Tuesday, 21 June 2022

 


*సీనియర్ సిటిజన్స్ కోసం :*
           *మాడిపోయిన బల్బ్ లు*                                                                                                                                  
                  
ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 

ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.
  
“చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 
                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.

ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 
"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటికి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 

అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 

మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 

ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..
 
మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 
అదే డెత్ సర్టిఫికెట్


♥️ కథ-

మన ప్రగతిని ఆటంకపరిచేది ఏమిటి?

నివాళి

ఒకరోజు ఉద్యోగులంతా ఆఫీసుకు చేరుకోగానే, తలుపుకి ఒక కాగితం అతికించబడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది – “ ఈ కంపెనీలో మీ పురోగతికి అడ్డుగా ఉన్న వ్యక్తి నిన్న చనిపోయాడు. అతనికి నివాళులర్పించేందుకు సెమినార్ హాలులో సమావేశం ఏర్పాటు చేయబడింది. సరిగ్గా 11 గంటలకు జరిగే నివాళి సభకు అందరూ హాజరుకావాలని భావిస్తున్నాం.

సహోద్యోగి మరణవార్త చదివి తొలుత అందరూ బాధపడ్డారు. అయితే కాసేపటి తర్వాత వారిలో ఉత్సుకత మొదలైంది. వారి పురోగతితో పాటు కంపెనీ పురోగతిని కూడా అడ్డుకున్నది ఎవరు?

11 గంటలకల్లా సెమినార్ హాలుకు ఉద్యోగులు రావడం ప్రారంభించారు. క్రమేణా, ఎంత మంది జనం అక్కడ గుమిగూడారంటే, వారిని నియంత్రించడానికి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. జనం వస్తూనే ఉన్నారు. జనం రద్దీ పెరుగుతుండడంతో సెమినార్ హాలులో కదలిక కూడా పెరిగింది. 

అందరి మదిలో మెదులుతున్న విషయం ఒక్కటే – “ ఈ కంపెనీలో నా పురోగతిని ఆపడానికి నరకయాతన పడ్డది ఎవరైయ్యుంటారు? పోన్లే, ఒక విధంగా అతను చనిపోవడం మంచిదే కదా."

నివాళులర్పించే సభ ప్రారంభం కాగానే, ఆతృతగా, ఆసక్తిగా ఉన్న ఉద్యోగులంతా ఒక్కొక్కరుగా శవపేటిక వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. 
కానీ దగ్గరికి వెళ్లి శవపేటిక లోపల చూసేటప్పటికి, షాక్‌కు గురైనట్లుగా, వారి ముఖం పాలిపోయింది.

ఆ శవపేటికలో ఒక అద్దం ఉంచబడింది. దానిలోకి చూసేవాడు తన ప్రతిబింబాన్ని అందులో చూసుకుంటాడు. 

ఆ అద్దం మీద ఒక చీటీ కూడా అతికించబడి ఉంది, దానిపై వ్రాసిన పదాలు ప్రతీ ఒక్కరి ఆత్మను కదిలించివేసాయి - "నా పురోగతికి ఆటంకం కలిగిస్తున్నది ఒకే ఒక వ్యక్తి - ఆ వ్యక్తి నేనే".

మన జీవితంలో మార్పు సృష్టించగల ఏకైక వ్యక్తి మనమే, ఇది మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మన సంతోషాన్ని, మన సున్నితత్వాన్ని, మన విజయాన్ని మనం మాత్రమే ప్రభావితం చేయగలం. మనకు మనమే సహాయపడగలం. మనకు ఉన్న అతి ముఖ్యమైన సంబంధం, మనతోనే.



మన ఆలోచనలు, పనులు, మన అలవాట్లే మన విధిని సృష్టిస్తాయి, అలాంటప్పుడు మన వైఫల్యానికి మరొకరు ఎవరో ఎలా కారణం కాగలరు?

మన రోజువారీ ఆలోచనల నుండే మన విధిని మనం సృష్టించుకుంటాం. 🌼
దాజీ

సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే, జీవితం గురించి ఆలోచిస్తే, పెద్ద కష్టం ఏమికాదు. క్షణభంగురమైన ఈ life లో కొంచెం పంచుకొంటే, భూమి స్వర్గం అవుతుంది. కానీ 😃😃😃😃....

ఇక చదవండి 💐💐💐💐

🙏 *వెళ్ళేలోగా ఖాళీ అయిపోదాం!*

                
*టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.*

*ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.*👌🏼

*టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.*

*‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’* అనేది ఆ ప్రశ్న.

*‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు - ఇలా జవాబులు చెబుతారు.*

*అప్పుడా డైరెక్టర్ , అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.*

*‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం  - స్మశానం!’*😳

 *ఎందుకంటే...*🤔

 *అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.*

*‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు.*

 *పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది.*😒

 *అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి?’*🧐

*డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.*

ఆ ప్రేరణతోనే  టాడ్ హెన్రీ *Die empty* అనే  పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు. 

*ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట...*

*‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి.* *అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి!’*

*నిజానికి  టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే...*

*‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.    మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.*

*‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.  మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.*

 *‘ప్రేమను పంచండి 💞, మీలోనే  దాచుకుని వృధా చేయకండి’*

*వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం.👍🏼             మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!*

*‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....అనుక్షణం జీవిద్దాం.

....
మంచుకొండ

అనగా అనగా మంచుకొండల వద్ద ఒక గ్రామం వుండేది.అ వూళ్ళో వనమయ్య అనే ఆసామి 
వుండేవాడు.అది చలికాలం వనమయ్యా,అతని స్నేహితులూ యింట్లోనే కుంపటి చుట్టూ 
కూచుని చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.అందరూ తమ తమ ధైర్య సాహసాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు.వనమయ్య వూరికే వింటూ కూర్చున్నాడు.

స్నేహితులంతా ఏమిటి వనమయ్యా నీవేమీ మాట్లాడడం లేదు.నీవేమీ ఘనకార్యం  చెయ్యలేవా?అని ఎగతాళిగా అడిగారు.
అప్పుడు వనమయ్య నేనేదయినా చేయగలను.ఏమి చేయ్యమంటారో చెప్పండి చేసి చూపిస్తాను.అన్నాడు.

అయితే రాత్రంతా బయట చలిలో నిలబడి వుండాలి.ఏ విధంగానూ వేడి తగలరాదు.పొద్దు పొడిచేవరకూ అలాగే నిలబడి వుండాలి.అని హెచ్చరించారు.
సరే అలాగే నిలబడతాను.నేను ఓడిపోతే మీ కందరికీ విందు భోజనం పెట్టిస్తాను.అదీ పందెం.అన్నాడు వనమయ్య.

ఇంట్లో  కుంపటి,దీపం ఆర్పేసి బయటకు వెళ్లి నిలుచున్నాడు.అర్ధరాత్రి అయ్యే సరికి చలి బాగా ఎక్కువైంది మంచు కురవడం ప్రారంభ మైంది.పళ్ళు గిత్త కరుచుకుని పోయాయి. అటూ యిటూ పచారు చేయటం మొదులు పెట్టాడు..యింతలో దూరంగా ఎవరింట్లోనో దీపం వెలిగింది ఆ దీపాన్నే చూస్తూ ఆ వేడిని ఊహించుకుంటూ వుంటే కొంచెం చలి తగ్గినట్లని పించింది.ఆ వెచ్చని ఊహలతో తెల్లవారింది.

స్నేహితులు వచ్చి మొత్తానికి గెలిచావయ్యా అని అభినందించారు.నీ కడుపు బంగారం గానూ!ఎలా ఓర్చుకున్నావయ్యా? అని అడిగారు.అర్ధరాత్రి దూరంగా దీపం కనిపించింది.
దాని వేడిని ఊహించుకుంటూ అలాగే రాత్రంతా గడిపాను.అన్నాడు వనమయ్య.
ఏ విధమైన వేడీ వుండకూడదు అని చెప్పాము కదా! నీవు ఆ వేడిని ఊహించుకున్నావు కాబట్టి నీవు వోడిపోయినట్టే.నీవు విందు ఇవ్వాల్సిందే అని అందరూ పట్టు బట్టారు.

ఎక్కడో దూరంగా వుండే దీపపు వేడి చలిని ఎలా తగ్గిస్తుంది?యిది అన్యాయం అని అరిచి మొత్తుకున్నా వాళ్ళు వినిపించుకోలేదు.విందు ఇవ్వాల్సిందే అని వాళ్ళు పట్టు బట్టారు.వాళ్ళు రేపు విందుకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు.
ఏమి చెయ్యాలో  దిక్కుతోచక న్యాయాధికారి దగ్గరికి వెళ్లి కథంతా చెప్పి నన్నేలాగైనా కాపాడండి అని వేడుకున్నాడు.ఆయన అతనికి ఒక ఉపాయం చెప్పి అలా చెయ్యమని 
చెప్పి పంపించాడు.

సరే నని యింటికి వెళ్లి మరుదినం ఒక కుండ  లో బియ్యము నీళ్ళు పోసి  చూరుకు వ్రేలాడ దీసి కింద చిన్నదీపం వెలిగించి పెట్టాడు.మధ్య మధ్యలో ఒక చిన్నబల్ల మీద ఎక్కి వుడి కిందా  లేదా అని చూస్తున్నాడు.మధ్యాహ్నానికి స్నేహితులందరూ వచ్చారు 
వంట అయిందా వనమయ్యా?అని అడిగారు.యిదిగో యింకా ఉడుకు పట్టలేదు. పొద్దుననగా పెట్టాను అన్నాడు వాళ్ళు లోపలి వచ్చి చూసి యిలా పెడితే ఎలావుడుకుతుంది?   నీకేమైనా పిచ్చా? అన్నారు.స్నేహితులు.

దీపం  చిన్నదైనా,ఎంతదూరంగా వున్నా వేడి తగులుతుందని అన్నారు గదా మీరంతా 
మరి యిదీ అంతే.అన్నాడు వనమయ్య.వాళ్ళు సిగ్గుపడి వాళ్ళ తప్పు ఒప్పుకొని అందరూ కలిసి ఒక పూటకూళ్ళ అవ్వ యింటి కి  వెళ్లి వనమయ్యకు ఘనంగా విందు  యిప్పించారు..

"కుక్క కాటుకు చెప్పుదెబ్బ"

.
...
*సద్గతి అనగా నేమి?*

🪷🪷🪷🪷🪷

సర్వం ఖల్విదం బ్రహ్మ సర్వమూ బ్రహ్మయే అయినప్పుడు అందరూ ఆత్మస్వరూపులే అయితే
ప్రత్యేకించి ఆలయాలకు వెళ్లడం ఎందుకు ?
ఉపవాసాలు ఎందుకు ? నియమనిష్టలెందుకు ?
ధ్యానమెందుకు ?
శాస్త్రపఠనమెందుకు ?
సత్సంగాలేందుకు ?

పై ప్రశ్నలన్నీ ఓ తెలిసిన అమ్మాయి అడిగింది . ఆ క్షణంలో తనలో ఏళ్ల క్రితం
నన్ను నేను చూసుకున్నట్లుంది.
ఈనాడు ఈ అమ్మాయి ధైర్యంగా అడిగినట్లుగా ఆనాడు నేను ఎవరిని అడగలేదు అయితేనేం భగవంతుని అనుగ్రహం వలన  సద్గురువుమీద గురితో , కాలక్రమేణా పుస్తక పఠనం ద్వారా  సందేహాలు తీర్చుకున్నాను.

మనది పరోక్ష జ్ఞానం అంటే ఋషులూ మహర్షులూ గురువులూ చెప్పింది పఠన శ్రవణముల ద్వారా తెలుసుకున్నది. దానినే ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకొని ముక్తిత్వం పొందడానికే పై సాధనాలన్నీ.
దీపం గురించి తెలిసినంత మాత్రాన చీకటి పోతుందా ? అన్నం గురించి మాట్లాడితే ఆకలి , నీటి గురించి మాట్లాడితే దాహం తీరుతుందా ? అలాగే వినడం వలన తెలుసుకోవడం వలన ప్రయోజనంలేదు.
భావనమాయాప్రజ్ఞ ( స్వానుభవములో తెలుసుకోవడం ) అన్నిటికన్నా చాలాముఖ్యం

మనసుని జయించడం మనసుకు అతీతులవడం చెడుగుణాలు తొలగడం మనలోపల ప్రక్షాళన జరగడం సంపూర్ణాంగా జీవించడం ఆనందంగా శాంతియుతంగా జీవించడం
పరమ గమ్యాన్ని చేరడం మానవజన్మకు సార్థకత చేకూరడం.
ఇత్యాదులన్నీ పై సాధనాల వల్లనే సాధ్యమవుతుంది.

వ్యవసాయకుడు తన పొలమునందున్న కలుపు మొక్కలని తొలగించి దుక్కి దున్ని పైరు బీజాలను ఎట్లుజల్లునో , అలాగే సాధకుడు తన హృదయాంతరాళమున ఉన్న దుఃఖమయ రాక్షసగుణాలన్నిటిని
సంపూర్తిగా తొలగించి అందులో భక్తి అనే బీజాలను జల్లి పెంచి పోషించినచో దైవత్వమనే పంట పండి తీరును.
ఎండాకాలంలో కలుపు ఏమియు కనపడకపోయినను బీజరూపమున దాగియుండి వర్షం కురవగానే ఎట్లు మొలకెత్తునో

అలాగే అజ్ఞానంవలన అనేక జన్మవాసనలు మనయందు దాగియుండి సమయం వచ్చినప్పుడు అంకురించి మొలకెత్తుచుండును వాటిని సాధన ద్వారా సాధకుడు పట్టుదలతో కృషిచేసి పెరికివేసినచో తప్పక విజయుడై విశుద్ధ హృదయుడై దైవత్వమును పొందగలడు గీతలో దైవాసుర సంపత్విభాగయోగమందు శ్రీకృష్ణుడు
చెప్పినట్లుగా సాధకులెల్లరు తమయందు దైవభాగమెంతగలదో , అసురభాగమెంతగలదో పరిశోధించి తక్షణమే అసురగుణ నిర్ములనకునూ దైవగుణ ప్రతిష్ట కొరకునూ ప్రయత్న శీలురై యుండవలెను.

అంతా బాగానే ఉంది, అయితే మరి ధ్యానాది సాధనలు చూసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు ? ముక్తులు కాలేక పోతున్నారు ? అనేసందేహంరావొచ్చు
 ఎందుకంటే
 మినః స్నానపరః ఫణి
 పవన భుజ్మే మెషోస్తి పర్ణశానః
 నిరాశి ఖలు చాతకః ప్రతిదినం
 శైలే బిలే మూశికః
 భస్మోధూళిత విగ్రహస్తు
 శునకో ధ్యానాదిరుడో బకః
 యేషాం ఫలమస్తి కిం నహి నహీ జ్ఞానం పరం కారణం

 గంగయందే పుట్టిపెరిగిన జలచరాలన్నియు నిత్యమూ గంగా  స్నానము చేసియు , అందే నివసించియున్నను ,
సర్పము వాయుభక్షణమును
చేసినను , మేక ఆకులనుఁ తినినను ఎలుకలు సదా కొండగుహలలో ఉన్నను కుక్క బూడిద పూసుకున్నాను కొంగ మౌనన్గా ఒంటికాలుమీద జపం చేసినను , వీటన్నిటికీ ఎలాంటి విశేషఫలము ఉండదు.

అలాగే కాసేపు ధ్యానం ఉపవాసాలు ప్రార్థనలు , శాస్త్రపఠనాలు ప్రవచనాలు వినడం ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రాన ఫలితముండదు.
అంతఃకరణశుద్ధి అంతరంగనిష్ఠ ఉండాలి .
సాధకునికి శ్రద్ధ భక్తివిశ్వాశం ఉండాలి.
ఎటువంటి అవరోధాలు కలిగినను పట్టుదలతో అనన్య భక్తితో సాగిపోవాలి ఆత్మసాక్షాత్కారం ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే హృదయ పరిశుద్ధత ఎంతో అత్యవసరం.
అందుకు ఎంతో సాధనబలం అవసరం.

మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలాగే ఉంటుంది.
సమ్మతితో ఉండాలి సద్గతిని పొందాలి.

1 comment:

  1. ప్రతి ఒక్కరుకూడా చదివి నచ్చిన కధను తెలుపగలరు

    ReplyDelete