Monday, 22 February 2021

23--2-2021

kamdevburnt



ముద్దమందార మధురస్మృతి (1) (రోజువారి కధ)

ఒకరి ఆలోచన మరొకరి పరిశీలన కధా పరిచయం 


మార్గశిర మధ్యం…
బ్రహ్మీ ముహూర్తపు వేళ!
వెన్నెల ఎర్రబారుతున్న సమయం.
భువిపై కురుస్తోన్న మంచు – చంద్రకిరణాలతో సఖ్యం పెంచుకొని మరింత ఘనీభవించి నేలంతా తెల్లని గొంగళి పరచినట్లుంది.

మంచి పేరుగ,  మందబుద్ధిని, మార్చనంటివి,  మోహనం 
నుంచి నేరుగ, శంక బుద్ధిని, నమ్మ  పల్కతి , మోహనా 
ఉంచి కాదన, స్థితిప్రఙ్ఞను, ఉన్న లేకయు , కాదులే 
పొంచిఉన్నను, ముప్పు నంతయు, పొంత  లేదియు  మోహనా

సృష్టిలోని యావత్ ప్రాణికోటి వెచ్చదనం కోసం గదుల్లోకి, నెరియల్లోకి, గుహల్లోకి దూరి ముడుచుకొని ఆదమరచి నిదురపోతున్న ఆ సమయంలో గుంటూరు లోని ఒక ఇంటి రెండో అంతస్తులోని ఈశాన్య భాగపు గదిలో చెదరని ఏకాగ్రతతో కనులు మూసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది మందార మల్లి .

సృష్టిలోకధ, వేడినిచ్చియు, శాంతి నిచ్చియు, నీడలో 
ముష్టిలో కధ, సత్యబోధయు, మర్మమార్గము, నీడలో 
ఇష్టిలో కధ, పుణ్యపాపము, ఇచ్చు మార్పుల , నీడలో 
కృష్ణలో కధ, మంచిచేసియు, కష్ట ముండుట , నీడలో  

తడి తలకి పిడచ కట్టి, భావతీక్షణతని సూచిస్తున్న కనుబొమ్మల మధ్య సింధూరం అలది, నిటారుగా కూర్చుని వున్న ఆమె ఆకృతిని పరికిస్తే కొంపతీసి ఆమె యోగనిద్రలోకి వెళ్ళిపోలేదు కదా అనిపిస్తుంది. ఎదురుగా వెలుగుతోన్న అఖండ దీపపు కాంతి కిరణాలు మూలపీఠం మీద అమర్చిన పంచలోహ విగ్రహాల మీద పడి పరావర్తనం చెంది ఆమె నాసికాగ్రాన వున్న రవ్వల ముక్కుపుడక మీద పడి వెలుగు బిందువులుగా మారి క్రిందకి జారుతున్నాయి.

భావతీక్షణ యుక్తధారలు భాగ్య మాస్రిత పొందుకే 
యావపొందియు మౌనదీక్షతొ  యశ్వ వేగము  పొందుకే
సవ్యసాచిగ నిండు యవ్వన సాగివుండుట  పొందుకే 
మువ్వచిందులు గువ్వగూటికి మంత్ర మాయను పొందుకే  

ఆమెకి నలబయి సంవత్సరాల వయసుండొచ్చు. శరీరాకృతిలో కొంత బొద్దుతనముంది. కొద్దిగా నోటి దగ్గరగా జారుతున్న బుగ్గలు ఆమె యౌవనంలో అందమైన స్త్రీ అయి ఉంటుందన్న నిజాన్ని తేటబరుస్తున్నాయి.

వత్సరంబుయు పెర్గియున్నను మొహమాకృతి మారదే 
నిశ్చితంబుయు కల్గియున్నను నగ్న తార్దము మారదే 
వచ్చిపోవును మబ్బువల్లెను వాన మల్లెను  మారదే 
నిచ్చసత్యము చెప్పుతున్నను నైతి కమ్ముగ మారదే 

స్తోత్రం ముగించి, ఆమె కళ్ళు తెరచి లేచి దేవుడికి హారతినిచ్చింది. కుడిచేతితో హారతిస్తూ ఎడం చేతితో ఆమె వాయించిన గంట శబ్దం తరంగాలై ఆ గదినుండి హాల్లోకి అక్కడనుండి ఆమె కూతురు పడుకున్న పడక గదిలోకి ప్రవహించింది.

  ... ... ////  ... //// .... 


నేటి కవిత..వచ్చింది
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   :

వచ్చింది వచ్చింది నూతన వచ్చరమూ
తెచ్చింది తెచ్చింది నూతన వర్ఛస్సునూ
పల్కింది పల్కింది నూతన భాష్యమునూ
చెకూర్పు ఓదార్పు మాత్రము సత్వరమూ

చిరునగవుల శ్రీవాణి నీవెంట ఉండగా
వరగుణముల కామాక్షి నీచెంత ఉండగా
కరుణరసము శ్రీమాత నీనీడ ఉండగా
హృదయములు శ్రీవిష్ణు నీసొంత మవ్వగా

నీతిని నమ్మి భీతిని వదలి జీవిద్దాం
నేతను బట్టి దివ్వెగ మనము జీవిద్దాం
తల్లి ఓర్పుతో తండ్రి నేర్పుతో జీవిద్దాం
సహన గుణంతో సహకరిస్తూ జీవిద్దాం

ఇహ పర సుఖములు పొందుతూ
బ్రాంతిని తొలగించి శాంతిని నింపుతూ
స్వార్ధము విడనాడి కరుణను పంచుతూ
చెలిమితో చేయి చేయి కల్పి జీవిద్దాం

విద్యయె మర్మ మయ్యెను గ సహకరిస్తూ
నిత్యము ధర్మ మయ్యెది  గ అనుకరిస్తూ
దేశము సత్య మయ్యెను వినయమిస్తూ
సర్వము రక్ష మయ్యెను గ జీవిద్దాం
 --((*))--
[21:11, 22/02/2021] s srivasa Charyulu: రేపు 23-2-2021భీష్మ ఏకాదశి : విష్ణు సహస్ర నామం పారాయణ చేయండి

 మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణుసహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. “మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః” కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.

అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను ఔపోసన పట్టి పూర్తిగా ఆకళింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి’ అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.

భీష్మపితామహుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది. కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.

తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు,ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు.

అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట “మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః” హే ద్రౌపతి ! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.

కురుసభలో వస్త్రాపహరణం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పారేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నావంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.

భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ ‘తాతా ! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు’ అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు ‘అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు.

కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ‘ హే ద్రౌపతీ ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.

నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు.

అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు. విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని అంటారు. ఏడాదిలో ఏ రోజు విష్ణు సహస్రనామం జపించని వారు ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి.

పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తిపొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారు అని నానుడి. ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పఠిస్తే…. భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చు.🙏
 🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞🌹🌞

 

 తేటగీతి పద్యాలు.. వెన్నెలేకళ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
 
పున్నమిన వెన్నెలేకళ  వలక బోసి   
కన్నెలకు వన్నెలే పంచి చిలక రించి  
మిన్నకుయు అంటె వెల్గులు మంచి చేసి  
వన్నెలతో తెన్నులే పంచు వాలు గుంచె  

గిన్నె కన్నేర్ర చేసేటి కాలమవ్వు  
బాస వలననే వాసము బ్రాంతి గొచ్చు  
ప్రాసయగును శ్వాసము పాశ మొవ్వు   
లాసముయె హాస ముగుటయె లాస్య మయ్యె  
 
రాసముయు  కోస ముగ  పోటి రవ్వ వలెను   
ఛందముయు  నంద నము తార చెమ్మ గిల్లె  
సుందరము బంధములు  వచ్చి చేరు సగటు  
లందుననె  విందు లున్నియు లాస్య మగును  

మందరము  గంధ ముయెవిశ్వ మగుట సహజ    
అందమవు సందు కను  విందు ఆఱుగు దెంచు     
లాందియగ  చిందు లుయె వేసి లుకలుకలగు  
దైవ పూజలు మనసుకు దాస్య మగును  

నవ్వులలొ  పువ్వు లుద యించి  నాట్యమాడు  
రవ్వలతొ గువ్వ లుడికించి రభస చేయు
మువ్వలతొ చోద్యముగ చేసి మాయ చేయు   
నిత్యమును సత్యముగ భాష నీకు రక్ష

--((*))--  


ఆత్మనిగ్రహం- చిట్టి సరదా కథ
ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న  రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్నిచూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకొన్నాడు.
'స్వామీ మీరు మా నగరానికి పావనంచేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.
'పోనీ.. శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టుపీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం  చేయండి!'అని ప్రాదేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!'అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ్గదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ.. సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యాసుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా  నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్చగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానంకూడా ఇవ్వకుండా నిష్క్రమింఛారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే .. దీన్నే అంటారు  నువ్వుఅ అనుకొంటున్న 'ఆత్ననిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-కర్లపాలెం హనుమంతరావు

 No photo description available.

సమ్మోహాలు ... ప్రశ్న 1281 ... 1290   
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రశ్నలో ఉన్నాది
ఉన్నాది జవాబది
జవాబులో ఉంది తన్మయమే  ఈశ్వరా
 
ప్రశ్నించ కే నీవు
నీవు బాధపతావు
బాధలు పెట్టుట ఎంత నిజమొ ఈశ్వరా

జ్ఞాన సముపార్జనే
ఆర్జన ప్రశ్నగునే
ప్రశ్న లే మనిషిని మార్చును లే ఈశ్వరా
 
మనసు ప్రశ్నలవల
వలయె  పొంగేటి అల
అల ప్రశ్నిస్తూనేవుంటుందే ఈశ్వరా  

మంచి చెడ్డ చూడక
చూడక ప్రశ్న అలక
అలక తీర్చుటకు ప్రశ్నలు వచ్చు ఈశ్వరా

గురువు శిష్యుల మధ్య
మధ్య ప్రశ్నల పద్య
పద్యములకు గురువే జవాబే ఈశ్వరా

ప్రశ్న తో మోహమ్ము
మోహమ్ము దేహమ్ము
దేహము ప్రశ్నల చుట్టూ తిరుగు ఈశ్వరా

కృష్ణార్జునులలో
అర్జున అడుగుటలో
అడుగుట ప్రశ్నగా కృష్ణ తెలుపు  ఈశ్వరా
 
జిజ్ఞాస ఉండాలి
ఉంటె ప్రశ్నల గాలి
గాలి కమ్ముకున్నట్ల ప్రశ్నలే ఈశ్వరా     

ప్రశ్నించేది కలలు
కలలు వల్లా వెతలు
వెతలు లేని జీవితం వ్యర్ధము ఈశ్వరా   

 --(())--

. వివేక చూడామణి - 29 / Viveka Chudamani - 29🌹
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అరిషడ్‌ వర్గాలు - 1 🍀

112. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను అరిషడ్‌ వర్గాలు రాజస లక్షణములు. వాటి ద్వారా వ్యక్తి యొక్క ప్రాపంచిక దృక్పదము వ్యక్తమవుతుంది. కావున రాజస గుణము బంధనానికి కారణమవుతుంది.

113. తామస గుణము యొక్క ముఖ్య లక్షణము బద్దకము, తమస్సు. వాటి వలన వస్తువుల యొక్క అసలైన లక్షణాలు గాక వేరుగా కనిపిస్తాయి. అందువలన మనిషి మరల మరల మార్పు చెందుతూ ఆయా లక్షణాలు వ్యక్తము చేస్తుంటాడు.

114. విద్యావంతులు, బుద్ధిమంతులైన వారు కూడా మరియు తెలివిగల స్థిరమైన ఆత్మ జ్ఞానము కలవారు కూడా తామస గుణానికి బందీలై, ఆత్మను గూర్చి ఎంత వివరించినను అర్థము చేసుకొన లేకున్నారు. వారు కేవలము భ్రమకు లోనై అదే నిజమని భావించి, ఆ భ్రమలకు బందీలై ఉన్నారు. ఆహా! ఎంత శక్తివంతమైనది ఈ బద్ధకముతో కూడిన తామస శక్తి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
 

.                      శుభోదయం

ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, మరియు ఆత్మస్థయిర్యం..

ఆత్మగౌరవం మనిషికి  - అంతర్మధనం కళలకి
అంతర్యుద్ధం కాలముకి  - ఆధ్యాత్మిక౦ మనసులకి
 
ఆత్మవిశ్వాసం జతకి - ఆత్మ హృద్యముగా కళకి
ఆత్మ స్థైర్యముగ పలికి - మన మంది పుచ్చు కొనుటకి

ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి. పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం. ఆచరిస్తే అంతులేని ఆనందం..

--(())--
 తేదీ : 13-02-2021 శనివారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#శివుడు_పార్వతీ_దేవికి_మాఘ_మాస_మహిమలు_చెప్పుట...
వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును, శివ లింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను.... మహాముని ! ఈ మాఘ మాస మహత్యము ను యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని" ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను..
మున్ను పార్వతీదేవికి శివుడును, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము...
ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచూ, నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి.. 'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని.., కానీ , ప్రయాగ క్షేత్ర మహత్యమును, మాఘమాస మహత్యమును వినవలెననడి కోరిక వున్నది. కాన.., ఈ యేకాంత సమయమందా క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దాననని వేడుకొనగా.., పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను.., దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను.. శ్రద్దగా వినుము.
సూర్యుడు మకర రాశి యందు వుండగా మాఘ మాసమందు ప్రాతఃకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక, జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘ మాసములో సూర్యుడు మకరరాశి యందుండగా, ప్రయాగ క్షేత్రము నందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేకాదు.. జీవనది వున్నను, లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోట కాని, తటాకమందు కాని మాఘ మాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయే గాక సమస్త పాపములను విడిపోవును. రెండవ రోజు స్నానము జేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘ మాసము నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ..! మాఘ మాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను.. మాఘ మాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నది కాని, చెరువు కాని, నుయ్యి కాని, కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింత గాదు.
ఏ మానవుడైననూ తన శరీరములో శక్తి లేక, కడకు బావి యందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసి గాని  తెలియక గాని మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును గాక.., మాఘ మాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘ పురాణము చదివి విష్ణు మందిరమున గాని, శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక, పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక, స్త్రీలు కూడా ఆచరించ వచ్చును.. మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటె, తాను బ్రతికున్నంత కాలము మాఘ మాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యముల నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా..! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము.. ఓ పార్వతీ.! యే మానవుడు మాఘ మాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను.. సావదానముగా ఆలకింపుము.
నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘ మాసమందు ప్రాతఃకాలమున నదీ స్నానము గాని, జపము గాని, విష్ణుపూజ గాని యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును, ఱంపముల చేత, ఖడ్గముల చేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువ జామున లేచి, కాలకృత్యములను తీర్చుకొని, నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము, విష్ణుపూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవ తనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాస మందు యే స్త్రీ అటుల చేయదో , అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములూ కలుగుటయేగాక ఆమె పంది,కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘమాస స్నానమునకు వయః పరిమితి లేదు, బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ యైనను, బాలికయైననూ, జవ్వనియైననూ, ఏ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.
పార్వతీ.!దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు , మద్యము త్రాగి పరస్త్రీ లతో క్రీడించువారు , జీవహింస చేయువారు మాఘ మాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన యెడల వారి సమస్త పాపములు నశించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును.. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయని వాడునూ, యితరులను వంచించి వారి వద్ద ధనమును హరించిన వాడును, అసత్యమాడి ప్రొద్ధు గడుపువాడును, మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి, తాళిగట్టిన ఇల్లాలిని, బిడ్డలను వేధించువాడును, రాజ ద్రోహి, గురు ద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను యెగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యములనూ, ధర్మ కార్యములనూ చెడగొట్టుచూ, దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించు వాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘ మాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు.
దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను.. వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘ మాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. యే మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘ మాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి, యెటువంటి దోషములూ లేక పరిశుద్ధుడగును, అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసముల లోనూ మాఘ మాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘ మాసము శ్రేష్ఠమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించెడి యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగా నున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా నున్న వారు చలిలో చన్నీళ్ళలో స్నానము చేయలేరు.. కాన అట్టివారికి యెండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన యెడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్ని దేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభ ఫలితము కలుగును.
ఈ విధముగా ఆచరించెడి వారిని జూచి, యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘ మాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునటుల యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికి కాని , క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానమును చేయుమని చెప్పిన యెడల వారు పుణ్య లోకమునకు పోవుటకు యే అడ్డంకులునూ ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని, చేయలేని వారిని కాని, ప్రోత్సహించు వారలను కాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము, వంశ క్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు, ముఖము కడుగుకొని, తలపై నీళ్ళు జల్లుకొని,  సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట గాని, వినుట గాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము, దరిద్రము నశింప వలయునన్న మాఘమాస స్నానము కన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి, బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణ లిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృ హత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును.
కనుక ఓ పార్వతీ..! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన, నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము..
ఇట్టి శ్రీ మాఘ పురాణ ద్వితీయోధ్యాయః పారాయణం సంపూర్ణం..

MAAGHA PURANAM -- 2
మాఘ పురాణం – 2వ అధ్యాయం

దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:
దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.
దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.
దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.
అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.
ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.
“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.
“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.
ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.
దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:
దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.
ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.
దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.
అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.
మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.
అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.

తనకు నచ్చిందే స్వర్గం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

అంతా మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఆ వైపునుంచే చూస్తాం. తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దానిని ఊహకు వదిలేశాం. అందుకే స్వర్గం, నరకం లాంటి అనేక రకాల పిచ్చి ఊహలు పుట్టుకొచ్చాయి. అతడు చనిపోతున్నాడని మనం భావిస్తాం. కానీ, అతడు మళ్ళీ జన్మిస్తాడు. అది అతనికి మాత్రమే తెలుసు. కానీ, మరణించిన అతడు మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘బాధపడకండి. నేను చనిపోవట్లేదు. మళ్ళీ పుట్టబోతున్నాను. వెళ్ళొస్తా’’ అని మీతో చెప్పలేడు.

అలాగే ఒకసారి తల్లి గర్భంనుంచి బయటపడిన తరువాత చివరి చూపుగా అతడు మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి అందరికీ వీడ్కోలు చెప్పలేడు.
హిందువుల పునర్జన్మ భావనలో కూడా సాధారణ జన్మ వివరణే ఉంటుంది. ఒకవేళ తల్లి గర్భం ఆలోచించగలిగితే, దాని దృష్టిలో శిశువు మరణించినట్లే. అలాగే శిశువు దృష్టిలో తను మరణిస్తున్నట్లు. కానీ, నిజానికి అది మరణం కాదు, జననం. అలాగే మరణం విషయంలో కూడా హిందువులు అదే విషయాన్ని చెప్పారు.

 ఒక వైపు నుంచి చూస్తే అది మరణం, మరొక వైపునుంచి చూస్తే అది మన ఊహకు ప్రతిరూపం కాబట్టి, దానిని మనకు నచ్చినట్లు చెప్పొచ్చు. అందుకే ప్రతి మతం ఆ మరొక వైపును తనకు నచ్చినట్లుగా చేసుకుంది. ఎందుకంటే, సమాజాలు, సంస్కృతులు వివిధ భౌగోళిక, చారిత్రక విషయాలపై ఆధారపడి ఉంటాయి.

ఉదాహరణకు, టిబెట్ వాసులు చలిని ఊహించేందుకే భయపడతారు. అందుకే వారి మరో ప్రపంచం వెచ్చగా ఉంటుంది. మరణించిన మనిషి వారి దృష్టిలో వెచ్చగా ఉంటాడు. అలాగే భారతీయుడు వేడిని ఏమాత్రం ఊహంచుకోలేడు. ఎందుకంటే, నాలుగు నెలల వేసవి కాలం వేడి వాడికి చాలా ఎక్కువ. అదే వేడి సంవత్సరమంతా ఉంటే వాడు వేగి వేపుడైనట్లే.

అందుకే హిందుల స్వర్గం ఎప్పుడూ వికసించిన పూలతో, విరజిమ్మే సువాసనలతో, పక్షుల కిలకిలలతో ఎటుచూసినా జీవం తొణికిసలాడే నిత్యవసంత సోయగాల శోభలతో నిండి సమశీతోష్ణస్థితిలో ఉంటుందే కానీ, వేడిగా ఉండదు. చల్లగా ఉండదు. అందుకే అది మన మనసుకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. లేకపోతే, స్వర్గం అన్ని రకాలుగా ఎందుకుంటుంది? మహమ్మదీయుల స్వర్గం ఎప్పుడూ ఎడారిగా ఉండదు. ఎందుకంటే, వారు అరేబియా ఎడారితో విసిగిపోయారు.

అందుకే వారి స్వర్గమంతా- ఎడారిలో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులతో మాత్రమే కాదు, మొత్తమంతా- ఒయాసిస్సులతో నిండి ఉంటుంది. మన స్వర్గాల సినిమాలు అలా ఉంటే, మరణించే మనిషి సినిమా మరోలా ఉంటుంది. మరణించే మనిషి కోమాలోకి వెళ్ళకుండా సచేతనమైన ఎరుకతో ఉన్నట్లైతే.

అతడు పుట్టినప్పడి నుంచి మరణించే వరకు జరిగిన జీవిత చక్రమంతా ఒక సినిమాలా అతనికి కొన్ని క్షణాలు మెరుపులా కనిపించి, అతడు ఎక్కడ ఎలా మరణించి జన్మించాడో అక్కడే ఆ సినిమా ఆగిపోతుంది. అందుకే పునర్జన్మ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీరు పుట్టిన వెంటనే మీలో కలిగిన భయమే మీ దేవుడు. ఆ భయమే మీరు మరణించే వరకు మరింత పెద్దదవుతూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.

యవ్వనంలో ఉన్న వ్యక్తి నాస్తికుడుగా ఉండవచ్చేమో కానీ, వయసు పెరుగుతున్నప్పుడు అతడు అలా ఉండలేడు. మరణించే మనిషిని మీరు నాస్తికులా అని అడిగితే, కేవలం భయంవల్ల అతడు ‘‘కానేమో’’ అంటాడు. ఎందుకంటే, అతని ప్రపంచం అదృశ్యమవుతోంది.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹  

..సంభావన..అంటే ఏమిటి?

🌺దక్షిణ కూడా ఒక విధమైన దానమే. దక్షిణ ఇచ్చుటలో దాతకు ఒక నిబద్ధత అనేది ఏమి ఉండదు. అనగా ఇక్కడ దానమిచ్చుట అనేది దాత ఇష్టాఇష్టాలపై పూర్తిగా ఆధారపడుతుంది. అది ఒక బాధ్యత.

ఒకరినుండీ ఏదైనా ఒక ఉపకారము పొందినపుడు, ప్రత్యుపకారముగా ఇచ్చేదే దక్షిణ లేక సంభావన.
ఇది ఎవరికైనా ఇవ్వతగినదే కానీ ఎక్కువగా ధార్మిక కార్యాలు జరిపించి ఇచ్చే పురోహితులకు , బ్రాహ్మణులకు ఎక్కువగా ఇది వర్తిస్తుంది. దక్షిణ అనేది వారి సేవలకు ప్రతిఫలము అనో, భత్యము అనో, జీతము అనో, రుసుము అనో అనుకుంటే అది పూర్తిగా దోషభూయిష్ఠమైన ఆలోచన.

ఋణమును తీర్చుకొనుట ఎటువంటి బాధ్యతో, మనకు పాపమును పోగొట్టి, పుణ్యమును పక్వమునకు వచ్చునట్లు చేయు బ్రాహ్మణులకు దక్షిణ నిచ్చుట కూడా అటువంటి బాధ్యతే. దురదృష్టముకొద్దీ ఈ కాలములో దక్షిణ అంటే అది ఒక రుసుముగా భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు.

ధార్మిక కార్యక్రమాలు చేయించుట ద్వారా బ్రాహ్మణులు యజమానికి తన పుణ్యము పక్వమునకువచ్చునట్లు చేయుటే గాక, అతడిచ్చు దక్షిణ స్వీకరించి అతడి పూర్వ పాపములో భాగము పంచుకొంటున్నాడు. ఆ పాపాన్ని పోగొట్టుకొనుటకు ఆ బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తములు చేసుకొనవలెను.

సాధారణముగా త్రికాల సంధ్యావందనము వలన ఆ పాపములు శమించుచుండును. కానీ ఒక్కొక్కసారి అంతకుమించిన ప్రాయశ్చిత్తములు కూడా చేసుకొనవలసి వచ్చును. బ్రాహ్మడికి దక్షిణ ఇంత అనీ ఎక్కడా నిర్వచనము లేదు. అయితే , ' విత్త శాఠ్యము ' లేకుండా , తనకు ఉన్న శక్తికొలదీ వీలైనంత ఎక్కువగా ఇచ్చి బ్రాహ్మణుడిని సంతృప్తి పరచవలెను.

బ్రాహ్మణుడు చేయించిన పూజల/ హోమాల ఫలితము పూర్తిగా యజమానికి దొరకవలెనంటే అతడు తన శక్తికొలదీ దానము దక్షిణగా ఇవ్వవలెను. పీనాసితనము చేయరాదు. శక్తి ఉండీ తక్కువ దక్షిణను ఇచ్చినచో అతడి కార్యము అంతమేరకు కుంటుబడుతుంది. కావలసిన కార్యములు దానివలన పూర్తిగా సఫలము కావు. శక్తిలేనివాడు తక్కువ ఇచ్చినా కూడా అతడి కార్యము పూర్తిగా సఫలమవుతుంది. కాబట్టి, తన శ్రేయస్సు కోసము , బ్రాహ్మణుడి చేత కార్యములు చేయించుకొను యజమాని ఎప్పుడూ కూడా వీలైనంత ఎక్కువగా దక్షిణ ఇచ్చుచుండవలెను.

దక్షిణ ఎప్పుడు ఇవ్వాలి?

ఏదైనా కార్యము ముగిసిన వెంటనే దక్షిణ ఆ పురోహితులకు ఇచ్చినచో అది యజమానికి సర్వశుభములనూ కలుగజేయును.అలాకాకుండా , ఏ కారణము చేతనైనా వెంటనే ఇవ్వలేక పోతే , ఒక రాత్రి గడిచాక ఇస్తే , ఆ దక్షిణను రెట్టింపుగా ఇవ్వవలెను.

ఒక మాసము గడిచినా ఇవ్వకుండా, తరువాత ఇస్తే దక్షిణను , తాను అనుకున్నదానికన్నా వందరెట్లు ఎక్కువ ఇవ్వవలెను.

రెండు మాసముల తరువాత ఇస్తే , వెయ్యిరెట్లు ఇవ్వవలెను.

సంవత్సరము గడిచాక ఇస్తే , అది నిష్ప్రయోజనమే కాక, ఆ యజమానికి నరక ప్రాప్తి తప్పక కలుగును అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
నవగ్రహ దోష నివారణకు తీసుకోవాలసిన ఆహారం-దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును.
రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి సహాయపడటం, గోధుమ గడ్డి, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వెయ్యటం, కోతులకు ఆహారం పెట్టటం, ఎర్ర చందనం చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్ర వర్ణం కలిగిన ఆవులు, గోధుమరొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి, రాగి వస్తువులు, రాగి జావ, తెల్లజిల్లేడు వత్తులు, తెల్లజిల్లేడు విగ్రహాలు, మిరియాలు, రేగి పళ్ళు, క్యారెట్, రాగితో చేసిన వస్తువులు  దానం చేయవచ్చును.
చంద్రగ్రహ దోషం ఉన్నవారు త్రాగే నీటిని దానం చేయటం, అన్నదానం, బియ్యం, తల్లికి సహాయ పడటం, బియ్యంతో చేసినవి, పాలు, పటిక బెల్లం, పాలతో చేసినవి, నీళ్ళు, తెలుపు కాటన్ వస్త్రాలు, ముత్యపు మాలలు, తెల్ల ఆవుకి ఆహారం పెట్టటం, కర్పూర మాలలు, పళ్ళరసాలు, వెండి వస్తువులు, కర్పూరం, తెల్ల పుష్పాలు, మెత్తటి ఉప్పు, శంఖాలు, పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.
కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు, మట్టి బొమ్మలు, కాయ ధాన్యాలు, మిరపకాయలు, నిమ్మ పులిహోర, పచ్చి ఖర్జూర, కళ్ళుప్పు, డేట్స్ సిరప్, బెల్లం, ఎరుపు వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బొగ్గులు, వ్యవసాయ పనిముట్లు, ఎర్ర చందనం, కాషాయ వర్ణ సింధూరం, కాషాయ వర్ణ వస్త్రాలు, ఎరుపు మచ్చల ఆవు, బొబ్బట్లు, బ్రెడ్, తీపి చపాతి శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం, ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.
బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు, పెసరపప్పుతో చేసిన ఆహార పదార్ధాలు, ఉసిరి కాయలు పంచటం,పాదరస వస్తువులు ఇవ్వటం, అన్నిరకాల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు, పుస్తకాలు, ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం, డబ్బు దానం చెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును.
గురుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు, తీపి పదార్ధాలు, శెనగపిండితో చేసిన ఆహారపదార్ధాలు, బొప్పాయి, అరటిపళ్ళు, పులిహోర, పుచ్చకాయ, కర్భూజ, పసుపు వస్త్రాలు, పసుపు, మెంతులు, నెయ్యి, లడ్లు, పసుపు వస్త్రాలు, శెనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్యా, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్త్రాలు, తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు, దానం చేయవచ్చును.
శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, తెల్ల నువ్వులు, గసగసాలు, ఇంగువ, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ళ రంగులు, సెంటు, అద్దాలు, దువ్వెనలు, తేనె, పౌడర్లు, పూలు,  డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు, పెరుగు, రంగు రంగుల వస్త్రాలు, సౌందర్య సాధనాలు, అలంకరణ వస్తువులు, తెల్ల వస్త్రాలు, ఒక కన్ను ఉన్నవాళ్ళకు సహాయం  చేయటం, సుగంద ద్రవ్యాలు దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు పంచటం, పెళ్ళికి సంబందించిన వస్తువులు, సిల్క్ వస్త్రాలు, సోదరీలకు సౌందర్య సాధన వస్త్రాభరణాలు ఇవ్వటం  మొదలగునవి దాన చేయవచ్చును.
శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, ఐరన్ వస్తువులు, నువ్వులతో చేసినవి, నీలిరంగు వస్త్రాలు, కార్మికులకు, నూనెతో చేసినవి, చెప్పులు, నల్లని గొడుగు, ముసలి వాళ్ళకు, మానసిక వికలాంగులకు, కుంటి, గుడ్డి, కుష్ఠు మొదలగు దీర్ఘకాల అనారోగ్యులకు, అనాదలకు సహాయపడటం, ఎద్దుకు ఆహారం పెట్టటం,, ఆహార, ధన రూపంలో సాయం చేయటం,ఇంట్లో, వ్యాపార, ఆఫీసులో పనిచేసే వారికి వస్తు, ధన రూపంలో దానం చేయవచ్చును.
రాహుగ్రహ దోషం ఉన్నవారు మినుములు, ఆవాలు, అగరబత్తీ, మినప సున్నిండలు, సీసంతో చేసినవి, బార్లీ గింజలు, గరికతో చేసినవి,  పుట్ట మట్టిని నీటిలో వేయటం, అద్ధం, ఇడ్లీలు, మినపగారెలు, తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం, పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును.
కేతుగ్రహ దోషం ఉన్నవారు ఉలవలు, కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టటం, పిల్లులకు, కుక్కలకు పాలు పోయటం, వాటిని సంరక్షణ చేయటం, దర్భలతో చేసినవి, ఉలవల పొడిని ఆవులకి పెట్టటం, విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయవచ్చును.
భోజన నియమాలు
            
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.  
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవా…
భోజన నియమాలు
            
1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.  
అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)
 
14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.
    
15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.
 
17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.
   
18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.
 
19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.
   
20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ  వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.
 
21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు)
 
22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  
 
23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.
 
27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.  
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.
                          
31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన స…
🌷🦚🌷🦚🌷🦚
 🌹HAPPY MORNING🌹
     🌷🌹 జై శ్రీరాం🌹🌷

బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది పొరపాటు అనేది అందులో ఒక పేజి మాత్రమే

పొరపాటు జరిగితే పేజీ తీసి
వేయాలే గాని పుస్తకం చింపి వేయకూడదు*

బంధాలు కూడా అంతే సర్దుకు పోయి బంధాలు నిలుపుకోవాలి* కాని బయటి వారిని అయిన వాళ్ళతో పోల్చి బంధాలు దూరం చేసుకో కూడదు

   శ్రీ రామా అంతా నీవే కలవు

    🌷శుభ శుభోదయం🌷
🌷🌹🦚🌹🌷🦚🌹🌷🦚
నేడు "తెలగ మహిళా ఆత్మాభిమాన దినోత్సవము".
వీరపరాక్రమాలకు,ఆత్మాభిమానానికి,ప్రజారంజక పాలనకు మారుపేరుగా నిలచి పచ్చగా కళకళలాడుతున్న బొబ్బిలి కోటపై ఈర్షతో రగిలిపోయిన విజయనగర పూసపాటి విజయరామరాజు 1757 లో ఫ్రెంచి సేనాని బుస్సీ,గోల్కొండ సైన్యాలను కలుపుకొని 50000 పైగా భారీ సైన్యంతో కక్షతో బొబ్బిలికోటను ముట్టడించగా మహా పౌరుష పరాక్రమవంతులైన రంగారాయుడుగారితో పాటుగా వేలమంది తెలగదొరలు చివరి రక్తపుచుక్క వరకు పోరాడి వీర మరణం పొందటం జరిగింది.ఆ వార్త విన్న అంతఃపురంలో మిగిలిన వేలమంది మానవతులు,వీర నారీమణులైన తెలగ మహిళలు ప్రాణం కంటే శీలమే ముఖ్యమని తలచి ఎట్టి పరిస్థితులలోను శత్రుసైన్యాలకు చిక్కకూడదని నిర్ణయించుకొని 1757 ఫిబ్రవరి 23 వ తేధీన కోటలోనే  మూకుమ్మడిగా అగ్నికి ఆహుతై ఆత్మబలిదానాలు చేసుకొని మానాభిమానాలను కాపుడుకోవటం జరిగింది.అటువంటి శీలవతులైన "ఆదర్శ తెలగ మహిళ"లకు సగర్వంగా నీరజనాలు సమర్పిస్తూ వారి సంస్మరణార్ధం ఈరోజును "తెలగ మహిళా ఆత్మాభిమాన దినోత్సవం"గా నిర్వహించుకుంటే గౌరవంగా ఉంటుందని భావిస్తూ మీ తన్నీరు శివశంకర్,తెనాలి.

1 comment: