Friday, 26 February 2021

26--02--2021

Indian Painting Art Print featuring the painting Radha Krishna by Jitendra r Sharma

నేటి ఛందస్సు

UUU  UIII IIU UIU UIUU

సర్వాగన్ సుందరుడవు మనో నిర్మలుఁడైన దైవం
సర్వార్థా రమ్యమును సకలార్ధమ్ముగా సాత్వి భావం
శ్రీ రమ్యా ధార్మికగుణములో ప్రేమయే పంచుదైవం
సూర్యా వంశా బ్ధి లొ వెలుగులే పంచుటంలోను భావం

శాంతాకారం సుభగ నయణం పద్మనాభం శురేషం
శ్రీ లక్ష్మీ శ్రీ కరశుభకరా సర్వ శోభాయమానం
శ్రీ వత్సాం హృద్య శిరి కమలం సర్వ విజ్ఞాన దైవమ్
శ్రీ రంగాశ్రీ రమణ రమణీ పర్వ పీఠాభిదైవం

సర్వార్ధమ్మే సమయ సమరోత్పన్న సంతోష భావం
సమ్మోహమ్మే వినయము విధేయమ్ము సంభావ భాష్యం
ధర్మార్ధమ్మే సకల జన శీగ్రమ్ముగా  స్నేహా రాజ్యం
విశ్వసంమ్మే కరణ చరితం దివ్యభావమ్ము దీపం  

"మందాక్రాంతః..
----
శ్రీవాణ్యంబాం వనజధవళస్థప్రపీఠాధిదేవీం ,
గైర్వాణీం తాంవిధిరసనవైరాజినీం శారదాభామ్ !
కావ్యాలంకారసువిదితభాషానువిజ్ఞానదాత్రీం ,
వాక్సౌందర్యప్రవిలసితవాణీంప్రవందేऽనునిత్యమ్ !!! "

--(())--

కామ్యఫలం -జ్ఞానఫలం 🌻


🍃🌺కర్మలవల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్య ఫలం త్వరలో లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకు పరుగులు పెడుతుంటారు.

🍃🌺సంసార కూపం నుంచి బయట పడే దారికి జ్ఞానమే మార్గం. కామ్యకర్మలు - కర్మ ఫలాలు అనేవి గానుగెద్దు లాగా, ఏతం బావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణ మౌతూ, సంసారచక్రం లోంచి బయటకు రానీయవు.

🍃🌺పుట్టేందు కెందుకంటే చచ్చేదానికి, మరి చచ్చేది ఎందుకంటే మళ్ళీ పుట్టేందుకు - అనేట్లు జీవితం చర్విత చర్వణంగా ( నమిలినదాన్నే మళ్ళీ మళ్ళీ నమలడంగా ) తయారవుతుంది.

🍃🌺అదే విషయాన్ని భాగవతంలో ఇలా చెప్పారు :

🍃🌺అచ్చపు చీకటింబడి, గృహవ్రతులై,  విషయ ప్రవిష్టులై, పుట్టుచు చచ్చుచున్,  మరల చర్విత ఛర్వణులైన వారికిన్,  చెచ్చెర పుట్టునే  పరులు చెప్పిననైన, నిజేచ్ఛనైన,ఏమిచ్చిననైన,  కానలకు ఏగిననైన హరి ప్రభోదముల్!

🍃🌺పోనీ అలానే పుడుతూ చస్తూ ఉందామంటే :

🍃🌺ఈ నర జన్మ 83,99,999 జన్మల తరువాత పరమేశ్వరుని కరుణా కటాక్షంతో వచ్చిన మానవ జన్మ. ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఎందుచేతనంటే :

🍃🌺" పునః గ్రామం, పునః క్షేత్రం, పునః విత్తం, పునర్ధనం, పునః శుభాశుభః కర్మ, న శరీరే పునః పునః"- అన్నారు పెద్దలు.

🍃🌺అంటే, మనం మళ్ళా మళ్ళా గ్రామం మారవచ్చు, మళ్ళా మళ్ళా భూమి కొనవచ్చు, మళ్ళా మళ్ళా ఆస్తి -పాస్థులు పొందవచ్చు, మళ్ళా మళ్ళా ధనం సంపాయించవచ్చు. కానీ, ఈ శరీరం మళ్ళీ మళ్ళీ రాదు.

🍃🌺ఈ శరీరం తోనే మనం ఏమైనా సాధించాలి. అందుచేత ఈ శరీరం పోయేలోపే మనం జ్ఞానం సంపాయించాలి.

🍃🌺ఈ జ్ఞానం సంపాయించడానికి, వేదాలు, పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం, ఉపనిషత్తులు మొదలైన గ్రంధాలనన్నింటినీ చదవ వలసిన పనిలేదు. ఒక్క భగవద్గీత అనే చిన్న గ్రంధాన్ని  చదవడం వల్ల మొత్తం జ్ఞానం అర్ధమై పోతుంది.

🍃🌺భగవద్గీతలో :  భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

🍃🌺ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌.

🍃🌺సంతృప్తి - సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే : గీతను అర్థం చేసుకోవాలి. ఇది :

🔴 ధర్మాధర్మాల గురించి చెబుతుంది.

🔴 కర్తవ్యం గురించి చెబుతుంది.

🔴 నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

🔴 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.

🔴 సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.

🔴 ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.

🔴 పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.

🔴 ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.

🔴 జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.

🔴 ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.

🔴 ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.

🔴 మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.

🔴 పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.

🔴 కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

🔴 నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
 
🍃🌺అందుకే భగవద్గీత  జాతి, మత,ప్రాంత, దేశ,  లింగ, వయో భేదాలు లేకుండా  సర్వమానవాళి  శ్రేయస్సు కోసం - సాక్షాత్తు  పరమాత్మ చేత స్వయంగా బోధింపబడింది.

🍃🌺అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.

🍃🌺నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది..

--(())--
 తేదీ : 26-02-2021 శుక్రవారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*#జ్ఞానశర్మ_కథ - (#మాఘ_పూర్ణిమ)*
గృత్నృమదుడు జహ్నువుతో నిట్లనెను... తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యెను.. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచి యుండెను. అప్పుడు శ్రీహరి ఓయీ నీవు మరల నా రాకను గోరి తపమచరించితి యెందులకు ? నీ మనస్సులో నేమి యున్నది చెప్పుమని యడిగెను.
అప్పుడా విప్రుడు.. 'స్వామీ ! నాకు పుత్ర వరము నిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను.. కాని నారద మహర్షి వచ్చి యీ బాలుడు పండ్రెండు సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరమిట్లయినది, నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచ రించితినని శ్రీహరికి విన్నవించెను..
అప్పుడు శ్రీహరి.. 'ఓయీ ! ఉత్తముడైన నీ పుత్రునకు పండ్రెండవ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వ జన్మమున చేసిన దోషమే ఇప్పుడి గండమునకు కారణము. పూర్వ జన్మమున గూడ మీరిద్దరును భార్యాభర్తలే అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడును నీ భార్యయే. ఆమె ఉత్తమశీలము, గుణములు కలిగి యుండినది. ఆమె భర్తయగు నీవు ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతము నారంభించెను. మాఘ పూర్ణిమ యందు వ్రతమాచరించి పాయస దానము చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘ వ్రతము నాచరించి నందున యీ జన్మ యందును విష్ణుభక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయస దానము చేయక పోవుట, భర్త చెప్పినను చేయకపోవుట యను రెండు దోషముల వలన పండ్రెండు సంవత్సరముల తరువాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతము నందలి గంగోదక బిందువులతో నీ పుత్రుని తడుపుము. ఇందువలన గండ దోషము పోయి నీ పుత్రుడు చిరంజీవి యగును.
ఓయీ ! మాఘ స్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును యిచ్చును. మాఘ స్నానము చేయని వారికి, వారి సంతానమునకు ఆపదలు కల్గును, అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము నాచరింపవలయునని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వపాప దోషహరము. నేను(శ్రీ హరి) మాఘ మాస ప్రియుడను. మాఘస్నాన మాచరించిన వారు దీర్ఘాయువులు, బుద్దిమంతులు , ఆరోగ్యవంతులు అయి ముక్తినందుదురు.
 మాఘ మాస స్నాన వ్రతము కోరిన కోరికల నిచ్చును. మాఘ వ్రత బ్రహ్మ , శివుడు , లక్ష్మి , పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్టుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగ తెలిసిన వారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు.., మాఘ వ్రత మహిమ కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియువారు కలరు. దీని మహిమ అందరికిని తెలియదు. నా భక్తులు, మాఘ వ్రత పారాయణులు మాత్రమే మాఘ వ్రత మహిమ నెరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింప వలయునను బుద్ధి కలుగును, నీ పుత్రుని మాఘమాస ప్రాతఃకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తొలగునని చెప్పి శ్రీహరి అంతర్హితుడయ్యెను.
బ్రాహ్మణుడును శ్రీహరి యనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యెను. బాలుని శ్రీహరి చెప్పినట్లుగా మాఘ వ్రత గంగా జలముచే తడిపెను, బాలునకును శ్రీహరి దయ వలన గండదోషము తొలగి చిరంజీవి అయ్యెను. మృత్యుభయము తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు మూడవ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరముల యందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసము నకై గురుకులమునకు పంపెను. పండ్రెండవ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యెను. ఆ బ్రాహ్మణుడు వాని భార్యా పుత్రుడు అందరును సుఖ సంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి యోగ మహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
జహ్ను మునివర్యా ! మాఘ వ్రతమునకు సాటియైనది మరొకటిలేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము. పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును గూడ నిచ్చును. ఈ వ్రతము అన్ని వర్గముల వారును ఆచరించి యిహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరి భక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖమును గూడ పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచరణీయము అని గృత్నృమద మహర్షి జహ్నుమునికి వివరించెను..
ఇతి శ్రీ మాఘ పురాణం పదిహేనవ అధ్యాయం పారాయణం సంపూర్ణం..

 ॐ శ్రీ గరుత్మంతుడి కధ -20 వ చివరి భాగం ॐ

         #గరుడపురాణంఅసలురహస్యం..!

🙏 వ్యాసభగవానుడు మనకు అందించిన 18 మహా పురాణాలలో ఒకటైన 'గరుడ పురాణంలో' 28 రకాల నరకాలున్నాయి.

⭕ మనుషులే కాదు ఇతర జీవజాలం కూడా ప్రశాంతంగా బతకాలని మన పెద్దలంతా బలంగా కోరుకున్నారు. రాముడైనా, యముడైనా వారి సంకల్పం సామాజిక సంక్షేమమే! మన పెద్దల ఆకాంక్షలు నెరవేరాలంటే మనమంతా క్రమశిక్షణ కలిగి కట్టుబాటుతో జీవించాలి.

⭕ మనం చేసే పాపాలను బట్టి యముడు ఆయా నరకాలకు మనను పంపుతుంటాడట. "అపరిచితుడు" సినిమా గుర్తుంది కదా. అందులో గరుడపురాణం పుస్తకంలో భూలోకంలో చేసే తప్పులకు నరకలోకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు.. ఆ శిక్షలు ఎలా ఉంటాయి అని చూపించారు, ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పులు చేయాలంటే కాస్త భయం కలిగిందని చెప్పవచ్చు.

👉 అసలు గరుడపురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి.. అవి ఎలా ఉంటాయి. ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తుందో ఒకసారి తెలుసుకుందాం‌. మన తప్పులు సరిచేసుకుందాం.

🔥 1.తమిశ్రం:- ఇతరుల సొమ్మును, భార్యాపిల్లలను కాజేసిన వాళ్ళను యమదూతలు కాలపాశంతో కట్టేసే ఇదో చిమ్మచీకటి నరక కూపం.

🔥 2. అంధతమిశ్రం:-  ఒకరినొకరు వెూసపుచ్చుకుని చిన్ని నా పొట్ట నిండితే చాలుననుకుంటూ స్వార్థ చింతనతో ముక్కుమునగ తినే వారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తరువాత వెంట్రుకముక్కలా వదిలిపారేసే భార్యా భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు.

🔥 3. రౌరవం:-  రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తనకోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు.

🔥 4. మహారౌరవం:- న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలిని అక్రమంగా లోబరచుకుని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు.

🔥 5. కుంభీపాకం:-  వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపునింపుకునే వారు ఇక్కడికి వస్తారు.

🔥 6.కాలసూత్రం:-  ఈ నరకం కణకణలాడే రాగిపాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది...

🔥 7. అసితపత్రవనం:-  విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్ళనూ చెడగొట్టే వాళ్ళు ఇక్కడకు వస్తారు.

🔥 8.సూకరముఖం:- అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు.

🔥 9. అంధకూపం:- చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు, కాపాడమని ప్రాథేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపా డని వాళ్ళు ఈ నరకానికి వస్తారు.

🔥 10. తప్తమూర్తి:-  ఈ నరకం ఒక కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెను మంటలు నాల్కలు సాచి భగభగ మండుతుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవదహనం చేస్తారు.

🔥 11: క్రిమిభోజనం:-  ఇది క్రిమికీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా, వాళ్ళకు మెతుకు విదిల్చకుండా మింగేవాళ్ళను, ఎదుటి వాళ్ళను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు.

🔥 12. శాల్మలి:-  దీన్నే 'తప్తశాల్మలి' అని కూడా పిలుస్తారు. వావీ వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగ వాళ్ళను ఈ నరకానికి తెస్తారు.

🔥 13. వజ్రకంటకశాలి:-  జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి ఈ నరకం ప్రత్యేకంగా సిద్ధంగా ఉంటుంది.

🔥 14. వైతరణి:-  అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్లు వాటిని పూర్తిగా దుర్వినియోగపరచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే ఇక్కడికి వస్తారు.

🔥 15. పూయోదకం:-  వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుషపశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది.

🔥 16. ప్రాణరోధం:-  కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారి కోసం ఈ నరకం తలుపులు తెరిచి ఉంటాయి.

🔥 17. వైశాసనం:-  పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు.

🔥 18. లాలభక్షణం:- అతి కాముకులు, భార్యను కట్టుబానిసంగా కన్నా నీఛంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగిస్తారు. …

--(())---

 మాలాధారణకు అర్హులెవ్వరు?

జవాబు : మాలాధారణకు కొన్ని నియమ నిష్ఠలు గలవు. అట్టివి 108 , మాలకు గల పూసలు
108 నియమములు కూడ వీటిని పాటించుటలోగల ఆవశ్యకత మాల ధారణతో ముడివేయబడి యున్నది. మాలాధారణకు అర్హులెవ్వరు అను ప్రశ్న ఇక్కడ అవసరమై యున్నది.  ఎవరైతే నియమములను పాటించుదురో స్వామి యందు ప్రేమానురాగములు కలిగి యుందురో వారే అర్హులు , స్త్రీలలో 5 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు , 50 సంవత్సరములు దాటిన అనగా బహిష్టులు లేని వృద్ధ స్త్రీలు అర్హులు. మధువు , మగువ , చెడు అలవాటులకు దూరముగా యుండి సత్యమును పలుకువాడు మాలధారణకు అర్హులు , విద్యావంతులు కానివారునూ అర్హులే. ఉత్తమ గురువుల ద్వారా మాలధారణము చేసుకునుటకు  భక్తులు ఇష్టపడుదురు. ఉత్తమ గురువు అనగా ఎల్లవేళల నియమ నిష్ఠలు పాటించువారు. మధు మాంసములు మాని , ధూమ పానములు తదితర దురభ్యాసములు లేనివారు , స్వామి భక్తులు , దినచర్యలయందు ప్రతినిత్యము భగవంతుని మరువని వారే మాలధారణ చేయుటకు అర్హులు.  కేవలము మండల పూజ కాలములో దీక్ష తీసుకొనుట , ఆ తరువాత నియమములను పాటించకుండ యుండువారు మాలధారణ చేయవచ్చునా అను ప్రశ్నను తన్ను తాను అవలోకనము చేసుకొనుట అవసరము. కేవలము నలుబది దినములు సరిపోదు. ఎల్లవేళలా మధు పానము , ధూమ పానము , మానవలయును మరియు ప్రతినిత్యము కనీసము అర్చనను 2 పూటలు చేసుకొను వారలే మాలధారణ చేయుట మంచిది.


శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప

శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప

లోకాః సమస్తా సుఖినోభవంతు

--(())--

  పెద్దరికం తరలిపోతోంది ముస

లితనపు మేలి ముసుగులో..

ప్రపంచాన్ని మనకన్నా ముందే చదివేసిన వాళ్ళ జాగ్రత్తలు మనకి చాదస్తాలు..

ఆ పెద్దాయన నెలకొకసారి తెచ్చే పింఛన్ నీకు కావాలి కానీ కష్ట కాలం లో అయన సలహా అక్కర్లేదు..

ఆయనకి పెట్టె గుప్పెడు మెతుకులు లెక్కపెట్టే మనం,, అయన మనకోసం గడిపిన నిద్రలేని రాత్రుల లెక్కలు గణించగలమా..

వాళ్ళు వారి పిల్లలకి పురాణ కధల్లో నీతులు చెప్పి పెంచితే మనం మన పిల్లలకి కార్తీక దీపం లో పిల్లల ఓవర్ డైలాగులు చూపించి పెంచుతున్నాం..

నువ్వు ఎక్కడ అర్ధాకలితో ఉంటావో అని ఆయన  పస్తులతో పడుకుంటే,,  నువ్వు మాత్రం నేడు నీ పిల్లలు తినగా మిగిలింది అయన పళ్లెం లో ముష్టి వేస్తున్నావ్..

మూడేళ్ళ నీ కూతురు అల్లరి ఆస్వాదించే నువ్వు డబ్భై దాటిన ఆ పెద్దాయన చెప్పుకునే బాధ గోనుగుడు గా మారిందా...

పదహారెళ్ల నీ కొడుకు ఆడుకోవటానికి వెళ్లి అరగంట ఆలస్యంగా వస్తే కంగారు పడే నువ్వు,, నీ కుటుంబంతో సినిమాకి వెళ్లే నువ్వు బయట ఉన్న ముసలిదానికి ఒక మాట చెప్పాలన్న ఇంగీతం లేకపోతె ఎలా..

 నీకు జ్వరం వచ్చి రెండు రోజులు మాగన్ను నిద్ర పొతే నీకోసం ముడుపులు కట్టిన వాళ్ళకి నేడు వాళ్ళ కళ్ల జోడుకి డబ్బులు నిన్ను అడుక్కోవాలా...

 ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో,, ఇంకెన్నో,,మరెన్నో

నీకోసం వాళ్లిద్దరూ ఎన్నోసార్లు గొడవ పడ్డారు వాళ్ళ కోసం నీలో సగానికి నువ్వు సర్దిచెప్పుకోలేవా..

తప్పు ఎప్పుడు ఓక వైపే ఉంటుంది అని నేను అనుకోను నీ ఎన్నో తప్పులు కాచి వాళ్ళ ఓపికకు మించి నీ కాళ్లపై నువ్వు నిలబడే వరకు నిన్ను పెంచారు రోజులో ఒక్క పూట కనీసం ఒక గంట వాళ్లతో ఓపిగ్గా మాట్లాడలేవా..

రేపు నీకు మాట్లాడాలి అనిపించినా మాట్లాడటానికి వాళ్ళు ఉండకపోవచ్చు...

--(())--

 

సమ్మోహనాలు ... ప్రశ్న 1301 ... 1310   

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సరిగమ సంగీతము 

సంగీతం పాఠము 

పాఠము జీవిత సంగీత మే ఈశ్వరా 


సంగీత స్వరాలు  

స్వరాలే మధురాలు

మధురాలు మనసునే దోచేను ఈశ్వరా  


యువతకే ఉల్లాసం  

ఉల్లాస ప్రభావం 

ప్రభావం సంగీత స్వరాలే ఈశ్వరా 

  

సంగీత కచేరీ

కచేరీ విహారీ 

విహారి మనసుకునేర్పు  లహరీ  ఈశ్వరా 

 

కొందరి జీవితాలు 

జీవ సంగీతాలు

సంగీత వృత్తియే జీవమ్ముఁ ఈశ్వరా


లింగ భేదము లేదు

లేదు మతమును లేదు 

లేదు సంగీత స్వరము మనషె ఈశ్వరా  


కాలానుగుణంగా 

గుణ ప్రభావంగా 

ప్రభావ సంగీత సాహితియే ఈశ్వరా

 

అపారమగు సంగీత 

సంగీత సమర్దత  

సమర్ధత కీర్తి ప్రతిష్టలే ఈశ్వరా

 

అత్యధికోత్సాహము 

ఉత్సాహ యవ్వనము 

యవ్వన దూకుడులు,గెంతులే ఈశ్వరా 

  

రమణీయ గీతమ్ము  

గీత ఆనందమ్ము  

ఆనంద సర్వ  సంగీతమే ఈశ్వరా 

--(())--

ఒంటె- సింహం- శిశువు: 🌻

ఒంటె అనుకూలమైతే, సింహం ప్రతికూలమైనది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దదే అయినప్పటికీ, అవి రెండూ ఒకే ప్రదేశంలో ఉంటాయి. పసిగుడ్డు ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటుంది. అదే ప్రదేశంలో గొంగళి పురుగు కదలడం ప్రారంభిస్తుంది.  అంటే ఒకే ప్రదేశంలో కదలిక పుట్టినట్లే కదా!

మీరు ఒంటెలా ఉండడమనేది సమాజం మీకిచ్చిన బహుమతి అయితే, మీరు సింహంలా ఉండడమనేది మీరు మీకిచ్చుకునే బహుమతి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే, మీరొక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలనుకోకపోతే, ప్రస్తుతం నడుస్తున్న దానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రమాదాన్ని స్వీకరించే సాహసం మీకు లేకపోతే మీరు ఆ పని చెయ్యలేరు.

కానీ, ఒంటె తత్వాన్ని సరిగా అర్థంచేసుకుంటే మీరు సింహంలా అవుతారు. ‘కాదు’అని చెప్పలేని మీరు ఎప్పుడూ ‘అవును’అని పదే పదే చెప్పడంవల్ల, ఏదో ఒకరోజు ‘అవును’అని చెప్పడం మీకు చాలా చిరాకు కలిగిస్తుంది. అందువల్ల ఏదో ఒక మార్పు కోసం ‘కాదు’అని చెప్పాలనిపిస్తుంది ఎవరికైనా.

అలా ఒంటె తొలిసారిగా సింహంలా మారినట్లు కలలుకనడం ప్రారంభిస్తుంది. ఒకసారి అపనమ్మకంతో సింహంలా సందేహిస్తూ ‘కాదు’అని చెప్పడంలోని రుచిమరిగిన తరువాత మళ్ళీ మీరు ఒంటెలా మారలేరు, ‘అవును’అని ఎప్పటికీ చెప్పలేరు. ఎందుకంటే, సింహంలా ‘కాదు’అని చెప్పడం మీకు ఎంతో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇస్తుంది.

అజ్ఞానులైన అనేకమంది ఒంటెస్థాయి వద్ద ఆగిపోతారు. వారికంటె చాలా మెరుగైన కవులు, కళాకారులు, భావుకులు, తత్వవేత్తలు, విప్లవకారులు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు వంటి మేధావులు సింహం స్థాయివద్ద ఆగిపోతారు. అంతమాత్రాన గమ్యం చేరుకున్నట్లు కాదు. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదు. అదే ‘శిశువు’స్థాయి అయిన మూడవ దశ.

జాగ్రత్తగా వినండి: తొలి దశ అయిన ఒంటె స్థాయిని మీకు సమాజమే ఇస్తుంది. రెండవ దశ అయిన సింహం స్థాయిని మీకు మీరే ఇచ్చుకుంటారు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడే మూడవ దశ అయిన శిశువుస్థాయి మీకు లభిస్తుంది. లేకపోతే అది మీకు ఎప్పటికీ లభించదు.

కేవలం కదలడం మాత్రమే తెలిసిన గొంగళిపురుగు ఏమాత్రం అర్థంలేకుండా తనకు రెక్కలొస్తాయని, హాయిగా ఎగరగలనని, తర్కవిరుద్ధంగా ఎలా ఊహించగలదు? అది అసంభవం. కేవలం నేలపై కదలడం మాత్రమే తెలిసినవారు గాలిలో ఎగరగలమని ఎలా ఊహించగలరు? అదంతా వేరే కోణం- నిట్టనిలువు కోణం.

ఒంటె సింహంలా మారడం పరిణామం, సింహం శిశువుగా మారడం విప్లవం. సమాజం మిమ్మల్ని ఒంటెగా మార్చగలదు. మీకుమీరే సింహంలా మారగలరు. కానీ, సింహం శిశువుగా మారేందుకు మాత్రం సీతాకోకచిలుకలా పరిణామం చెందిన బుద్ధుడు, మహావీరుడు, రూమీ లాంటి గురువులు చాలా అవసరం. అప్పుడే మీరు వారిలా అవాలనే కలలుకనగలరు. లేకపోతే, మీకు తెలియని వాటి గురించి మీరు ఎలా కలలు కనగలరు?

హిమాలయాలలో నివసిస్తున్న అతి ప్రాచీన ఆదివాసీలు తాము ఎప్పుడూ చూడని ‘‘మోటారు వాహనం (కారు)’’ గురించి కల కనలేరుకదా! కాబట్టి, ఏదైనా చూసినప్పుడే దాని గురించి మీరు కల కనగలరు.

బుద్ధుడు,  బోధి ధర్మలను చూసినప్పుడే అలాంటి మహానుభావులు ఉన్నారని మీకు తెలుస్తుంది. చూసేందుకు వారుకూడా మీలాగే మామూలు మనుషులుగా కనిపిస్తారు. కానీ, వారు మామూలు మనుషులు కారు. అనంత దిగంతాల ఆవలి తీరంలో ఉన్న ఏదో తెలియని శక్తి వారి ఉనికిలోకి ప్రవేశించినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మీరు ప్రేమతో, దయతో వారిని సమీపించినప్పుడు వారి అంతర్గత ఆకాశం మీకు లీలగా కనిపిస్తుంది. అప్పటినుంచి మీరు దానికోసం కలలుకంటూ ఎలాగైనా, ఎప్పటికైనా వారిలా అవ్వాలని ఆశిస్తూ ఉంటారు. గురువు నుంచి శిష్యునికి సంక్రమించే అంటురోగం అదే. అలా మూడవ దశ అయిన ‘శిశువు’దశ మీకు గురువునుంచి సంక్రమిస్తుంది. అదే పరస్పరాలంబనతో కూడుకున్న సృజనాత్మకత.

మొదటి దశ అయిన ఒంటె దశ పరాధీనమైనది. రెండవ దశ అయిన సింహం దశ స్వతంత్రమైనది. కానీ, మూడవ దశ అయిన శిశువు దశ పరాధీనమైనది కాదు, స్వతంత్రమైనది కాదు. అస్తిత్వమంతా పరస్పరాలంబనతో కూడుకున్నదే. అందులో ఉన్నవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడ్డవే. అందుకే అవి అన్నీ ఈ అస్తిత్వంలో ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి.

‘‘నేను, నీవు’’అనేవి లేవు. అలాగే ‘‘అవును, కాదు’’అనేవి కూడా లేవు. ఎప్పుడూ విధేయతతో ‘అవును’అని, అవిధేయతతో ‘కాదు’అని చెప్పవలసిన అగత్యంకూ
డా ఏమాత్రంలేదు. సర్వస్వ జ్ఞానోదయమంటే అదే. కాబట్టి, అందరూ మరింత సమయస్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించే సమయం ఆసన్నమైంది.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

[26/02, 6:36 am] : *క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ*…


ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండదు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్ట్ట డం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.

ఆసురీ గుణాలు

కామం…

అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.

క్రోధం…

క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.

లోభం…

లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.

మోహం…

మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.

మదం…

ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸°వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.

మాత్సర్యం…

ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.

రాగము…

ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.

ద్వేషం…

ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.

ఈర్ష్య…

తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.

అసూయ…

తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.

దంభము…

తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.

దర్పం…

నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)

అహంకారం…

అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు

ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశా నుసారం కర్మ చేయాలి.

మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?


పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.

ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.


మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

బుద్ధుడు తిరిగి రాని  విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.

మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

త్రికరణములు: 3 పనిముట్లు 1 మనస్సు 2వాక్కు3శరీరం.వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2రకాలు.1బైటికి కనిపించేవి. 2కనిపించనివి.వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ  2రకాలు.పుణ్యకర్మలు.పాపకర్మలు.పుణ్యకర్మలవల్ల

సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం

సూక్ష్మ శరీరం గా(మనోబుధ్ధిచిత్యహంకారములు)

ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.

బాల్యం లోజరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం

కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటి

వన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. కర్మ ను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి 

స్థూలంగా కర్మ అకర్మ వికర్మలను గురించి తెలుసుకుందాం. 1కర్మ:శాస్త్రవిహితమైనవే

అంటే శాస్త్రము బోధించే కర్మలు. 2అకర్మ:ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన

సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 3వికర్మ:శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిధ్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.

మరొక విధంగా కర్మ 3రకాలు.1సంచిత.2ప్రారబ్ధ3ఆగామి.

సంచితకర్మ:ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.

ప్రారబ్ధం :సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.

ఆగామి :ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే

జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. మన

ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగి కిమాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిధ్ధిస్తుంది.

కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు. 

కర్మ సిద్ధాంతము : మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.

కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టు కు కారణం విత్తు అట్లే తండ్రి కారణం కొడుకుకార్యం మళ్ళీ ఆ కోడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …

అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుందిఅందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్ప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినా

 *జీవిత సత్యం*


తుమ్మెద  పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి

అందులో జీవనం కొనసాగిస్తుంది.....

చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...


కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు

ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....

అయ్యో

నన్ను ఏదో  బంధించేసింది అని చెప్పేసి ఆ తామర

రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....

అయితే 

మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం

ఆ తామర రేెకులను తొలచలేదా....

ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...


కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...

లేక 

నన్నేదో బంధించింది అన్న

భావన దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావనను

నమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న 

దాన్ని నమ్మింది...

అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...


మన జీవితంలో సమస్యలూ అంతే,

సమస్య బలమైంది కాదు....

మనశక్తిని

మనం మర్చిపోవడమే దాని బలం...

మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,

గుర్తించడమే, నమ్మడమే దాని బలం...


"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...

దాని బలం తామర రేకు అంత....

నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.

తెలుసుకో 

అదే..జీవిత సత్యం

శ్రీ ఆకెళ్ళ శ్రీనివాసరావు

No photo description available.

1 comment: