Tuesday, 30 March 2021

31032021

   

నేటి కవిత్వం -. మనోహరి (6)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మందారం లా విరబూసే నా తనువూ
సిందూరం లా తనువంతా ఓ మెరుపూ
నీ చూపే నా మనసంతా ఓ కుదుపే
సిగ్గాయే నా కలలో నీ స్పర్శ లతా
సింగారం లా మరుగొల్పే నీ మనసే
నాంచారీ లా ఉసిగొల్పే నీ సొగసే
బంగారీ లా మెరుపుల్తో నీ తనువే
వయ్యారి లా నడకల్తో నీ నడుమే
ఉద్వేగం చెందుట శృంగారం వలనా
రాద్ధాంతం చేయుట ప్రేమావల్లె కదా
సందేహం తీర్చుట సంతోషం వలనా
ఉద్దేశ్యం మంచిది చెల్మి వల్లె కదా
ఊహల్లో ఊపుల వయ్యారం చెసే
రాగాలు పువ్వుల ముద్దూలే చెసే
అద్దంలా నవ్వితె నవ్వుల్తో చెసే
ఈజన్మే మాధవు సొంతంలా చెసే
--(())--
UIUII UIU UI UI
నేటి కవిత్వము - హాయి
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నిన్ను నిన్నుగ చూడగా నేను లేను
నేను నేనని తల్యంగా నీవు లేవు
నీవు నేనను దృష్టి యే నిల్చి పోవ
నన్ను నీవని చెప్పంగ శక్య మౌన
కాల మాయకు అందరూ చిక్కి నట్టె
వాన నీటికి అందరూ తడ్సి నట్టె
ఎండ గాలికి అందరూ మాడి నట్టె
అగ్ని వాడక ఎవ్వ రూ బత్క నట్టె
రాజ కీయపు రంగులే నీకు వద్దు
కాయ కష్టము నమ్మియే ఆశ తీర్చు
మారు పల్కక చెప్పెదే దేదొ చేయి
కారు చీకటి మారునే వెలుగు వచ్చె
పాలు నిచ్చు గొ సంతతీ బాధ చూడు
ఊలు నిచ్చిన గొర్రెల బాధ చూడు
మేలు చేసెడి పెద్దలా బాధ చూడు
వేలు ఖర్చులు మంచికే చేసి చూడు
రోజు లన్నియు ఒక్క మాదిరే చూడు
దేని గూర్చియు ఆశ పెట్టు కోకుండు
సేవ చేసియు కోర్క తీర్చియు చూడు
మంచి చేసిన వాడికే హాయి గుండు
--(())--


మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
 తరువాత?
 మెసపొటేమియా!
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,
రా! నా ప్రక్కన పడుకో!
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!అని అడిగాడు!..డియోజినస్.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
ఒక మనిషికి ఎంతకావాలి?
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
..........

కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.. ఎన్నో లోయలు, వంపులు, మలుపులు. అన్నీ అధిగమిచ్చి నిరంతరం తనకు తాను ముందుకు సాగుతూనే ఉంటుంది.. ప్రవహించిన నీరు వెనక్కు రాదు.. అదే విధంగా  చేజేతులా జారవిడుచుకున్న క్షణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేం. బాల్యం లో, యవ్వనం లో ఎన్నెన్నో క్షణాలను వృధా చేసుకుంటాం. వయసు పై పడిన తరువాత ఒక్క సారి వెనక్కు చూసుకుంటే. అదేదో విచిత్రమైన అనుభూతి.. అలా చేసి ఉండక పోవలసిందని.. అలాగే చేయడం మంచిదైందని అనుకుంటాం. అందుకే ప్రతిసారి మన అనుభవాలను, కష్టాలను, సుఖాలను గుర్తుచేసుకుంటూ.. ముందుకు సాగాలి.. అవే మనకు పాఠాలు, గుణపాఠాలు..
ఓరోజు ఓ ధనవంతుడు ఓ అడవిగుండా పోతున్నాడు. ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు. ఆయన దగ్గరున్నదంతా దోచుకున్నారు. అయితే దొంగలలో ఒకడు “ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం. కనుక ఇతనుండి లాభమేంటీ... అతనుంటే మనకు ప్రమాదం కూడా. చంపేస్తేనే మనం బయటపడగలం” అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలతో ఆగలేదు. తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు. ఇంతలో రెండో దొంగ అడ్డుపడి “అతనిని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు...అతనిని కట్టపడేసి ఇక్కడే వదిలేద్దాం. అతను తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్పలేడు” అన్నాడు. అతను చెప్పిన మాట బాగుందనుకుని దొంగలు అతనిని తాళ్ళతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. కాస్సేపు తర్వాత మూడో దొంగ ఒక్కడూ అతని దగ్గరకు వచ్చాడు. “నిన్ను మా వాళ్ళు బాగా వేధించారు కదూ. కొట్టారు. గాయపరిచారు కదూ...క్షమించు....నాకు నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నేను నిన్ను విడిచిపెడతాను.... ” అంటూ మూడో దొంగ కట్లన్నీ విప్పి అతనిని విడిచిపెట్టాడు. అంతేకాదు, అడవి నుంచి అతనిని తనతోపాటు బయటకు తీసుకువచ్చాడు. “నా వెంటే రా....నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు...” అన్నాడు. దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ “సరేగానీ నువ్వు నాతోపాటు మా ఇంటికి రావా”లన్నాడు. “నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. నీకు కృతజ్ఞతలు” అన్నాడు ఆ ధనవంతుడు. “నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబసభ్యులను పరిచయం చేస్తాను. నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను, వారెంతో సంతోషిస్తారు.... ” అన్నాడు. కానీ దొంగ తనను క్షమించమని, తాను వాళ్ళింటికి రాలేనని అంటాడు. అక్కడికి వచ్చినట్లు తెలిస్తే నన్ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ చెప్పి ఆ ధనవంతుడికి దగ్గర దారి చూపించి వెళ్ళిపోతాడు. ఈ కథతో తెలుసుకోవలసినవి మూడు గుణాలు. అవి, ఒక దొంగేమో ఆ ధనవంతుడు ఉండి లాభమేంటీ...అతనిని చంపేస్తేనే మంచిదని అన్నాడు. ఇది తమోగుణం. ఇక రెండో దొంగ ఏం చెప్పాడు....అతనిని చంపడంవల్ల మనకెలాంటి లాభమూ లేదు. అతనిని తాళ్ళతో కట్టిపడేసి వెళ్ళిపోదాం అన్నాడు. ఇది రజో గుణం. ఇక ఇంకొక దొంగ వైఖరిని సత్వ గుణంగా చెప్పుకోవచ్చు. సత్వగుణం దైవాన్ని చేరుకునే మార్గం చూపుతుంది. మొదటి ఇద్దరు దొంగలకన్నా అతను మేలు. అతను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతో కొంత ఉంది. కనుకనే అతను ఆ ధనవంతుడికి ఇంటికి చేరుకునే మార్గాన్ని చూపించాడు.

****

 🍁వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?🍁


"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః " - అంటే అర్ధం తెలుసా???

SUN'DAY
MO(O)N'DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY

- అంటే ఏమిటో తెలుసా?
అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర - అంటే తెలుసా?

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా?
తెలియదా!?
సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!
వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!
కాస్త విపులంగా....
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు.
భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందామరేడ్యభూపుత్రసూర్యశుక్ర_బుధేందవః
అనగా...
పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి.

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి?

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది.
ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి.
ఆ భాగాలను వారు "హోర" అన్నారు.
"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.
దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు.
ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.
హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది.
ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది.
కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.
మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,
ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.
అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది!
అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం.
వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి.

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.
అదే మొదటిరోజు.
అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.
ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే.
అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది.

ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు.

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం!

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా!

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ?
పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం!
నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.

🍁*****

sekarana 🌹. వివేక చూడామణి - 53 / Viveka Chudamani - 53🌹
✍️  రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 16. బుద్ది   - 2 🍀

189. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము రూపొందుతుంది.

190. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా భావిస్తుంది.

191. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.

192. మాయ వలన కాని ఇతర కారణముల వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని, చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

సదాచారము 


పరిశుద్ధ జీవనము ఒక్కటియే మార్గమున పురోగతి నివ్వజాలదు. సదాచారవంతు లెందరో గలరు. పాత్రను పరిశుద్ధి చేయుట సద్వినియోగపరచుటకే కదా! కేవలము ప్రతిదినము తోమి, కడిగి, భద్రముగ వుంచిన పాత్ర వలన వినియోగము లేదుకదా! ఆహార పదార్థములను వండుటకు పాత్రను వినియోగించినట్లే నీవు కూడ పరహితమను యజ్ఞమునకు సమర్పణము చెంది
యుండవలెను.

పాత్ర అగ్ని తాకిడి భరించి, రుచికరమైన పదార్థములను తయారుచేసి పదిమందికి పోషణము కలిగించును. నీవును అట్లే జీవితపు ఆటుపోటులను భరించుచు, పదిమందికి వినియోగపడు పద్ధతిలో జీవించుట ముఖ్యము. కేవలము సదాచారమే సమస్తము అను భ్రమనందు జీవింపకుము. సదాచారమవసరమే. అది లేనివారు సత్కార్యములను నిర్వర్తించలేరు.

సత్కార్య నిర్వహణకు సదాచారముతో పాటు సత్సంకల్పము, తెగించు బుద్ధి (ధీరత) కూడ నుండవలెను. ఇట్టి గుణములు లేని సదాచారము డాంబికముగ నుండును. తెలియని అహంకారము నిన్నాశ్రయించి యుండును. పదిమందికి ఉపయోగ పడిన జీవనమే జీవనము. త్వరపడి పరహిత కార్యమున పాల్గొనుము.

సశేషం...

 స్వేచ్

నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి.

మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలను పాటించాలని మీకు బాగా చిన్నప్పటి నుంచే బోధించారు. అందుకే మీకు స్వేచ్ఛ అంటే భయం. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ, బుద్ధి పెరగలేదు. అన్ని జంతువులకూ వయసు మాత్రమే పెరుగుతుంది కానీ, బుద్ధి పెరగదు. బుద్ధి పెరగడమంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.

దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని ఆది నుంచే మీకు బోధించారు. అందువల్ల మీరు ఆయన రక్షణ వలయంలో ఉన్నారనుకుంటారు. మీ లెక్కలు మీకుంటాయి. ‘‘ భయపడకండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి, ఆయనను తలచుకుంటూ పడుకోండి’’ అని చిన్న పిల్లలకు కూడా రాత్రి పడుకునే ముందు బోధిస్తారు.

మీకు వయసు పెరిగినా మీ పసితనంలో నాటిన ఆ భావన మీలో అలాగే ఉండిపోతుంది. కానీ, ఎవరూ మిమ్మల్ని రక్షించ వలసిన అవసరం లేదని, చీకటిలో కూడా మీరు హాయిగా పడుకోవచ్చని’’  నేనంటాను. అంటే ‘‘మీరు భయపడుతున్నారని, అందుకే మిమ్మల్ని రక్షించేందుకు ఎవరో ఒకరు కావాలని, లేకపోతే మీరు పడుకోలేరని’’ అర్థం. .

ఒకవేళ మీ రోగం కేవలం ఊహాత్మకమైతే- అలాంటి రోగులు మీ చుట్టూ అనేకమంది ఉంటారు. ఒక చిన్న విషయం చాలు, వారికే తెలియకుండా వారు దానిని పెద్దది చేస్తారు- దానికి ఊహాత్మకమైన మందు అవసరమవుతుంది. ఒక మాయ చెయ్యడమే వాటికి మందు. ‘‘దేవుడు’’ అలాంటి మందే.

నిశ్శబ్దంగా ఉండే అనంతమైన కటిక చీకటి చాలా అందంగా ఉంటుంది. వెలుగు వస్తుంది, పోతుంది. కానీ, చీకటి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది వెలుగుకన్నా ఎక్కువ శాశ్వతమైనది. వెలుగు కావాలంటే మీకు ఇంధనం అవసరం. కానీ, చీకటికి ఇంధనం అవసరం లేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ ఉండేదే. వెలుగు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల మీకు నిద్ర పట్టదు. విశ్రాంతి లభించదు. కాబట్టి, విశ్రాంతి కోసం వెలుగును ఎంచుకోవడం సరియైన పని కాదు. అసలైన విశ్రాంతి చీకటిలోనే లభిస్తుంది.

కాబట్టి, అందులోకే వెళ్ళండి. నిజానికి, చీకటిలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదు. అనవసరంగా ఆ విషయంలో మిమ్మల్ని భయపెట్టారు. అందుకే చీకటిలో మిమ్మల్ని రక్షించేందుకు ఆ దేవుడు మీకు అవసరమవుతాడు.  ఒక అబద్ధానికి మరొక అబద్దం చెప్పాల్సి వస్తుంది. అలా మీరు అంతులేని అబద్ధాలు చెప్తూనే ఉంటారు.

స్వేచ్ఛ మిమ్మల్ని అనేక విషయాలలో కచ్చితంగా భయపెడుతుంది. కాబట్టి, ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని భయపెట్టే విషయాలపై లోతుగా దృష్టి సారించండి. వెంటనే వాటిపై మీకున్న భయం పోతుంది. మీరు భయపడేందుకు ఈ ప్రపంచంలో ఏదీ లేనప్పుడే మీరు స్వేచ్ఛగా ఆనందించగలరు, దాని బాధ్యతను స్వీకరించగలరు.

బాధ్యత మీరు ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందువల్ల మీరు ప్రతి పనిలో, ఆలోచనలో, భావనలో మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. అలా అది మీకు, మీ మనస్తత్వానికి ఉన్న బంధనాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని మరింత పారదర్శకంగా చేస్తుంది.

మీరు మీ భయాలను మరీ ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకే వాటినుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో అసలు వాటివైపే చూడకుండా వాటికి వ్యతిరేకమైన వాటిని మీరు సృష్టిస్తున్నారు. వెంటనే అవి వడగళ్ళలా కరిగిపోతూ తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. వాటి గురించి మీకు పూర్తి అవగాహన కలిగే సమయానికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. గుర్తుంచుకోండి.

మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా, వారి స్వేచ్ఛలో మనం జోక్యం చేసుకోకుండా, వారి సామర్థ్యం పూర్తిగా ఎదిగేందుకు మనం ఎలా సహాయపడగలం?

పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మనం ఎలా సహాయపడాలి? అని ఆలోచించడమే మీరు తప్పుదారిలో ఉన్నట్లు నిరూపిస్తోంది. అలా మీరు పిల్లలకు ఏది చెయ్యాలనుకున్నా అది కూడా మీకు కావలసిన రీతిలో మలచబడ్డ ప్రణాళికే అవుతుంది.

అది మీరు మీ పెద్దలనుంచి స్వీకరించిన నిబద్ధీకరణ ప్రణాళికకన్నా భిన్నమైనదే కావచ్చు, మీది సదుద్దేశమే కావచ్చు. ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.

ఇంకా వుంది...
🌹 🌹 🌹 🌹 🌹

ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.

పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.

ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.

శుభసాయంత్రం
 😊💐

 🙏🙏🙏🙏🙏
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
🙏🙏🙏🙏🙏

Sunday, 28 March 2021

sto****ries

 

 [ will be manifested".

లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి (అజ్ఞానాంధకారము నుండి బయటకు రండి). ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, దుఃఖాలను తొలగించుకొనే శక్తి ఉంది. నమ్మండి! అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది.


ఓం నమః శివాయ:
46-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

17. వేదాంగములు : ఛందస్సు

((((((((((🕉))))))))))

కవిత్వపు ఛందస్సు పుట్టుక:-

వేదాలను పఠించేప్పుడు స్వరభేదానికై స్థాయిని హెచ్చించటం తగ్గించటం జరుగుతూంటుంది. కాని కావ్యాలలోగాని ఇతర కవనాల్లోగాని ఇది ఉండదు. వేదాలలోని అనుష్టుప్‌ ఛందస్సుని మొదటగా వాల్మీకి వాడాడు - కాని వేదాలలో వలె స్థాయి భేదం లేకుండా, అది ఆయన ప్రయత్న పూర్వకంగా చేయలేదు. రెండు పక్షులలో ఒక దానిని బోయవాడు చంపటం చూచాడు. తన సహవాసి మరణాన్ని చూస్తున్న పక్షి పట్ల కరుణ, బోయవాని పట్ల కోపంగా మారింది. అతనిని ఈ విధంగా శపించాడు;


మా నిషాద ప్రతిష్ఠాంత్వమగమ శ్శాశ్వతీసమాః!యత్‌ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్‌||

''వేటకాడా- నీకెప్పుడూ ఏ శుభమూ కలుగ కుండుగాక, ఆనందంలో ఉన్న క్రౌంచపక్షులలో ఒక దానిని హత మార్చావు''


ఆయన కోపం అప్రయత్నంగానే ఆ విధమైన అక్షర రూపం దాల్చింది.


వాల్మీకి మహర్షి తన ఆవేశానికి ఎంతో చింతించి దీని గురించి ఆలోచించాడు. హఠాత్తుగా ఆయన మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. ఆయన జ్ఞాన దృష్టి గల ఋషి, తన శాపము అనుష్టుప్‌ ఛందస్సులో, నాలుగుపాదాలతో, పాదానికి ఎనిమిది అక్షరాలతో కూర్పబడిందని గ్రహించాడు. ఆయనకి ఆవేశం అప్రయత్నంగా పెల్లుబికినట్లే, ఆ అక్షరాల కూర్పు కూడ కవిత్వం వలె అప్రయత్నంగానే జరిగింది. ఆయన ఆశ్చర్య చకితుడయినాడు. బోయవానిని శపిస్తూ పలికిన శ్లోకానికే మరో అన్వయం కుదురుతుంది. ''లక్ష్మీవల్లభా! సుఖదంపతులలో కామమోహితుడైన పురుషుని వధించటం నీకు యశస్కరం'' ఈ పద్యం విష్ణు అవతారమైన శ్రీరామునికి సరిగ్గా నప్పుతుంది. కామాతురుడైన రావణుని వధించటానికి రాముడవతరించాడు. మండోదరిని పెళ్లి చేసుకొని సుఖిస్తున్న రావణుడు పరస్త్రీలను మోహించి, వరించాడు. తన నుండి అప్రయత్నంగా వెలువడిన ఆ శ్లోకం దైవప్రేరితమని వాల్మీకి గ్రహించాడు. సృష్టికర్త, బ్రహ్మ ధైర్యమివ్వటంతో ఆ అనుష్టుప్‌ ఛందస్సులోనే రామాయణ కావ్య నిర్మాణం ప్రారంభించాడు.


వైదిక స్వరాలు లేకుండా (అంటే ఉచ్ఛారణలో భేదం లేకుండా) శ్లోకం జన్మించటమిక్కడే. పరమసత్యాలని తాను ప్రచారం చేయటానికే ప్రజలు తేలికగా కంఠస్థం చేయటానికీ వీలుగా ఉండే మాధ్యమం తనకి అప్రయత్నంగా సంక్రమించిందని సంతోషించాడు ఆయన. ప్రపంచానికి ఆదికావ్యంగా, అనుపమాన సౌందర్యంతో ఆయన రాముని కథను అనుష్టుప్‌ ఛందస్సులో నిర్మించాడు.


వచనాన్ని కంఠస్థం  చేయటం కష్టం - మరచిపోతాము. ఛందోబద్ధమవటం వల్ల కవిత్వాన్ని జ్ఞాపకముంచు కోవటం తేలిక. ఈ కారణం వల్లనే పూర్వపు రోజులలో చాలా విషయాలను కవిత్వంలోనే చెప్పేవారు. అచ్చువేయటం ప్రారంభించిన తరువాత అన్నిటినీ కంఠస్థం చేయవలసిన అవసరం తప్పింది, దేనిని కావాలంటే దానిని గ్రంథస్థం చేయగలగటం వల్ల. ఈ విధంగానే వచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని భావవ్యక్తీకరణలో కవిత్వానికి సొగసూ, సౌందర్యమూ, ఓజస్సూ ఎక్కువ.


రామాయణావిర్భావం కేవలం దైవకృపవల్లనే జరిగింది. ఆ ఛందస్సు అప్రయత్నంగా సృష్టింపబడింది. ఇతర స్త్రోత్రాలూ, పూరాణాలూ, కావ్యాలూ, రచింప బడటానికి దారి చూపింది.


కొన్ని ఛందస్సులు:-

ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, స్రగ్ధర-ఇత్యాదివి స్త్రోత్రాలలో, కావ్యాలలో వాడబడే ఇతర ఛందస్సులు. వాటిలో కొన్ని బహుక్లిష్టమైనవి. పండితులేగాని ఇతరులు ఉపయోగించలేరు.


''అనుష్టుప్‌'' ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలుంటాయన్నాను. తొమ్మిది ఉంటే ''బృహతీ'' అవుతుంది. పది ఉంటే ''పంక్తీ'' అవుతుంది. పదకొండు ఉంటే ''త్రిష్టుప్‌'' అవుతుంది. పన్నెండు ఉంటే ''జగతీ'' అవుతుంది. పాదానికి ఇరవై ఆరు అక్షరాలు గల ఛందస్సుని ''ఉద్‌కృతి'' అంటారు. ఇది ''భుజంగ విజృంభితం'' పద్ధతిలోనిది. పాదానికి ఇరవై ఆరు కంటే ఎక్కువ అక్షరాలుంటే ''దండక'' మవుతుంది. వీటిలో కూడ ఎన్నో రీతులున్నాయి.


కొన్ని ఛందోరీతుల పేర్లు సుందరంగా, సముచితంగా, రసాత్మకంగా ఉంటాయి. కొన్ని ఛందస్సులలో అక్షరాలు పులిపిల్ల ఆడుతూ గంతులు వేస్తున్నట్టుగా సాగుతాయి. దీనిని ''శార్దూల విక్రీడిత'' మంటారు. శార్దూలమంటే పులి, విక్రీడిత అంటే ఆట. పాదానికి పందొమ్మిది అక్షరాలుంటాయి. అతిధృతి - అంటే వేగంగల జాతి ఛందస్సు. ప్రతిపాదంలోనూ రెండు అక్షర సముదాయాలుంటాయి. ఒకదానిలో పన్నెండు, మరొక దానిలో ఏడు అక్షరాలుంటాయి. పాకుతున్న పామువలె ధ్వనించే ఛందస్సుని ''భుజంగ ప్రయాత'' మంటారు భుజంగమంటే పాము. 'జగతి' ఛందోరీతి యిది. పాదానికి పన్నెండు అక్షరాలుంటాయి. ప్రతిపాదాన్ని రెండు అక్షర సముదాయాలుగా విభజించాలి. ఒక్కొక్క దానిలో ఆరు అక్షరాలుండేట్టు. ఉదాహరణ : ''మయూరాధిరూఢం మహావాక్యగూఢం'' అన్నప్పుడు మ-యూ-రా-ధి-రూ-ఢం.మ-హా-వాక్య-గూ-ఢం. ఆదిశంకరుని ''సౌందర్యలహరి'' ''శిఖరిణి'' ఛందస్సులో ఉంది. ప్రతిపాదానికి పదిహేడు అక్షరాలుంటాయి (పాదానికి పదిహేడు అక్షరాలు కలవాటికి 'అద్యష్టి' సాధారణ నామం). ఈ పదిహేడు అక్షరాలనీ ఆరు, పదకొండు అక్షర సముదాయాలుగా, రెండుగా, విభజిస్తే ''శిఖరిణి'' అవుతుంది. ''స్రగ్ధర'' అన్న ఛందస్సులో శబ్దాలు ప్రతి ధ్వనిస్తున్నట్టు - వెల్లువవలె నోటి నుండి బయల్వెడలు తున్నట్టు ఉంటాయి. ఇందులో ఇరవై ఒక అక్షరాలుంటాయి పాదానికి. వీటిని ఏడేసి అక్షర సముదాయాలుగా, మూడుగా, విభజిస్తారు.


శ్రీ శంకరాచార్యుల వారు ఈశ్వరునిపైన, విష్ణువుపైన వ్రాసిన స్తోత్రాలు ''కేశాదిపాద'' ''పాదాదికేశ'' అన్న ఛందస్సులో ఉంటాయి. అవి ఈ జాతికి చెందినవే.


ఇంద్రవజ్ర అన్నది ''తిష్టుప్‌'' జాతికి చెందిన ఛందస్సు. పాదానికి పదకొండు అక్షరాలుంటాయి దీనిలో. ఉపేంద్ర వజ్రలో కూడ పదకొండే ఉంటాయి. కాని వేరే విధంగా విభజింపబడుతుంది. ఈ రెంటినీ కలిపితే ''ఉపజాతి'' ఛందస్సు వస్తుంది. కాళిదాసు తన కుమార సంభవాన్ని ఈ ఛందస్సులోనే ప్రారంభించాడు.


ఈ ఛందస్సులు వేదకాలం దాటిన తరువాతి కవిత్వానికీ, స్తోత్రాలకీ సంబంధించినవి. వేదాలలో కనబడే ఛందస్సులు - గాయత్రి, ఉష్నిక్‌, అనుష్టుప్‌, బృహతి, పంక్తి, త్రిష్టుప్‌, జగతి వంటివి.


మంత్రరాజమైన గాయత్రి మహా మంత్రం చెప్పబడిన ఛందస్సుకి ఆ పేరే ఉంది - ''గాయత్రి ఛందస్సు''

సాధారణంగా ఏ దేవతకి సంబంధించినదో, ఆ దేవత పేరే పెడతారు. ''శివపంచాక్షరి'' ''నారాయణ అష్టాక్షరి'' ''రామ త్రయోదశి'' అన్న పేర్లలో దేవత పేరూ, అక్షరాల సంఖ్యా కలిసి యుంటాయి.


గాయత్రి మంత్రానికి దేవత సవిత, గాయత్రి అన్నది ఛందస్సు పేరు మాత్రమే. కాని మంత్రానికి ఛందస్సు పేరే పెట్టారు. శబ్దానికీ, స్వరానికీ దివ్వశక్తి ఉన్నట్టుగానే ఛందస్సుకీ, రచనకీ కూడా ఉన్నాయి. మంత్రానికైనా, శ్లోకానికైనా నాలుగు పాదాలుండాలి మామూలుగా. దీనికి విరుద్ధంగా గాయత్రికి మూడు పాదాలే ఉంటాయి. గాయత్రి అనే ఛందస్సుకి మూడుపాదాలూ, పాదానికి ఎనిమిది అక్షరాలూ - మొత్తం ఇరవై నాలుగు అక్షరాలుంటాయి. మూడు పాదాలు కలిగి యుండటం వల్ల ''త్రిపాద గాయత్రి'' అంటారు. ఇతర గాయత్రి రీతులు కూడా ఉన్నాయి. ఋగ్వేదపు మొదటి మంత్రం - ''అగ్నిమీలే'' - కూడ గాయత్రి ఛందస్సు లోనిదే.


కొన్ని స్తోత్రాలలో 24 అక్షరాల గాయత్రిని నాలుగు పాదాలుగా, ఒక్కొక్క పాదానికి ఆరు అక్షరాలతో విభజిస్తారు.


ఒక్కొక్క పాదానికి ఏడు అక్షరాల చొప్పున మొత్తం 28 అక్షరాలుంటే అది ''ఉష్ణిక్‌'' ఛందస్సవుతుంది.


ఛందస్సు ప్రయోజనం:-

ఏ మంత్రమైనా రూపొందితే, దానిని నిర్దుష్టంగా, సరియైన స్థాయిలో, స్వరంతో పలికే విధానాన్ని నిర్దేశిస్తుంది 'శిక్ష' శాస్త్రం. మంత్రం యొక్క రూపం సరిగ్గా ఉండాలంటే ఛందస్సు అవసరం. ధ్యానమగ్నుడైన ఋషికి భగవంతుని అనుగ్రహం వల్ల గోచరించపబడే ఏ మంత్రానికైనా సరియైన రూపమే ఉంటుంది. అది శ్రమతో కూర్ప బడింది కాదు కదా!


ఒక వేదసూక్తాన్ని గాని, మంత్రాన్ని గాని పఠించేప్పుడు అది మూలం ప్రకారమే ఉన్నదో లేదో తెలుసు కోవటానికి ఛందస్సు ఉపయోగిస్తుంది. మంత్రంలోని అక్షరాలను లెక్క పెట్టినప్పుడు లెక్క కుదరక పోతే తెలిసిన వారినడిగి సరియైన రూపాన్ని తెలుసుకో గలుగుతాము.


వాటంతట అవే ఆవిర్భవించిన మంత్రాలను అట్లా ఉంచినా, కవులు శ్లోకాల రూపంలో తమ భావాలని వ్యక్తీకరించేందుకు ఛందస్సునే ఆశ్రయిస్తారు. సంగీతానికి తాళమెటువంటిదో శ్లోకాలకి ఛందస్సు అటువంటిది. ఒక క్రమంలో ఉండవలసి రావటం వల్ల దానికి స్వతస్సిద్ధంగానే రూపమేర్పడుతుంది, ఛందోబద్ధమైన దానిని కంఠస్థం చేయటం తేలిక.


వేదపాఠాలు ఆదిలో ఎట్లా ఉండేవో అట్లాగే ఒక్క అక్షరం ఎక్కువా, తక్కువా కాకుండా ఉండటానికి కారణం ఛందస్సొక్కేటే. వేదశబ్దాలతో ఆడుకోరాదు. ఏ మాత్రం హెచ్చుతగ్గు జరిగినా వాటి ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లుతుంది.


వేదాలకి పాదం - మంత్రానికి నాసిక :-

ప్రతిమంత్రమూ ఏదో దేవతకి అంకితమయి ఉంటుంది. అంటే, ప్రతిమంత్రానికీ ఒక అధిష్ఠాన దేవత ఉంటుందన్న మాట. దానికొక ఛందస్సూ, దానిని లోకానికి అనుగ్రహించిన ఋషి ఉంటారు. ఆయనే ఆ మంత్రానికి ఋషి. మంత్రాన్ని చెప్పే ముందు ఆ ఋషిపేరు తలచుకొని, శిరస్సును తాకటమంటే, ఆయన పాదాలను ఎంతో గౌరవంతో శిరస్సుపై పెట్టుకోవటమన్న  మాట. మంత్రాలను మనకి యిచ్చిన వారు ఋషులే కదా!


మంత్రం యొక్క ఛందస్సు పేరుని చెప్పినప్పుడు ముక్కుని వేలితో తాకుతాము. మంత్రానికి ఒకే పరిరక్షకుడు ఛందస్సు. మంత్రానికి ఊపిరి వంటిదది. అందువల్లనే మన ఊపిరి నియమబద్ధం చేసే ముక్కుని పట్టుకోవటము. ఊపిరి లేక జీవితమే లేదు. ఆ విధంగానే మంత్రాలకి ఛందస్సే ఊపిరి కాని, వేదాలనన్నిటినీ ఒక మూర్తిగా భావిస్తే 'శిక్ష' నాసిక, ఛందస్సు పాదాలూ అవుతాయి.


మనం కాళ్లమీద నిలబడి నట్టే వేదపురుషుడు ఛందస్సనే కాళ్లపై నిలబడుతాడు. కాళ్లులేక పోతే లేచి నిలబడలేము. వేదం యొక్క దేహం నిలబడేది ఛందస్సనే పాదాలపైనే.

🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ!!


ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ!!


వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ!!


గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ!!

[15:55, 28/03/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩

మనము కనులు మూసుకొని ఏదో ఒక దైవీ రూపాన్ని మనసులో ప్రతి నిత్యము చూడడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి.  అలా అంతర్దర్శనము అయినపుడు దానిని ధారణ అంటారు. అపుడు చేస్తున్న స్తోత్రం ఫలవంతముగా ఉంటుంది. ఆ దర్శనము మన లోపల అలా నిలబడి ఉండి, మనకు స్థిరముగా కనిపిస్తే  దానిని 'సాలోక్యము' అంటారు. అపుడు మన మనసుకు కలిగిన పరిపూర్ణ ఆకర్షణ చేత దానికి దగ్గరగా వెళ్లిపోతూ ఉంటే అది 'సామీప్యము' అవుతుంది.


దగ్గరగా వెళ్లిన తరువాత దానితో కలిసి పోతే  దానిని 'సాయుజ్యము' అంటారు. కలిసిపోయిన తరువాత  'అదే' నువ్వుగా ఉంటావు. 'అది' అయి పోతే దానిని 'సారూప్యము' అంటారు. అది తెలుసుకుంటే మనము  భ్రమలో లేకుండా వినయముగా ఉంటాము.

🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన

పవిత్రత ఎన్నడూ సోమరి జీవితంలోకి ప్రవేశించదు.
 

మనస్సు ప్రాపంచిక ఆలోచనలతో, భావాలతో పూర్తిగా నిండిపోతే అది దట్టంగా, భారంగా, స్పందించలేనిదిగా మారిపోతుంది.


మన మనస్సు మొద్దుగా, బరువుగా ఉంటే సాధన సమయంలో ఆధ్యాత్మిక భావాలు ఉదయించవు. జాగరూకతతో, ఆలోచనాపరులై ఉన్నవారి విషయంలో ఇది సంభవించదు. వారి ఉత్సాహం ఎన్నడూ సడలిపోదు. చివరి క్షణం వరకు వారు ఆధ్యాత్మిక సాధనలు విడిచిపెట్టరు. వారు ప్రతీ రోజూ, ప్రతీ కార్యాన్ని ఆధ్యాత్మికమయంగా మలచుకుంటారు.


మనం కూడా ఇలా చేస్తే మన పనులన్నీ ఉన్నతమైన ప్రేరణలతో నిండిపోతాయి. ఇది మన మనోదృక్పథం మీద, మన ఉత్సుకత మీద, మన అప్రమత్తత మీద ఆధారపడి ఉంటుంది.

శుభం భూయాత్

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(843)
🕉🌞🌎🌙🌟🚩

కోరికలను తగ్గించుకుంటూ పోతే అది ఉత్తమ జీవితానికి దారితీస్తుందా !?"

అంతరంగంలో ఆశను తగ్గించాలంటే బాహ్యజీవనంలో ఏర్పడే కోరికలను తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆశను నిర్మూలించే కొద్దీ 'స్మృతి' వాడుకోవటం తగ్గుతుంది. స్మృతి అవసరం తగ్గేకొద్దీ మనసు త్రిపుటిగా మారే ప్రక్రియ తగ్గుతుంది. త్రిపుటి ఏర్పడని మనసు ఎప్పుడూ శుద్ధ గ్రహింపుగానే ఉంటుంది. అలా కేవలం శుద్ధగ్రహింపుతో సాగే జీవనమే సహజ సమాధిగా పరిణమిస్తోంది. పెద్దలు సూచించిన ధర్మాజీవనం అలవర్చుకుంటే అది గొప్ప యోగజీవనంతో సమానమై అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని మనకు ప్రాప్తింపచేస్తుంది. ధర్మజీవనాన్ని ఆచరించి చూపుతూ మనకు బోధించేందుకే గురువు అవసరం అవుతారు. [నిజానికి] గురువు బహిరంగంగాలేరు. దేహాన్ని గురువని భ్రమిస్తాం. అయితే గురువు తానట్లు భావించరు. గురువు అరూపాత్మ. అది నీలోనిది. అది వెలుగుగా గోచరించేది నిన్ను సరిదిద్దటానికే !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"గ్రహింపు సమయంలోనూ మనసు శుద్ధంగానే ఉంది..!" [అధ్యాయం -104]

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: "ఋభుగీత"(310)
🕉🌞🌎🌙🌟🚩

"బ్రహ్మము"
21వ అధ్యాయము

దైవంతో మన సామ్యత, సమానత్వం స్పష్టంగా తెలియడం అద్వైత జ్ఞానం !

శుద్ధత, అశుద్ధత అనేవి వ్యవహారిక ధర్మాలు. సాపేక్ష అంశాలు స్థిరమైన శుద్ధత, స్థిరమైన అశుద్ధత ఏదీలేదు. అశుద్ధంగా భావించే విసర్జకాలు భూమిని సారవంతంచేసే ఎరువు అవుతున్నాయి. ఎంతో శుద్ధమైన దేవుని నైవేద్యం తెల్లవారితే దాని శుద్ధతను కోల్పోయి దుర్వాసన వస్తుంది. ద్వైతం, అద్వైతం కూడా ఆత్మకు వర్తించవు. ద్వైతం అంటే దైవం వేరుగా ఉన్నాడని చెప్పేది. అద్వైతం అంటే నీకు దైవానికి తేడా లేదని చెప్పేది. సముద్ర తరంగాలు సముద్రంలో అంతర్భాగం. అవి సముద్రంతో సమానంకావు. అలాగని సముద్రానికి భిన్నమూ కావు. దైవంతో మన సామ్యత, సమానత్వం కూడా అలాంటివే అని స్పష్టంగా తెలియడం అద్వైత జ్ఞానం !

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: 🧘‍♂️నీటిలో మునిగితే- అది స్నానం.. నీలో మునిగితే- అది ధ్యానం🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పని లేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు.
 

ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే చాలా మంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు. తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు.


బుద్ధుడు శిష్యుడి కేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు.


‘ఎవరికైనా ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలా మందిది ఇదే పరిస్థితి.


నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానే కాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.
 

ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి వచ్చి చేరుతుంది. ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా ! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి. చిరునవ్వుతో పలకరించాలి.


ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి. ఆ సంధి సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం.


ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదనలోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.
   

సాధన క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని మనం గ్రహించాలి.


పరమహంస యోగానందగారు చెప్పినట్లు వాటి ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి. ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు, వాటికోసం ప్రయత్నించ కూడదు. వైకుంఠపాళిలో నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం !

🕉️🌞🌍🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: 205) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

యే వదన్తీత్థమేతేఽ పి భ్రామ్యంతే విద్యయాత్రకిమ్ ౹ న యథాపూర్వమేతేషామత్ర భ్రాంతేరదర్శనాత్ ౹౹239౹౹

239. (ఆక్షేపము) ఇట్లు మాయాప్రభావమును వర్ణించువారు కూడ భ్రమకు లోనగుదురు.విద్య వలన,జ్ఞానము వలన కలిగిన లాభమేమి ?
(సమాధానము)జ్ఞానమునకు పూర్వము వలె భ్రాంతి సత్యమని భావింపకుండుటయే.


ఐహికాముష్మికః సర్వః సంసారో వాస్తవస్తతః  ౹ న భాతి నాస్తి చాద్వైత మిత్యజ్ఞాన వినిశ్చయః ౹౹240౹౹

240. అజ్ఞానులకు ఈ లోకము పరలోకములందలి సుఖములే సత్యము.అద్వైతము వారికి తోచదు.లేదనియే వారి నిశ్చయము.

🕉🌞🌎🌙🌟🚩

 [21:09, 28/03/2021] +91 95058 13235: 28.03.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  ఏబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

54.33 (ముప్పది మూడవ శ్లోకము)

యోగేశ్వరాప్రమేయాత్మన్ దేవ దేవ జగత్పతే|

హంతుం నార్హసి కల్యాణ భ్రాతరం మే మహాభుజ॥10489॥

శ్రీకృష్ణుడు రుక్మిని చంపుటకు సిద్ధపడుటను జూచి రుక్మిణి భయవిహ్వలయయ్యెను. పిదప ఆ సాధ్వి తన భర్తపాదములపైబడి దైన్యముతో ఇట్లు విన్నవించుచుండెను-

"ప్రభూ! నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు. దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలిసికొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు. తిరుగులేని భుజబలము గలవాడవు, కల్యాణ స్వరూపుడవు (మంగళప్రదమైన కల్యాణము చేసికొనబోవు చున్నవాడవు). ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు, నీకు బావమఱద…
[05:09, 29/03/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[05:10, 29/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

859వ నామ మంత్రము 29.03.2021

ఓం కాష్ఠాయై నమః
 
పదునెనిమిది నిమేషముల కాలస్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.

ఉపనిషద్వాక్యార్థనిష్కర్ష స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కాష్ఠా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం కాష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆరాధించు భక్తులను  ఆ తల్లి  సుఖశాంతులతో, సిరిసంపదలతో జీవనముగడుపునట్లను గ్రహించును.

నిమిషము అనగా రెప్పపాటు. పదునెనిమిది నిమిషముల కాలమునకు కాష్ఠయని పేరు.  అటువంటి పదునెనిమిది నిమిషముల కాలస్వరూపురాలైన పరమేశ్వరి కాష్ఠాయని అనబడినది. దీనినిబట్టి పరమేశ్వరి కాలభేదస్వరూపురాలు.

సప్తశతిలోని పదకొండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో

కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయని

విశ్వస్యోపరితౌ శక్తే! నారాయణి! నమోఽస్తుతే॥

ప్రపంచమునకు నీవే కల-కాష్ఠ అనెడి కాలప్రమాణ రూపముతో మార్పులు కల్గించి తుదకు అంతము చేయు శక్తి గలిగిన తల్లీ నీకు  నమస్కారము.

కాష్ఠ అనగా మ్రానిపసుపు. కుమారస్వామి నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించినదనియు, కాబట్టి శివశక్త్యాత్మకమనియు మైలారతంత్రమునందు ఒక కథ చెప్పబడినది. శిశువులు జన్మించినపుడు నాభినుండి వ్రేలాడు ఒక సిరకు నాభినాళము అని అందురు. పార్వతీపరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి యొక్క నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించెనని చెప్పబడినది. దీనిని బట్టి పరమేశ్వరి మ్రానిపసుపు స్వరూపురాలు. ప్రతీతము - అప్రతీతము, ఇంద్రియగోచరము - ఇంద్రియాతీతము - సమస్తము పరమశివుడే అని  వేదాంతవాక్యములన్నియు ఏ తత్త్వమును బోధించుచున్నవో అదియే కాష్ఠ యని అనబడినది. శివుని అష్టమూర్తులలో  ఆకాశమూర్తికి భీముడని పేరు. ఈయనకు పదిదిక్కులందు (అష్టదిక్కులు, భూమి, ఆకాశము)  భార్యలున్నారు. అందులో ఆకాశమూర్తియైన భీమునిభార్యగా పరమేశ్వరి దిక్స్వరూపురాలు. వాయు పురాణమందు భీమదేవుని ఆరవ దేహము ఆకాశము, దిక్కులు భార్యలు, స్వర్గము వారి కుమారుడని చెప్పబడినది. శ్రుతియందు 'పరమేశ్వరి జగత్తును అతిక్రమించినది గనుక కాష్ఠ యగును' అని శ్రుతియందు చెప్పబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కాష్ఠాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:10, 29/03/2021] +91 95058 13235: 29.03.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  ఏబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
54.41(నలుబది ఒకటవ శ్లోకము)

రాజ్యస్య భూమేర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః|

మానినోఽన్యస్య వా హేతోః శ్రీమదాంధాః క్షిపంతి హి॥10497॥

బలరాముడు శ్రీకృష్ణునితో ఇట్లు వచించెను "సోదరా! దురభిమానముతో, ధనమదముతో విర్రవీగుచుండెడివారు రాజ్యము కొఱకును, భూమి (ఆస్తి పాస్తుల) కోసము, ధనధాన్యముల కొఱకును, కాంతల విషయమునను, పేరు ప్రతిష్ఠలకోసము, వైభవములను నిలుపుకొనుట కొఱకును, మఱచి, బంధువులను సైతము హింసించుచుందురు.

54.42(నలుబది రెండవ శ్లోకము)

తవేయం విషమా బుద్ధిః సర్వభూతేషు దుర్హృదామ్|

యన్మన్యసే సదాభద్రం సుహృదాం భద్రమజ్ఞవత్॥10498॥

బలరాముడు మరల రుక్మిణితో ఇట్లనెను  రుక్మిణీ! నీ సోదరుడైన ఈ రుక్మి సకల ప్రాణులయెడ ద్వేషభావమునే కలిగియుండెను. కావున అతని మేలునకే ఇట్లు శిక్షించుట జరిగినది. అజ్ఞానులవలె నీవు 'ఈ దండనము తగని పని' యని తలంచుచున్నావు. ఇది నీ బుద్ధి వైషమ్యమే గాని వేఱుగాదు.

54.43 (నలుబది మూడవ శ్లోకము)

ఆత్మమోహో నృణామేష కల్పతే దేవమాయయా|

సుహృద్దుర్హృదుదాసీన ఇతి దేహాత్మమానినామ్॥10499॥

54.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఏక ఏవ పరో హ్యాత్మా సర్వేషామపి దేహినామ్|

నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః॥10500॥

54.45 (నలుబది ఐదవ శ్లోకము)

దేహ ఆద్యంతవానేష ద్రవ్యప్రాణగుణాత్మకః|

ఆత్మన్యవిద్యయా కౢప్తః సంసారయతి దేహినమ్॥10501॥

54.46 (నలుబది ఆరవ శ్లోకము)

నాత్మనోఽన్యేన సంయోగో వియోగశ్చాసతః సతి|

తద్ధేతుత్వాత్తత్ప్రసిద్ధేర్దృగ్రూపాభ్యాం యథా రవేః॥10502॥

54.47 (నలుబది ఏడవ శ్లోకము)

జన్మాదయస్తు దేహస్య విక్రియా నాత్మనః క్వచిత్|

కలానామివ నైవేందోర్మృతిర్హ్యస్య కుహూరివ॥10503॥

54.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

యథా శయాన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ|

అనుభుంక్తేఽప్యసత్యర్థే తథాఽఽప్నోత్యబుధో భవమ్॥10504॥

భగవంతుని మాయవలన మోహితులైన వారు దేహాత్మబుద్ధిగలవారై ('దేహమే ఆత్మ' యని భావించుచు) 'ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు ఉదాసీనుడు' అను భేదబుద్ధిని కలిగియుందురు. అమ్మా! సూర్యుడును, చంద్రుడును ఒక్కొక్కడే ఐనప్పటికిని జలాదులయందు అనేకులుగా భ్రమింపజేయుచుందురు. ఆకాశము ఒక్కటేయైనను ఘటాది భేదముచే వేర్వేఱుగా కన్పట్టుచుండును. అట్లే అన్ని దేహములయందును ఉన్న ఆత్మ ఒక్కటేయైనను ఉపాధి భేదములతో (మానవ పక్ష్యాది దేహములను బట్టి) మూఢులు అనేకములుగా భావించుచుందురు. పంచ మహాభూతములతో, పంచప్రాణములతో, పంచతన్మాత్రలతో, సత్త్వాది త్రిగుణములతో ఒప్పుచుండెడి ఈ దేహము ఆద్యంతములు గలది. అనగా జనన మరణములు గలది. కాని దేహాభిమానము గల జీవుడు అజ్ఞానకారణముగా 'ఈ దేహము శాశ్వతమైనది' అని భావించి సంసారచక్రమున పరిభ్రమించు చుండును. సాధ్వీ! చూచే కన్నులు, చూడబడే రూపములు -ఈ రెండింటినీ ప్రకాశింపచేసేది సూర్యుడు ఒక్కడే. అందువలన సూర్యునితో కన్నులకు, రూపములకు ఎప్ఫుడైనా వియోగము ఉండదు. సంయోగమూ ఉండదు. అదేవిధముగా ఈ జగత్తు అంతయునూ ఆత్మవల్లనే గోచరించును. సమస్త జగత్తును ప్రకాశింపజేయునది ఆత్మయే. కావున అశాశ్వతములైన పదార్థములతో ఆత్మకు ఎటువంటి సంయోగ, వియోగములూ ఉండనే ఉండవు. వృద్ధిక్షయములు చంద్రకళలకేగాని, చంద్రునకు కావు (శుక్లపక్షమున చంద్రకళలు వృద్ధిచెందును. అవి కృష్ణపక్షమున క్షీణించును).  అట్లే జన్మాది షడ్వికారములు శరీరమునకేగాని, ఆత్మకు గావు. అమావాస్య దినమున (కుహూ - సా దృష్టేందుః 'సినీవాలీ' సా నష్టేందుకలా 'కుహూః' - చంద్రకళ కనిపించిన అమావాస్యను సినీవాలి అనియు, చంద్రరేఖ కనబడని అమావాస్యను కుహువు అనియు పేర్కొందురు.అటువంటి కుహువు దినమున) చంద్రుడు లేనట్లుగా అనుకొనుచుందురు. కాని చంద్రుడు ఉండును. అట్లే శరీరము నశించినప్పుడు ఆత్మ నశించినట్లు భ్రమపడుచుందురు. రుక్మిణీ! నిద్రించుచున్నవాడు కలలో వచ్చిన సుఖదుఃఖాదులను ఆత్మయే అనుభవించుచున్నది అని భ్రమపడుచుండును. అట్లే అజ్ఞాని నశ్వరమైన విషయాదుల యందు సుఖదుఃఖాదులను పొందుచుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -175 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము  📚
శ్లోకము 19

🍀 19. యతచిత్తము - గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును.  యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యందనాసక్తి, సంకల్ప సన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము నేర్వవలెను. 🍀

యథా దీపో నివాతస్థా నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః|| 19

గాలి తగులని దీపమెట్లు నిశ్చలముగ నుండునో అట్టి స్థిర చిత్తముతో 'నేను' అను వెలుగును భ్రూమధ్యమున యోగి దర్శించు చుండును. నివాతస్థ దీపమనగ గాలి సోకని దీపము. గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము.

చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యథాలాపముగ ఏమియు చేయరాదు. చేయుపని ఏదైనను దానియందే పూర్ణచిత్తము నియోగించవలెను.

దంత ధావనము,  స్నానము, వస్త్రధారణము, భోజనము వంటి కార్యములు యథాలాపముగ చేయక మనసు పెట్టి నిర్వర్తించవలెను. శ్రద్ధగ చేయవలెను. అక్షరాభ్యాస సమయము నుండి ఈ అభ్యాసము ప్రారంభించిన వారికి యతచిత్త మేర్పడుట సులభము. దైనందిన కార్యములందు యథాలాపముగ నుండువారు ధ్యానము నేర్చుటకు చాల శ్రమపడవలసి వచ్చును.

ప్రస్తుతమున మనస్సు నిలుపుట, ఇతర ఆలోచనలు రాకుండుట జరుగవలెను. విను చున్నపుడు పూర్తిగ వినవలెను. చూచుచున్నపుడు పూర్తిగ చూడవలెను. అనగ మనస్సు పెట్టవలెను. అట్లే తినుచున్నపుడు, తిరుగు చున్నపుడు కూడ. ప్రస్తుతమున మనస్సు నిలచుట ప్రధానము. ఉదాహరణకు ఒక పాట వినుచున్నపుడు పాటను పూర్తిగ వినువారు అరుదు. ఆ నిమిషములోనే అనేకానేక భావములు కలిగి పాట వినుట జరుగదు.

యతచిత్తము గూర్చి భగవానుడు చాలమార్లు పలికినాడు. అట్టి యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యం దనాసక్తి, సంకల్పసన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము ఇత్యాది వెన్నియో గీతయందు తెలుపబడినవి. ఇవి ఏవియును పాటింపక, సరాసరి ధ్యానమందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకమే అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 377🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴
అధ్యాయము - 12

🌻. శివహిమాచల సంవాదము - 2 🌻

హిమవంతుడిట్లనెను-

ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)

ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20).

హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).

మహేశ్వరుడిట్లు పలికెను-

హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25).

హిమవంతుడిట్లు పలికెను-

ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).

శంభుడిట్లు పలికెను-

ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).

ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 5 🌹
✍🏼. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు

🌻. భాగవతము 4-288. ధ్రువోపాఖ్యానము 🌻

భగవంతునికి నమస్కరించువారు తాము మంచిదనుకొను దానిని పొందుటకై నమస్కరించుచున్నారు.  కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు.  (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు తామేమియు కోరకున్నారు.) వారే నిష్కాములు.

అట్టి వారికి రాజ్య పరిపాలనము మున్నగు ప్రయోజనములు సిద్ధించినను ,  వారు తమ పరిపాలనము రూపమున జీవులకు సర్వ ప్రయోజనములను సిద్ధించుటకు యత్నించుచు ఆ జీవుల రూపమున‌ భగవంతుని పాదసేవయే చేసికొనుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
[05:15, 29/03/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 199 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సత్యానుభూతి - చతుర్విధ నిశ్చయార్థకములు 🌻

739. ఆత్మ నాల్గు స్థితుల ద్వారా పురోగమించగా సత్య సంబంధమగు నిత్య సత్యానుభూతిని సేకరించును.

740. చతుర్విధ నిశ్చయార్థకములు

1. అంతరానుభూతుల నుండి, దృశ్యముల నుండి లేక ఆధ్యాత్మిక అనుభవముల నుండి (అవి మార్గమందలి అనుభవములు కానీ లేక అన్యము కానీ) కలిగిన నిస్సంశయము.

2. సాక్షీభూతమైన నిస్సంశయము. సర్వత్రా భగవంతుని ప్రత్యక్షముగా చూపుట వలన కలిగిన నిస్సంశయము.

3. భగవదైక్యము వలన కలిగిన నిస్సంశయము.

4. మానవునిలోగల దివ్యత్వ పరిపూర్ణత్వమునకు సంబంధించిన అనుభవముతో కూడిన నిస్సంశయము. దీని వలన ఆతడు భగవంతుని యొక్క, విశ్వము యొక్క రహస్యములను ఎఱుంగును.

ఈ శక్తి ఒక్క సార్వభౌమిక మనస్సునకే (మహాకారణ శరీరము) గలదు. ఇది సమస్త దివ్య విచారమునకు పీఠము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:15, 29/03/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 243 / Sri Lalitha Chaitanya Vijnanam  - 243 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
*🍀  59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀*

🌻 243. 'చారుచంద్ర కళాధరా'🌻

వృద్ధి, క్షయ రహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధి క్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళల కతీతముగ మనోభావమున వృద్ధి క్షయములు లేక యుండును. జ్ఞానాగ్ని మనో వికారము లన్నింటిని దగ్ధము చేయును. అట్టి జ్ఞాన వంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై యుండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు.

ఈ కళను ఎప్పుడునూ ధరించి యుండునది శ్రీదేవి. ఆ జ్ఞానమున కామెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి. జ్ఞాన స్వరూప. జ్ఞానమును ప్రసాదించునది కూడ ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి యున్నది అనుటలో విశేషము నిజమున కేమియూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణ గాథ యున్నది.

చంద్రకళ అను రాజకుమారి యుండెడిది. ఆమె కాశీరాజు కుమార్తె. సర్వ లక్షణ సంపన్న. ఆమెకు శశికళ అనుపేరు కూడ కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప నర్హత గల రాజ కుమారుడు చాల కాలము కానరాకుండెను.చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగ ఆమె కమితమగు దుఃఖము కలిగినది.

శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది "పుత్రీ! చంద్రకళా! నీవు దిగులు చెంద నవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లి యాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. నిశ్చలమగు ఈశ్వరోపాసకుడే నిన్ను పరిణయ మాడగలడు. సుదర్శనుడను రాజపుత్రుడు కామరాజ బీజ ఉపాసకుడు, పరమ శివుడే కామరాజు. అతనీ బీజాక్షరీ ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవతనిని వరునిగా వరింపుము.

అతనిని మహేశ్వరు డావరించి యున్నాడు. అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి యుందును. నీయందతనికి నాకళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు.
నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారుచంద్ర కళాధరా అను అష్టాక్షరీ నామము నా కేర్పడగలదు.” పై కారణముగ శ్రీదేవి చారుచంద్ర కళాధరా అయినది.

పూర్ణచంద్రుని కళ చారుచంద్రకళ, ఇట్టి పూర్ణ జ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింప గలదు. ఆమె సాన్నిధ్యమున ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి యుండును. ఇది శ్రీదేవి అనుగ్రహము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 243 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Cāru-candra-kalādharā चारु-चन्द्र-कलाधरा (243) 🌻

She is wearing the crescent moon in Her crown.  Cāru means moon light.  All the above nāma-s deal with the moon.  The full moon represents supreme consciousness.  If She is meditated upon on the full moon night, one will attain mantra siddhi at the earliest.  On full moon days, sattvic guṇa becomes predominant.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Thursday, 25 March 2021

26032021

*🌹. మనలో సంతోషము ఎందుకు మాయమవుతుంది? 🌹*

*భగవంతుని స్తృతి అనగా యోగము వలన సంతోషము కలుగునట్లు మనం చేసిన పొరపాట్ల వలన సంతోషం మాయమవుతుంది.*

*ఎప్పుడైనా పనికిరాని ఆలోచనలు మనసులోకి వస్తే వెంటనే వాటిని పెద్దల ముందుగానీ, సర్వశక్తిమంతుడైన శివ పరమాత్మ ముందుగానీ ఉంచి వారి నుండి అవసరమైన సూచనలు పొంది మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని హృదయ భారాన్ని తగ్గించుకోవాలి.*

*గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే, గడిచిన దాని గురించే ఆలోచిస్తూ, బాధ పడుతూ, దురదృష్టవశాత్తూ నేను ఇలా చేసాను. నా ఆధ్యాత్మిక స్థితి బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు.*

*గడిచిన దాని గురించి ఒక గుణపాఠం నేర్చుకుని, ఇక మీదట మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అపచారం చేసాను అన్న మనోభారంలో నిరంతరం ఉండుట వలననే మన సహజత్వాన్ని కోల్పోతుంటాము.*

*ఒక లోటును సరిదిద్దుకోవడానికి దాని గురించే ఆలోచించడం కాకుండా స్వయం యొక్క ఉన్నత స్థితి గురించిన ఆలోచన అవసరం. బుద్ధిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటూ, కలవరంలో కొట్టుకుపోకుండా , ఏ వికారీ ఆలోచన ఆటంకంగా రాకుండా చూసుకోవాలి.*

*ఇటువంటి అనిశ్చితమైన సంఘటనల నుండి జాగ్రత్తగా ఉండాలంటే దివ్య స్పృతి అనే జ్యోతికి ఎప్పుడూ దివ్య జ్ఞానము అనే నూనెను అందిస్తూ ఉండాలి.*
🌹 🌹 🌹 🌹 🌹

యద్యపి బహునాధీషే
        తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |
    స్వజనః శ్వజనో మా భూత్
        సకలం శకలం సకృత్ శకృత్ ||

భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలము) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.
      వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు. ఉచ్చారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.
 

*****

ధన్వంతరి :-

సాక్షాత్తు పురాణ విశ్వాసం దైవంగా ఆరాధించే ధన్వంతరి ఆయుర్వేద సృష్టికర్త గా మహర్షిగా ఆయన పేరు మీద ప్రాచీన భారతీయ ఆయుర్వేద విధానం ప్రపంచంలో అద్భుతమైన వైద్యశాస్త్రం గా వర్థిల్లుతోంది. సుమారు 250 రకాల వనమూలికలను , ఖనిజాలను ఔషధాలుగా వినియోగించి వైద్యశాస్త్రాన్ని సృజించిన ధన్వంతరి ఏ కాలానికి చెందిన వారో పుట్టుపూర్వోత్తరాలు పురాణంగా నిరాధారంగా ఉన్నాయి. క్రీ శ. 5 వ శతాబ్దానికి చెందిన ఆచార్య వాగ్భటుడు ధన్వంతరిని వైద్య శాస్త్ర పితామహుడిగా ప్రశంసించాడు. కాశీరాజు దివోదాసు, ఆచార్య సుశ్రుతుడికి వైద్యం భోదించారని, దివోదాసే ధన్వంతరి గా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన గ్రంథాల ఆధారంగా క్రీ. పూ. 3వ శతాబ్దానికి చెందినవాడిగా బావించబడుతోంది. రెండవ ధన్వంతరి విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకనిగా తెలుస్తోంది. అసలు సిసలైన ధన్వంతరి కాశీరాజు దివోదాసు ధన్వంతరి అని భావించవలసి ఉంది. ఆచార్య సుశ్రుతుని గురువుగా ''సుశ్రుత సంహిత'' లో పేర్కొనబడింది. వేదాలలో , పురాణాలలో నిక్షిప్తమై ఉన్న ఆయుర్వేద విధానాలను ఒక శాస్త్రరూపంగా ధన్వంతరి , సుశ్రుతుని వంటి నాటి శిష్యులకు భోదించినట్లు ఆధారాలు ఉన్నాయి.

పంచభూత నిర్మితమైన మానవధేహంలోని మూలకాల సమతుల్యాన్ని కాపాడటం వలన, ఆయుర్వృద్ధి సాధించవచ్చని శాస్త్రం విశ్వసిస్తోంది. వ్యాధి లక్షణాలు, ఓషదుల ప్రభావం, మానసిక చింతన జోడించిన ఆయుర్వేదం క్రీ . శ. 900 ప్రాంతంలో పరిశోధనా బలంతో వేదవిజ్ఞానంగా గుర్థింపబడుతోంది. ధన్వంతరి సూర్య భగవానుని 16 మంది శిష్యులలో ఒకనిగా, క్షీరసాగరమధనం లో జన్మించినట్లు భాగవతం, విష్ణు, బ్రహ్మ, వైవర్త పురాణాలు పేర్కొంటున్నాయి.

ధన్వంతరి వైద్య విధానం లో 8 భాగాలు :-

👉🏿 కాయ చికిత్స :- శరీర భాగాలన్నింటికి , ప్రధానంగా ఉదరం.

👉🏿 బాల చికిత్స:- శిశు బాలారిష్టాలు రోగ నివారణ.

👉🏿 గ్రహ చికిత్స :- మానసిక రోగచికిత్స.

👉🏿 శల్యాక తంత్ర :- తంత్రం అంటే క్రియాశీలత. శరీరంలో బాహ్య అంగాలకు సంబంధించిన రోగ నిర్దారణ, ఔషద ప్రయోగ విశ్లేషణ.

👉🏿 శల్య తంత్ర:- చిన్న, మధ్య, పెద్ద శస్త్రచికిత్స కార్యశీలత.అంటే సర్జరీ.

👉🏿 విష తంత్ర :- అశ్వినీ కుమారుడు ప్రవచించిన విష శాస్త్రం మిళితం. విషాల వర్గీకరణ. ప్రపంచ దేశాలకు విషవిజ్ఞాన పునాది .

👉🏿 రసాయన తంత్ర :- వనమూలికలు తదితరాలతో రూపొందించిన రసాయనాలతో వ్యాధుల చికిత్స విశ్లేషణ.

👉🏿 వాజీకరణ తంత్ర :- నపుంసకత్వం పోగోట్టడం, పుంసత్వశక్తి పెంపొందించడం, సుఖ లైంగిక జీవితానికి సులభ చికిత్సా విధానాలు. ఆధునిక ''వయాగ్రా'' కు మించిన ఔషధాల రూపకల్పన వివరాలు .

సమస్త వైద్యవిజ్ఞానం నిక్షిప్తమైన పై ఎనిమిది అధ్యాయాలలోని జ్ఞానాన్ని నాటి చరకుడు, సుశ్రుతుడు, నేటి అత్యాధునిక శాస్త్రజ్ఞుల పరిశోధనాంశాలను జోడించి గ్రంథస్థం చేశారు. శరీరంలోని నోరు, ముక్కు , చెవి, కన్ను, మెదడు, మనసు, తల , మూత్రకోశం, ఉదరకోశం మొదలైన అవయవాలకు శస్త్రచికిత్సలు జరిపే విధానం ఒక్క ధన్వంతరి మాత్రమే వివరించాడు.

ధన్వంతరి మహార్షికి కర్ణాటకలో యలగుప్పలో ప్రాచీన ఆలయం ఉంది. మహర్షిని పూజించి , ఔషధాలు సేవిస్తే స్వస్థత చేకూరుతుంది అని విశ్వాసం.

అగ్నివేశసంహిత గ్రంథంలో ధన్వంతరి వైద్య చికిత్సకు సంబంధించిన పూర్వ, ప్రధాన, పశ్చాత్కర్మ ప్రక్రియలు ఉంటాయి. శ్లేష్మం, పిత్తం, వాయువు దోషాల స్థాయిలో రోగ నిర్దారణ చికిత్స మహర్షి ధన్వంతరి వివరించారు.

శల్యతంత్ర గ్రంథ రచన ఆధునిక సర్జరీకి పునాది.

తంత్ర శాస్త్రం లో సమస్త ఔషధ మూలాలు, మూలికలు, మొక్కల సిద్ధాంతాలు ఉన్నాయి. తాంత్రికులు సిద్దాంతాలను క్రియారూపంలోకి మలిచేవారు. రసవాదులు ( alchemist)  వైద్య సూత్రాలను ప్రచారం చేసేవారు. దీపావళి నవరాత్రులలో ఉత్తర భారతంలో ధన్వంతరి పూజలు చేస్తారు.

క్షార లవణాలను ఔషద ధాతువులుగా వినియోగించడం గురించి సుశ్రుతుడు తన గ్రం
థంలో ''కాశీరాజు దివోదాస ధన్వంతరి'' వద్ద నేర్చుకున్నట్లు తెలిపాడు.

శరీర నిర్మాణ శాస్త్రం ( అనాటమీ) పింఢోత్పత్తి శాస్త్రం , జంతు శరీరధర్మశాస్త్రం , రోగ నిదాన శాస్త్రం, వ్యాధి పుట్టుక శాస్త్రం, ఔషద విజ్ఞాన శాస్త్రం, ఇలా పలు వైద్య శాస్త్రాలకు అంకురార్పణ చేసిన మహార్షి ధన్వంతరి ప్రపంచానికి ఆరోగ్య ప్రదాతగా దైవసమాన మహాత్ముడు .

9542552784 


👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01

గుప్త విద్య పాఠం 1

ఇతరులతో పోల్చుకున్నావంటే భయం తప్పదు . ఎలా పోల్చుకున్నా సరే. ఆదర్శప్రాయంగా, మానసికంగా, పోల్చుకున్న రీతిలో వెలుగొందాలనుకుంటే మాత్రం, నువ్వు ఏమీ కాలేవు, కాలేకపోవడం వలనే భయం పుడుతుంది. అలా కావాలనుకోవడం ఒక కోరిక; కోరిక ప్రకారం నెరవేరడం జరుగదు. పోలిక ఉన్నచోట భయం తప్పదు.

సమాజం లో మనం ఏమీకాదు అనే భయం ఒకటి ఉంటుంది. అందుచే ఏదో ఒక హోదా పొందాలనే సంతృప్తి కోసం ఆరాటపడతాం. పౌరునికి మర్యాద చూపేదిగా సమాజం తయారయ్యింది. పొజిషన్ లేనివాణ్ణి దగ్గరకు రానివ్వదు. సమాజంలో లేదా కుటుంబం లో ఒక గుర్తింపు గల వ్యక్తి గానో దేవుని కుడి ప్రక్క కూర్చునే వ్యక్తిగానో ఇతరుల దృష్టిలో పడాలి. లోపల వేదనలతో కూడిన సుడులు, చెడుతనం ఉన్నా, గొప్ప వ్యక్తి అని గుర్తింపు పొందడమనేది ఒక తృప్తి. ఏదో ఒక పదవి లేక అధికారం కలిగి, సమాజం గుర్తింపు పొందాలనుకోవడమంటె ఇతరుల్ని అదిగమించాలనే కోరిక. అది దౌర్జన్య రూపం. ఒక సాధువు సాధుత్వంలో పొజిషన్ సంపాదించాలనుకోవడం కూడా పక్షులు ముక్కుతో పొడిచినంత దౌర్జన్యం. ఈ దౌర్జన్యానికి కారణమేంటి !? భయం !

నేను ఒక రకమైన జీవితం గడుపుతూ ఉన్నా , కొన్ని నమ్మకాలు, సిద్దాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. అవి నాకు మూలాలు. వాటి నుంచి పక్కకు తొలగటానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే రాబోయే కొత్త విధానం ఏంటో ఎలా ఉంటుందో తెలియదు. అది అయోమయం. అంటే , ఒక నిర్దిష్ట విధానాన్ని సృష్టించుకున్న మెదడు కణాలు, తమకు నిర్థిష్టం కాని మరో విధానాన్ని సృష్టించడానికి ఇష్టపడదు . ఒక నిర్థిష్టం నుంచి అనిర్థిష్టం ంవైపుకు ఉండె చలనమే భయం .

వాస్తవ చలనంలో , వర్తమాన చలనంలో నాకేమీ భయం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకేం జరగటం లేదు, నా నుండి ఎవరూ ఏమీ తిసుకొని పోవడం లేదు. కానీ మనసులోని మరింత లోపల పోర తెలిసో , తెలియకో ముందు ముందు ఏం జరగబోతోంది అన్నది లేదా గతం నుంచి ఏదో నన్ను అధిగమించి పోతుందేమోనన్న చింతనలో పడుతుంది. కనుక నేను గతం గురించి భవిష్యత్తు గురించి భయపడతాను.

రెండు సంవత్సరాల క్రితం జ్వరం వచ్చింది అనుకుందాం. భాధ పడ్డాను . అది నా స్మృతిలో ఉంది. ఆ జ్ఞాపకం ఇప్పుడు అంటుంది జాగ్రత్తగా ఉండు , మళ్లీ జబ్బు పడొద్దు, కనుక జ్ఞాపకమే ఇలా భయపెడుతుంది. నిజంగా ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను. గతానికి చెందిన ఆలోచన, స్మృతి నుంచి పెల్లుబికిన ఆలోచన భయపడే బావన సృష్టించింది. అది నిజం కాదు. నిజం ఏమిటంటే నీవు ఇప్పుడు బాగున్నావు. మనసులో నిలిచిన జ్ఞాపకంగా నిలిచిన గతానుభవం ఆలోచనను మేల్కొలిపి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది . అదే భయానికి కారణం.!!!

ఉన్నది భయం అది మొత్తంగా వుంది. దాన్ని మొత్తంగా చూడటం సాధ్యమా !? ముక్క చెక్కలైన మనసు చూడగలదా !? అసలు ఆలోచనా ప్రక్రియే ప్రతిదాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ద్వేషిస్తాను, నువ్వు మిత్రుడివి, విరోదివి కూడా! నా దేవుడు, నీ దేవుడు ,నా దేశం, నీ దేశం , నా మతం నీ మతం , నా కులం నీ కులం - ఇదీ ఆలోచనా ధోరణి. ఇలాంటి ఆలోచన ఒకటిగా ఉన్నదాన్ని ముక్కలు ముక్కలుగా తరిగి చూస్తుంది. కనుక ఆలోచనా చలనం ఆగినప్పుడు మాత్రమే మొత్తం భయరూపాన్ని చూడటం జరుగుతుంది.

గమనించేటప్పుడు ఒకటి ఆర్థం అవుతుంది. ఈ గమనించే వాడు ఒక అభిప్రాయాల పుట్ట, జ్ఞాపకాల తుట్ట, కనున విలువలేని వాడు. అలాంటప్పుడు ఈ చూసేవాడు , చూడబడే భయానికి వేరైన వాడా !? రెండూ ఒకటే. చూడబడేదీ భయమే , చూసేవాడూ భయస్తుడే. ఇదీ అసలు వాస్తవం. దూరం నుంచి,వేరైయుండి చూసినంత కాలం భయం భయమే . కానీ భయమే తానైతే ఇద్దరి మధ్యా ఖాళీలేదు, కాలం లేదు. ఇద్దరూ ఒకటేనన్న అవగాహన కలిగిన మరుక్షణమే భయం మాయమైపోతుంది . భయంలో నీవు భాగమని, భయానికి నువ్వు వేరుకాదు అని , భయమే నువ్వు అని తెలిసిన తక్షణమే వెతికేవాడూ లేడు, వెతకాల్సిన వస్తువు లేదు .

మనకు భద్రత కావాలి. ఇంట్లో బిడ్డకు మరింత భద్రత కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ కోర్కెల సాధనలో , ఇంక ఇంకా అనే పెరపెరల్లో మునిగి ఉంటారు. భవంతుల్లో , రాజభవనాల్లో మరెంతో భద్రత కావాలి. భద్రత లేకపోతే మెదడు సమర్థవంతంగా ఆరోగ్యంగా పని చేయదు . మానసికంగా భద్రత చెందటం మరీ కష్టం . కనుక భద్రతను నమ్మకంలోనూ, తీర్మానంలో , సిద్దాంతంలో , అనుభవంలో , కుటుంబంలో , జాతీయతలో పొందాలని కాంక్షిస్తాం . ఆ నమ్మకం , నిర్ణయం, అనుభవం, కుటుంబం వగైరాలు మరుగవగానే భయం సాక్షాత్కారం పొందుతుంది.

ఒంటరితనం ఉందే అది ఉన్న స్థితిని పూర్తిగా అర్థం చేసుకోనివ్వదు. గతానుభవానికి సంబంధించిన శబ్దం , పదం ప్రమాదబావం కల్గిస్తుంది. దాంతో భయం ఏర్పడుతుంది. దాని నుండి పారిపోతాం. అదే మన ప్రయత్నం. ఒక మాట చెప్పగానే ముఖంలో మార్పు వస్తుంది. అద్దంలో చూసుకోవచ్చు. స్వర్గం, నరకం , దేవుడు, కమ్యూనిజం, కుటుంబం, భార్య, ఒంటరితనం- ఇలాంటి పదాలు మనమీద అసాధారణమైన ప్రభావం చూపుతాయి. మనం ఆ పదాలకు బానిసలైపోయాం. బానిసత్వానికి లోబడ్డ మనసు భయం నుంచి విముక్తి ఏనాటికి కాలేదు.

ఒంటరితనం ఉన్నంత మాత్రాన, ఆ వాస్తవం వలన భయం కలగడం లేదు. ఒంటరితనం వస్తుందన్న బావన వల్ల భయం కలుగుతోంది. వాస్తవం వలన గాక వాస్తవం కలిగించభోయే ప్రభావం వల్ల భయం కలుగుతోంది. మనసు జరగభోయేదాన్ని చూసి భయపడుతుంది. వాస్తవం గురించి కాదు. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. తెలియని దాన్ని గురించి కాక, తెలిసింది పోతుందేమోనన్న భయం ఉంది. గతం గురించి కూడా కాదు. గతం కలిగించే ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచన వలన భయం. లోపల ఒంటరితనం , లోపల ఏమీ లేదన్న భావం భయం కలిగిస్తుంది. అప్పుడు దేన్నో ఒక దానిని ఆశ్రయించాలి. అప్పుడు బంధం ఏర్పడుతుంది. ఆ బందం సిద్దాంతం తో , లేక నమ్మకంతో ఏర్పడుతుంది. అది ఉన్నదాన్ని అవగాహనకు అడ్డు వస్తుంది.

పోగు చేసుకోవడంలో , పోగు చేసుకునే ప్రక్రియకు సంబంధించిన నమ్మకంలో భయం చేరి ఉంది. కుమారుడు చనిపోతే , పునర్జన్మలో నమ్మకం పెట్టుకుంటాం. ఎందుకు అంటే , మానసిక వేదన నుంచి ఓదార్పు కోసం. తప్పించుకోవడానికి. కానీ నమ్మక ప్రక్రియలోనే సంశయం ఉంది. బయట వస్తువులు పోగు చేసుకుని యుద్దాలు కొని తెస్తున్నాం, లోన నమ్మకాలు పోగు చేసుకుంటున్నాం, అలా భాధ కొని తెస్తున్నాం. బద్రత, బ్యాంకు ఎకౌంటు, సంతోషాలు, వగైరా వగైరా కావాలని కోరిక ఉన్నంతకాలం , మానసికంగానో లేక భౌతికంగానో ఏదో కావాలనుకున్నంత కాలం బాధ ఉండక తప్పదు. భయం నుంచి తప్పించుకోవాలని చేసే వాటిలోనే భయం , బాధ ఉన్నాయి .

ఒక ప్రత్యేక విధానంలో ఉండాలని కోరుకున్నప్పుడు భయం ప్రవేశిస్తుంది. భయం లేకుండా ఉండడమంటే ప్రత్యేక పద్ధతి అంటూ లేకుండా జీవించడమే . అయితే భయం లేకుండటానికి ఒక విధానాన్నే విధ్వంసం చేస్తాననడం కొత్త విధానం కోరుకోవడం అవుతుంది. అది మరో భయానికి కారణం. భయం పోగొట్టకోవాలని మనం చేసేది ఏదైనా భయానికి కారణం అవుతుంది.

భయం తన నుంచి తాను తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూసుకుంటుంది. సామాన్యమైనది గుర్తింపు పొందడం- దేశంతో , సంఘంతో , అభిప్రాయం తో ఏకం కావడం. మత ఊరేగింపు, సైనిక కవాతు, దేశంపై దాడి ఇలాంటివి సంభవించినప్పుడు మనం ఏం చేస్తామో చూడండి. దేశానికో ఆదర్శనికో అంకితం అయిపోయినట్టు గుర్తింపు కోరతాం. ఖాద్యా బిడ్డలతో లేక గొప్ప క్రియతో గుర్తింపు పొందాలని కొందరు చూస్తారు. గుర్తింపు అంటే తనని తాను మర్చిపోవడం !!

నేను అనే చింతన నిలిచి ఉన్నంత కాలం బాధ, పోరు, భయం ఉంటాయి అయితే గొప్ప వాళ్ళతోనో గొప్ప విషయంలోనో, జీవితంలోనో సౌందర్యంతోనే సత్యంతోనే , జ్ఞానంతోనే తాత్కాలికంగా గుర్తింపు చెందితే , నేను నుంచి తప్పుకోవచ్చు. దేవునికి, కుటుంబానికి అంకితమైనా మైమరపు వస్తుంది. తాత్కాలిక తప్పించుకోవడం అవుతుంది.

గతం భద్రతతోనే జరిగింది. అనిశ్చాలున్నా నిన్న గడిచిపోయింది. ఈ రోజు పర్వాలేదు, బాగానే ఉన్నాను. రేపటి గురించి భయపడుతున్నా. రేపటి అనిశ్చియంతో కూడిన అభద్రత ద్వారా ఉండే ఉనికే భయం ! భవిష్యత్తు బాగానే ఉండవచ్చు. కానీ దానిని గురించిన ఆలోచన భయాన్ని కలిగిస్తుంది. రేపు ఏమైనా జరగవచ్చు, ఏమీ జరగకపోవచ్చు. ఎప్పుడూ భధ్రతకోరే ఆలోచన, హాఠాత్తుగా భవిష్యత్తు గురించి అనిశ్చయ భావానికి లోనయిందంటే భయం కలుగుతుంది. భగవంతుడా ఏం జరుగుతుందో అనుకుంటాం. కనుక ఆలోచన భయాన్ని పెంచి పోషిస్తుంది.

ఒక ఆదర్శాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెట్టి దాని ద్వారా నిశ్చయత్వం కోరే ఆలోచన భయానికి కారణం అవుతుంది. ఆ భయం అంతా ఆలోచనా పనితనం . భయం తెలిసినదానితోనే సంబంధించి ఉంటుంది. తెలియని దాంతో కాదు.

*****

శంఖ - లిఖితులు

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
 

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
 

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
 

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.
 

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

ఈ శంఖ లిఖితులు - ద్వాపర యుగం లో
" ధర్మశాస్త్రం " రచించారు .
 ఆయనకి చేతులు ( బాహువులు) మళ్ళీ వచ్చాయి కాబట్టి , దీనికి " బాహుదా " నది అన్న పేరు వచ్చింది .
స్థానికులు అయిన గ్రామీణులు " చేతులు ఇచ్చిన యేరు  కాబట్టి, ఈ పవిత్ర నదిని " చెయ్యి + యేరు = చెయ్యేరు ) అని పిలుస్తున్నారు .]

****


Tuesday, 23 March 2021

24032021

 

 May be an image of 1 person and text that says "జయ హనుమంత జ్ఞానగుణవందిత జయపండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ P A00 राम C అంజనేయ స్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ శుభ మంగళవారం"

 

శ్రీమంగళచండీ స్తోత్రం
ఓంశ్రీమాత్రే నమః ప్రాంజలి ప్రభ ఆద్యాత్మికం 24032021
(కుజగ్రహ దోష నివారణకు,సర్వ దోష నివారణకు)

రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే ||

హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే ||

మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళాతే దేవీం సర్వేషామ్ మంగళాలయే ||

పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ ||

మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని ||

సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే ||

||ఇతి మంగళచండి స్తోత్రం సంపూర్ణం||
 

****** 


May be an illustration of 1 person and text that says 'M. శుభోదయం'

సీతాపతీ పద్యము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

సీసము

జన్మల బంధము జయము ను పెంచును
జాతిని రక్షించు జన్యు పరము
అంత శోభకరము ఆదిదేవుని తీర్పు
వెలుగును చూపించు వేళ కళ్ళు
సీత ఆడేందుకు సీతల వెలుగులే
రామచంద్రయ్య కు  రాత్రి తెలుపు
లోకాలు ఏలేటి లౌక్యంగా నడిపించు
రామచంద్రుని లీల రమ్య మవ్వు

తేటగీతి
ప్రేమ గుడ్డిది ప్రత్యక్షం పుడమి నందు
చట్ట ముకు కళ్ళు లేవులే చూపు ఏది
సుందరాకార సౌందర్య శ్యామ లీల
ధర్మ సత్య న్యాయమునకు దారి ఇదియె

--(())--

సీసము

పరిశుద్ధ జీవన - పరమాత్మ స్వరూపి
నిర్మల హృదయంతొ - నియమ బుధ్ధి
నిగ్రహమ్ము గాను - నిత్య సత్యపు బోధ
విశ్వాస నీయమై  - వినయ ముంచె
గురువును తలచియు - గౌరవించుట శక్తి
గుప్త విద్యను పూర్తి  -గాను పెంచు
మర్మము లేనట్టి  - మనసును అదుపులో
ఉంచుము లక్ష్మణా - ఉదయ వాక్కు

తేటగీతి
మానవపురోభి వృద్ధికి - మనసు ఉంచి
సత్య సూత్రము నిత్యము - శోభ పెంచు
నిర్మల హృదయ మే నీకు  - నమ్మకమ్ము
చిత్తముంచియు ప్రేమను - చూపు చుండు

--(())--

సీసము
బంధము ఆశల - బహుమాన  కధలేలు
బాధ్యత లు గలిగి - బంధమవ్వు
ఆత్మీయత గలిగి - ఆనంద పరుచుట
అనురాగ అమృతము - ఆత్రుతవ్వు  
గురువులా బోధించి - గొప్పకు పోకుండ
గౌరవ లక్ష్యము - గోప్యమవ్వు
మిత్రునిలా ఆపదలో - మక్కువ చూపుము  
లక్ష్మణా గృహముకు - దీపమవ్వు

ఆటవెలది
జపము సల్పుచున్న - జన్మజన్మా౦తర
పాపసంచయములు బారద్రోలి
మోక్షమొసగుచుండు మార్గమ్ము తెల్పుము
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు

--(())--
 


"సీ.
----
కరిరాజవదనము గలవాని గణపుని
        వెలఁగలు చెఱకులు విరిగఱికలు
కుడుములునుండ్రాళ్ళుగుడసహితముగను
      బిల్వాది పత్రాలు విరివిఁదెచ్చి
పార్వతీతనయుని పండితపూజ్యుని
        సాహిత్య సంగీత సకలకళుని
సర్వకార్య శుభేష్టశాస్త్రవిజ్ఞానదు
        తొలుతగాసేవ్యుని తుష్టివరదు
గీ.
--
ఆఖువాహను వేల్పుని హర్షమలర
భక్తిఁగొలిచెదహృదియందు శక్తిమేర
షోడశోపచారవిధిని సూక్తమతిని..
సిద్ధిగణపతికినతులుచేయుచుండ !!! "     .... ... 89
--------------
సీసము
నిరతము నిన్నే ను - నే కల్చెదను రామ
         నిను నిరంతరము గా - నీదు భక్తి
నిస్సహాయంగా ను - నిర్మలంగావుండె
         నమ్మిన వాడిగా - నేను ఉన్న
నిజముగా నీవేను - నన్నునూ రక్షించే
            నిక్కము తెల్పితి - నీవె రక్ష
నిర్వాహణమ్ముయె - నటననే నాదియు
      నన్నుమన్నించుము - నయన రామ

ఆటవెలది
నేను అన్న అహము నాలోను ఉన్నది
నిన్ను కోరు చుంటి నన్ను మార్చు
నాలొ అశలన్ని నన్నుగా ఉంచక
నిర్ణయాలు మార్పు నీవె రామ    ... ..... 90
**(())**


 

Monday, 22 March 2021

23032021

 May be an illustration of 1 person and text that says 'M. శుభోదయం'

 సీతాపతీ పద్యకావ్యము

సీసము
మనసుయే బతికించు మనిషిని నిత్యమూ
ప్రేమయే పంచును ప్రియుని యందు
శీలమే మనిషిని శీఘ్రమ్ము గ కదుల్చు
నిస్వార్ధమె మనిషి నిజము తెల్పు
సత్యమార్గపు కళ సంతోష పరచును
శాంతమే మనిషికి సౌఖ్య మవ్వు
సహనమే మనిషికి సహజగుణంఔను
ముక్తిపదముకదె మూలమగును
 
తేటగీతి
భక్త జనులను రక్షించు భవ్య జీవి
భాగ్య మిచ్చియు మనసును బాగుపరచు
భజన చేసిడివారిని  భయముమాపు
లక్ష్మణా సత్యమును తెల్పు లోకమందు

--(())--

సీసము
శృంగార రసము తా బొంగార సీతతో
మించు వేడుక విహరించినావు
శివధనుర్బంగంబు, జేసెడి వేళలో
వీరరసంబు గుపించినావు
కాకాసురునియందు, కారుణ్యరసమును
చిలికించి, వాని రక్షించినావు
అంబుధిలో, పర్వతాళిని దేలించి
యద్భుతంబును చూపి యలరినావు

తేటగీతి  
తల్లి తండ్రుల పలుకును నిలిపినావు  
ధర్మ మనుచు వనములకు ఏగినావు
సూర్పనఖయందు హాస్యము జూపినావు
ప్రాంజలి ఘటించు రామ ని పాదములకు

--(())--

సీతాపతీ పద్యకావ్యము

సీసము
 తత్త్వం అర్ధములను -  తెలిసిన వాడికి
లోకము పిచ్చిది - లాశ్య మవ్వు
తాత్వికుడు మనసు - తాపత్రయము గుండు  
లోకము పాలించు - లలిత మవ్వు
నిత్య సనాతన - నిర్మాన ధర్మాలు
దేహలయానికి - దైవ మవ్వు
నీవు దేవుడవైన - నా హృదయము నందు
 దేవాలయము రామ - ధన్య మవ్వు

తేటగీతి
తత్వ భావాలు జీవికి - తృప్తి పెంచు
ధర్మ సందేహములు తీర్చి - దారి చూపు
రామ రాజ్యం లొ కష్టాలు - రావు లేవు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
సీసము
  ఎద లోతులో మది - ఏడుపు మడతలో
      మనసు మమత లోన - మరులు గొలుపు
      హృది ఉల్లము శృతిగా  - రాగంతొ కృతిగాను
     గీతంతొ లయవేద - గీత మాయె
     గతి గమకంతోను - గోప్యతా భావము    
వయసు వలపు లోన  - వ్యక్త పరచి
     హృది లోయ లోపల - హరించు మోహము
శ్రీ రామ వీక్షించి - రక్ష చేయు
తేటగీతి
ఆశయాలలొ సహనపు భావ ముంచి
రామశ్రీరామ సతాపతీ మనోహ
రామ రామను చుంటిని రామ భద్ర
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--

సీసము
అక్షర సంప్రోక్ష ణము - మది లాలన
 తలపు లో నిలిచిన, - తిరగని కళ
మమతల పట్టి గా - మనసున ఉంచుము
 సహజ భావనలేలు‌ - సమత మమత
    హారపు సిరిచంద - నాలను మాకిమ్ము
    నవజీవన తలపు - నమ్మి ఉన్న
    సుమమాలల సువర్ణ - సుందర పట్టీని
సీఘ్రము గానీ కు - చిలిపి రామ

తేటగీతి
నిత్య సత్యాలు బోధన - నిజము గుండె
    అమృత దారలు వర్షించె - అదుపు తప్పి
    నిత్యనూతన కానుకల - నీకు రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ - పాదములకు
--(())--

అదియె ఆనంద నిలయం
ధర్మో రక్షతి ధర్మం
అదియె నిత్య కళ్యాణం
అక్కడ పత్స తోరణం

--(())--
   !

 🧘‍♂️భవబంధాలు🧘‍♀️

ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే, అసత్యాలే..


చిన్న కథ...

ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చాడు.

"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్ఛాడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగాడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పాడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయాడు.

అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించారు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసాను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.

మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.

సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.

ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరి కదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు.

ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..!నేను ఈ అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మ తోటిది మాత్రమే అని గ్రహించాను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయాడు.

((())))