ఎప్పుడో యనకుమా... యేదియో పలుకుగా
సప్పుడే తలపుగా..సత్యమే తెలపగా
నిప్పు నే పట్టుతీ... నిజమ్మే బ్రతుకుగా
ఒప్పులే తప్పులై... ఓటమే భవశి వా
ప్రతి పరిచయం ప్రీతిగ వికసితం
ప్రతి పరిణయం ప్రేమగ సముచితం
ప్రతి యనుభవం ప్రేమ చెలిమిగతం
ప్రతి జపమయం ప్రేమ మనసు శివా
ప్రేమ పంచె సంబంధమె ప్రీతి నిచ్చు బాం ధవ్యమె
క్షేమ మయ్యె సుఖత్వమ్మె క్షేమ స్వర్గ బంధుత్వమె
సామ బేధ కర్తవ్యమె సంఘ సర్వ కర్తృత్వమె
సాక్షి గమ్య మార్గమ్ముయె సాధ్య ధర్మ సత్య శంభు
ప్రవాహమ్మేసాగే ప్రభలు కదులుస్త్రోత్రముగనే
వివాహమ్మే యోగమ్ము విధిగను బంధమ్ముయగుటే
నివాసమ్మే ప్రాణమ్ము నిధిగను విద్యా కదలికే
నవాభ్యు స్సాద్యమ్మేను నటనలు విశ్వేశ్వరునివే
ప్రలోభమ్మే భారమ్ము ప్రగతికి కీడే జరుగుటే
విలోలమ్మే సర్వమ్ము విజయము కష్టమ్ము యగుటే
బలో పేతమ్మే నష్ట ప్రతిభ గనే బాధ గనుటే
కళో ళ్లాసమ్మే దృష్ట కళలగు శంభో మది శివా
నటించే వారే స్వేచ్ఛ పలుకుల యాకర్షణగుటే
ఫటించే వారే ప్రాభవ మగుట వేదమ్మగుటయే
ఝటించే వారే ఝాఝమగుటయు నాట్యమ్ముగుటయే
తటించే వారే వింత గమనము భవ్యల్ శివ శివా
పరంధామా శిద్దేశ్వర వినయ విద్యా ప్రతిభ యే
జ్వరంతత్త్వమ్మే బుద్ధి గుణమగు ప్రజ్ఞా ప్రభవ మే
నరం సాగేయుద్ధమ్ము గతియగు భావమ్ము కళ యే
స్వరం రాగమ్మేలే సరిగమలు శంకర ప్రభువా
సతతము నిన్ను గొల్చెద ప్రశాంత మూర్తి స
న్మతి ,సుముఖా, ప్రజాపతి సనాతనా ,శివా
గతియగు ,పాపనాశక, వినిర్మలాకృతీ!
చతురవచోవిదా, సుగుణజాల బ్రోవరా.
సుకేసర వృత్తము
(న జ భ జ ర యతి..11)
****
అమ్మానాన్న గురువుల ఆశీస్సులు అమృతవల్లీ
అమ్మ వారి దీవెనలు అందు కొనుము తల్లీ
తళ్లడిల్లు లోకములో తత్వమ్ము బోదన లీలా
కల్ల లాడని తన్మయత్వపు భయము జపము లీలా
అత్తమామల సేవలతో ఆదమరుచు లీలా
కాలమాయకు చిక్కక ఉండాలి లతలా...// అమ్మ..//
మరువలేని నీ తత్త్వం మహాభారతమ్ము గా
తిరుగులేని నీ భావం మహా మానవత్వం గా
విశ్వానికి ఆదర్శం నీ విరూపాక్ష సత్వం గా
విశ్వమాయకు చిక్కక కదలాలి కాలములా / అమ్మ..//
నీ ఉనికిని ప్రశ్నించు పరమాత్మ ఉనికిని గ్రహించు
నీలో నువ్వు జ్వలించు వాస్తవాన్ని గ్రహించు
జ్ఞానం వైపు కదలు అజ్ఞానాన్ని దహించు
ధర్మ మార్గాన పయనించు అధర్మాన్ని ఎదురించు //అమ్మ..//
అమ్మానాన్న గురువుల ఆశీస్సులు అమృతవల్లీ
అమ్మ వారి దీవెనలు అందు కొనుము తల్లీ
***
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
"దయచేసి బ్రాహ్మణ బంధువులకు షేర్ చేయండి"
1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు... సేవ చేసింది సూర్య వంశానికి,
2.చాణక్యుడు బ్రాహ్మణుడు. పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,
3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..
4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర శివాజీకి..
5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..
అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు. ము బ్రాహ్మణులమ్
మేము క్షత్రియుడైన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం
గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని పరమాత్ముడు అని ఆరాదిస్తాం
స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.
బ్రాహ్మణుడైన బ్రహ్మకు నమస్కారం చేయము..
బ్రహ్మణుడైన రావణుడి..దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.
ఇంతచేసినా కూడా పరుల కళ్ళకు జాతీయవాదులం
ఎందుకంటే,....మేము బ్రాహ్మణులం..
ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.
కళా, సాంసృతులను ఆరాదిస్తాం..ఉచితంగా విద్యాబోధన చేస్తాం
ఎవరైనా ఎదుగుతుంటే వారికి నిచ్చెన వేస్తాం.. వారి బాబుకు శ్రమిద్దాం.
ఇంత చేసినా కూడా పరుల కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..
ఎందుకంటే..మేము బ్రాహ్మణులం..!!
అన్నo పెట్టకున్నా గంజిని పెట్టి ఆకలి తీరుస్తాం.
అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..
ఎందుకంటే...మేము బ్రాహ్మణులం.
గవర్నమెంట్ పథకాలు లేకున్నా దేవుడు ఇచ్చాడని అనుకుంటాo
రిజర్వేషన్లు లేకున్నా మా పిల్లలను అప్పుచేసి చదివించి సర్కారు బళ్లకు, కంపినిలకు
పంపిస్తాం.
మేము దేశానికి సేవకులై, శ్రామికులమై ఈ మట్టికోసం.సమస్త విద్యలో బోధ కొరకు పోరాడు
తాం..
ఎందుకంటే,...మేము బ్రాహ్మణులo.!!
అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..అందరితోనూ... "మెప్పు"పొందుతాం
బ్రాహ్మణులను గౌరవింపు దేశానికి వెన్నెముక బ్రాహ్మణల మంత్రమే లోకాలకు శాంతి మార్గము
***
ఎవరు రాసారో తెలియదు కానీ అత్యద్భుతంగా ఉంది
ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .
మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన - అద్దం - రాముడు .
ధర్మం పోత పోస్తే రాముడు
ఆదర్శాలు రూపుకడితే రాముడు .
అందం పోగుపోస్తే రాముడు
ఆనందం నడిస్తే రాముడు
వేదోపనిషత్తులకు అర్థం రాముడు
మంత్రమూర్తి రాముడు .
పరబ్రహ్మం రాముడు .
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు
ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన
పాట -
రామాలాలీ - మేఘశ్యామా లాలీ
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా
వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
రామ రామ
భరించలేని కష్టానికి పర్యాయపదం -
రాముడి కష్టం .
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు
కష్టం గట్టెక్కే తారక మంత్రం
శ్రీరామ .
విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా
వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
కృష్ణా రామా !
తిరుగులేని మాటకు - రామబాణం
సకల సుఖశాంతులకు - రామరాజ్యం .
ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన
ఆజానుబాహుడి పోలికకు - రాముడు
అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు
రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -
Rama killed Ravana ;
Ravana was Killed by Rama .
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు
గొప్ప కొడుకు - రాముడు
అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు
గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .
మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).
మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).
సంగీత సారం రాముడు
(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం
(పిబరే రామరసం)
సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .
రామాయణం పలుకుబళ్లు
మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .
తెలుగులో కూడా అంతే .
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...
చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం
కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .
వికారంగా ఉంటే -
శూర్పణఖ
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర
పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .
ఎంగిలిచేసి పెడితే -
శబరి
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు
అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ కాండ
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .
పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.
సాయం చేసినపుడు- ఉడుత భక్తి..
కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..
గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని
యుద్ధమంటే రామరావణ యుద్ధమే .
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు
ఒంటిమిట్టది ఒక కథ ..
భద్రాద్రిది ఒక కథ
అసలు రామాయణమే మన కథ .
అది రాస్తే రామాయణం
చెబితే మహా భారతం
అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు
అది ఒక జీవన విధానం
అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు
రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు
జై శ్రీ రామ్.....
|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది
జై శ్రీరామ్
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
"దయచేసి బ్రాహ్మణ బంధువులకు షేర్ చేయండి"
1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు... సేవ చేసింది సూర్య వంశానికి,
2.చాణక్యుడు బ్రాహ్మణుడు. పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,
3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..
4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర శివాజీకి..
5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..
అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు. ము బ్రాహ్మణులమ్
మేము క్షత్రియుడైన శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం
గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని పరమాత్ముడు అని ఆరాదిస్తాం
స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.
బ్రాహ్మణుడైన బ్రహ్మకు నమస్కారం చేయము..
బ్రహ్మణుడైన రావణుడి..దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.
ఇంతచేసినా కూడా పరుల కళ్ళకు జాతీయవాదులం
ఎందుకంటే,....మేము బ్రాహ్మణులం..
ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.
కళా, సాంసృతులను ఆరాదిస్తాం..ఉచితంగా విద్యాబోధన చేస్తాం
ఎవరైనా ఎదుగుతుంటే వారికి నిచ్చెన వేస్తాం.. వారి బాబుకు శ్రమిద్దాం.
ఇంత చేసినా కూడా పరుల కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..
ఎందుకంటే..మేము బ్రాహ్మణులం..!!
అన్నo పెట్టకున్నా గంజిని పెట్టి ఆకలి తీరుస్తాం.
అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..
ఎందుకంటే...మేము బ్రాహ్మణులం.
గవర్నమెంట్ పథకాలు లేకున్నా దేవుడు ఇచ్చాడని అనుకుంటాo
రిజర్వేషన్లు లేకున్నా మా పిల్లలను అప్పుచేసి చదివించి సర్కారు బళ్లకు, కంపినిలకు
పంపిస్తాం.
మేము దేశానికి సేవకులై, శ్రామికులమై ఈ మట్టికోసం.సమస్త విద్యలో బోధ కొరకు పోరాడు
తాం..
ఎందుకంటే,...మేము బ్రాహ్మణులo.!!
అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..అందరితోనూ... "మెప్పు"పొందుతాం
బ్రాహ్మణులను గౌరవింపు దేశానికి వెన్నెముక బ్రాహ్మణల మంత్రమే లోకాలకు శాంతి మార్గము
***
శివుడు స్మశాన వాసి ఎందుకు అయ్యాడు?*
త్రిమూర్తులు లో ఒక్కడైనా పరమశివుడు కైలాసం లో, కాశీ లో వశిస్తుంటాడు. అయితే ఈయన స్మశానం లో కూడా వశిస్థాడని చెపుతారు. అంతటి మహిమన్వితునికి స్మశానం లో ఉండవలసిన అగత్యం ఏమిటి?ఈ ప్రశ్నలకు మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో సమాధానం దొరుకుతుంది.
ఒక సారి కైలాసం లో పార్వతీపరమేశ్వరులు ఇరువురు మాట్లాడు కుంటుండగా, పార్వతీదేవి పరమేశ్వరుని, స్వామి మీరు స్మశానం లో ఎందుకు నివసిస్తారు?అని ఆడిగిన0ది. దానికి సమాధానం గా శివుడు.
దేవి ఒకమారు బ్రహ్మదేముడు నన్ను కలిసి మహేశ్వర స్మశానం లో ఉగ్రభూతాలు జనావాసాల మీద పడి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అనిచెప్పాగా నేను వాటిని నియంత్రి0చడానికి స్మశాన వాసినయ్యాను. అంతే కాకుండా మరణించిన వ్యక్తి ని దహనం చేసి బంధువులు వెనుతిరిగిన తరువాత ఆ జీవుడు ఒంటరిగా ఏడుస్తుంటే నేను అతనిని ఓదార్చి స్వాంతన చేకూరుస్తాను. అంతే తప్ప మరొక కారణం లేదు అని చెప్తాడు.
ఈ చిన్ని కధ వల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే. మనిషి జీవన పర్యంతం భగవత్ స్పృహ లేకుండా, సంసార బంధం అనే చట్రం లో ఇరుక్కొని, లోక వ్యవహారం లో ఇబ్బడి ముబ్బడిగా కూరుకు పోయి అంత్యకాలం లో భార్యాపిల్లలు బంధువులచే వదిలివేయ బడి ఆ జీవుడు ఏకాకి అయి విలపిస్తుండగా, అప్పుడు ఆ ఆసుతోషుడు అక్కున చేర్చుకుని స్వాంతన చేకూరుస్తాడు.
అందుకే దూర్జటి తన కాళహస్తీశ్వర శతకం లో ఇలా అంటాడు
దంతంబు ల్పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేన చరించునప్పుడె కురుల్వెల్వెల్లగానప్పుడే
చింతింప న్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!
పరమశివా ఈ శరీరం లో సకల శక్తులు ఉన్నప్పుడే ధనసంపాదన ఎలా చేస్తామో అలాగే భగవంతుని పైన కూడా చిత్తము ఉంచి పర్యంతం దేవుని సేవలో తరించాలి.!
*హర హర మహాదేవ*
.....
చల్లని అనుభూతులు
ఒక్కొక్కసారి మనసు ఆనందంతో నిండిపోతుంది. గతదినం వేదనలో మూగబోయి రాత్రి నిదుర అనంతరం నిన్నటి కలతకు అంతగా కారణం కనిపించకపోయేసరికి మనసు తేలికపడుతుంది. చల్లని దేశాల్లో సూర్యభగవానుడి నులివెచ్చని కిరణాలు సోకినప్పుడు, వేడి దేశాలలో వాతావరణం చల్లబడి నాలుగు చినుకులు రాలి చలచల్లని మలయ సమీరం వీచినప్పుడు- మనసుకు ఎంతో హాయి కలిగి ఏనో తెలియని లోకాలకు వెళ్ళిపోతుంది. మనిషి ఆనందానుభూతులకు వాతావరణం ఓ పెద్ద కారణం అన్నప్పుడు ఆశ్చర్యం. కలుగుతుంది. మనసు ఆనందంతో నిండి ఆహ్లాదంగా ఉన్నప్పుడు అడిగిన వారికి, ఆడగనివారికి దానధర్మాలు చేయాలని కొందరికి అనిపిస్తుంది. అందుకే అంటారు. పెద్దలు సంతోష సమయాలలో వాగ్దానాలు చేయవద్దని
శ్రావణ, ఆశ్వీయుజ, కార్తికమాసాలు శుభ కార్యక్రమాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగిపోతాయి. _మాసాలలో دان ఈ వైదిక, ఇటు ప్రార్ధనల రూపేణా మన్నించమని భగవంతుడిని మన సారా కోరుకోవడం కనిపిస్తుంది. శ్రావణమాసంలో చల్లని సాయం కాలాలు ఉవ్విళ్లూరిస్తాయి. శీతాకాల ప్రారంభమైన కార్తీకం ఇటు భక్తికి అటు ముక్తికి మార్గం చూపుతుంది. చల్లదనం ఎందుకు ఆహ్లాదం కలిగిస్తుంది. మనసుకు చలి ప్రదేశాలలో నీరు గడ్డకట్టే చలిలో ప్రజలు శీతల దుస్తులు ధరించి.. నులివెచ్చని అనుభూతులు సృజిం చుకొని ఆనందాన్ని అనుభవిస్తారు. శరీరం పిత్తదోషయుక్తమైనప్పుడు రక్తం వెచ్చని అనుభవాన్ని పంచుతుండగా శరీరానికి తగిలే చల్లనిగాలి మనసును సేదదీరుస్తుంది. ప్రకృతి తాపాన్ని పంచుతున్నప్పుడు చల్లని అనుభూతిని, శీత ప్రకోపం చెందినప్పుడు నులివెచ్చని అనుభూతిని మనసు కోరుకోవడంలో తప్పేముంది! అయినా అందులోని వైచిత్రి ఆశ్చర్యం గొల్పుతుంది. మనిషి తనకు దక్కింది చాలక మరేదో గొప్పదాన్ని కోరుకోవడం చిత్రమైన అనుభవమే! చీకటి రాత్రులలో వెలుగు కోసం, వెలుగు(ఎండ) ఉష్ణ ప్రకోసం చేస్తున్నప్పుడు చల్లని నీడ కోసం ప్రయత్నించడం ప్రాణుల సహజ లక్షణం. చెట్లను, నీడనిచ్చే చల్లని లోగిళ్లను ఆశ్రయించడం జీవులకు పరిపాటి
పెద్దలు పిన్నలను దీవించడం సంప్రదాయం. ఏదైనా పండుగను, పబ్బాన్ని పురస్కరించుకొని పెద్దలు, పండితులు తమకన్నా చిన్నవారిని నూరేళ్లు చల్లగా వర్ధిల్లమని దీవిస్తారు. చల్లదనం ఆయుష్షును పెంచే పదంగా ఉపయోగించడం విశేషం. సూర్యరశ్మిలో జీవకణాలు ప్రవర్ధిల్లుతాయి. విత్తనాలు జీవం పోసుకుంటాయి. మొక్కలు ఆకుల ద్వారా సూర్యకాంతిని స్వీకరించి పిండిపదార్థం తయారు చేసుకుంటాయి. అయినా చంద్రుడికే ప్రాముఖ్యం ఇచ్చి (ఔషధ మొక్కలకు చంద్రకాంతి కావాలట) చల్లదనాన్ని ఆహ్వానించి పిల్లలకు, ఆశీర్వాదం అందించడం పెద్దలకు వెన్నతో పెట్టిన విద్య.
- గోపాలుని రఘుపతిరావు
కనికరం తేటగీతి మాలా
అప్పుడప్పుడూ గుండెలో యలుపు చేరి
గుండె లయ తప్పినప్పుడు గుర్తుచేయు
కళ్ళరెప్పలచప్పుడు కానలేను
ఏది తోచనప్పుడు బంధ మెరుగ లేను
పరిమళాలు గుప్పెడు చేరి పలకరింపు
అప్పుడప్పుడూ మాటలే పెగల లేవు
రెప రెపమనికదులు గుండె రెచ్చి పోవు
జ్ఞాపకాల బావుటగాను జ్ఞాన మేది
నేను చోరునికే జిక్కి నీడలేక
నిద్ర లేక యాతన యగు నిజముతెలుప
పాపము తెలిసిచేయని పాపినైతి
మనసు ఆశదురాశగు మాయ కమ్మి
పరుల స్వత్వముహరణ పదము కదలె
పగలు రాత్రి భ్రమణమేను పాశవిద్య
బెడద తట్టుకొని బ్రతుకు బిడియ మదియు
సర్వ నిష్ఠ కదల కార్య సమయ మిదియు
భార్య పుత్రులు కుశలమే బంధ మగుట
దేహప్రేమ కలిగి యుండు దినదినమగు
చింత లేని హితము తోడు చెలి చెరితమె
కాంతుని కదులు లీలలే కాల మార్పు
అప్పుడప్పుడూ నిస్తేజ యలక జేరి
హృదయ మేకమ్మినప్పుడు హాయి యేది
ప్రణయ కవితలు సంపుట ప్రభలు మిగులు
కాల తీర్పు కని కరమ్ము కదులు చుండ
వ్యాకరణ, ఛందో, శబ్ద, అన్వయదోషములు కుప్పలు తెప్పలు. గణములను కిట్టిస్తే పద్యము కాదు. పద్యము పుట్టాలంటే ఎంతో శ్రమ చేయాలి. ఎవరూ నిర్దోషిగా పద్యాన్ని ఆరంభంలో వ్రాయలేదు. మీ బ్లాగు చూసి వ్రాయాలని పంపించింది. మొదటి మీరు మంచి పద్యం గురువు వద్ద విద్య అభ్యసించి అప్పుడు పద్యములు వ్రాయండి. లేకపోతే మీ పద్యములు ముత్యాల సరాల్లా మిగిలి పోతాయి. గణములను కిట్టిస్తే పద్యములు అల్లర్లు. మీరు నవీన్ ఛందమఉలలఓ పద్యములు ఎప్పుడైనా వ్రాయవచ్చు. మొదటి అందరికీ తెలిసిన ఛందమఉలలఓ నిర్దోషిగా పద్యం వ్రాయండి. దోషాలు తో పద్యములు పొడుగు నీవు.
ReplyDelete