్వారా. ధ్యానం యొక్క మొత్తం రహస్యం ఏమిటంటే, ఏ విధమైన ఇష్టాలు మరియు అయిష్టాలు లేకుండా, ఎటువంటి ఎంపిక లేకుండా, అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉండకుండా, ఆందోళన చెందకుండా, నిదానంగా ఉండాలి. మీరు సాక్షిగా కొన్ని క్షణాలు అయినా ఉండగలిగితే, మీరు ఎంత ఆనందాన్ని పొందుతారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.*


*కొనసాగుతుంది...*


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 520 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 520 - 1 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।*

*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀*

*🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 1 🌻*

*సాకినీ అను పేరుగల మాతగ మూలాధార పద్మము నందున్నది. 514 నుండి 520వ నామము వరకు మూలాధార దేవత స్థితి యున్నది. మూలాధార పద్మము నాలుగు దళములతో నుండును. అందు శం, సం, షం, హం అను నాలుగు బీజాక్షరము లుండును. కేంద్రమున 'లం' అను బీజాక్షర ముండును. ఈ పద్మము ఎర్రని రంగులో నుండునని తెలుపుదురు. ఇందలి శ్రీమాత పంచముఖి. అనగా ఐదు భూతములు వ్యక్తమైన స్థితి. ఈ స్థితియందు సృష్టి, జీవ రూపముల సృష్టి భౌతికమునకు చేరును. జీవులయందు అత్యధిక భౌతిక స్థితి అస్థికలకు (ఎముకల) ఉండును. దేహ ధాతువులలో ఎముక ఏడవది. ఎముకలు ఆధారముగనే మిగిలిన ఆరు ధాతువులకు రూప మేర్పడును.*

*సశేషం...*


🌹. శ్రీమద్భగవద్గీత - 478  / Bhagavad-Gita - 478 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*ప్రాంజలి prabha👍

*. 12వ అధ్యాయము -భక్తియోగము -09 *

*09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |*
*అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||*

*🌷. తాత్పర్యం : ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసికొనుము.*

* భాష్యము  : ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింప బడియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును. భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు.*

*పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.*
🌹 🌹 🌹 🌹 🌹

పరిశీలనే పాఠం(కథ ) ✍️ 

  సైన్సు మాష్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన  తరువాత   సమయం మిగలడంతో పిల్లల్తో మాట్లాడారు. “సృష్టిలో ప్రతి జీవికీ ఏదోఒక  ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోడానికి మంచి లక్షణాలు కనిపిస్తాయి” అన్నారు. 

    నరేంద్ర అనే పిల్లవాడు “మాష్టారూ! నిజంగానా?”అన్నాడు  సందేహంగా.  

     “సందేహమెందుకురా? రేపెలాగూ ఆదివారమే. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది”  అన్నారు నవ్వుతూ మాష్టారు. 

 సోమవారంనాడు  పాఠశాలలో తొమ్మిదో తరగతికి  వచ్చినప్పుడు సైన్సు మాష్టారు నరేంద్రని నిలబెట్టి “నువ్వడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా?” అనడిగారు. 

“ఇంటికి వెళ్ళగానే ఆ విషయం మరచిపోయాను” అన్నాడు తల ఒంచుకుని నరేంద్ర.   

  వాడి ప్రక్కనే కూర్చున్న కార్తీక్ చెయ్యెత్తాడు. వాడిని చెప్పమన్నారు మాష్టారు.          

“ మా ఇంట్లో  పంచదార క్రింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి  పంచదార పలుకుని తీసుకుపోయింది. మరికొంతసేపయ్యేసరికి చీమల దండు వచ్చింది అక్కడకి.  ఒక్కో పలుకు చొప్పున దాదాపు మొత్తం పంచదారని తీసుకుపోయాయవి. వచ్చేటప్పుడు,  వెళ్ళేటప్పుడు వరుస పాటించాయి చీమలు. అవెళ్లే దారిలో  గిన్నె అడ్డుపెట్టాను.  ప్రక్కనుండి వెళ్లిపోయాయి తప్ప ఆగలేదు చీమలు” అన్నాడు కార్తీక్ . 

“నీకేం  అర్థమైంది?” అనడిగారు మాష్టారు. 

పిల్లలంతా కార్తీక్ వైపు ఆసక్తిగా చూసారు. 

“ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తుపడతాయని, వరుస పధ్ధతిని  పాటిస్తాయని, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవని, ఐకమత్యంగా ఉంటాయని తెలిసింద”న్నాడు వాడు.  

 “బాగా చెప్పావు” అని మెచ్చుకున్నారు మాష్టారు.    

“ఇంకెవరైనా?” అని మాష్టారు అడగ్గానే రాము నిలబడి  “మా  దొడ్లో  జామచెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్లేసరికి ఒక  సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో  అది జారి క్రింద పడిపోతుండేది. ఒకసారి  పెద్దగా  గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి  చిన్న  కొమ్మ విరిగడంతో  దారం తెగి క్రిందపడింది. అలా ఆటంకాలు వచ్చినా పట్టు వదల్లేదది. చాలా సార్లు క్రిందపడినా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించి చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో  ఇమిడిపోయింది సాలీడు ” అన్నాడు. 

“  నీకేం అర్ధమైందో చెప్పు?” అనడిగారు మాష్టారు. 

“ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదని,  ఎన్ని  ప్రయత్నాలు చేసైనా సరే పని పూర్తి చెయ్యాలని” అన్నాడు రాము.

 బాగా చెప్పావని రాముని మెచ్చుకున్నారు మాష్టారు. 

ఈసారి మాష్టారు అడగక ముందే రవి నిలబడ్డాడు.  ‘నేనూ ఒకటి చెబుతానంటూ’ మొదలుపెట్టాడు.

  “ మా పెరట్లో  పూలమొక్కలే కాకుండా  జామ, దానిమ్మ , వేపచెట్లున్నాయి. వేపచెట్టు కొమ్మల్లో తేనెటీగలు  తేనెపట్టుని  పెట్టాయి. అక్కడ నుండి  తేనెటీగలు వచ్చి పువ్వుల  మీద వాలాయి. ఒక్కో పువ్వునుండి మకరందాన్ని నోటిలోకి తీసుకొని ఝమ్మని ఎగురుతూ  తేనెపట్టులో దాచేసి  మళ్ళీ వచ్చేవి. ఇంకో పువ్వు మీద వాలేవి. అలా రోజంతా ఎగురుతూనే ఉన్నాయి. మకరందం తీసుకెళ్తూనే ఉన్నాయి” అన్నాడు.   

“నీకేం అర్ధమైందని“ వాడిని అడిగారు మాష్టారు. 

“తేనెటీగలకి  బద్ధకం లేదని తెలిసింది. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే కలిగే ఫలితం తేనెలాగా తియ్యగా ఉంటుందని బోధపడింది” అన్నాడు రవి.  

 మాష్టారు  “పిల్లలూ! నరేంద్ర అడగబట్టే  కదా వీళ్ళ  ముగ్గురూ  తెలుసుకున్న విషయాలను  మనతో చెప్పారు.  దీన్ని బట్టి  ప్రశ్నించడం అలవాటు  చేసుకోవాలని తెలిసింది కదా. వాళ్ళ ముగ్గురూ చెప్పినట్టు మనుషులు కూడా  ‘చీమల్లా ఐకమత్యంగా ఉండాలి.  కష్టపడి పని చెయ్యాలి.  తలో దారిలో వెళ్లకుండా ఒకే మాట, ఒకే బాటన్నట్టు ఉండాలి.  పనిలో  అడ్డంకులు వచ్చినా వదిలేయకుండా మరో ప్రయత్నం చెయ్యాలని, పూర్తయ్యేవరకు సాలీడులా  పట్టు విడువకూడదని తెలిసింది. తేనెటీగల విషయానికి వస్తే  అవి కష్టపడి తేనె పట్టు పెట్టినా తేనెను త్రాగలేవు. మనుషులే  వాడుకుంటారు. మనం కూడా ప్రక్కవారికి ఉపయోగపడే పనులు చేస్తుండాలని గ్రహించాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే  మిగతా జీవుల్లో కూడా   మంచి లక్షణాలెన్నో కనిపిస్తాయి”  అన్నారు. 

పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టి “అర్ధమైంది మాస్టారు. మేము కూడా మాలో మంచి లక్షణాలు పెంచుకుంటాము” అన్నారు ఏకకంఠంతో.

***నారంశెట్టి ఉమామహేశ్వరరావ

            *ధృతరాష్ట్రుని చింత:*           

భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది అన్నాడు . సంజయుడు సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. శ్రీకృష్ణుని అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభి షేకం చేస్తానని అన్నాడట. మిగిలినవారు వారించి అర్జునినికి సారధ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గధాఘాతాలకు తట్టుకోగలరా? అన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నాకొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేంచేయుదును అని పరితపించాడు. ధరమరాజు కామ్యకవనంలో అర్జునిని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపసుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునిని మీద ఆధారపై ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునిని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము. రణరంగంలో నన్ను ,అర్జునిని ఎదిరించే వారు లేరు అన్నాడు. అందుకు ధర్మరాజు భీమసేనా! ఆ విషయం నాకు తెలియును కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను అన్నాడు ధర్మరాజు.

[

మన ఆలోచనలే మనం

మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు.

ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం.

సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది.

‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది.

సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు.

క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం.

‘హెయిన్‌’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్‌ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే.

   మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది.

కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు.

మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది.


మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు.

[

జీవన యోగం

ఆధ్యాత్మిక పరిభాషలో యోగం జీవాత్మ పరమాత్మల సంయోగం. వ్యక్తిచైతన్యం విశ్వచైతన్యంతో లీనం అయినప్పుడు యోగం అవుతుంది. విశ్వచైతన్యం అంటే విష్ణుచైతన్యం విశ్వం విష్ణువు స్వరూపమే. యోగసాధన జీవితంలో సాగవలసిన నిరంతర ప్రక్రియ.

శరీరం, మనసు, ఆత్మ- త్రివేణి సంగమించిన ప్రయాగ క్షేత్రం మనమేనని తెలుసుకోవడమే ఎరుక లేదా జ్ఞానం. మూడూ ఒకదానితో ఒకటి లంకె వేసుకున్నందువల్ల ఒక నియతిప్రకారం పురోగమించి జీవితాన్ని పండించుకోవాలి. మనం శరీరానికి, ఆత్మకు మధ్యన ఉన్న మనసు సంధానకర్తలాంటిది. ఇటు భౌతిక బంధానికి అటు ఆత్మోన్నతికి మనసే కారణం మనసును మెల్లగా ఆదుపు చేయడాన్నే అభ్యాసయోగం అంటారు. అభ్యాస యోగి సత్కర్మలు చేస్తూ లోకకల్యాణం సాధిస్తాడు. కుండలినీ యోగం లేక హరయోగం గురించి పతంజలి మహర్షి యోగ శాస్త్రం, ప్రముఖంగా రాజయోగం గురించి గీతా గ్రంథం చక్కగా చెబుతున్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానమనే ఏడంచెలు సాధించాలి. సమాధి అనే యోగసిద్ధిని పొందాలి. మొదటి నాలుగు అంచెల ద్వారా శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. అనంతరం అంతర్ముఖం కావడం. ఏకాగ్రత పొందడం. ఒకే వస్తువుపైన బుద్ధినిలపడం అన్న మూడు సంబంధించినవి. చిత్తవృత్తులు మనసుకు ముఖ్యంగా నిరోధించమని, సమతౌల్యం సాధించమని పతంజలి యోగం చెబుతున్నది.

దేశ, కాల, పాత్రలను బట్టి యోగాభ్యాసం పలుమార్పులకు, చేర్పులకు లోనయింది. శారీరకంగా ఆరోగ్యం సాధించడానికి బోలెడు వ్యాయామాలున్నాయి. అంతరంగంపై నియంత్రణ సాధించడమే అసలైన యోగ సాధన పామరులకు కూడా పనికి వచ్చే అష్టాంగమార్గం చెప్పాడు బుద్ధుడు.

భౌతిక జీవితంలో వేగం పెరుగుతున్నకొద్దీ అంతరంగిక యోగ సాధనకు అంతరాయం కలుగుతున్నది. ఉన్నంతలో యోగ బలం పుంజుకోవడానికి సులభమైన, సరళీకృతమైన, యోగ విద్యకు రూపుదిద్దవలసిన అవసరం ఉన్నది.. మనం చేయవలసిన పనులు యంత్రాలు చేయలేవు. శరీరం కర్మక్షేత్రం. ఆది కర్మాగారంగా మారితేనే ప్రమాదం. యాంత్రికజీవనం మనిషిని మరమనిషిగా మార్చివేస్తుంది. కర్మచేయడంలో నేర్పరితనమే యోగం అంటున్నాడు కృష్ణుడు.

కర్మాగారంలో వేగంగా, ఒకే నమూనాలో వేల సంఖ్యలో వస్తువుల్ని తయారుచేయవచ్చు. ఈ శరీరాన్ని ధర్మసాధన చేయడానికి ఉపయోగించాలి. 'శరీరమాద్యంఖలు ధర్మసాధనమ్ అన్న ఆప్తవాక్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆశ్రమ ధర్మాల ద్వారా పురుషార్ధం సాధించాలని అర్జునుడికి బోధించాడు. గీతాచార్యుడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం, చతుర్విధ పురుషార్థాలు, ధర్మంగా అర్ధ కామాలు

అనుభవిస్తూ చివరి పురుషార్ధమైన మోక్షం సాధించడమే జీవన యోగం. సాధన వల్ల సమకూరనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదంటారు. జీవితమే ఒక యోగమై సాగితే భవ్య జీవితం దివ్య జీవనంగా మారుతుంది. మానవుడు. దివ్య మానవుడవుతాడు. నిండు నూరేళ్లు జీవించి పండులా రాలిపోవడమే. మోక్షం. అదే జీవనయోగం. - ఉప్పు రాఘవేంద్రరావు

[