రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?
రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ.మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు.రథసప్తమి మహా తేజం.మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది.సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు,
3. అనుష్టుప్పు,
4. జగతి,
5. పంక్తి,
6. బృహతి,
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.
ఇందులో 30 శ్లోకాలున్నాయి.వీటి స్మరణ వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది.అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
-ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:
నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి,భాను, వివస్వత,భాస్కర, సవిత,అర్క,సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.
ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.
మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే.శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.
ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
🙏🙏🙏🙏🙏
తేదీ : 19-02-2021 శుక్రవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#దత్తాత్రేయుడు_కార్తవీర్యార్జునకు_ఉపదేశమిచ్చుట..
దత్తాత్రేయుడు
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక
కళ్యాణము కొరకు ఘన కార్యములు చేసినాడు., త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున
జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ
వీరుడు 'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి
గురువర్యులు దత్తత్రేయులు.., ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని
ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి.. "గురువర్యా! మీ అనుగ్రహము వలన అనేక
విషయాలు తెలుసుకొని వుంటిని, కాని #మాఘ_మాసము యొక్క మహత్మ్యమును విని
యుండలేదు. కావున, #మాఘ_మాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి
నాకు వివరించ వలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను.
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.
"భూపాలా.!
భరత ఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచ మండెచ్చటనూ లేవు. ఈ
నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము
కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందున్నప్పుడు
ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి
దానధర్మములు ఆచరించిన యెడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ
సాధ్యము కాదు. అందునా మాఘ మాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితo
కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక, యే మానవుడైననూ #మాఘ_మాసము
లో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు
దానధర్మములు చేసినచో పంచ మహపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు", అని
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీ విధముగా చెప్పుచున్నాడు.
"పూర్వకాలమున
గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు
జనులు కుబేరులు వలె నున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు
గొప్ప ధనవంతుదు, బంగారు నగలు, నాణేములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు
హేమాంబరుడు చనిపోయెను., తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి
ఆస్తిని భాగములు చేసి పంచుకొని యిష్టము వచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు
చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు
వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటి
వెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ
చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి.
చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయ మన్నాడు.
రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు రెండవ వాడు
చిత్రగుప్తునితో యిలా అన్నాడు.
"అయ్యా! మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము.
ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసి యున్నాము. అయినా అతనికి నరకమును, నాకు
స్వర్గమును యేల ప్రాప్తించును" అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు " ఓయీ
వైశ్యపుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి
గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడి
వాడవు. అటులనే మాఘ మాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ
శిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు... మరొక విషయమేమనగా నీ
మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది
మహా పాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే
కలిగినది. అదియును గాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు
వినియున్నావు. గంగానది లోని నీరు నీ శరీరము మీద పడినది. గనుక నీ పాపములు
నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు
వివరించెను. ఆహా! ఏమి నా భాగ్యము.. గంగాజలము నా మీద పడినంత మాత్రమునే
నాకింతటి మోక్షము కలిగినదా" అని వైశ్య కుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గ
లోకమునకు వెళ్ళిపోయెను..
ఇది శ్రీ మాఘ పురాణం అష్టమ అధ్యాయ పారాయణం సంపూర్ణం...
--(())--
🌞🌞🌞🌞🌞
రథసప్తమికి జిల్లేడకుకి సంబంధం ఏమిటి?*
రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది.
దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.
ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.
అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒకమేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది.
అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.
అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, "మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.
ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది" అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.
అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.
🙏🙏🙏🙏🙏
నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం..💐
ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం..👹
అమ్మ అరగంట కనబడకుంటేనే అల్లాడిపోయిన మనం.. 💐
అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..👹
నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...💐
“నేనే హీరో”... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..👹
నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...💐
చిల్లరబుద్ధులతో... సంపాదనలో అవే“చిల్లర” కూడా తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచుకుంటున్నాం..👹
చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం.. 💐
ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...👹
బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..💐
ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక “కుటుంబాన్ని చిన్నదిగా” మల్చుకుంటున్నాం..👹
చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం... 💐
ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!👹
...........
: *కర్మ*
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.
ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.
. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు.
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు.
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం.
............
నమ్మకం గెలిపిస్తుంది ! అప నమ్మకంఓడిస్తుంది !
అశ్వ సేనుడు అవంతీ రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో, ఒక ఏడాది తీవ్రమయిన కరువు కాటకాలు ఏర్పడ్డాయి. నెలల తరబడి వొక్క వర్షపు చుక్క కూడా పడడం లేదు. భూములన్నీ బీడు వారి పోయేయి. ప్రభువుల ధనాగారం కూడా నానాటికీ తరిగి పోసాగింది. తిండికి కరువు రావడంతో రాజ్యంలో సంక్షోభం ఏర్పడింది. దారి దోపిడీలూ, దొంగతనాలూ పెచ్చు పెరిగి పోయేయి. ప్రజలు రాజ శాసనాలను ధిక్కరించే పరిస్థితి ఏర్పడింది. అశ్వ సేనుడి పాలన పట్ల ప్రజలకు నమ్మకం సడలి పోసాగింది. రాజులో కూడా నానాటికీ అసహనం ఎక్కువ కాసాగింది. ఆకలికి తట్టుకో లేక పెట్టే ఆర్తుల మొర ఆలకించడం మానేసాడు. మీదు మిక్కిలి కఠిన దండనలు విధించ సాగేడు. అధిక పన్నులు వేయ సాగేడు. దాంతో రాజ్యంలో అరాచకంమరింత పెరిగి పోయింది ! పరిస్థితి చెయ్యి దాటి పోతున్నదని మహా మంత్రి గమనించాడు. రాజ్యంలో అరాచక పరిస్థితుల నివారణకు తగిన పరిష్కారం కనుగొనడానికి వో సారి తపోవనవాసులయిన మునిజనం వద్దకు వెళ్ళి రమ్మని మహా మంత్రి, రాజ గురువు రాజుకి సలహా యిచ్చారు. అందుకు సమ్మతించి అశ్వ సేనుడు కొద్ది పాటి సైన్యంతో అటవీ ప్రాంతానికి బయలుదేరాడు.
అరణ్య ప్రాంతంలో ప్రవేశించగానే , అక్కడి వాతావరణం చూసి రాజు చకితుడయ్యేడు ! అక్కడ అంతా పచ్చగా ఉంది. మునులూ, వారి శిష్యులూ పుష్ఠిగా వింత తేజస్సుతో వెలిగి పోతున్నారు ! రాచ నగరుకి అతి సమీపంలో ఉండే అటవీ భూములలో రాచ నగరులో వలె కరువు కాటకాలు లేక, అంతా పచ్చగా ఉండడానికి కారణం మునులను ఇలా అడిగాడు. ‘‘ మునులారా! ఈ ఆశ్రమ ప్రాంతం మా రాజ నగరుకి ఏమంత దూరంలో లేదు. కానీ అక్కడి కంటె భిన్న మయిన పిరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ అటవీ ప్రాతం కూడా నా ఏలుబడిలో ఉన్నదే కదా ! అతిసమీప ప్రాంతాలయినఈ రెడంటికీ నడుమ ఇంత తేడా ఎలా వచ్చింది ?’’ అనడగాడు.
మునులు నవ్వి , ‘‘ రాజా ! ఇప్పుడు చూడు ! లా కనిపిస్తోందో !’’ అన్నారు.
రాజు చుట్టూ తేరిపార చూసాడు. ఆశ్చర్యం ! అక్కడి వాతావరణం రాచ నగరు కంటె భిన్నంగా ఏమీ లేదు ! కరువు అక్కడా తాండవిస్తోంది. రాజుకి అంతా అయోమయంగా తోచింది.
అప్పుడు మునులు రాజుతో ఇలా అన్నారు : ‘‘ మహా రాజా ! ఆపదలో ఉన్న మిమ్ములను మునుల మయిన మేము ఒడ్డెంక్కించ గలమనే నమ్మకంతోనే నువ్వు ఇక్కడకి వచ్చేవు. అందు వల్లనే నీకలా గోచరించింది. అంతే. దేనికయినా నమ్మకమే ప్రధానం ! ఈ కరువు పరిస్థితులు ఇక ఎన్నాళ్ళో ఉండవు. వెళ్ళి, నీప్రజలలో నీ పాలన పట్ల నమ్మకం కలిగించు. నమ్మకం గెలిపిస్తుంది. అప నమ్మకం ఓటమికి దారి చూపిస్తుంది ! వారిలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించు. అప్పుడు అరాచకం తగ్గుతుంది ’’
రాజు మునుల వద్ద శలవు తీసుకుని, రాజధానికి తిరిగి వచ్చి, మునులు చెప్పినట్టే తన ఏలుబడి పట్ల ప్రజలలో నమ్మకం కుదురు కునేలా చేశాడు.
త్వరలోనే రాజ్యమంతటా విస్తారంగా వానలు కురిసాయి !
రాజ్యం సుభిక్షమయింది !
.
..............
మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం... కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం... మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!
మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!
నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!
ఎందుకంటే...
మనం ఎదుగుతున్నాం..!💪
మనం మనకే అందనంతగా...
మనం ఎదుగుతున్నాం..!💪
మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం
నిజంగా...🤫🤫🤫
మనం... ఎదుగుతున్నామా..???🤦♂️
..........
మన జీవితంలో అదృష్టం పాత్ర ఎంత..?
మన జీవితంలో అసలు అదృష్టం పాత్ర ఎంత ఉంది? అదృష్టమనేది “దృష్టి “ లేని వారి కోసమేనని చెబుతున్నారు.
సద్గురు: ఎవరైతే అదృష్టం మీద ఆధారపడ్డారో, వాళ్ళు నక్షత్రాలు, గ్రహాలు, స్థానాలు, వారికి కలిసి వచ్చే చెప్పులు, సంఖ్యలు ఇలా అన్ని రకాల వాటికి ప్రాధాన్యతనిస్తారు. వీళ్ళు అదృష్టం కోసం వెతుకుతూ, ఆ ప్రక్రియలో విషయాలు వాటంతట అవే జరిగిపోవాలని ఎదురుచూస్తున్నారు. వాళ్ళంతట వాళ్ళు ఎంతో సులువుగా చూసుకోగలిగిన విషయాలను కూడా ఇలా ఎదురు చూపులు చూస్తూ, అవి చేసుకోకుండా ఉండిపోతున్నారు. జీవితంలోని ప్రతి అంశంలోనూ ఏది జరగాలన్నా, అది మీ వల్ల జరగాల్సిందే. మీ ప్రశాంతత, మీ కలవరం మీరు సృజించుకుంటున్నదే. మీ సమయమనం, మీ పిచ్చి మీరు సృజించుకుంటున్నదే. మీ సంతోషం, దుఃఖం మీరు చేసుకుంటున్నదే. మీలో ఉన్న దైవం లేదా దయ్యం కూడా మీరు చేసుకుంటున్నదే.
ఏదో కాకతాళీయంగా కొన్ని విషయాలు జరగొచ్చు. కానీ మీరు ఇలా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే, మీరు సమాధికి వెళ్ళే వరకు మీకు మంచి విషయాలను జరగవు. ఎందుకంటే వాటంతట అవి జరగాలంటే, అంత సమయం తీసుకుంటాయి మరి.
దురదృష్టవశాత్తు, సరైన పరిస్థితులు కలగాలని, ఇంకా ఎదో జరగాలని ఎదురు చూస్తూ, మీరు మీ శక్త్యానుసారం, మీ సామర్థ్యన్ని ఉపయోగించి, మీ అంతర్ముఖంలోనూ, బహిర్ముఖం లోనూ మీకు కావలసినది సృజించుకోవడం మానేస్తున్నారు.
తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ఒక రోజుని మీరు ఎలా అనుభూతి చెందారన్నది పూర్తిగా మీరే చేసుకుంటున్నారు. మీకు ప్రజలతో ఎంత ఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితులను అర్థం చేసుకోవడంలో ఎంత విఫలమయ్యారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది కచ్చితంగా మీరు అదృష్తం కోసం ధరించే జాతి రాళ్ళ మీద ఆధారపడి ఉండదు. ఇది మీరు ఎంత సున్నితత్వంతో, ఇంగితంతో, తెలివితో, ఎరుకతో మీ చుట్టూరా ఉన్న జీవాన్ని గమనిస్తూ నడుచుకుంటున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతున్నా, అవి మీకు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో వండుకున్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే.
ఒక రోజున ఒక విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు కలిసారు. ఒకతను ఎంతో నిస్పృహతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మరొకతను, “ మీరు ఎందుకిలా ఉన్నారు? ఏం జరిగింది?” అని అడిగాడు.
దానికి మొదటి వ్యక్తి, “నన్ను ఏం చెప్పమంటారు..? నా మొదటి భార్య క్యాన్సర్ తో మరణించింది. రెండో భార్య పక్కింటి వాడితో లేచిపోయింది. నా కొడుకు జైల్లో ఉన్నాడు, ఎందుకంటే నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. నా పద్నాలుగేళ్ల కూతురు గర్భవతి. మా ఇంటి మీద పిడుగు పడింది. షేర్ మార్కెట్ లో నాకున్న షేర్లన్నీ ఇవాళ కుప్పకూలిపోయాయి. ఇవన్నీ కాకుండా నాకు ఎయిడ్స్ ఉందని ఇవాళ మెడికల్ రిపోర్ట్ వచ్చింది.”
మరో వ్యక్తి, “అయ్యో ఎంత దురదృష్టం కలిగింది మీకు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? మీ వృత్తి ఏమిటి?” అని అడిగాడు
అందుకు మొదటి వ్యక్తి, “ నేను అదృష్టం కలిగేందుకు జాతి రాళ్లను అమ్ముతాన” ని జవాబిచ్చాడు.
విషయం ఏమిటంటే, మీరు ఒక విధంగా ఉంటే కొన్ని పరిస్థితులు మీ పట్ల ఆకర్షితమవుతాయి. మీరు మరో విధంగా ఉంటే, మీ చుట్టూ జరిగే విషయాలు మరో విధంగా ఉంటాయి. అక్కడొక పూల పొద, ఒక ముళ్ళపొద ఉన్నాయనుకోండి, తేనెటీగలన్ని పూల వైపుకి వెళ్తాయి. దీనర్థం పూలపొద అదృష్టవంతురాలని కాదు, దాని సువాసన అటువంటిది. అది ఆకర్షిస్తోందని కనపడకకపోవచ్చు, కాని ఆకర్షిస్తోంది. ప్రజలు ముళ్ళపొద వైపుకి వెళ్లడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది మరో విధమైన పరిస్థితిని సృష్టిస్తోంది కాబట్టి. ఈ రెండు కూడా అవి సృజించే దాన్ని ఎరుక లేకుండానే చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ చుట్టూతా జరిగేవి ఎలా జరగాలో ఆ విధంగానే జరుగుతాయి.
మీకు ఎంతో గొప్ప విషయాలు జరుగుతున్నా, అవి మీకు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదంటే మీరు ఎప్పటిదో వండుకున్న ఆహారాన్ని ఇప్పుడు తింటున్నట్లే. అది మీరు ఎప్పుడో ఎక్కడో చాలా కాలం క్రితం చేసుకున్నది. దాన్ని మీరు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ అది రోజురోజుకి పాచిపోతుందని తెలుసుకోవాలి. మీకు కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు అవి ఎందుకలా జరుగుతున్నాయో మీకు తెలుస్తుంటే, దాని అర్థం మీరు స్పృహతో ఆహారాన్ని ఈ రోజున వండారన్నమాట. అదేవిధంగా మీకు చెడ్డ విషయాలు జరుగుతూ, అవి ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలియకపోతే, మళ్ళీ మీరు అలా పాచిపోయిన ఆహారాన్నే తింటున్నారని అర్థం.
అదృష్టం - మీరు చూడలేనిది
భారత ప్రాంతీయ భాషల్లో అదృష్టం అంటే ఏంటో చూద్దాం. దృష్టి అంటే మనం చూడగలిగింది. అదృష్టం అంటే మనం చూడలేనిది; మీరు చూడలేకపోతున్నారనమాట. మీరు చూడగలిగితే ఏది ఎందుకు జరుగుతోందో మీకు తెలుస్తుంది కదా, మీరు చూడలేనప్పుడే జరుగుతున్న విషయాలు యాదృచ్చికంగా జరుగుతున్నట్టు మీ కనిపిస్తుంది. అప్పుడు మీరు అది అదృష్టమనో దురదృష్టమనో అనుకుంటారు.
ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే.
ఆధ్యాత్మికత అంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకోవటమే. అలా మీ జీవితాన్ని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే, మీరు పూర్తి స్థాయిలో ఎరుక ఉన్న జీవం అవుతారు ఇంకా మీలో దైవత్వం కూడా ఉదయిస్తుంది.
మీ జీవితాన్ని మీరు స్పృహతో చూడవలసిన సమయం. మీరు అదృష్టం మీద, నక్షత్రాలు లేదా గ్రహాల మీద ఆధారపడకండి; ఇవన్నీ జీవం లేని వస్తువులు. మానవ నైజం ప్రాణం లేని విషయాల తలరాతను రాయాలా లేదా ప్రాణం లేని వస్తువులు మానవ నైజాన్ని నిర్ణయించాలా....? ఏవిధంగా ఉండాలి...? మానవ నైజం ప్రాణంలేని వాటికి ఏం జరగాలన్నది నిర్ణయించాలి కానీ ఒక నక్షత్రం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అంటే లేదా ఒక ప్రాణంలేని వస్తువు మీ తలరాతను నిర్ణయించడం ఏంటి?
ఇలాంటివి మిమ్మల్ని ప్రభావితం చేసేందుకు మీరు అనుమతినివ్వకండి. ఎందుకంటే ఇలా చేస్తే మీ జీవితం ఎంతో పరిమితంగా మారిపోతుంది. మీరు ఒక చట్రంలో ఉండిపోతారు, దాన్ని దాటి ముందుకు వెళ్ళలేరు. ఇది మీ ఎదుగుదలను మీ అవకాశాలను తగ్గించి వేస్తుంది.
మీకు ప్రజలతో ఎంత ఘర్షణ ఏర్పడిందన్న విషయం మీరు పరిస్థితులను ఇంకా వారి పరిమితులను అర్థం చేసుకోవడంలో ఎంత విఫలమయ్యారన్న దాన్ని బట్టి ఉంటుంది.
ఏదో కాకతాళీయంగా కొన్ని విషయాలు జరగొచ్చు. కానీ మీరు ఇలా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే, మీరు సమాధికి వెళ్ళే వరకు మీకు మంచి విషయాలను జరగవు. ఎందుకంటే వాటంతట అవి జరగాలంటే, అంత సమయం తీసుకుంటాయి మరి.
కాబట్టి మీరు యాదృచ్చికంగా జీవిస్తే మీరు భయాందోళనల్లో కూడా జీవిస్తారు. మీరు మీ శక్తి సామర్థ్యాలతో జీవిస్తే, బయిట ఏం జరిగినా జరగకపోయినా, కనీసం మీలో జరుగుతున్నది మీ అదుపులో ఉంటుంది. ఇది మరింత స్థిరమైన జీవితం.
om
ReplyDelete