Tuesday, 9 February 2021

11-02--2021

 

 

తేటగీత పద్యాల్లో నాతండ్రి
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
6281190539

గుండె చప్పుడు వినబడి గోప్య మయ్యె  
మయ్యె కమిలిన దేహము మంచు వల్లె
మంచు ఆలి బిడ్డలకు యె మౌన మల్లె
మౌన సతమతమవుతుండె మనసు గుండె

అలలు వలెనేను కష్టము అలుక తీర్చి
తీర్చి ఆత్మస్థైర్యంతోను తనువు ఇచ్చి
ఇచ్చి వెరవని కడలిలా ఈప్సి తమ్ము
ఇల్లు ఇల్లాలు బిడ్డలు ఇష్ట కున్న

ఇంట నవ్వుల పువ్వుల ఈశ్వరుఁగను
ఈశ్వరని మాయను భరించి ఇంట నున్న
నిత్య యుధ్ధోన్ముఖుడుగను నింగి నేల
ఏక మైనను భార్యను ఏలు చుండు

కంటి నలుసుని నలపక  కంద నివ్వ
కుండ, కనుపాపలాగుండు కామ్య దాత  
సూర్యచంద్రుల వలేను స్ఫూర్తి తోను
జీవిత సమరానికి నిత్య జీవి నాన్న

చిద్వి లాససంపదతోను చిన్మయమ్ము
చూపి, చిల్లగవ్వ ను లేని చేతి యన్న
యన్న మాటకు ఓర్పుతో యుండె జీవి
సకల సౌఖ్యమ్ము లందించు స్వామి నాన్న

జీవి తమ్మున నిర్ధేశ జయము చూపి
బ్రతుకు పాఠాలు నేర్పేయు భయము తుంచె  
గడప దాటిఇంటిలొ గుట్టు గాయ మయిన
కలలు నెరవేర్చు నిత్యమ్ము కన్న తండ్రి

ఒంటి రెక్కగా ఇంటిలో ఒత్తు లాగ
కరిగి వెలుగును పంచేటి కన్న తండ్రి
ఎన్ని చీకటి రాత్రులు ఏకమైన
మనసు ఇచ్చిపుచ్చుకొనెడి కన్న తండ్రి      
--(())--
 

🌹. సప్త మహర్షులు - సప్త ఋషి మండలము 🌹
(అత్తివిల్లి బాలసుబ్రహ్మణ్యం)
📚. ప్రసాద్ భరద్వాజ

సప్త ఋషులు అనబడేవారు ఒక గణం. ఆ గణంలో ఏడుగురు ఋషులుంటారు. ప్రతి మన్వంతరంలో ఒక గణం ఉంటుంది. మహాప్రళయానికి ముందయితే 14 మన్వంతరాలుంటాయి కనుక 98 మండి సప్తర్షులు ఉంటారు! బ్రహ్మ మానస పుత్రులయిన ఇప్పటి వైవస్వత మన్వంతరంలోని సప్తర్షులు వరుసగా - మరీచి, అంగీరస, అత్రి, పులస్త్య, వశిష్ట, పులహ, క్రతువులు.

మనది కర్మభూమి అయిన ఋషిభూమి. ఈ జగత్తును పాలించేది రాజులయిన, వారిని తమ సలహాలతో, శిక్షణలతో ముందుకు నడిపించేది వారివారి గురువులయిన ఋషులే! అంతేకాదు, మానవాఌకికూడా ఋజువర్తన, సత్ప్రవర్తనలకు మార్గం నిర్దేశించిందికూడా మహనీయులయిన ప్రాచీన ఋషులే. అందుకే మానవజాతి వీరికేంతో ఋణపడి ఉంది. మనుష్య జన్మనేట్టిన ప్రతి ఒక్కరూ పితృ ఋణం, మాతృ ఋణం, గురు ఋణం (ఋషిఋణం), దైవ ఋణాలను తప్పక తీర్చుకోవాలని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.

సప్తఋషిగణంలోని ఏడుగురు మహర్షులు వరుసగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని - ఇది మరొక క్రమం. తమ అమోఘ తపఃశక్తితో, నియమ నిష్ఠలతో మానవజాతికి సన్మార్గాన్ని నిర్దేశించి, వినువీధిలో "సమ్ప్తఋషి మండలం" గా వేలుగుసోబగులు గుప్పిస్తున్న ఈ మహనీయ, ఋషిపుంగవుల గురించి కొంతయిన తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం.

1. కశ్యపుడు సూర్యుని మానస పుత్రుడైన మరీచి తనయుడు. దక్షుని కుమార్తెలయిన అదితి, దితి మొదలయిన పన్నెండు మందిని పెళ్లాడి, సృష్టిని వృద్ధి చేసిన ఇతనికి దేవదానవులు, నరులు, మృగాలు, పశు, పక్షి, వృక్షాదులను కూడా ఇతని సంతతిగానే పేర్కొంటారు. విష్ణువు వామనవతారంలో ఇతనికి పుత్రుడుగా జన్మించాడు. అలాగే, రామకృష్ణావతారాల్లో కూడా కశ్యపుడే దశరథుడుగా, వసుదేవుడుగా జన్మించాడని మన పురాణోక్తి! ధర్మ ప్రబోధం గావించే "కశ్యపధర్మసూత్రాలు", క్షమాగుణాన్ని చాటిచెప్పే "కశ్యపగీత"ను రచించిందీ ఇతనే.

2. అత్రి బ్రహ్మ మానస పుత్రుడు, మహాసాధ్వి అయిన అనసూయ భర్త, మరియు ఘోర తపస్సుతో త్రిమూర్తుల అంశలో చంద్ర, దత్తాత్రేయ, దుర్వాసులను కుమారులుగా పొందాడు. దేవదానవ యుద్ధంలో, చంద్రుడు రాహువుచేత కబళించబదాగా, సూర్యుడు పాలిపోవడంతో జగత్తంతా అంధకారమయిన తరుణంలో, అత్రి, సూర్యునికి ధైర్యానిస్తూ, చంద్రుడి, సూర్యుడి శరీరాలు., నక్షత్రాలు గావించి, ప్రకాశాన్ని తిరిగి రప్పించాడు. రామాయణ కాలంలో, తన ఆశ్రమానికి వచ్చిన సీతారామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి, అతని ధర్మ పత్ని అయిన అనసూయ సీతమ్మకు నూతన వస్తాభరణాలను ఇచ్చి, పతివ్రతాధర్మ సూక్ష్మాలను ఎరుక పరిచింది. అత్రి మహాముని, "అత్రి సంహిత", "అత్రిస్మృతి", అనే రచనలు చేసాడు. అత్రిస్మృతి కాలక్రమంలో "అత్రేయధర్మ శాస్త్రం"గా జగద్విఖ్యాతి నొందింది.

3. భరద్వాజుడు
దేవగురువైన బృహస్పతి కుమారుడు. అతన్ని మరుత్తులు పెంచి, భరతునికి అప్పగించారు. భరతునిచే స్వీకరించబడిన వాడు కనుక "భరద్వాజుడు"గా పిలువబడ్డాడు. గంగానదీ తీరంలో ఆశ్రమవాసియైన ఈయన, సీతారామలక్ష్మణులకు అరణ్యవాస సమయంలో ఆతిథ్యమిచ్చాడు. అదే విధంగా, రాముణ్ణి వెదుకుతూ వచ్చిన భరతునికీ, అతని పరిజనులకూ గొప్పగా విందు నొసగి, రాముడు చనిన దిక్కును తెలిపాడు. రావణ వధానంతరం తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఆతిథ్య మిచ్చాడు. ఈయన వ్రాసిన 'భారద్వాజస్మృతి' అనే శాస్త్రం - వసిష్ఠాది మహర్షుల కోరిక మేరకు - ఏయే కర్మలను, ఎప్పుడెలా ఆచరించాలో వివరిస్తుంది.

4. విశ్వామిత్రుడు
తండ్రి గాధి అనంతరం రాజయి, వేటకు వెళ్ళినప్పుడు, విశిష్ఠాశ్రమానికి వేలడం, అక్కడ ఉన్న కామధేనువును కోరటం, వశిష్ఠుడు నిరాకరించడం, కదనానికి దిగి భంగపడడం జరిగిన తరువాత, వశిష్ఠుని అమోఘమైన తపఃశక్తిని చూచి, రాజ్యాన్ని త్యజించి, ఘోర తపస్సు చేసి, మహేంద్రుడు పంపిన మేనక యౌవన-సౌందర్యానికి దాసోహమని, శకుంతల జన్మకు కారణమయ్యి, తప్పు తెలుసుకొని, తిరిగి ఘోర తపస్సు గావించి, తీవ్ర క్షామాన్ని అనుభవించి, పడరాని పట్లు పడి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, సత్యవ్రతుడనే రాజును బొందితో స్వర్గానికి పంపబోయి, సాధ్యం కాక, త్రిశంకు స్వర్గాన్నే స్రుష్టించి, వసిష్ఠునిచేత 'బ్రహ్మర్షి' అని పిలిపించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి, వెతలు అనుభవించి, కోపాన్ని జయించి, చివరకు ఆయనచే 'బ్రహ్మర్షి' అని అనిపించుకొని తృప్తి చెందాడు. విశ్వామిత్రుడే రామలక్ష్మణులకు ఎన్నో శాస్త్రాలు, మంత్ర విద్యలు ఉపదేశించి, ఎందరో దుష్ట రాక్షసులను సంహారం చేహించాడు. అలాగే మిథిలకు వాళ్ళను తోడ్కొని పోయి సీతారామ కళ్యాణానికి హేతువయ్యాడు. సంధ్యావందన గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి బహూకరించిన ఇతడు 'విశ్వామిత్ర స్మృతి' అనే గ్రంథాన్ని రచించాడు.

5. గౌతముడు
ప్రచేతసుని మానస పుత్రుడు. 'తను చల్లే విత్తనాలు వెంటనే మొలచి పంట పండా'లని ప్రార్థిస్తూ, బ్రహ్మను స్మరిస్తూ, గొప్ప తపస్సు చేసాడు. వర్షాభావంతో, క్షామం ఏర్పడినప్పుడు, ప్రజలకు తను స్వయంగా వంది, అన్నదానం చేసి, రక్షించాడు. అసూయాపరులైన కొందరు మునులు, గౌతముని సంపదను చూసి, ఒక గోవును అతని పొలంలోకి పంపగా, పైరు మేస్తున్న గోవున అదిలించటానికి ఒక దర్భను మంత్రించి వదలగా, గోవు మరణిస్తుంది. మునులు అతనమీద గోహత్య పాతక దోషం వెయ్యగా, గౌతముడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి, మెప్పించి, అయన జటాజూటంలో ఉన్న గంగను ఆవుప ప్రోక్షించగా, అది బ్రతకటమే కాకుండా, నీటిబిందువులు పడినచోట ఒక నది పుట్టగా, దానికి "గౌతమీ' అని, గోవును బ్రతికించింది కావున 'గోదావరి' అని పేర్లు వచ్చాయి. గౌతముడు, ధర్మ సూత్రాలు, న్యాయ శాస్త్రం, 'గౌతమ సంహిత' అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

6. వసిష్ఠుడు
పరమ పతివ్రతా శిరోమణి అయిన అరుంధతి భర్త. సూర్యవంశ క్షత్రియులకు గురువై, శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు జాతవివాహాది శుభ కర్మలను జరిపించాడు. అశ్రమాని వచ్చిన విశ్వామిత్రునికి అన్నం పెట్టిన పాపానికి, కామధేనువును అపహరించబోగా గుణపాఠం నేర్పాడు. అకారణాలవల్ల అనేక కష్టాలను, కాల పరీక్షలను, ఓర్పుతో, ధైర్యంతో, ఎదుర్కొని, చివరికి ధర్మం, శాంతం, సత్యగుణాలే విజయానికి సోపానాలని జగత్తుకు చాటి చెప్పిన జితేంద్రియుడు, సత్యస్వరూపుడు, ధర్మమూర్తి. హరిశ్చంద్రుని కీర్తి చిరస్థాయిగా నిల్పినవాడు. శ్రీరాముణ్ణి ధర్మపథంలో నడిపినవాడు ఇతడే. ఇతడు ప్రపంచలహిరి, వసిష్ఠధనుర్వేద సంహిత, వసిష్ఠ స్మృతి అనే గ్రంథాలను వ్రాసాడు.

7. జమదగ్ని సత్యవతీఋచీకుల పుత్రుడు. రేణుకాదేవిని పెళ్ళాడాడు. గొప్ప తపశ్శాలి అయినా, రేణుక మనస్సులో జరిగిని తడబాటును ఒకరోజు గ్రహించగానే, ఆగ్రహంతో ఆమెను వధించమని పుత్రులను అజ్ఞాపించాడు. అయిదుగురు పుత్రులలో చివరివాడైన పరసురాముడు పరశువుతో తల్లిని వధించి, తిరిగి తండ్రి ఇచ్చిన వర ప్రభావంతో ఆమెను బ్రతికిస్తాడు. అధికార మదంతో, దురహంకారి అయిన రాజు కార్తవీర్యార్జునుడు తన తండ్రిని మరియు సోదరులను చంపినందుకు అతణ్ణి హతమార్చి, ఆ రక్తంతో తర్పణంతో జమదగ్ని పునర్జీవితుడౌతాడు..జమదగ్ని తన అమోఘ తపఃశక్తితో సప్తఋషి మండలంలో స్థానం పదిలపరచుకున్నాడు.

ఈ సప్త మహా ఋషుల ప్రస్తావన రామాయణంలో కూడా చూడవచ్చు. ముఖ్యంగా రత్నాకరుడు వాల్మీకిగా మారటానికి కారణభూతులవుతారు. అతనికి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించి తరింపచేసి, రామనామ జపాన్ని బోధించి, వాల్మీకిగా మారుస్తారు. దివ్య తేజస్సుతో, కొన్నేళ్ళ తపస్సు తరువాత, క్రమ్ముకున్న వాల్మీకం నుండి బయటకు దివ్య తేజస్సుతో, ఋషిగా మారి వచ్చిన వాల్మీకిని సప్త మహర్షులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పవిత్రమైన, ఆదికావ్యమైన రామాయణ రచనకు అతన్ని నియోగిస్తారు.

ఈ సప్త ఋషులు, మన పురాణగాథల్లో, మన దివ్య సంస్కృతికి గుర్తులుగా నింగిలో నక్షత్ర రూపులై శాశ్వత మహోన్నతులుగా ప్రఖ్యాతి గడించి, నిలిచిపోయారు.
🌹 🌹 🌹 🌹 🌹

 🌹నేటి మంచిమాట🌹

ఎదగాలి అనుకునే వాడు,  తనకు తానే దారి వేసుకుంటాడు..
ఎదుగుదాములే అనుకునే వాడు, ఎవరో ఒకరి పంచన చేరుతాడు..
నీకు ఆసక్తి ఉంటే, నిన్ను ఏ శక్తి ఆపలేదు..
ఆదర్శాలకు పోవడం అలవాటు పడకు, ఆదరించే గుణం వదులుకోకు..
మాటకు మాట పోగేసే వారికి, మౌనాన్ని జవాబుగా ఇవ్వాలి..

కలుపుకుపోయే మనస్తత్వం, మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు...
అంతా నాకే తెలుసు, నాకెవరి అవసరం లేదనే అహం మనకుంటే,
సమాజమే మనని దూరం పెడుతుంది...
మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు, మనము ఎంత మంది, మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం!

☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకాః సమస్తాః సుఖినోభవంతు   
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.          
🌻🌻🌻🌻🌻
*_....✍️

 త్యాగమయి...

                      అమ్మ
                 ➖➖➖✍️

ఈ మధ్య గ్రామంలో ఒక మిత్రుడుని కలిశాను...

వాడి రెండస్తుల డాబాలో వాడు పైన ఉంటాడు. వాడి తమ్ముడు క్రింద పోర్షన్లో.

మాటల మధ్యలో వాళ్ళ అమ్మ సంగతి చెబుతూ అమ్మ తన దగ్గర పదిహేను రోజులు, తమ్ముడి దగ్గర  పదిహేను రోజులు ఉంటుందని, అలా బాధ్యతలు పంచుకున్నామని చెప్పాడు.

మనస్సు చివుక్కుమంది. ఏ సీజన్ లోనైనా ఎండిపోని ధార కన్నీరు బైటకు రాబోయింది.

అప్పుడు అనుమానం వచ్చింది. ఏయే నెలల్లో ముప్పయిఒక్క రోజులుంటాయో ఆరోజుల్లో అమ్మ ఉపవాసము ఉండాల్సి వస్తుందా...?

నాఅదృష్టం నా అమ్మను నాతో పంచుకోడానికి నాకు తమ్ముడు లేడు.

నాకు నాఅమ్మ ఒక మధుర జ్ఞాపకం.
తనకు నా ఆకలి ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం రాలేదు...

కొత్త బట్టలతో బైటకు వెళ్లివస్తే వెంటనే దిష్టి తీసేది...!

పరీక్షలకు బయలుదేరితే తీపిపెరుగుతో ముందు నిలిచేది...!

బాల్యంలో నా పిచ్చి భాషను క్షణంలో పసికట్టేది....!
ఇలా ఎన్నో ఎన్నెన్నో....

అమ్మ...!
బిడ్డ ఒక స్థనంలో పాలు తాగుతూ, రెండో స్థనాన్ని పలుమార్లు తన్నుతూ ఉంటాడు...

తనను తన్నే వారి కడుపు నింపే ఔదార్యం భగవంతుడు ఒక్కఅమ్మకు మాత్రమే ఇచ్చాడు....!

అమ్మ ఒక వేదం...
అమ్మ ఒక భక్తిభావం...
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన...
అమ్మ ఒక భావన...
అమ్మ ఒక పుస్తకం...
అమ్మ ఒక కలం...
అమ్మ ఒక కవిత...
అమ్మ ఒక జ్ఞానం...
అమ్మ ఒక గుడిలో దీపం...
అమ్మ ఒక హారతి పళ్లెం...
అమ్మ ఒక సుకుసుమం...
అమ్మ ఒక చల్లని చిరుగాలి...
అమ్మ ఒక అన్నపూర్ణ...
అమ్మ ఒక లాలిత్యం...
అమ్మ ఒక చీరకొంగు...
అమ్మ ఒక కరుణ...
అమ్మ ఒక దీవెన...
అమ్మ ఒక అక్షిత....
అమ్మ ఒక వర్షపు బిందువు...
అమ్మ ఒక మధురగేయం...
అమ్మ ఒక శ్వాస...
అమ్మ ఒక వూపిరి...
అమ్మ ఒక మురళి గానం...
అమ్మ ఒక జోలపాట...
అమ్మ ఒక పచ్చదనం...
అమ్మ ఒక కనురెప్ప...
అమ్మ ఒక దేవత...
అమ్మ ఒక పుడమి...
అమ్మ ఒక స్వచ్ఛత...
అమ్మ ఒక ప్రవచనం...
అమ్మ ఒక వెలుగు...
అమ్మ ఒక సుగుణం...
అమ్మ ఒక నమ్మకం...
అమ్మ ఒక ఆరోగ్యం...
అమ్మ ఒక భద్రత...
అమ్మ ఎన్నో ఎన్నెన్నో.......

ఇది చదివిన వారికి ఇంతమంది అమ్మలు జీవించివున్నారో, మరణించినారో తెలియదు. కాని ఒక్క మాట చెప్పగలను. ఎవరు అమ్మ దగ్గర ఉంటారో వారు అతిసంపన్నులు. అమ్మ సేవ భాగ్యం కలిగివుంటారో ధన్యులు, అదృష్టవంతులు
ఇంకా ఇంకా చెప్పలేనన్ని.........✍️

                       🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*🙏సర్వేజనాః సుఖినోభవంతు🙏
🕉️శుభోదయం*🕉️
 -------------------
🌻 మహనీయుని మాట🍁
        -------------------------
"ఎవరైనా మన కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఎంత నొప్పిని అనుభవించి ఉంటారో కదా... సూదితో గుచ్చి,దారాన్ని తన గుండా పంపినపుడు కలిగే నొప్పిని భరించినప్పుడే కదా పూవు మాలగా మారి దేవుని మెడలో చేరేది."
       --------------------------
🌹 నేటి మంచి మాట 🌼
      ---------------------------
"కనిపించేదాన్ని చూడటానికి కళ్లు కావాలి కనిపించని దాన్ని చూడడానికి వివేకం కావాలి."

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🕉🙏నమస్కారం మన సంస్కారం🙏🙏ఎలా నమస్కరిస్తే ఏమిటి? వివరాలు తెలుసుకుందాం.🙏*
☘☘☘☘☘☘☘
       "తూర్పుదిక్కు" కు నమస్కరిస్తే మన తల్లిదండ్రులకు నమస్కరించినట్లు. మనిషికి తల్లిదండ్రుల ఋణం గొప్పది.
🌸🌸🌸🌸🌸🌸🌸
          "పశ్చిమ" దిక్కు నమస్కారం భార్యబిడ్డలపై ప్రేమకు చిహ్నం. భార్యబిడ్డల ఆలనాపాలనా చూడాలి.
🌸🌸🌸🌸…
🌿🌸🌿

మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు...?
ఇష్ట పడినప్పుడు వసంతం రాదు...?
చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు...?
అలాగే, ఆశించినప్పుడు...
ఆత్మీయులు మనకు దొరకరు.!
జీవితం ఆనందమయం అయ్యేది,
కోరుకున్నది పొందినప్పుడే కాదు...?
పొందినవి ఆస్వాదించినప్పుడు!
ఎవరు కూడా,
ఊరికే మన జీవితములోకి రారు?
సృష్టికర్త...వారికి ఏదో ఒక పాత్ర,
మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు.!!

ఉప్పు ని "కూర" లో వేస్తే రుచి ఇచ్చింది కదా అని,
"పాల" లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది.!
"పదార్థాన్ని బట్టి అవసరము",
"పనిని బట్టి ప్రాముఖ్యత" ఉంటాయి.!!
కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా,
నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే,
నీ విలువ పెరుగుతుంది..

🎋శుభోదయం🍀🌾



సిరివెన్నెల చిత్రంకోసం కేవి మహదేవన్ గారు కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. హుషారైన డాన్స్ ట్యూన్నూ మాంచి మెలోడీని అద్భుతంగా కలిపేయడం మహదేవన్ గారికే చెల్లింది
చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, ఆనంద్, సుశీల

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ.. అది ఆహా ఓహో అంటున్నదీ

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా...

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో అంటూన్నదీ
అది ఆహా ఓహో అంటూన్నదీ..

రాసలీలా.. రాగహేల
రాసలీలా.. రాగహేల
రసమయమై సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగుల పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా...

https://youtu.be/wON0dH28wIE

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
చిత్రం : వందేమాతరం (1985)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి

పల్లవి :
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
చరణం 1 :
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి.. నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాలున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది.. నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీపక్కన

చరణం 2 :
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో నన్ను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ.. అది నిలిచి వుంది నాపక్కన
వేల తారకలు తనలో వున్నా.. వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ... ఈ నేలపైనే తన మక్కువ


శ్యామలానవరాత్రులు ఎప్పుడు?

మనకు అనేక నవరాత్రి పూజలు ఆచరిస్తుంటాము, చైత్రమాసంలో వసంత నవరాత్రులు అని శ్రీరామనవమి వరకు చేయటం

భాద్రపదంలో గణపతి నవరాత్రులు ఆచరించటం

ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు ఆచరించటం చేస్తూ ఉంటాము

  అయితే స్కాందంలో
ఆశ్వినే మధుమాసేవా తపోమాసేశుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాః ఫలదాయకం

ఆశ్వయజం, చైత్రం, ఆషాఢం, మాఘం ఈనాలుగు మాసాలు విశేష మాసాలు అని చెప్పబడ్డాయి.

వీటిలో మాఘమాస శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా అమ్మ వారిని ఆరాధించటం విశేషం

ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులలో ప్రధానమైన జ్ఞాన స్వరూపం శ్యామలా దేవి

ఈమాఘ మాసంలో అమ్మను శ్యామలా దేవి స్వరూపంలో ఆరాధించాలి, కాళిదాసు వారు అమ్మను ధ్యానించిన రూపంలో మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలినీ అన్నట్లుగా అమ్మవారి మరకత రంగు కలిగిన శ్యామలా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని లేదా గృహంలో అమ్మవారి విగ్రహం ఉంటే చక్కని మరకతం రంగు చీరను అమ్మకు అలంకరించి తొమ్మిది రోజులు అమ్మను కుంకుమ పూజచేత ఆరాధించి పాయసాన్నాన్ని నివేదించి, శ్యామలా స్తోత్ర దండకాదులను పారాయణ చేయాలి

అలా ఆచరించటం ద్వారా జ్ఞానం ఐశ్వర్యం, కలుగుతాయి వివాహాలు కావలసిన వారికి వివాహం అవుతుంది, వివాహం అయినవారికి దీర్ఘ సుమంగళిత్వం కలుగుతుంది, గృహంలో శుభములు మంగళములు కలుగుతాయి.

12-2-2001  శుక్రవారం నాడే శ్యామలా నవరాత్రులు ప్రారంభం

                Chandrasekharrallabhandhi
శ్రీనివాస సిద్ధాంతి.9494550355.

నవగ్రహాలు-పూజాఫలం

 నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.
ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.
 
గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.
బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తారు. లౌకిక ప్రపంచానికి కొద్ది దూరంగా ఉందామని.. దేవతా పూజలో నిమగ్నం చేసే ఆలోచనలను ఇస్తాడు. కేతువు తర్వాతి గ్రహం శుక్రుడు.ఈయన్ని పూజిస్తే దాంపత్య జీవితంలో అన్యోన్యతను పెంచుతాడు. సంతానాన్ని ఇవ్వగలుగుతాడు.
ఇక గ్ర‌హాల అనుకూలత తగ్గిన పరిస్థితుల్లో శాంతి చేయించాలి. ఆర్థిక, మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తితే.. గ్రహదోషమని భావించాలి. అయితే ఏ గ్రహం వల్ల అశాంతి కలిగిందనే విషయాన్ని జ్యోతిష్యులను సంప్రదించి వారి సూచనల మేరకు, ఆ గ్రహానికి శాంతి చేయించుకోవడమే గ్రహశాంతి అంటారు.

జాతక,వాస్తు,ముహూర్త విషయాలకు phone ద్వారా కూడా సంప్రదించవచ్చును.
ద్విస్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
లక్ష్మీ లలితా వాస్తుజ్యోతిష నిలయం
9494550355

plez forward the message
* మృత్తికా ప్రసాదం, కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం

  మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

    ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

   మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

  ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేoతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

 * మృత్తికా ప్రసాదం వివరాలు

01. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

02. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

03. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

04. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

05. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

06.ఎ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్తానం చేయిoచే సమయంలో  వేడి నీటితో స్తానం చేయిoచిన అనంతరం  దేవునికి నేతి దీపాన్ని వెలిగించి  ప్రాద్దించి  ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

07. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

08. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర  నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.

09. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తికాను  వేసి దేవునికి చూపించి ప్రాద్దన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత  వేసిన వదలి పోతుంటాయో అ
టువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్తానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.

ఆధునిక ప్రార్ధన

ఓ భగవంతుడా, ఆసుపత్రికి వెళ్లే అవసరం రాకుండా చూడు!

పోలీసు స్టేషన్ కు వెళ్లే సమస్య లేకుండా చూడు!

కోర్టు మెట్లెక్కవలసిన కేసులు రాకుండా చూడు!

ప్రజానాయకుడు దగ్గరకువెళ్లే పని లేకుండా చూడు !

మంత్రిగారిని కలవవలసిన ముప్పేమీ రాకుండా చూడు!

రౌడీతో రాజీ పడవలసిన రోజు రాకుండా చూడు!

దేవుడికి ముడుపులు కట్టవలసిన కోరిక కలగకుండా చూడు!

పూజలు చేయవలసిన పాపాలు చేయకుండా చూడు!

యజ్ఞాలు, హోమాలు చేయవలసిన ధ్యేయాలు లేకుండా చూడు!

బాబాల దగ్గర మోసపోవలసినంత అమాయకత్వం లేకుండా చూడు!

వాముల దగ్గరకు పోవలసినంత  అజ్ఞానం లేకుండా చూడు!

మొబైల్ మోసాల మాయలో పడనంత మెలుకువ ప్రాదించు!

సైబర్ నేరగాళ్ల వలలో పడనంత ఆలోచన అందించు!

విద్యుక్తధర్మం నిర్వర్తించే వివేకాన్ని అనుగ్రహించు!

పర్యావరణాన్ని రక్షించే పట్టుదల ప్రసాదించు!

మూగజీవులకు మమత పంచే మానవత్వం అనుగ్రహించు!

వసుదైక కుటుంబం కాంక్షించే విశాలహృదయం ప్రసాదించు!

సమస్యలను ఎదుర్కొనే సంయమనం అనుగ్రహించు!

సంఘజీవిగా మెలిగే సంస్కారాన్ని ప్రసాదించు!

విలువలు వెలిగించే వ్యక్తిత్వాన్ని అనుగ్రహించు!

న్యాయాన్ని నిలబెట్టే నిబద్ధత ప్రసాదించు!

అన్నార్తులకు అన్నం పెట్టే అవకాశం అనుగ్రహించు!

అభాగ్యులను ఆదుకునే సమర్ధత సమకూర్చు!

అక్రమాలను అడ్డుకునే సంకల్పం ప్రసాదించు!

ఆఖరిక్షణం వరకు నీ నామ స్మరణ జరిపే వరం ప్రసాదించు!

ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఎగిరిపోయే జీవితం అనుగ్రహించు!🙏

 

1. అతి చిన్న విషయానికి నానా రబస చేయు వారినుద్దేశించి ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు?
జ:
ఇల్లు పీకి పందిరి వేయడం
2.  ఇంట్లోని విషయాలను పట్టించుకోకుండా, పొరుగు వారికి ఉపయోగపడే పనులు చేస్తుండే వారిని గురించిన జాతీయం తెలుపండి.
జ:
ఇంటికి జ్యేష్టాదేవి పోరుగుకు లక్ష్మీదేవి

3. మాయమాటలు చెప్పి ఎదుటివారికి ఏ కొద్దిగానో ఇచ్చి వారి నుంచి ఎక్కువ కాజేయటం అనే భావనను తెలుపు జాతీయం తెలుపండి
జ:
ఈతాకిచ్చి తాటాకు గుంజినట్టు

4. పనికి మాలిన కబుర్లు చెపుతూ ఏదైనా చేసేస్తాను అని పలుకులు పలికే వారిని ఉద్దేశించి తెలుపు జాతీయం ఏమిటి
జ:
ఉత్తర కుమార ప్రగల్భాలు

5. లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించక పోవటం, అనుకున్నది సాధించే వరకూ వూరుకోక పోవటం భావనకు వాడే జాతీయం తెలుపండి?
జ:
ఎత్తిన కత్తి దించక పోవడం
6. ఏమిచెప్పినా అర్థం కాకపోవడం, ఏంతచెప్పినా వినిపించుకోకపోవటం వారిని ఉద్దేశించి వాడే జాతీయం ఏమిటి?
జ:
ఎనుపోతుపై వాన
7. చెయ్యకూడని పనిని బాహాటంగా చేస్తూ ఉండటం, చేసిన పనికి సిగ్గుపడక అందరికీ చెప్పుకోవటం గురించి తెలిపే జాతీయం ఏమిటి?
జ:
ఎముకలు మెళ్లో వేసుకు తిరిగి నట్లు

8. ఒకరికొకరు సహకరించు కోకుండా, ఎవరిష్టం ప్రకారము వారు నడుచు కోవడం అనే భావన తెలుపు జాతీయం ఏమిటి?
జ:
ఎవరికి వారే యమునాతీరే

9. నామమాత్రపు చదువు, మనుషుల పేర్లు మాత్రమే రాసే వరకూ వచ్చి ఆగిపోయిన అక్షర జ్ఞానం అని తెలుపడానికి ఏ జాతీయం వాడతారు?
జ:
ఎల్లయ్య మల్లయ్య చదువు
10. పచ్చి అవకాశ వాది అని తెలిపే జాతీయం ఏమిటి?
జ:
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం
---------------------------------------------------
                    వెంకట్.సి హెచ్ 



1 comment: