346
పూర్వము ఒకవూరిలో రామ రాజు, భీమ రాజు అనే స్నేహితులు వుండే వారు. రామ రాజుకు ఒక కొడుకు, భీమ రాజుకు ఒక కూతురు వున్నారు. ఒక రోజు రామరాజు భీమ రాజు దగ్గరకు వచ్చి నేను అవసరార్థం నా పొలం అమ్మదలుచుకున్నాను, అది నీవు తీసుకొని నాకు డబ్బు యివ్వు అన్నాడు.సరే అని భీమరాజు ఆ పొలం కొన్నాడు.అందులో విత్తనం వేద్దామని దున్నుతుండగా నాగలికి తగులు కొని ఒక బిందె బయటికి వచ్చింది.
దాని నిండా బంగారు నాణాలు వున్నాయి.భీమ రాజు ఆ బిందె తీసుకొని రామరాజు యింటికి వెళ్లి నీ పొలం దున్నుతుంటే ఈ బిందె దొరికింది. పొలం నీదే కదా ఈ బిందె నీకే చెందుతుంది.అన్నాడు. దానికి రామరాజు
పొలం నీకు అమ్మేశాను కదా! అది నాదెలా అవుతుంది?ఆ బిందె నీదే అవుతుంది అన్నాడు.అందుకు భీమరాజు
నేను నీ పొలానికి మాత్రమె డబ్బు యిచ్చాను.బిందెకి కాదు కదా!అలాంటప్పుడు ఈ బంగారు నాణాల బిందె నీదే అన్నాడు. యిద్దరూ కాసేపు వాదులాడుకొని తర్వాత తీర్పు కోసం ఆ దేశం రాజు గారి దగ్గరకు వెళ్ళారు.
ఇద్దరి వాదనలను విన్న రాజుగారు వారి ధర్మ నిరతికి ఆశ్చర్య పోయారు. మీ యిద్దరికీ ఒకరికి కూతురూ
ఒకరికి కొడుకు వున్నారు కదా వారిద్దరికీ పెళ్లి చేసి ఆ ధనం వారిద్దరికీ యిచ్చి వేయండి. వారిద్దరూ దానితో ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా వుంటారు. అని తీర్పు చెప్పి భీమరాజుకు కూతురి పెళ్లి చేయటానికి తగిన ధనం యిచ్చి నీ కూతురి పెళ్ళికి యిది నా కానుక అని చెప్పాడు. "ధర్మో రక్షతి రక్షితః "
(చందమామ కథలు)
347
"శ్రీ వేంకటేశ్వరుడి పాద వైభవం "..
ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.
శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు.
ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.
శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే
ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.
ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి.
ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.
శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.
అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?
అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.
కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనన్ని ఉన్నాయి . మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యం .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం.
ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను
ఆ పూజ మందిరంలో పెడతారు .
ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.
నారాయణ పాదములు
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో నారాయణ పాదం ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.
ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు భూచక్ర గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు భూచక్ర గొడుగులను కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.
అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు
****
348..శ్రాద్ధ భోక్తలు - ఆపస్తంబుని కధ
యజుర్వేదాధ్యాయులైన బ్రాహ్మణులలో మూడు వంతుల మంది ఆపస్థంబసూత్రానికి చెందినవారే. ఈ ఆపస్థంబుడు అనే ఈ మహర్షి గురించి తెలుసుకుందాము.
ఒకప్పుడు వేదవేత్త అయిన ఒక బ్రాహ్మణుడు శ్రాద్ధం జరిపేడు. భోక్తగా ఒక బ్రాహ్మణుడిని నిమంత్రణం చేశాడు. ఆ భోక్త కోసం చాలా సేపు వేచి ఉన్నాడు. భోక్త చాలా ఆలస్యంగా వచ్చాడు. బాగా ఆకలితో వచ్చాడు.
కర్త, భోక్త గారి కాళ్లు కడిగి అర్చన చేసి భోజనం వడ్డించేడు.
వచ్చిన మిగతాసాధారణ భోక్తల కంటే బాగా ఎక్కువగా భోజనం చేశాడు.
బ్రాహ్మణుడికి బాగా ఆకలిగా ఉన్నట్లున్నది అని భావించి కర్త మళ్ళీ మళ్ళీ వడ్డించేడు. వడ్డించగా వడ్డించగా వండిన వంటకాలు మరేమీ మిగలలేదు.
కర్తలో మొదట ఉన్న వినయం నశించిపోయి హేళనకి దిగింది. మాటలలో హేళన కనబడటం మొదలైంది. దానిని లెక్క చెయ్యని భోక్త ఇంకా వడ్డించు వడ్డించు ఏమిటి అలా చూస్తున్నారు అన్నాడు.
అపరిమితంగా తిన్నా తృప్తి పొందక తనకు ఇంకా పెట్టు అనే అంటున్నాడు. తనని అలా ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని అనటం తనని అవమానించటానికే అనుకున్నాడు కర్త. వండిన పదార్థాలన్నీ అయిపోయి నా ఇంకా కావాలి ఇంకా కావాలని భోక్త అడుగుతూంటే కర్తకి కోపం వచ్చేసింది.
దాంతో ఖాళీ అయిపోయిన వంట పాత్రలను తీసుకువచ్చి విస్తరిలో బోర్లించేసేడు. ఇంక తృప్తి అయిందా అని అన్నాడు. (భోక్త భోజనం అయిన తరువాత వారిని కర్త తృప్తాస్తాః అని అడగటం, భోక్త తృప్తోస్మి అని మూడు సారులు చెప్పటం సాంప్రదాయం కదా.)
అలా చెప్పకపోతే శ్రాద్ధకర్మ మరి ముందుకు సాగదు
కాని ఈ భోక్త లేదు నాకు తృప్తి కాలేదు అన్నాడు. కర్తకి కోపం నసాళానికెక్కింది. ఈయన అడిగినదంతా వడ్డించేనే, పెట్టినదంతా తినేసి తృప్తి లేదంటూ నన్ను అవమానించి, నేను పెట్టిన ఈ శ్రాద్ధాన్ని కూడా చెడగొట్టేడే ఈ బ్రాహ్మణుడు అని కోపం తెచ్చుకున్నాడు.
కర్త మంచి తపస్వి. కోపం చేత ముఖం ఎఱ్ఱగా చేసికొని ఆయన ఈ భోక్త గా వచ్చిన బ్రాహ్మణుడిని శపించటానికి చేతిలో జలం తీసుకొని అభి మంత్రించి బ్రాహ్మణుడితలమీద చల్లాడు.
అప్పుడొక ఆశ్చర్యం జరిగింది. వచ్చిన బ్రాహ్మణుడు తన చేతితో అభిమంత్రించి తలమీద చల్లిన జలాన్ని క్రింద, తన తలమీద పడకుండా మధ్యనే నిలిచిపో అని ఆజ్ఞాపించినట్లుగా ఆగు అని ఆపేసేడు.
కర్త దీన్ని చూసి ఆశ్చర్యంతో ఉన్నవాడు ఉన్నచోటనే నిలబడిపోయేడు. తాను చల్లిన నీటిని మధ్యనే నిలబెట్టిన ఈ బ్రాహ్మణుడు సాధారణ బ్రాహ్మణుడు కారు, తనకంటే గొప్ప వాడు అని తెలిసికొని, "పూజ్యుడా! మీరు ఎవరు నన్ను ఎందుకిలా శోధిస్తున్నారు" అని అడిగేడు. దానికి ఆయన ఇలా సమాధానం చెప్పేరు - "నేను ఒక మునిని. నేను ఎక్కువగా తిన్నందువలన నన్ను ఎగతాళి చేసేవు. నీ చూపులతోనూ నీ చేష్టలతోనూ నువ్వు నన్ను అవమానించేవు. శ్రాద్ధానికి వచ్చిన బ్రాహ్మణుల మీద నీ పితృదేవతల ఒక అంశని వేసి భగవానుడు పంపుతాడని మరిచిపోయి నువ్వు వ్యవహరించేవు.నీకు బుద్ధి చెప్పటం కోసమే నేను ఇలా చేసేను శ్రాద్ధాన్ని భయభక్తులతో శ్రద్ధతో చెయ్యాలి తప్ప కోపం తెచ్చు కొనకూడదని తెలుసుకో" అన్నారు.
దానికి కర్త 'స్వామీ నా తప్పుని
తెలిసికొన్నాను, క్షమించండి ఇకమీదట ఇటువంటి తప్పు చెయ్యను, నేను జరిపిన శ్రాద్ధకర్మ పూర్తికాలేదే, దానికి ఏమి చేసేది? అని అడిగేడు.
దానికి ఆ బ్రాహ్మణుడు నేను తృప్తి చెందలేదు అని చెప్పినందున శ్రాద్ధం పూర్తి కాలేదు. అందుచేత పురుషసూక్తాన్ని పారాయణం చెయ్యి, ఈ దోషం పరిహరించబడుతుంది
అన్నారు దానిని పారాయణం చేసి కర్త శ్రాద్ధాన్ని పూర్తి చేసేడు.
జలాన్ని మధ్యను ఆపేరు గనుక ఆయనకు ఆపస్తంబులు అని పేరు వచ్చింది.
శ్రాద్ధకాలంలో పురుషసూక్తాన్ని, కాటకోపనిషత్తునీ పారాయణం చేసే నియమం ఉన్నది.
ఆపః అంటే నీరు ఆ నీటిని స్తంభింపచేసి మధ్యను నిలిపి దానికి విలువ లేకుండా చేసినందున ఆయన ఆపస్థంబులు అయినారు.
From fb
****
349-కర్మ - జన్మ
11 వ అధ్యాయం
రామాయణం - కర్మ సిద్ధాంతం
పూర్వం మయానూనమభీప్సితాని పాపానికర్మాణ్యసకృత్కృతాని
తత్రాయ మద్యాపతితో విపాకో దుఃఖేనదుఃఖం యదహం విశామి
--అరణ్య కాండ (63-4)
భావం:-
తను పూర్వం ఎప్పుడో అనేక పాపకృత్యాలు చేసి ఉంటాడని, , తనకు కలిగే దుఃఖం ఆ పాప కర్మ ఫలమే తప్ప ఇంకోటి కాదని రాముడు విలపిస్తూ అంటాడు.
గుణదోషకృతం జంతుః స్వకర్మఫలహేతుకమ్
అవ్యగ్రస్త దవాప్నోతి సర్వంప్రేత్యశుభాశుభమ్
--కిష్కింధా కాండ (21-2)
భావం:-
ప్రతీ జీవుడు తన పూర్వ కర్మల ప్రకారం సుఖదుఃఖాలని అనుభవిస్తాడు. సుగ్రీవుడి వల్ల వాలి మరణించాడని బయటకి కనిపించినా, వాలి స్వకర్మ ఫలితంగానే మరణించాడు. వాలి నిమిత్త మాత్రుడు.
నియతిః కారణం లోకే నియతిః కర్మసాధనమ్
నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణమ్
-- కిష్కింధకాండ (24-5)
భావం:-
ఈ లోకంలో అన్నింటికీ కారణం కాలమే. కాలమే కర్మలకి సాధనం. ఈ లోకంలో సమస్త భూతాలని ప్రేరేపించే కారణం కాలమే.
న కాలస్యాస్తి బన్దుత్వం న హేతుర్న పరాక్రమః
న మిత్రజ్ఞాతి సంబన్ధః కారణం నాత్మనో వశః
--కిష్కింధకాండ (24-7)
భావం:-
కాలానికి పక్షపాతం లేదు. దాన్ని వశం చేసుకొనే సాధనం కాని, జయించే పరాక్రమం కాని ఎవరికీ లేదు. మితృత్వం, జ్ఞాతిత్వం మొదలైన సంబంధాలు కాల ప్రవృత్తికి కారణం కాదు. కాలం ఎవరికీ వశం కాదు.
నియతిః కారణం లోకే నియతిః కర్మ సాధనం
నియతిః సర్వభూతానాం నియోగేష్విహ కారణం
--కిష్కింధ కాండ (25-4)
భావం:-
లోకాలన్నిటికీ కారణం భగవంతుడే. భగవంతుడే సకల కర్మలకు సాధనం. అతడే సకల జీవులని నియమించేవాడు.
నకర్తా కస్యచిత్ నియోగేచాపినేశ్వరః
స్వభావేవర్తతేలోకస్తస్యకాలః పరాయణం
-- కిష్కింధ కాండ (25-5)
భావం:-
లోకంలో ఎవడూ ఏ పనికీ కర్త కాని, ఇంకొకరు చేయడానికి ప్రేరకుడు కాని కాలేరు. లోకమంతా కాలానికి (పూర్వ కర్మ ఫలాలకి) వశమై. కర్మఫలాలు కాలాన్ని అనుసరించే అనుభవంలోకి వస్తాయి.
*****
350.. *నెల్సన్ మండేలా డైరీలో ఓ పేజీ:*
‘నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక #హోటల్కివెళ్లాను.
వేయుటర్ వచ్చి #మాఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది.
సరదాగా మాట్లాడుకుంటూ,
మేం తినడం ప్రారంభించేముందు నా #దృష్టి #ఎదురుటేబులలో_ఒంటరిగా_కూర్చున్నవ్యక్తి మీద పడింది.
అతని #భోజనం_ఇంకారాలేదు.
నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి #బయటకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి #భోజనంవచ్చింది.
అతను #నిస్సహాయంగా_కూలబడిపోయాడు.
నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి,
నాపక్కన కూర్చోమంటూ, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను.
వెయిటర్ కు సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు.
#తప్పనిసరి_పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు.
మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, #అతనికి_ముద్ద_గొంతుదిగడంలేదు.
*చేతులు వణుకుతున్నాయి.*
దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు.
మా అందరి భోజనం అయ్యాక అతను సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు.
అతనిని గమనించిన నా మిత్రుడు బాగా _అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..!_" అంటూ ఓ జనాంతిక కామెంట్ వదిలాడు.
_అప్పుడు నేను "లేదురా..! అతను ఆరోగ్యంగానే ఉన్నాడు._
*నేను జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ* ఇతను
ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింసవల్ల నొప్పులు, బాధతో అరిచీ అరిచీ
నా గొంతు ఆర్చుకుపోయి _దాహంతో నీళ్లమ్మని అడిగితే,_
_హేళనగానవ్వుతూ నామొహం మీద మూత్రం పోసేవాడు._
*మాఅమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను.*
*మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు.*
_నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి, వణికిపోతున్నాడు._
✨✨✨✨✨✨
నేను తనమీద ప్రతీకారం
తీర్చుకుంటానేమో,
ఉద్యోగం పీకిస్తానేమో,
జైలులో వేయిస్తానేమో..!
_ముందే_ఊహించి కొని అలా భయపడుతున్నాడు._
✨✨✨✨
నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు!
పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య.
గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది!
సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను.
*~నెల్సన్ మండేలా*.
(దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యధార్ధ సంఘటన.)
ప్రతి ఒక్కరూ చదువుతారని ఎంతో శ్రమించి పోష్టుచేసాను మీరు చదివాక వేరొకరికి పంపండి
ReplyDelete