Thursday, 11 February 2021

13--02-+2021

 

 

May be an image of 2 people

 మత్త కోకిల.. మధురిమలు  
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :

నమ్మరాదుయు వమ్ముచేయకు
నిమ్నపల్కులు ఎప్పుడూ       
తప్పులెంచకు ఒప్పుమాటలు
తన్మయమ్మున ఎప్పుడూ

విశ్వభావము మందహాసము
విందు చేష్టలు ఎప్పుడూ
హాస్యమాలిక ఇప్పుడుంచుము
హావభావము ఇప్పుడూ

తగ్గ కుండక మించకుండగ
తప్పుచేయక ఎప్పుడూ
తాత చెప్పిన మామచెప్పిన
తేట పల్కులు ఎప్పుడూ

ఆచరించియు ఆశలేకయు
ఆదరించుము ఎప్పుడూ
కాలమంతయు గాధలన్నియు  
కావ్య మల్లెను ఇప్పుడూ
 
ఎక్కువెందుకు తక్కువెందుకు
ఏక మవ్వుట ఎప్పుడూ
ఏమి చెప్పిన ఆశచూపిన
ఏమి పల్కకు ఎప్పుడూ

ఎంతఅన్నను పట్టుపట్టిన
ఏమి చెప్పకు ఎప్పుడూ
ఎవ్వరెవ్వరి మాటలెందుకు
ఏకమవ్వుము ఇప్పుడూ

--(())--

తేదీ : 13-02-2021 శనివారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#శివుడు_పార్వతీ_దేవికి_మాఘ_మాస_మహిమలు_చెప్పుట...
వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును, శివ లింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను.... మహాముని ! ఈ మాఘ మాస మహత్యము ను యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని" ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను..
మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము...
ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి.. 'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని.., కానీ , ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరిక వున్నది. కాన.., ఈ యేకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాననని వేడుకొనగా.., పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను.., దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను.. శ్రద్దగా వినుము.
సూర్యుడు మకర రాశి యందు వుండగా మాఘ మాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘ మాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రము నందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాదు.. జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోట కాని, తటాకమందు కాని మాఘ మాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయే గాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానము జేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘ మాసము నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ..! మాఘ మాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను.. మాఘ మాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నది కాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింత గాదు.
ఏ మానవుడైననూ తన శరీరములో శక్తి లేక, కడకు బావి యందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసి గాని  తెలియక గాని మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును గాక.., మాఘ మాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘ పురాణము చదివి విష్ణు మందిరమున గాని, శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించ వచ్చును.. మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘ మాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యముల నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా..! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము.. ఓ పార్వతీ.! యే మానవుడు మాఘ మాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను.. సావదానముగా ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘ మాసమందు ప్రాతఃకాలమున నదీ స్నానము గాని, జపము గాని, విష్ణుపూజ గాని యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపముల చేత, ఖడ్గముల చేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువ జామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము, విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవ తనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాస మందు యే స్త్రీ అటుల చేయదో , అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములూ కలుగుటయేగాక ఆమె పంది,కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘమాస స్నానమునకు వయః పరిమితి లేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ యైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఏ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.
పార్వతీ.!దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు , మద్యము త్రాగి పరస్త్రీ లతో క్రీడించువారు , జీవహింస చేయువారు మాఘ మాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన యెడల వారి సమస్త పాపములు నశించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును.. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయని వాడునూ, యితరులను వంచించి వారి వద్ద ధనమును హరించిన వాడును, అసత్యమాడి ప్రొద్ధు గడుపువాడును, మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని, బిడ్డలను వేధించువాడును, రాజ ద్రోహి, గురు ద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యములనూ, ధర్మ కార్యములనూ చెడగొట్టుచూ, దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించు వాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘ మాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు.
దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను.. వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘ మాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసముల లోనూ మాఘ మాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘ మాసము శ్రేష్ఠమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగా నున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా నున్న వారు చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు.. కాన అట్టివారికి యెండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన యెడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్ని దేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభ ఫలితము కలుగును.
ఈ విధముగా ఆచరించెడి వారిని జూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘ మాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికి కాని , క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానమును చేయుమని చెప్పిన యెడల వారు పుణ్య లోకమునకు పోవుటకు యే అడ్డంకులునూ ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని, చేయలేని వారిని కాని, ప్రోత్సహించు వారలను కాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము, వంశ క్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళు జల్లుకొని,  సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట గాని, వినుట గాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింప వలయునన్న మాఘమాస స్నానము కన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణ లిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ..! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము..
ఇట్టి శ్రీ మాఘ పురాణ ద్వితీయోధ్యాయః పారాయణం సంపూర్ణం..
--(())--

“మా బెజవాడ చాలా గొప్పది.."


“అరవ వాళ్లకి మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.”


“అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ,

 కే.ఎల్.రావు, 

టి.వి.ఎస్. చలపతి రావు, 

డాక్టర్ దక్షిణా మూర్తి, 

మరుపిళ్ళచిట్టి, 

కాకాని వెంకట రత్నం,

 కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, 


ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు.

-

“సంగీతంలో"

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు..


చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,


 మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి,


 మంగళంపల్లి బాలమురళీకృష్ణ,


 బాలాంత్రపు రజనీ కాంత రావు,


 వోలేటి వెంకటేశ్వర్లు, 


మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు, 

శ్రీరంగం గోపాల రత్నం 


 బెజవాడకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు


“#సాహిత్యంలో 

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, 

పేరాల భారత శర్మ,

 చెరుకుపల్లి జమదగ్ని శర్మ 

     వంటి కవి పండిత శ్రేష్ఠులు,

 పరిశ్రమలతో పాటు ధార్మిక సంస్థలు నెలకొల్పిన 

చుండూరు వెంకటరెడ్డి, 

కౌతా పూర్ణానందం, 

మాగంటి సూర్యనారాయణ, 

జీ.ఎస్. రాజు, 


#సినీరంగం ప్రముఖులు..

 పోతిన శ్రీనివాసరావు, 

పూర్ణ మంగరాజు

కామరాజు,

 విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, 

నవయుగ శ్రీనివాసరావు,

కాట్రగడ్డ నరసయ్య, 


  తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల - బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.

-

“ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, 

తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు,


 జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా #లైబ్రరీలు పెట్టిన 

అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం,


   #మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, 


నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని అద్దంకిశ్రీరామమూర్తి, 

విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, 

బి.వి. రంగారావు, 

సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,కర్నాటి లక్ష్మినరసయ్య, 

సీడీ కృష్ణమూర్తి, 


   నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు, ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటిశివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి, చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల

నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డి, ఏబీకె ప్రసాద్, పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు - వీరిదీ బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!

-

“ప్రభాకర ఉమామహేశ్వర పండితుల ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు, నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, 

దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

“టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి లక్ష్మీ జనరల్ స్టోర్స్, వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు శ్రీ రామనవమి పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

“ తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా, బోడెమ్మ హోటల్, న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్, అలంకార్ సెంటర్, మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు, జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే జనం ఇవీ బెజవాడ అంటే.

-

“లీలా మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు రోడ్డు సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె, దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం, పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల హల్వా, రామచంద్రరావు హోటల్లో అరటి ఆకు భోజనం. 

మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు, కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం, సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక శిల్ప కళా క్షేత్రమా అనిపించే 

దుర్గా కళా మందిరం , మారుతి సినిమా, జైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు, ఎప్పుడూ హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.

-

“రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం, దివ్యజ్ఞాన సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ, ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో గోపికలతో సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే...


  ఇదే బెజవాడ..


మనం ఎదుగుతున్నాం...! 

నిజంగానే మనం ఎదుగుతున్నాం !


 చిన్నప్పుడు పెన్సిల్ విరగ్గొట్టిందని "కట్టి" అన్న మనం... ఇప్పుడు మనస్సు విరగ్గొట్టినా పోనిలే అనుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!!


 అమ్మ పాలు తాగి పెరిగిన మనం... ఇప్పుడు ఏది పడితే అది తాగి తిరుగుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!! 


నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం... ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!! 


అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం... అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం...!

మనం ఎదుగుతున్నాం !!! 


చిన్నప్పుడు “అమ్మ”లో ప్రేమను వెతుక్కున్న మనం... ఇప్పుడు ప్రేమించడానికి “అమ్మాయిని” వెతుక్కుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...  నేనే హీరో... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


గళ్ళపెట్టెల్లో చిల్లర దాచుకున్న మనం... అవే చిల్లరబుద్ధులతో బ్యాంకుల్లో కోట్లు దాచుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


క్యారంబోర్డు లో రెడ్ కాయినే లక్ష్యంగా పెట్టుకున్న మనం... ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ ని నీచంగా తిట్టుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


మాథ్స్ లో ఫెయిల్ అయినందుకే చచ్చిపోదాం అనుకున్న మనం... లైఫ్ లో ఫెయిల్ అవుతున్నా బ్రతికే ఉన్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


స్నేహితులతో జీవితాంతం కలిసే ఉందాం అనుకున్న మనం... జీవితంలో ఒక్కసారి వాళ్ళని కలిస్తే చాలనుకుంటున్నాం...! మనం ఎదుగుతున్నాం !!! 


చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం... ఇప్పుడు వస్తుంటే భాధపడుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!! 


సంతోషాల కోసం పోటిపడుతూ పెరిగిన మనం... ఇప్పుడు సంపాధనల్లో పోటీ పడుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!! 


చెడులో కూడా మంచిని చూస్తూ పెరిగిన మనం...  మంచి గురించి కూడా చెడుగానే ఆలోచిస్తున్నాం..! మనం ఎదుగుతున్నాం !!! 


చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం... ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!!


చిన్నప్పుడంతా ఎదగడానికి తొందరపడ్డ మనం... ఇప్పుడు ఎదిగిన్నందుకు సిగ్గుపడుతున్నాం...! 

మనం ఎదుగుతున్నాం !!! 


మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి... కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం...! కానీ... మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...! మనలో మనిషికి దూరంగా పారిపోతున్నాం..! మంచి నుంచి వేగంగా జారిపోతున్నాం...! నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం...! 

ఎందుకంటే మనం ఎదుగుతున్నాం !!! 

నిజంగానే మనం ఎదుగుతున్నాం !!!

 


    అరుంధతి నక్షత్రం కథ !(1)


అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.

రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు.
అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. 
పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చెయ్యగలరా అరుంధతి గురించి చాలా కథలున్నాయి. 
అందులో కొన్ని... వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. 
ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. 
ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు. 
పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు

. ఆమెనే అరుంధతి. పెళ్లి చేసుకుంటేనే తింటాను తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. 
ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది.

ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. 

అయితే అరుంధతి మాత్రం  దాని వంకే చూస్తూ ఉంటుంది. పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు అమ్మా అరుంధతి మీ ఆయన ఇన్నేళ్లు అయినా తిరిగిరాలేదు. కాస్త ఇటు చూడమ్మా అంటారు.
అయినా ఆమె చూపు మరల్చదు. 

కొన్ని ఏళ్ల తర్వాత వశిష్టుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది.  తన భర్తను తప్ప పర పురుషుడిని కన్నెత్తి చూడని మహా పతివ్రత అరుంధతి.ఇక అగ్ని దేవుడి ఎదుట సప్త రుషులు యజ్ఞం చేపడుతారు.
ఆ రుషుల భార్యలపై అగ్ని దేవుడు మోజు పడతాడు. 
ఈ విషయాన్ని అగ్ని దేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది.
ఆ ఏడుగురి భార్యల మాదిరిగా తానే రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక రుషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్ని దేవుడి కోరిక తీరుస్తుంది. 
ఇక చివరి రోజు తాను అరుంధతి అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించిన అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం.
అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆందర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు
. శక్తి కమారుడే పరాశరుడు. పరాశరుడి కుమారుడే వ్యాసుడు. 
అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.
--((**))--
 


[12/02, 8:01 pm] . Mallapragada: *🌸సత్- సంగం*🌸

🍁🍁🍁🍁
     

‘సంగం’, ‘సంగమం’, ‘సంగతి’, ‘సాంగత్యం’ అనే పదాలకు ‘కలయిక’ అని సామాన్యార్థం.

 ఏ రకమైన కలయికలనైనా ‘సంగం’ అనే పిలుస్తారు. ‘త్రివేణీ సంగమం’ అని నదుల కలయికను చెప్పడం పరిపాటి.

 అందరూ కలిసి ఉండే విధానాన్ని భౌతికమైన సంగమంగా భావిస్తాం.

 కానీ, మన ఆలోచనల్లో దేనితో కలిసి ఉన్నా దానిని కూడా ‘సంగం’ అని మాత్రమే పిలువాల్సి ఉంటుంది. 

వేనితో సంగమిస్తున్నామో వాని లక్షణాలను మనం కొన్ని తెచ్చుకుంటామని రసాయనిక చర్యలన్నీ తెలుపుతాయి.

 వెలుగుతో కలిసి ఉంటే జ్ఞానిగా, చీకటితో కలిసి ఉంటే అజ్ఞానిగా మారడం సహజం.

 అందుకే, ‘సంగం’ మానవ జీవితాల్లో చాలా ప్రాధాన్యం వహిస్తున్నది. స్నేహాదులు కూడా సంగమానికి ప్రతీకలే. అన్నిటికన్నా ముఖ్యమైనవి భావాలు. భావంతో సంగమించడం వల్ల మంచి-చెడు ఏర్పడుతాయి.

 ‘భగవద్గీత’ ఈ అంశానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది.

 ‘సంగం’ వల్ల వచ్చే సమస్యలను రెండు శ్లోకాల్లో ఏకరువు పెట్టింది.

*🌹ధ్యాయతో విషయాన్‌ పుంసాన్‌ సంగస్తేషూప జాయతే సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ క్రోధోభి జాయతే॥*

*క్రోధాత్‌ భవన్తి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమ:స్మృతి భ్రంశాత్‌ బుద్ధినాశః బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి॥*

మనం లోకంలో ఏ అంశాన్నైనా, వస్తువునైనా చూసినా, విన్నా, గుర్తు చేసుకున్నా, ఆలోచించినా దానితో మన ‘సంగమం’ మొదలవుతుంది. అది కావాలనిపించడం ‘కామం’. దొరకకపోతే వచ్చేది ‘క్రోధం’. దానితో విడదీయరాని అనుబంధం ఏర్పడటం ‘మోహం’. అందులోనే పడిపోయి ఏం చేస్తున్నామో అర్థం కాకపోవడం ‘స్మృతి భ్రంశం’. దానివల్ల ప్రవర్తనల్లో వచ్చే పూర్తి మార్పులే ‘బుద్ధి లోపం’. ఈ బుద్ధి సరైనవిధంగా పని చేయకుండా ప్రవర్తించేవాడు పరిపూర్ణంగా నశిస్తుంటాడు. అంటే, ‘ఒక వస్తువుతో మన కలయిక మనలను చివరికి ఎందుకూ పనికిరాని వాడిగా మారుస్తుందని’ భగవద్గీత సారాంశం. 

అంటే, అనవసరమైన కలయికలవల్ల ఎప్పటికైనా సమస్యలు తప్పవు. అవసరమైన పరతత్త్వంతో కలయిక (సంగం) ఒక్కటే మనకు కావాలి. బహుముఖమైన ఆలోచనలు ఏకముఖంగా, శక్తిముఖంగా ఉండాలి. అప్పుడే, వ్యక్తి ‘సత్సాంగత్యం’లో ఉన్నట్లు అర్థం. ఈ ప్రయత్నం చేయడానికి తగిన జ్ఞానం కావాలి. అలా దానితో సంగమించడానికి తగిన ప్రయత్నమూ ఉండాలి. అదీ చాలా తీవ్రస్థాయిలో ఉండాలి.

వస్తువుతో, వ్యక్తితో, వ్యవహారంతో, అధికారంతో, ధనంతో, ఆస్తిపాస్తులతో సంగమిస్తూ మనతో మనం కలిసి ఉండటం ఎలాగో చాలామందికి తెలియడం లేదు.

 ‘శాశ్వతం’ కాని వాటిని మన అజ్ఞానం వల్ల శాశ్వతమని భ్రమించి వాటితో కలిసిపోతున్నాం. అవన్నీ వెళ్ళిపోతుంటే విపరీతమైన వేదనకు గురవుతున్నాం. అందుకే, మనలోనూ, మన చుట్టూ ఉండే చైతన్యాన్ని గుర్తించి, దానితో నిరంతరం సంగమిస్తూనే ఉండాలి. దాని గురించే ఆలోచించాలి.

 శ్రవణం, కీర్తనం, మననం, ధ్యాస అన్నీ దానిపైనే కేంద్రీకరించాలి. అదే ‘సత్సంగం’ అవుతుంది.

 శాశ్వతమైన సత్యం లోకంలో ఒక్కటే ఉంటుంది. అదే శక్తి. దానితోనే నిరంతరం సంగమిస్తూ ఉండాలి. అది అత్యంత శుద్ధమైంది. కాబట్టి, మనలోని మాలిన్యాలను క్రమంగా శుద్ధి చేసుకుంటూ దానితో నిరంతరం కలిసి ఉండే ప్రయత్నం చేస్తుంటే, మనమూ ‘పరమాత్మ స్వరూపులం’ అవుతాం. ‘

మన దేహమే దేవాలయంగా మారాలంటే మనలోని అజ్ఞానమనే నిర్మాల్యం వెళ్ళిపోవాలని’ శంకర భగవత్పాదులవారు ఏనాడో ఉద్బోధించారు.

 సత్యంతో సంగమించడం వల్ల కలిగే ‘సత్సాంగత్యం’ ఇక ఇతరమైన వానితో సంగమం లేకుండా చేస్తుంది. శంకరులు చెప్పినట్లు సత్సాంగత్యం వల్ల మనిషి సంగరహితుడవుతాడు.

 దానివల్ల మోహ రాహిత్యం కలుగుతుంది. క్రమంగా మన మనసు నిశ్చలమవుతుంది. ఈ దశలో ఆ వ్యక్తి పొందే స్థితినే ఆధ్యాత్మిక నిపుణులు ‘జీవన్ముక్తి’ అంటారు.

🍁🍁🍁🍁
[12/02, 8:01 pm] . Mallapragada: ఏకాగ్రతా రహస్యం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు.
కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం.
ఎవరు ఏ పని చేస్తున్న ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి.
ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది,
అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివృత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం.
కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు.
దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది.
భగవద్గీతలో అర్జునుడు ఈ విధం గా అడుగుతాడు..
అర్జునుడు : కృష్ణా! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ! దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బందించడం లాంటిదే! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడం ఎలా...?
కృష్ణుడు : అర్జునా! నువ్వు చెబుతున్నది నిజమే. మనస్సు చంచలమైనది. దాన్ని నియంత్రించడం అంతా సులభమైన పని కాదన్నది నిజమే! అయితే అంతటి చంచలమైన మనసును సైతం నిరంతర సాధన ,అంటీ ముట్టని ధోరణి అనే బలం ద్వారా నియంత్రణలోకి తీసుకురావచ్చన్నది అంతే నిజం.
మనస్సును నియంత్రణలోకి తీసుకురావడానికి అన్నిటికన్నా ముఖ్యంగా, మొట్టమొదట ఓ విషయం తెలుసుకోవాలి. తాము పోరాడదలచిన మనస్సు స్వభావాన్ని స్పష్టంగా అర్ధం చేసికోవాలి.
మనస్సనేది కోతి లాగ చంచలమైనది. తప్పతాగి మత్తెక్కిన ఏనుగు లాగ చాల బలమైనది. అలాంటి మనసును నియంత్రించడమనేది అర్జునుడు చెప్పినట్లుగా, గాలిని పట్టుకోవడం లాంటిదే! కోతులను పట్టుకోవడంలోను, ఏనుగులకు శిక్షణ ఇవ్వడం లోను ఎలాంటి నైపుణ్యం అవసరమో – అంతా నేర్పు మనస్సును క్రమబద్దీకరించడానికి కావాలి.
భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికీ, ప్రతి వస్తువుకు ఓ విలక్షణమైన స్వభావం ఉంటుంది. ఉదాహరణనకు వీయడమనేది గాలి స్వభావం. కాల్చడమనేది నిప్పు స్వభావం. పారడమనేది నీటి స్వభావం. అదే విధంగా ప్రతిదాంట్లో తల దూర్చడం, ఒక విషయం మీద నుంచి మరో విషయానికి దూకడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యల గురించి దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, మనకు అప్పగించిన పని గురించి కాకుండా మిగిలిన ప్రతి ఒక్క పని గురించి పట్టించుకోవడం – ఇదీ మనస్సు స్వభావం.
ఇటువంటి మనస్సును నియంత్రించగలిగితే, మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించ గలుగుతాం.
మరి మనసును ఎలా నింత్రించాలి? ఆ పని ఎలా చేస్తాం? మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాల పాత్ర ఇక్కడ వస్తుంది.
కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – ఈ అయిదు మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్ని మనస్సును అన్ని వైపులా లాగుతూ ఉంటాయి. కాబట్టి, వివేకాన్ని ఉపయోగించడం ద్వార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.
ఇలా ఇంద్రియాలను అదుపులో ఉంచడాన్నే సంస్కృతంలో ‘దమం’ అంటారు. నిజానికి ,ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా కూడా ఇష్టమొచ్చిన చోటుకు మనస్సు పోగలదు. అలాంటి సందర్భాలలో బుద్దిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఇలా తిన్నగా మనస్సును నిశ్చలంగా ఉంచే పద్ధతినే ‘శమం’ అంటారు.
మనస్సు గురించి, దాని ఏకాగ్రత గురించి ఎన్నో వివరాలు తెలిసిన తరువాత, ‘అసలింతకీ, మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి?’ అని కొందరు అడుగవచ్చు.
దీనికి సరైన సమాధానం తెలుసుకొని తీరాలి. దానికి సరైన జవాబు ఒక్కటే: మనస్సు గనక అదుపులో ఉంటె ఉన్నత లక్ష్యాలను సైతం సాధించాగాలుగుతాం. అదే మనస్సు అదుపులో లేనట్లయితే, అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనస్సుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది.
ప్రాచీనకాలంలో మన ఋషులు నిరంతర ప్రయత్నాలతో మనస్సును తమ అదుపులోకి తెచ్చుకొని ,మానసిక సమతౌల్యాన్ని సాధించారు. అదే వారు చేసిన మొదటి పని. అలాంటి మనసును ఏకాగ్రపరిచినప్పుడు అద్భుతమైన యోగ రహస్యాలను వారు కనుగోనేలా అది (మనస్సు) చేసింది. అది వారికి దివ్య జ్ఞానాన్ని అందించింది.
స్వామి వివేకానంద చెప్పినట్లు, ఏకాగ్రతతో కూడుకున్న మనస్సు నిజంగా ఓ సెర్చి దీపం లాంటిది. దూరంగా, చీకటి మూలల్లో పడి ఉన్న వస్తువులను కూడా మనకు కనిపించేలా చేస్తుంది ఆ సెర్చి దీపం.
సరే! మనస్సును ఏకాగ్రపరచాలన్న మాట నిజమే? కానీ, దాన్నీ ఏ వస్తువు మీద ఏకాగ్రపరచాలి? మనం అందరం యోగులం అవడానికి ప్రయత్నిస్తున్నాం కావున, మనం అందరం స్వయం ప్రకాశితమైన మన ఆత్మజ్యోతి మీద మన మనస్సును ఏకాగ్రపరచాలి.

 [11/02, 8:49 pm] +91 94414 08564: 🌻  *మహా భారతం* 🌻

🎈 *భాగము 42* 🎈

💧 *వీడుకోలు* 💧

🍃🌺సంజయుడు అణ కువతో దోసిలియొగ్గి, ‘‘గోపాలదేవా! జరిగిపోయిన దానికై మాటిమాటికీ మథనపడి దానినే ప్రస్తావించిన వ్యవహారం చక్క బడుతుందా’’ అన్నాడు. కృష్ణుని కనుకొసలు ఎరుపెక్కాయి. ‘‘సంజయా, ఆ దారుణ పరాభవ వేళ భీష్మకృప ద్రోణాచార్యులు మొదలైన పెద్దలంతా కురుమహీపతి మనసులోని అభిప్రాయాన్ని ఆకళించుకోలేక నోరెత్తక చలించక బొమ్మలవలె కూర్చున్నారు. 

🍃🌺కురురాజు అంతటి ఘోరం జరుగుతున్నా, యిదేమని కొడుకులను మందలించ లేకపోయాడు. అదేనా పెద్దరికము? దురహంకారంతో కొవ్విన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి కొప పట్టి నిండుసభలోనికీడ్చుకు వచ్చినపడు, ఆమె గోలుగోలున నిస్సహాయురాలై ఆక్రోశించినపడు ఆ మామగారెట్లు సహించగలిగిరో? ఇపడు పాండవుల యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని నిన్నిక్కడికి ఎట్లు పంపగలిగిరో? నాటి సభలో రాధేయుని అసభ్య ప్రేలాపనలను నీవు కూడా మరిచిపోయావా? ‘‘నీ మగలందరూ ద్యూతంలో పరాజితులైనారు. 

🍃🌺నువ్విపుడు దిక్కులేనిదానవు. ఇక నైనా నిన్ను ప్రాణపదంగా చూసుకునే పురుషుణ్ణి ఎంచుకో వారజాక్షీ! అని కలకలనవ్వి అపహసించాడు ఆ నీచాత్ముడు. అట్టి పలుకులు పాండవుల హృదయాలలో గుచ్చుకుని, నేటికీ వేధిస్తున్నవి. ఇక దుర్యోధనుని మాటలు మాత్రము తక్కువా. నాటి మాటల గాయాలు పాండవుల మనసులలో ఇంకనూ పచ్చిపచ్చిగానే వున్నాయి. 

🍃🌺అందుకని సంధి పొసగడం అంత చిన్న విషయం కాదని నా నమ్మకం. అయినా, నేను చేయగల ప్రయత్నాలన్నీ చేస్తాను. హస్తినకు స్వయంగా వస్తాను. ఇరుపక్షాలకు నచ్చజెప్పి, యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేసి, శాంతి ప్రియుడననే కీర్తిని దక్కించుకుంటాను’’ అన్నాడు వాసుదేవుడు.

🍃🌺తిరిగి ప్రశాంత ధోరణలో కృష్ణుడు, ‘‘సంజయా! దుర్యోధనుడు కేవలం రోషావేశ స్వరూపమైన మహావృక్షం. రాధేయుడు ఆ వృక్షపు మొదలు. వేపుగా విస్తరించిన కొమ్మలు శకుని. పుష్పఫల గుచ్ఛాలు దుశ్శాసనుడు. ఆ దుర్యోధన వృక్షానికి మూలశక్తి ధృతరాష్ర్టుడు. ఇక యిటువైపు ధర్మనందనుడు ధర్మతరువు. అర్జునుడు దాని కాండము. భీమసేనుడు ఆకాశాన్ని చుంబించిన మహాశాఖ. 

🍃🌺నకుల సహదేవులు ఫలపుష్పాలు. నేను, ధర్మపరులైన మహీసురులు చతుర్వేదాలు. ఇంకొక్క సంగతి. నూర్గురు పుత్రుల ధృతరాష్ర్టుడు ఒక మహారణ్యం. పాండవులయిదుగురు మృగేంద్రాలు. సింహాలు లేని వనంలో వృక్షాలు మనజాలవు. జనం నిర్భయంగా నరికివేస్తారు. అందుకే వీరు వారు కలిసిమెలిసి ఉండడం శ్రేయస్కరం. చెట్లు లేని చోట సింహాలు ఉండడమూ కష్టమే. సంధి కుదిరితే సంతోషం. 

🍃🌺యుద్ధమే అనివార్యమయితే అందుకూ సిద్ధమే. కనుక యిక్కడ జరిగినవన్నీ మీరాజుకి వివరించు. త్వరలో హస్తినకు నేను వస్తానని చెప. కురురాజు తుదినిర్ణయంపై భవిష్య కార్యక్రమం ఆధారపడి వుంటుంది’’ అని ముగించాడు.సంజయుడు కృష్ణునికి నమస్కరించి, ధర్మజుని వైపు తిరిగి ‘‘సాక్షాత్తూ వాసుదేవుడే హస్తినకు రానున్నపడు యిక కావల్సిందేమున్నది. నా రాక సఫలమైందని భావిస్తున్నాను. నా మాటలలో అనుచితాలేవీ లేవు కదా’’ అన్నాడు.

🍃🌺యుధిష్ఠిరుడు చిరునవ్వుతో, ‘‘సంజయా! ఇక్కడి వారందరికీ వ్యవహారాన్ని చక్కగా ఎరుక పరిచావు. అనుచితాలేమీ లేవు. యథార్థస్థితిని వివరించడంలో నువ్వు నిక్కచ్చి వైఖరిని ప్రదర్శించావు. నీ సంభాషణలో పొల్లుమాటలూ లేవు, కటువు పలుకులూ లేవు. ఇటువంట వ్యవహారాలలో నీవు, విదురుడు మాత్రమే దక్షులు. హస్తినలో బ్రాహ్మణోత్తములందరికీ నా నమస్కారలు అందజేయాల్సింది. 

🍃🌺ఆచార్య దేవులకు అంజలులు సమర్పించాల్సింది. మా జనకులు ధృతరాష్ట్ర మహీపతికి నా సాష్టాంగ నమస్కారం నివేదించవలసింది. కురుకుమారులందరి క్షేమసమాచారాలడిగినట్లు తెల్పాల్సింది. పూజ్యులైన పురంరఽధీశులందరికీ వందనాలు అందించాల్సింది. హస్తినలోని ప్రముఖులకు పెద్దలకు పేరుపేరున మా గౌరవాలు తెల్పాల్సింది. 

🍃🌺అక్కడి దాసదాసీ జనానికి మా జ్ఞాపకాలు అందించు. సంజయా! మా పితామహుడు భీష్మాచార్యుని కలిసి, నాడు శంతనువంశం నిలిపినట్లే నేడు పౌత్రులను సన్మార్గంలో నడిపించమని నా పక్షాన ప్రార్థించు. దుర్యోధనునికి బాసట గా యోధానయోధులు వుండి వుండవచ్చు. కాని మా దగ్గర అనన్య సామాన్య ధర్మశక్తి వుంది. ఆపైన వాసుదేవుని కటాక్షం వుంది. 

🍃🌺అందువల్ల కదనరంగంలో మమ్ముల జయించడం అసాధ్యమని అహంకారి దుర్యోధనునికి నా మాటగా వివరించు. నేను వయసులో పెద్దవాడిని కనుక చెబుతున్నాను. నా మాటను నా సోదరులు గౌరవిస్తారు. అందుకే చెబుతున్నాను. నెత్తురుకూడు నీకెందుకని నీవు కూడా అన్నావు కదా. మాకు ధర్మంగా రావల్సిన సగభాగం కూడా మేము ఆశించడం లేదు. అందరి హితం కోరి ఒక్కమాట చెబుతున్నాను.

🍃🌺మా అయిదుగురకూ అయిదూళ్ళు యిమ్మని చెప. కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం, యిదిగాక వారికి యిష్టం వచ్చిన మరొక్క ప్రాంతం యిచ్చినా చాలు. మేము సంతృప్తి పడతామని విశదపరుచు. దీనితో వైషమ్యాలు తొలిగిపోతాయి. ఎందరో ధరాధిపతులు నిశ్చింతగా ఉంటారు. ఇవన్నీ వారికి వివరించు’’ అన్నాడు. 

🍃🌺అందుకు వినమ్రంగా సంజయుడు కైమోడ్చాడు. రాయబారిగా వచ్చిన సంజయుని అమూల్య ఆభరణాలతో, విలువైన పట్టువస్త్రాలతో సత్కరించారు. బహు బహుమానాలతో సగౌరవంగా వీడ్కోలు పలికారు. సంజయుని రథం హస్తినవైపు కదిలింది.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

[11/02, 8:50 pm] +91 94414 08564: 🌻 *తెలిసుకోవాల్సిన మంచి విషయాలు.....* 🌻

🍃🍒66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.

🍃🍒67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.

🍃🍒68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.

🍃🍒69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.

🍃🍒70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.

🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹🌼🌹

[11/02, 8:52 pm] +91 94414 08564: 🌻 *భక్త* *పురందరదాసు* 🌻

🍃🌹కర్ణాటక సంగీత పితామహులు శ్రీ భక్త పురందరదాసు గారి జన్మదినం పుష్యమాస బహుళ అమావాస్య, ఈ రోజు వారి సంగీత వాగ్గేయకారోత్సవములు దేశమంతటా జరుగును ,భక్త పురందర దాసు ‘’దాసరేంద్రే పురందర  దాసరాయ ‘’-దాస  భక్తులలో పురందరదాసు శ్రేష్ఠుడు’’అని గురువు వ్యాసతీర్థులవారి ప్రశంస అందుకున్న భక్త శిఖామణి పురందర దాసు సంగీత కర్త, కవి అయిన వాగ్గేయకారుడు.  

🍃🌹కర్ణాటక సంగీతానికి  ఆద్యుడు అందుకే ‘’కర్ణాటక సంగీత పితామహ ‘’అని పురందరదాసు ను గౌరవంగా సంబోధిస్తారు. నారద మహర్షి అపర అవతారమనీ అంటారు దాసును.

వీరు దాదాపు 4 లక్షల 75 వేల  కీర్తనలు రచించారు.

🍃🌹ఆధ్యాత్మిక వేత్తలైన వారికి మాత్రమే బోధపడే శ్రీ  మద్ భాగవతాన్ని సుందర సరళతరమైన శ్రావ్యమైన పాటలు గా రాసి సామాన్యులకు కూడా భాగవత పరమార్ధాన్ని తెలియ జేశాడు.

🍃🌹కర్ణాటక సంగీతం లో వ్రేళ్లమీద లెక్కింపదగిన వాగ్గేయకారుడిగా గుర్తింపుపొందాడు .

🍃🌹స్వరావళి ,అలంకారాలతో సంగీతానికి శోభ సమకూర్చాడు .’’మాయా మాళవ’’ రాగాన్ని సృష్టించి సంగీతం నేర్చుకొనే వారికి మొట్టమొదట పాడుకోవటానికి సులభంగా  ఉత్సాహ జనకంగా  వరప్రసాదంగా అందుబాటులోకి తెచ్చాడు.

🍃🌹ఇప్పటికీ  ప్రారంభదశ లో సంగీతం నేర్చుకొనేవారికి వారికి ఈ రాగం లోనే సంగీతం బోధించే సంప్రదాయం కొనసాగుతోంది స్వరావాలి ,జంటస్వరాలు ,అలంకారాలు ,లక్షణ గీత ,ప్రబంధాలు యుగభోగాలు ,దాటువరస గీతాలు ,సూలాది మొదలైనవి రాశాడు .ఏదిరాసినా భావ రాగ లయ సమ్మేళనం తో విరిసిన పుష్పంగా కీర్తన శోభిల్లుతోంది .లక్షలాది కీర్తనలు రాసినా లభించి ప్రాచుర్యం లో ఉన్నవి 700 మాత్రమే .

🍃🌹పురందర దాసు భక్తి ఉద్యమంలో దాస సాహిత్యాన్ని పరిపోషించి వ్యాప్తి చెందించాడు.కన్నడం లో చాలా కీర్తనలు రాసినా, సంస్కృతం లోనూ పురందరదాసు కృతులు  రాసి కీర్తి గడించాడు. ఆయన కృతులలో ‘’పురందర విఠల ‘’అనేది అంకిత  ముద్ర గా ఉండటం విశేషం  

🍃🌹పుష్య బహుళ అమావాస్య నాడు పురందరదాసు ఆరాధనోత్సవం ఘనం గా నిర్వహిస్తున్నారు. కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అందరికి ఆరాధనీయుడే.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే

జీవితం చాలా కష్టం అనిపిస్తుంది 


పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సరళం అనిపిస్తుంది


పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది


పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది


పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిది అనిపిస్తుంది


పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.


పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే 

ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది.


పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.


పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.


పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.


పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది.


*పది నిమిషాలు స్నేహితుని*

*ముందు కూర్చుంటే*

*జీవితం స్వర్గంలా ఉంటుంది.*


ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్వ్యూ

చేస్తున్నాడు.👌👌

*విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?

రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?

* : నల్లమేకకు..

రై : గడ్డి..

వి : మరి తెల్లమేకకు..?

రై : గడ్డి..

వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?

రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?

వి : నల్లమేకను..

రై : బయటి వసారాలో..!!

వి : మరి తెల్లమేకను..?

రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!

వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?

రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?

వి : నల్లమేకకు..

రై : నీటితో..

వి : మరి తెల్లమేకకు..?

రై : దానికి కూడా నీటితో..!!

వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా

చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,

తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?

రై : ఎందుకంటే నల్లమేక నాది.

వి: మరి తెల్లమేక..?

.

రై : అదికూడా నాదే..!!

.

విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.

👌రైతు నవ్వుతూ అన్నాడు..

ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి

తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా

ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?

😀😀😀😀😀😀😀😀

1 comment: