ప్రాంజలి ప్రభ 24 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
విధేయుడు: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత ..(2 )
మందహాస మధురమ్మ - విందుచేయు వినయమ్మ
సుందరాన సుమసమ్మ - అందచేయు అదరమ్మ
గుబ్బల మోపు అమ్మ - జబ్బలు మోపు అమ్మ
దబ్బల పెద్వి అమ్మ - మబ్బుల చూపు అమ్మ
నమ్రత చూపు నమ్మ - తామ్రము లేని అమ్మ
అమృత మిచ్చు అమ్మ - సుకృతమవ్వు అమ్మ
కైవల్య వరద అమ్మ - దైవము కొరకు అమ్మ
శ్రావ్యపు పలుకు అమ్మ - భవ్యపు వెలుగు అమ్మ
మనంద సుందరమ్మ - సునంద కందరమ్మ
కనంద కాంతులమ్మ - అనంద ఆత్మయమ్మ
సౌఖ్యమిచ్చు మాయమ్మ - సఖ్యతిచ్చు మాయమ్మ
లౌఖ్య మిచ్చు మాయమ్మ - జోఖ్య మవ్వు మాయమ్మ
మముకన్న మాయమ్మా - సుమమాల మాయమ్మ
సముఖాన మాయమ్మ - విముఖాన మాయమ్మ
(మూలం .. మూక పంచ శతి.. ఆర్య శతకమ్)
--(())--
ఛందస్సు - వసు షట్పది
8 / 8 / 8 - 6 లేక 7 మాత్రలు
గాజు బతుకు యే
మోజు బతుకు యే
బూజు బతుకు యే ఎవరి కొరకు
అడిగినా ఫలం
అడితే గళం
అడగకే గుణం ఎవరి కొరకు
ప్రణయ నాదమే
గణన వేదమే
గుణము శోధనే ఎవరి కొరకు
కళల యోగమే
కలల రాగమే
అలక మోహమే ఎవరి కొరకు
పూర్తి నమ్మకం
కీర్తి అమ్మకం
స్ఫూర్తి విస్మయం ఎవరి కొరకు
కష్టం ఎవరికి
ఇష్టం ఎవరికి
నష్టం దేనికి ఎవరి కొరకు
మనకు సహాయం
తనకే సహనం
అనకే విహంగం ఎవరి కొరకు
మానధనుడు యే
గాణ వినుడు యే
మోనధనుడు యే ఎవరి కొరకు
పాప భీతి యే
శాప నీతి యే
కోప మేత యే ఎవరి కొరకు
కవి కాలము యే
కవి గాళము యే
కవి తాళము యే ఎవరి కొరకు
0000000
నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై
జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
"మత్తకోకిల
----
అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా
అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా
రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా
యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా
ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే
ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే
సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా
దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా
ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా
ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే
పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే
వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా
కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ
రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్
భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే
అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!"
000000
----
"ఉత్పలమాలా..
-----
శ్రీపరదేవతే ! విమలరీతికటాక్షజవైభవప్రదే !
శ్రీపరదేవతే ! సుపదరీతివిభూషణరాజితే ! శుభే !
శ్రీపరదేవతే ! భయదరీతివిరోగనిహంత్రి ! చండికే !
శ్రీపరదేవతే ! సుగతిశేవధి ! త్రాహి..జయే ! నమోऽ స్తుతే !!!
(పేరి వెంకటసూర్యనారాయణ )
దానము చేసెదా ఇచట దాపరికమ్ముయు లేదు దేనికిన్
ఆనక విద్యలే సలిపి ఆదర మిచ్చెద మూడుడైననన్
మానస వీణ నే తలచి మార్గము తెల్పియు జూడవేడెదన్
వైనము సుస్వరంబునను వాణినె పిల్చెద బత్కు మారగన్
చిత్తము చూపియే కరణ చింతన తెల్పియు వేడ్కు సేయగన్
సత్యపు పల్కు లన్ నియమ సాధన చేసియు తెల్పు చుండుచున్
ముత్యపు చిప్పలో వెలుగు ముత్యము సర్వము మోహ పర్చుచున్
తత్వము నిత్యమై బతుకు తీవ్రత విశ్వము విద్య వేదమున్
(మల్లాప్రగడ రామకృష్ణ )
--(())--
సోయగములు.. 4నుండి 6
జానకి రాముని కళ్యాణం
మునులు ఋషులు చేరె
చూదము రారండి జనులార
వేదములను చదువు
కారణ జన్మలపెళ్ళియు
కరుణ దయయు మెండు
చూదము కరుణ సోయగములే
సకల గుణాభిరాముని పెళ్లి
రకరకాల పూల
గుత్తులు జిలుగు వెలుగుల లో
చిత్త మంత చూపె
జానకి పెళ్లికూతురు అయ్యె
మనకు పిల్పు వచ్చె
చూదము కరుణ సోయగములే
అఖిల భువనమ్ములు ఏలు
సుఖము పంచు రామ
పరమ పావని సీత దేవితో
వరద రామ పెళ్ళి
మంగళ సూత్రమ్ము కట్టేను
యొగ మాయ వీడె
సన్నాయి మేళాలు మ్రోగే ను
ఉన్న వారు సంత
సమ్మును కరుణ సోయగములే
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
)))))0(((((((
పురంజనోపాఖ్యానం:
భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా వుంది – ఇదంతా తమకు అందదని అంటారు. అందుకని ఋషులు బోధ చేసేటప్పుడు ఆ తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు.
ప్రాచీన బర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకోని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని తానూ ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకోని ఒక రకమయిన అజ్ఞానంలో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీన బర్హికి చెప్పిన కథకే ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు.
పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు.
అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీపేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది.
ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ.
0
: పంచభూతాలలో పృధివికి మాత్రమే దైవత్వం, మాతృత్వం రెండూ ఆపాదించారు శాస్త్రకారులు. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఆకాశరాజు అంటాం... ఒక్క పృధివిని మాత్రమే భూమాత అంటాం. భూదేవి లాంటి విశేషణాలు మిగతా భూతాలకు లేవు. అందుకే ఆమెకు నిత్యం గౌరవంగా వందనాలు సమర్పించాలి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని ప్రార్థిస్తాం. మహోత్కృష్టమైన భూమి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పురాణాలలో గోచరిస్తాయి.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, పునరుత్పత్తి... ఇది సృష్టిక్రమం అని వేదాలు చెబుతున్నాయి. ఓషధులకు భూమి ప్రధానమైనది. ‘భూమి’ శబ్దానికి అన్నిటినీ భరించగలిగేది అని ఒక అర్థం ఉంది. అచల, అనంత... ఒక్కో కారణంగా ఒక్కో పేరు వచ్చింది. భూమి తాను కదులుతున్నప్పటికీ భూమి మీద నివసించే ప్రాణులు, ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అంటే కంపం లేకుండా ఉంచుతుందన్నమాట. అందుకే భూమాతను అచల అంటారు.
ఎంత బరువువైనా భరించగల శక్తి భూమికి మాత్రమే ఉంది. సహనానికి మారుపేరు పుడమి. పిల్లలను కనిపెంచడానికి తల్లిదండ్రులకున్నంత సహనం భూమాతకు ఉంది. అంత సహనం కలిగిన భూమాత తన కుమారుడి వల్ల ప్రజలకు చేటు జరుగుతోందని గ్రహించి, తన కుమారుడని కూడా చూడకుండా, నరకాసురుడిని సంహరించింది.
మాతృత్వం...
పంచభూతాలలో భూమికి మాత్రమే దైవత్వం, మాతృత్వం అనే రెండు లక్షణాలు ఉన్నాయి. వేదాలు మాతృదేవోభవ అని చెప్పిన వాక్యం భూమికి సైతం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. భూమిని దైవంగా భావించి గౌరవించాలి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి ఆ తల్లిని బయటకు తీసి, భూభారాన్ని ఆయన స్వయంగా మోశాడు. భరించే వాడు భర్త కనుక, భూదేవికి విష్ణుమూర్తి భర్త అయ్యాడు.
అనేక నామాలు...
భూమి, భూదేవి, భూమా దేవి, భూమి దేవి, వసుంధర, వసుధ, వైష్ణవి, కాశ్యపి, ఉర్వి, హిరణ్యం, వసుమతి... ఈ పదాలతో నేలతల్లిని పిలుస్తాం. విష్ణుమూర్తి అవతారమైన వరాహావతారంలో వరాహుని భార్య భూమి. లక్ష్మీదేవి రెండు అంశలలో భూదేవి ఒక అంశ. ఆమె నిరంతరం నారాయణునితోనే దర్శనమిస్తుంది. కశ్యప ప్రజాపతి కుమార్తె భూదేవి. అందుకే కాశ్యపి అని పేరు.
వీరంతా భూగర్భ ఉద్భవులే...
భూమాత అనేకమంది దేవతామూర్తులకు జన్మనిచ్చింది. సీతలాగే పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలం దున్నుతుండగా దొరుకుతుంది. ఆండాళ్ కూడా పెరియాళ్వార్ నాటిన తులసి చెట్టు కింద దొరుకుతుంది.
పంచభూతాలలో మొట్టమొదటగా నమస్కరించేది భూమాతనే. పృథివ్యాపస్తేజో వాయురాకాశః... అని పంచభూతాలను వరుసక్రమంలో చెబుతాం. దేవునికి అర్చించే పుష్పాల జన్మస్థానం భూమి. కుసుమాలు భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే వాటికి సువాసన సమకూరుతుంది. అంటే భూమి విత్తనంతో సమ్మేళనం చెందుతున్నప్పుడే ఈ ఘుమఘుమలు సమకూరతాయి. ఈ కారణంగానే భూమిని ‘గంధవతీ పృథివీ’ అంటారు. అటువంటి భూమిని సంక్షోభానికి, తాపానికి గురి చేయకుండా ఉండటం ఆమె బిడ్డలుగా మనందరి బాధ్యత.
రూపవిలాసం... భూదేవి చతుర్భుజి. ఒక చేతిలో దానిమ్మ, ఒక చేతిలో జలపాత్ర, ఒక చేతిలో మూలికలతో నిండిన పాత్ర, మరో చేతిలో కూరలతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో కుడిచేతిలో నీలోత్పలం (కుముదం లేదా ఉత్పలం, రేకలువ), ఎడమ హస్తం అభయముద్రతోను సాక్షాత్కరిస్తుంది.
అభయహస్తాన్నే లోలహస్త ముద్ర అని కూడా అంటారు. పృథివికి ఆఘ్రాణ శక్తి ఉంది. అందుకే పృథివిని నాసిక భాగంతో పోలుస్తారు. హస్తంలో పృథివిని ఉంగరం వేలుగా గణిస్తారు. పృధ్విని కేంద్ర స్థానంగాను, నిశ్చలత్వానికి ప్రతీకగాను శాస్త్రం చెబుతోంది. పృధ్వితో జలం కలిస్తే తియ్యటి రుచి ఏర్పడుతుంది. పృథివితో అగ్ని కలిస్తే చేదు రుచి ఉద్భవిస్తుంది.
--(())--
జీవితం కొందరికి వడ్డించిన విస్తరిగా అనిపిస్తుంది. ధనమే జీవితానికి పరమావధిగా భావిస్తుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే, లోకమంతా రంగులమయంగా కనిపిస్తుంది. డబ్బు అలా విసిరేస్తే కొండమీది కోతి అయినా ఇలా దిగివస్తుందని తలపోస్తారు. దిలాసాగా జీవితం గడిపేస్తుంటారు. ఏదో అనుకోని సంఘటన... వూహించని జీవన ఉత్పాతం... సంభవిస్తుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అసలలాంటి బాధలు ఉంటాయని కూడా ఆలోచించి ఉండం. ఎలా ఆ కష్టాల నుంచి బయటపడటం అని... అప్పుడు.. అప్పుడు ఆలోచిస్తాం. మనిషి హాయిగా జీవించేయడానికి బాసటగా ఉన్నవారిని అకస్మాత్తుగా కోల్పోవచ్చు. కలలోనైనా వూహించని సంఘటన జరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకోవచ్చు. అప్పుడిక కష్టాలన్నీ మనలను వెన్నంటే ఉంటాయి. నడి సముద్రంలో చిక్కుకొన్న మనిషిలా ఆశలు కొలబోతాయి. ఒడ్డున పడటం మన వీలు కాదని అనుకొంటున్న సమయంలో. అప్పుడు మన మనసులో శతకోటి ఉపాయాలు మెదులుతాయి. ఏదో ఒక యుక్తి వల్ల జీవితంలో ఆలంబన లభిస్తుంది. ఆ కష్టసమయంలో మనం చేసే ప్రయత్నమే మన అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టమే కష్టాల కడలినుంచి తీరానికి చేరుస్తుంది.
ఆ కష్టం సంభవించే దాకా మనిషికి తాను అలాంటి ప్రయత్నం చేయగలనని తెలియదు. కష్టమే మన ప్రయత్నానికి వూతమై అదృష్టవంతుణ్ని చేస్తుంది. ప్రారంభంలో మనిషి, అన్ని చతుష్పాద (నాలుగు కాళ్ల) జంతువుల్లాగానే భూమిపై తిరిగేవాడని మానవ ఆవిర్భావ సిద్ధాంతాలు తెలుపుతున్నాయి. కష్టాలను దూరం చేసుకొనే ప్రయత్నంలోనే సుఖాల అన్వేషణ చేశాం. నేడు సుఖంగా మనుగడ సాగించగలిగే సౌకర్యాలను
సమకూర్చుకొని అదృష్టవంతులమయ్యాం ! మనిషికి కష్టాలే లేకపోతే సుఖాలను శోధించే అవసరమే ఉండేది కాదు. శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక కష్టాల బారిన పడినంత మాత్రాన మనిషి నిరుత్సాహపడకూడదు. మనిషిలోని ఆలోచన, ఉద్వేగాలు ఎంతో గొప్పవి ఎప్పుడూ కష్టాలకు భయపడుతూ బతకడం మానవనైజం కాదు
మనిషి తనకు కలిగిన కష్టాలను దూరం చేసుకొనే అశక్తుడిగా మారినా వెరవడు. తన సృష్టి ఎలా జరిగిందో తెలుసుకొని అందుకు కారకుడైన అంతర్యామిని గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను దైవానికి విన్నవించుకొనేందుకు ప్రార్థనను సృజించగలిగి మహా అదృష్టవంతుడయ్యాడు తనను అన్ని విధాలా కష్టాలనుంచి కాపాడగలిగే దైవం ఉన్నాడనే భావన మనిషికి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది.. కష్టాల్లోనూ, అన్నిరకాల బాధల్లోనూ దైవాన్ని శరణువేడి ప్రార్థిస్తే మనిషికి లభించే ధైర్యం మహనీయమైనది. ఆ ధైర్యమే మనిషికి శ్రీరామరక్ష, చీకట్లు ఆవహించగానే ఆ .కష్టాన్ని తీర్చుకోవడానికి వెలుగులను సృష్టించుకుని అదృష్టవంతుడయ్యాడు. ప్రయత్నం చేస్తే చెడుకాలం తొలగి మంచికాలం వస్తుందని తెలుసుకొన్నాడు. సృష్టినీ సృష్టికర్తనూ తెలుసుకోగలిగాడు. ఒంటరిగా జీవించే కష్టాలకు దూరం కావడం కోసం సమాజాన్ని
సృష్టించుకొన్నాడు. ద్వేషం కష్టాలకు కారణమని గ్రహించి ప్రేమించడంలోని గొప్పతనాన్ని తెలుసుకొని అదృష్టవంతుడయ్యాడు ప్రేమించి ప్రేమను పొందడంలో దైవత్వం ఉందని తెలుసుకొన్నాడు. ప్రేమవల్ల త్యాగం, త్యాగంవల్ల నిర్మలత్వం, నిర్మలత్వం వల్ల దైవత్వం సిద్ధిస్తుందని గ్రహించాడు. అన్నింటికీ ఆ దైవమే ఉన్నాడనే భావననూసృజించుకొని మనిషి మహా అద్భుతమైన ధైర్యవంతుడయ్యాడు. ధైర్యం మనిషిని శక్తిమంతుడిని చేసే అదృష్టానిస్తుంది. కష్టకాలాల్లో ఎంతటి బాధలనైనా ఎదుర్కొని ముందుకు సాగే శక్తిని దైవబలం మనిషికిస్తుంది. జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే యుక్తి మనిషికి దైవం ఉన్నాడనే భావనవల్ల కలుగుతుంది
కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు మనిషిలోని నిద్రాణమైన భావం, యుక్తి, శక్తి- కష్టాలు సంభవించినప్పుడే ఉత్తేజితమవుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనిషి కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు. ఎంతో అదృష్టవంతుడవుతాడు. అందుకే కష్టాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కష్టాలే అదృష్టాలు
చాలా చాలా బాగున్నాయి అందరూ చదివేవారు
ReplyDelete