Saturday, 30 January 2021

01-02-2021

KRISHNA ART : Photo

సుప్రీంకోర్టు సంచలన తీర్పు 🛑

*కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు,
భీమా సంస్థలు , రవాణాశాఖ మరియు ప్రభుత్వం సంయుక్తంగా    ఏప్రిల్ 1వ తారీకు 2021 నుంచి కచ్చితంగా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు జడ్జి ఆదేశించారు...*
*****

⭕1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా)  ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు.  అలాగే ప్రమాదం పాలైన వారికి  ఏ విధమైన పరిహారం వర్తించదు.

⭕2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

⭕3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు.

⭕4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు.

⭕5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ విధమైన భీమా వర్తించదు.

⭕6. రాంగ్ రూట్లలో వచ్చే వారి వల్ల ఇతరులకి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం చేసిన వ్యకి పేరుతో ఉన్న ఆస్తిలో 20 లక్షల రూపాయల ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన వ్యకికి పరిహారం ఇవ్వాలి .ఇవ్వలేని పరిస్థితి ఉంటే 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు.
అదే విధంగా వారి రక్తసంబంధీకుల డ్రైవింగ్ లైసెన్స్ 7 సంవత్సరాల రద్దు చేస్తారు.

⭕7. ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం చేస్తే కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది.

⭕8. వీరి తరపున ఎవరైనా పైరవీలు చేసినచో వారి డ్రైవింగ్ లైసెన్స్ 5 సంవత్సరం లు రద్దు చేస్తారు.

⭕9.ఈ విషయాలలో కఠిన చర్యలు తీసుకోని అధికారుల విధుల నుంచి 3 సంవత్సరం లు తొలగిస్తారు , ఈ సమయంలో వారికి ఏ విధమైన ప్రభత్వ పరమైన సహాయం అందదు.

⭕10.అతివేగంగా వెళ్లే వారికి కూడా పైన పేర్కొన్న విధంగా శిక్షలు వర్తిస్తాయి.

⭕11. కారు ప్రయాణంలో సీట్ల బెల్ట్స్ పెట్టుకోకుండా వున్నా కూడా ప్రమాదం జరిగితే  ఏ విధమైన భీమా వర్తించదు

--(())--

Image may contain: 1 person, sitting and outdoor

సమ్మోహనాలు .. రచ్చ బండ (1151-1160)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జాతుల కూడలి ఇది 
ఇది పరిష్కార విధి 
విధిగా సమస్య పరిష్కారము ఈశ్వరా 

పెద్దలు కూర్చొనునది 
కూర్చొని  తీర్పుల వీధి 
వీధి నందు తీర్పు చెప్పు పెద్ద ఈశ్వరా 

జాతీ సమైక్యత
సమైక్యత ఐక్యత 
ఐక్యతతో గ్రామ స్వేశ్చ ఇచ్చు ఈశ్వరా

ఇది  సమన్వయానికి 
సమన్వయ తీర్పులకి
తీర్పులతో రచ్చబండ తెల్పు ఈశ్వరా 

కులాలకు ఆజ్యంగ     
ఆజ్యాంగ ధర్మంగ
ధర్మ0గ న్యాయంగ నిర్వహణ ఈశ్వరా 
  
సంఘర్షణ వచ్చెను   
వచ్చె సందిగ్ధతను 
సందిగ్ధ పరిష్కార వేదిక ఈశ్వరా 

సమ సమాజం కొరకు   
కొరకు క్షేమం కొరకు  
కొరకు అభాగ్యుల సేవ కొరకు ఈశ్వరా 

శ్రేష్ఠులు కలసి ఉండు 
ఉండు న్యాయ ముండు 
ముండునది సేవలకు మార్గమే ఈశ్వరా

నవ వసంతం తోను 
తోను పండుగ లోను  
పండుగ సంభరం జరిపేను ఈశ్వరా 

కాల ప్రభుత్వమిది
ఇదిజనల కొరకుంది   
కొరకుంది ఆత్మగౌరవంతో ఈశ్వరా 

--(())--


[31/01, 7:05 am] తెలుగు1: శ్రీమద్రామాయణం!.. మన జీవన వేదం!..


అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.

ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి " ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా " అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.

అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి " నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా. 

పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దెగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దెగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.

మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటె రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటె, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దెగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా " అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.

రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |

కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||

రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు.

ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు.


సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |

భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||

సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |

అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||


వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు " అన్నాడు.

(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)

  -సశేషము (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనము నుండి గ్రహీతము ).

 తెలుగు1: *కలసి మునుగుదాం .. రండి!* 

చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్ చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.

ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.

ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.

కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'

'వస్తాదులెందుకయ్యా?'

'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'

'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'

'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. ఐ. పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.

'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'

'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు టకటకలాడిస్తో.

'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'

'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!

'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో  మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.

'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.

తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్ డిజైనింగులో  బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.

ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.

తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.

మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని  పాపం మా అందరి కోసం పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా! ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.

డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.

గోరు తడవకుండా  గోదావరి స్నానమంటూ  ఇదేంటో మరి?!

కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంతకీ కలవదే!

'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు మిత్రుడు .

✍🏻కర్లపాలెం హనుమంతరావు

 [Prathyusha: ఎంత  అద్భుతమైన  పోస్టింగు  ఇది.

🍁MUST READ 

గొప్ప నీతి కథ..

అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.

దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.

అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

🍃🍃🍃

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. 

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా? 

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. 

ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. 

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట.

అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. 

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? 

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? 

నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? 

నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. 

నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. 

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? 

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? 

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. 

ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. 

ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. 

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? 

ఇక నేనుండలేను వెళ్తున్నా!'


👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. 

దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. 

దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇

[ Prathyusha: _*శ్రీ శివ మహాపురాణం - 74 వ అధ్యాయం*_

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


_*దక్ష యజ్ఞములో సతి*_

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

దక్షుని యజ్ఞము మహా ప్రభతో కొనసాగుచుండెను. దేవతలు, రాక్షసులు, మునులు, ఇంద్రాది దిక్పాలకులు ఉత్సాహముతో దానిలో పాల్గొనిరి. దక్షపుత్రి అచటకు వెళ్లెను. అనేక వింతలతో గూడినది, గొప్ప కాంతి గలది, దేవతల ఋషుల గణములతో కూడినది అగు తన తండ్రి ప్రాసాదము నామె అచట చూచెను. అపుడా దేవి ద్వారము వద్ద తన వాహనమగు నందినుండి దిగి వెంటనే ఆమె ఒక్కతెయే లోపలకు యజ్ఞశాలకు వెళ్లెను. యశస్వినియగు ఆమె తల్లి అసిక్ని, మరియు సోదరీ మణులు ఆమెకు ఉచితమగు మర్యాదలు చేసిరి.

దక్షుడు ఆమెను చూచెను. కాని ఎట్టి ఆదరమును చూపలేదు. శివమాయచే విమోహితులైన ఇతరులు కూడా వాని భయముచే ఆమెను ఆదరింపలేదు. ఓ మహర్షీ!ఈ విధముగా సర్వుల అనాదరమునకు గురి అయిన ఆ సతి మిక్కిలి ఆశ్చర్యమును పొంది తల్లికి, తండ్రికి సమస్కరించెను. ఆ యజ్ఞములో విష్ణువు మొదలగు దేవతల కీయబడిన హవిర్భాగముల నామె చూచెను. కాని దక్షుడు శంభునకు భాగము నీయలేదు. సతీదేవికి పట్టరాని కోపము కలిగెను.

ఈ విధముగా అవమానింపబడిన సతీదేవి మిక్కిలి క్రోధమును పొంది దక్షుని దహించువేయునా యన్నట్లు చూచెను. మరియు ఇతరులను కూడ భయమును గొల్పు దృష్టితో చూచెను.

*సతి ఇట్లు పలికెను -*

పరమ మంగళ స్వరూపుడగు శంభుని నీవేల ఆహ్వానించలేదు? ఆయన ఈ చరాచర జగత్తునకంతకు పవిత్రత నాపాదించుచున్నాడు. యజ్ఞ స్వరూపుడు, యజ్ఞవేత్తలలో శ్రేష్ఠుడు, యజ్ఞము అంగముగా గలవాడు, యజ్ఞములోని దక్షిణ స్వరూపముగా గలవాడు, సోమయాజి స్వరూపుడునగు శంభుడు లేని యజ్ఞము ఎట్లు సంభవము?. ఆయనను స్మరించినంత మాత్రాన సర్వము పవిత్రమగును. ఆశ్చర్యము!ఆయన యొక్క స్మరణ లేని కర్మలన్నియూ అపవిత్రములగును. యజ్ఞద్రవ్యములు, మంత్రములు, దేవతల కిచ్చే హవిర్భాగములు, పితరులకిచ్చే కవ్యము ఇత్యాది సర్వము ఆయన యొక్క స్వరూపమే. అట్టి శంభుడు లేని యజ్ఞము ఎట్లు ప్రవర్తిల్లుచున్నది?.

ఓరీ తండ్రీ !నీవు అధముడవు. శివుని ఒక సామాన్య సురునిగా భావించి నీవు అనాదరము చేసితివి. ఈనాటికి నీ బుద్ధి భ్రష్టమైనది. ఓరీ! ఏ మహేశ్వరుని సేవించి విష్ణు బ్రహ్మాది దేవతలందరు తమతమ పదవులను పొందినారో, అట్టి హరుని ఎరుగకున్నావు. విష్ణు బ్రహ్మాది దేవతలు, ఈ మహర్షులు తమ ప్రభువగు శంభుడు లేని ఈ నీ యజ్ఞమునకు ఎట్లు వచ్చేసిరి ?.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

శివస్వరూపిణి, పరమేశ్వరి అగు ఆ సతి ఇట్లు పలికి, మరల విష్ణ్వాదులనందరినీ వేర్వేరుగా భయము కలిగించుచున్నదై ఇట్లు పలికెను.

*సతి ఇట్లు పలికెను -*

ఓ విష్ణూ!నీవు మహాదేవుని స్వరూపము నెరుంగవా ? వేదములాయనను సగుణుడనియు, నిర్గుణుడనియు కూడ వర్ణించుచున్నవి గదా !. ఓ హరీ! పూర్వము మహేశ్వరుడు అనేక పర్యాయములు నీకు చేయూత నిచ్చి, నీవు వరాహాది అవతారములను ధరించుటకు ఆవశ్యకమగు శిక్షణ నిచ్చియుండెను. ఓరీ! దుష్టబుద్ధీ !అయిననూ నీకు మనస్సులో జ్ఞానము ఉదయించలేదు. నీ ప్రభువగు శివుడు లేని ఈ దక్షయజ్ఞమునకు భాగమును గోరి వచ్చితివి. ఓరీ బ్రహ్మా! పూర్వము నీవు అయిదు ముఖములు గలవాడవై సదాశివుని ఎదుట గర్వమును చూపగా, ఆయన నిన్ను నాల్గు ముఖములు గలవానిని చేసెను. నీవు ఆ అద్భుతమును విస్మరించితివి.

ఓరీ! ఇంద్రా! నీవు మహాదేవుని పరాక్రమమునెరుంగవా? క్రూరమగు కర్మలను చేయగలిగే హరునిచే నీ వజ్రము భస్మము చేయబడినది. ఓ దేవతలారా!మహాదేవుని పరాక్రమమును మీరెరుంగరా? ఓయీ అత్రీ !వసిష్ఠా! మునులారా !మీరిచట ఏమి చేసినారు ? పూర్వము దారువనములో ఆ రుద్ర విభుడు భిక్షాటమును చేసినాడు. ఏలయన, ఆ సమయములో మునులగు మీరు ఆయనను భిక్షుడవు కమ్మని శపించిరి. అట్లు శపించిననూ రుద్రుడు ఏమి చేసినాడో మరిచినారా ఏమి? లింగ రూపుడగు శివుడు స్థావర జంగమాత్మకమగు జగత్తునంతనూ దహించివేసినాడు.

విష్ణువు బ్రహ్మ మొదలగు సర్వ దేవతలు, మునులు, ఇతరులు శంకరుడు లేని ఈ యజ్ఞమునకు వచ్చి మూర్ఖులైరి. ఎవని నుండి సర్వవేదములు, వేదాంగములు, శాస్త్రములు, వాక్కు పుట్టినవో, ఎవడు వేదాంతములచే ప్రతిపాదింపబడుచున్నాడో, అట్టి శంభుని కొందరు మాత్రమే తెలియగలరు. ఇతరులకు ఆయన అందడు.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

జగన్మాతయగు సతీదేవి కోపముతో కూడియున్నదై దుఃఖితమగు హృదయముతో అచట ఇట్టి అనేకములగు పలుకులను పలికెను. విష్ణువు మొదలగు సర్వ దేవతలు, మునులు భయముచే కల్లోలితమగు మనస్సులు గలవారై ఆమె మాటలను విని మిన్మకుండిరి. అపుడు దక్షుడు తన కుమార్తె యొక్క ఆ పలుకులను విని, ఆ సతిని క్రూరమగు చూపులతో చూచి, కోపమును పొంది, ఇట్లు పలికెను.

*దక్షుడిట్లు పలికెను -*

నీవు అధిక ప్రసంగము నేల చేయుచున్నావు ?ఇపుడునీ కిచట పని లేదు. ఓ మంగళ స్వరూపులారా! వెళ్లెదవా ?ఉండెదవా? నీవు ఏల వచ్చితివి ?. నీ భర్తయగు శివుడు అమంగళుడనియు, కులహీనుడనియు, వేద బహిష్కృతుడనియు, భూత ప్రేత పిశాచములకు రాజనియు పండితులు చెప్పుచున్నారు. అందువలననే , ఓ పుత్రీ! విద్వాంసుడనగు నేను ఈ సత్యము నెరింగి మిక్కిలి చెడు వేషమును ధరించు రుద్రుని దేవతలు, ఋషులు కొలువు దీర్చియున్న ఈ యజ్ఞమునకు ఆహ్వానించలేదు. బుద్ధిహీనుడు, పాపియగు బ్రహ్మ ప్రేరేపించగా నేను, వేదతాత్పర్యము తెలియనివాడు, గర్విష్ఠి, దుర్మార్గుడనగు రుద్రునకు నిన్ను ఇచ్చి వివాహమును చేసితిని. ఓ స్వచ్ఛమగు చిరునగవు గలదానా !కాన నీవు కోపమును వీడి స్వస్థురాలవు కమ్ము. నీవు ఈ యజ్ఞమునకు ఎటులైననూ వచ్చితివి గాన, దీనిలో పాలు పంచుకొనుము.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

దక్షుడిట్లు పలుకగా, దక్షుని కుమార్తె, ముల్లోకములకు పూజ్యురాలునగు ఆ సతి నిందావచనములను పలుకు తన తండ్రిని చూచి మిక్కిలి కోపమును పొందెను. అపుడామె ఇట్లు తలపోసెను. నేను శంకరుని వద్దకు ఎట్లు పోగలను ? నాకగు శంకరుని చూడవలెనని యున్నది. ఆయన వివరములనడిగినచో, నేను ఏమి సమాధానము నీయగలను ? అపుడు ముల్లోకములకు తల్లియగు ఆ సతి క్రోధముతో కూడినదై, నిట్టూర్పులను విడచుచున్నదై, దుర్బుద్ధియగు ఆ దక్షునితో నిట్లనెను.

*సతి ఇట్లు పలికెను -*

ఎవడు మహాదేవుని నిందించునో, ఎవడు మహాదేవుని నిందను వినునో, వారిద్దరు సూర్యచంద్రులున్నంత వరకు నరకములో నుందురు. కావున నేను దేహమును వీడెదను. అగ్నిని ప్రవేశించెదను. తండ్రీ !నా ప్రభువును గూర్చి అనాదరముతో నీవు పలికిన పలుకులను విన్న నాకు జీవతముతో పనియేమి ?. శక్తిగలవాడు శంభుని నిందించువాని నాలుకను బలాత్కారముగా కోసివేయవలెను. అపుడా నిందావచనములను విన్న అశుద్ధి నిస్సందేహముగా తొలగిపోవును. అట్లు చేయ శక్తిలేని బుద్ధిమంతుడగు మానవుడు చెవులను గట్టిగా మూసుకొని అచటి నుండి తొలగిపోయినచో, ఆతడు శుధ్ధుడగునని గొప్ప పండితులు చెప్పుచున్నారు.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ఆమె ఈ తీరున ధర్మమును నీతిని చెప్పి, పశ్చాత్తాపమును పొందెను. ఆమె కలుషితమైన మనస్సుతో శంకరుని మాటలను స్మరించుకొనెను. అపుడా సతి మిక్కిలి కోపించి దక్షునితో , విష్ణువు మొదలగు దేవతలతో, మరియు మునులతో అందరితో నిశ్శంకముగా నిశ్చయముగా నిట్లు పలికెను.

తండ్రీ! నీవు శంభుని నిందించితివి. తరువాత దుఃఖించెదవు. ఇహ లోకములో మహాదుఃఖముననుభవించి, మరణించిన తరవాత నరకయాతనలను పొందెదవు. ఏ పరమాత్మకు ద్వేష్యుడగు ప్రాణిగాని, ప్రియుడగు ప్రాణిగాని లేడో, అట్టి అజాత శత్రువగు శంకరునిపై నీవు తక్క మరెవ్వరు కక్ష గట్టెదరు?  దుర్మార్గులు ఈర్ష్యతో సర్వదా మహాత్ములను నిందించుట ఆశ్చర్యకరము కాదు. కాని మహాత్ముల పాదధూళిచే నశింపజేయబడిన తమోగుణము గలవారికి మహాత్ములను నిందించుట శోభావహము కాదు. ఏ మానవులు ఒక్కసారి 'శివ' అను రెండక్షరములను ఉచ్చరించెదరో వారి పాపములన్నియూ వెనువెంటనే నశించును. అమంగళుడవు, దుష్టుడవు అగు నీవు పవిత్రమగు కీర్తి గలవాడు, ఉల్లంఘింప శక్యము కాని శాసనము గలవాడు, సర్వేశ్వరుడునగు శంభుని ద్వేషించుట ఆశ్చర్యము.

మహాత్ములు తమ మనస్సు అనే తుమ్మెదలతో ఆయన పాదములనే పద్మములను బాగుగా సేవించెదరు. ఆయన పాదములు భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. బ్రహ్మానందమును గోరు ముముక్షువులు ఆయన పాదములను ఆదరముతో గొల్చెదరు. శివుడు భక్త జనులకు వరములను ప్రేమతో వర్షించును. సర్వప్రాణులకు హితుడగు ఆయనపై మూర్ఖత వలన నీవు ద్వేషమును చూపుచున్నావు. శివుడు (మంగళ స్వరూపుడు) అమంగళవేషధారియా? బ్రహ్మాది దేవతలు, మునులు, సనకాది సిద్ధులు, ఇతరులు, విద్వాంసులు అట్లు తలచుట లేదు. నీవు మాత్రమే అట్లు తలంచుచున్నావు. విశాల హృదయుడగు ఆయన, జటలను విరబోసుకొని, భూతములతో గూడి, శ్మశానమునందు కపాలధారియై, కపాలమాలను, భస్మను ధరించి ప్రీతితో నివసించుచున్నాడు. ఈ సత్యము నెరింగిన మునులు, దేవతలు ఆయన పాదధూళిని నిర్మాల్యముగా స్వీకరించి, ఆదరముతో శిరస్సుపై ధరించుచున్నారు. ఆ శివుడు పరమేశ్వరుడు.

వేదములో ప్రవృత్తి, నివృత్తి అను రెండు విధముల కర్మ విధింపబడినది. విద్వాంసులు వాటి మధ్య గల భేదమును విచారించి నిరూపించినారు. ఈ రెండు పరస్పర విరుద్ధములు గనుక, ఒకే వ్యక్తి ఒకే కాలములో రెండింటినీ అనుష్ఠింపజాలడు. పరబ్రహమ్మయగు శంభునియందు ఈ ద్వివిధ కర్మల సంబంధము లేదు. ఓ తండ్రీ !ఆయనను మీరు పొందలేరు. మీరు యజ్ఞశాలలో కామ్య కర్మలననుష్ఠించి ధూమ్రమార్గమును పొందెదరు. మావంటి ఆత్మ జ్ఞానపరులు మాత్రమే కర్మ ఫలములను త్యజించి పరమాత్మను భజించెదరు. ఆయన లక్షణము ఇంద్రియ గోచరము కాదు. ఆయనను అవధూతలు చక్కగా సేవించెదరు. కావున, ఓ తండ్రీ! నీవు దుర్బుద్ధితో చూచి, అహంకారమును పొందకుము.

ఇన్ని మాటలేల ? నీవి దుష్టుడవు. నీ బుద్ధి అన్ని విధములుగా భ్రష్టమైనది. నీ నుండి జన్మించిన ఈ దేహముతో నాకు ప్రయోజనమేమియూ లేదు. మహాత్ములను పరిపరివిధముల నిందించు దుష్టుని జన్మ నిందార్హము. విద్వాంసుడు అట్టి వానితో సంబంధమును ప్రయత్నపూర్వకముగా వీడవలెను. భగవాన్‌ వృషభధ్వజుడు నన్ను నీ కుమార్తెను గనుక దాక్షాయణి అని పిలుచును. అట్టి సందర్భములలో నా మనస్సు వెనువెంటనే మిక్కిలి క్లేశమును పొందును. కావున, నీ శరీరమునుండి ఉద్భవించిన ఈ దేహము శవమువలె మిక్కిలి అశుచియైనది, నిందితమైనది, కావున నేను ఇప్పుడు ఈ దేహమును నిశ్చయముగా వీడి సుఖమును పొందగలను.

ఓ దేవతలారా! మునులారా! మీరందరు నా మాటను వినుడు. దుష్ట బుద్ధిగల మీరందరు సర్వధా అనుచితమగు పనిని చేయుచున్నారు. శివుని నిందించి, కలిని ప్రేమించు మీరందరు మిక్కిలి మూఢులు. మీకు సంపూర్ణమగు దండన హరుని నుండి నిశ్చితముగా కర్మ ఫల రూపముగా లభించగలదు. దీనిలో సందేహము లేదు.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

అపుడా సతి యజ్ఞశాలయందు దక్షుని, ఇతరులను ఉద్ధేశించి ఇట్లు పలికి విరమించెను. ఆమె ప్రాణప్రియుడగు శంభుని మనస్సులో స్మరించెను.


*శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు సతీ ఖండలో సతీ వాక్య వర్ణనమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.*

 Prathyusha: ఓం నమో భగవతే శ్రీ రమణాయ

“నీ సహజ స్థితిలో ఉండు”

భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు-6

🌹ప్రశ్న: మనస్సుకి ఆత్మకి భేదమేమిటి?

మహర్షి:  ఏమీలేదు. అంతర్ముఖ మైన మనస్సు ఆత్మ.  బహిర్ముఖమైతే అదే అహమవుతుంది. ప్రపంచమవుతుంది. ప్రత్తి రకరకాల బట్టగా తయారైనప్పుడు వేర్వేరు పేర్లు పెడతాము. కానీ బట్టలన్నీ ప్రత్తే, నగలన్నీ బంగారమే. సత్యం ఏకం. నామాలు, రూపాలు అనేకం. అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు. అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. ఆత్మ, మనస్సు లేకుండా ఉంటుంది. కానీ ఆత్మ లేకుండా మనసెప్పుడూ ఉండలేదు.

🌹ప్రశ్న: బ్రహ్మానందాన్ని సచ్చిదానందం అంటారు కదా, అంటే ఏమిటి?

మహర్షి: సంస్థితమైనది – సత్. దానినే బ్రహ్మమంటారు. సత్ యొక్క కంటి చిత్. దాని స్వరూపం ఆనందం. ఇవి సత్ కి భిన్నం కావు. మూడింటిని కలిపి సచ్చిదానందమంటారు.

🌹ప్రశ్న: మన సహజ స్థితి ఆనందం అంటారు ఏ విధంగా ?

మహర్షి: పరిపూర్ణ ఆనందం – బ్రహ్మం. పరిపూర్ణ శాంతి, ఆత్మ. సంస్థితమైనదంతా అదే. ఆ చైతన్యమే. ఆనందం ఆ ఆత్మ యొక్క స్వరూపం. పరిపూర్ణమైన ఆనందమే కాని ఆత్మ మరేమీ కాదు. ఉండేదల్లా ఆ ఆనందమనబడేదే. ఆ సత్యాన్ని తెలుసుకుని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యమూ ఆస్వాదించు. ఎవరైనా బయటి కారణాల వల్ల గానీ సంపద వల్ల గానీ కలుగుతోందనుకుంటే అతని సంతోషం సంపద ఎక్కువైనా కొద్దీ ఎక్కువవుతూ సంపద తగ్గినకొద్దీ తగ్గుతూ ఉండాలి కదా. కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషం శూన్యమైపోతుంది. కానీ మనిషి అనుభవమేమిటి? ఇలాగే ఉంటుందా?

గాఢనిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు. అతని దేహమే ఉండదు. అయినా అసంతుష్టిగా ఉండడు. పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు. మంచి నిద్ర కావాలని అందరికి ఉంటుంది కదా.  అంటే సంతోషమనేది మనిషి లోపల సహజంగా ఉంది.  అది బయటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు. అకళంకమైన ఆనందకోశం తెరుచుకోవాలంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి.

*******

 Prathyusha: ప్రతి మనిషికి తన వద్ద మిగిలిపోయే అతి గొప్పదైన చివరి సంపద తన శరీరమే. మనిషి తన తోటి మనిషికి పంచివ్వాలన్నా, సహాయం చేయాలన్నా తన వద్ద ఉండవలసినది ధనం, సంపద, ఆస్తి పాస్తులు ఉండాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అవి లేకపోతే మరేముండాలి!? కేవలం నీ శరీరం ఉంటే చాలు, అదే ఒకపెద్ద నిధి. అందులోనే అనేక సంపదలు ఉన్నాయి. ఆ సంపదలతో ఎదుటి వారికి అనేక రకాలుగా సహాయం చేయవచ్చు.

ఒక ఊరి చివరిగా ఓ గురువుగారు ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. ఒకసారి చాలా పేదవాడు ఆ ఆశ్రమానికి వచ్చి గురువుగారితో ఇలా అడిగాడు, స్వామి 'నేను ఎందుకు పేదవాడిగా పుట్టాను, ఆ భగవంతుడు ఎందుకు మనుషులను కొందరిని ధనవంతులుగా, మరికొందరిని పేదవారిగా పుట్టిస్తున్నాడు. ఈ బేధభావం ఎందుకు అని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా సమాధానం చెప్పారు.

మీరు ఎందుకు పేదవారుగా పుట్టారు, అంటే అది మీరు గతజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి మీకీ జన్మ లభిస్తుంది. అంటే మీరు ఇతరులపైన ఎటువంటి జాలి, దయ వంటి ఔదార్యము కలిగి ఉండరు. అలాగే ఇతరులకు ఉపయోగపడేలాగ దాన-ధర్మాలు చేసివుండరు.

 అందుకా పేదవాడు మరి నేను ఇతరులకు దానధర్మాలు చేయడానికి నావద్ద ఏమున్నది అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు గురువు గారు ఈ విధంగా చెప్పాడు.

నీ దగ్గర ఇతరులకు పంచడానికి నాదగ్గర ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రతి మనిషికి తన దగ్గర ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను కలిగివున్నారు. అందులో

 🌹మొదటిది మీ ముఖం. అది మీకు ఉందికదా. ఆ ముఖకవళికలతో మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. దీనికి నీ దగ్గర ధనరాసులే ఉండక్కర్లేదు. ఇది ఉచితం. ఈ నీ నవ్వులే ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిద్వారా నీవే కాదు నీతో ఉన్న ప్రతి ఒక్కరినీ సంతోషంగా జీవింప చేయవచ్చు. నీలో ఎన్నెన్నో బాధలు ఉండి ఉండవచ్చు. కానీ వాటిని బయటకు వ్యక్తపరచకుండా నీవు ఎప్పుడూ నవ్వుతూ, ఆ నవ్వులను అందరికీ పంచడమే నీవు ఇతరులకు చేసే గొప్ప సాయం. అదే నీకు పెన్నిధి.

🌹ఇక రెండవ నిధి మీ కళ్ళు. అవి మీకు ఉన్నాయి. వాటితో మీరు ప్రేమ, కరుణ,దయా, జాలి, ఆప్యాయతా, అనురాగం వంటి అనేక రకాల రసాలను ఇతరులకు పంచవచ్చు‌. ఇది నిజం మీరు లక్షలాది మందిని కేవలం మీ ప్రేమానురాగాలు నిండిన కంటిచూపుతోనే గొప్పగా ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతిగా మార్చవచ్చు. కాబట్టి ఇకనుండైనా మీ కళ్ళతో కరుణరసాలనే నిధులను పంచే ప్రయత్నాలు చేయండి.

🌹ఇక మూడవది మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి సుభాషితాలు, మంచి మంచి విషయాలు చెప్పవచ్చు. మంచిని మంచిగా చర్చించండి. ఆ చర్చలే మనిషి జీవితానికి అతి విలువైనదిగా భావించండి. ఇలా చర్చించకనే అనేక ఉమ్మడి కుటుంబాలు చెల్లాచెదురుగా చెదిరి పోతున్నాయి. మంచి స్నేహితుల మధ్య పెద్ద పెద్ద అగాధాలని సృష్టిస్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య ఆనందం మరియు సంతోషాలు కరువౌతున్నాయి. కాబట్టి సమస్యలు ఏవైనా మంచిగా చర్చించుకొని అపోహలు తొలగిపోతే ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు వ్యాప్తి చెందుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

🌹ఇక నాలుగవది మీకు గుండె ఉంది కదా. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకోవచ్చు. మీరు కూడా ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. ఆ అనుభూతులను ఇంకెందరితోనో పంచుకోవచ్చు. మీరు అందించే ఆ మమతాను రాగాలు వారి జీవితాలను తాకవచ్చు. వారిలో అనూహ్య స్పందనలను కలిగించవచ్చు. ఆ విధంగా బండరాతి గుండెలను కూడా సుతి మెత్తని పూబంతులవలే మలచవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆ అనుభూతి మీకు కూడా అవగతమౌతుంది.

🌹ఇక మీరు కలిగి ఉన్న అతి పెద్దదైన చివరిసంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక రకాలుగా మంచి పనులు చేయగలరు. అవసరమైనవారికి అనేక రకాలుగా సహాయం అందించగలరు. సహాయం చెయ్యడానికి మనిషికి డబ్బే అవసరం లేదు. శారీరకంగా ఏంతో శ్రమను ఇతరులకు సహాయంగా అందించవచ్చు. నువ్వు చేసే ఆ శారీరక సహాయం వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. వారు ఇది నాకు అసాధ్యం అనుకొనే ఏ పనినైనా, సుసాధ్యం చేసి వారికెంతో ఊరట కలిగిస్తుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

[ Prathyusha: హరిఓం  , 

అలమటిస్తోన్న వృద్ధులకు అమ్మలా అన్నం పెడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని విద్యార్థులకు ఓ అక్కలా చేయూతనిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతోన్న వారికి ఓ కూతురిలా ఆపన్న హస్తం అందిస్తోంది. అలాగని ఆమె శ్రీమంతురాలు కాదు, ఓ సామాన్యురాలు. తెలుగు రాష్ట్రాల్లోని దీనులకు చేయూతనందిస్తోంది #విశాఖపట్నానికి చెందిన #మజ్జి_శ్రీదేవి.….

చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీదేవిని తల్లే పెంచింది. ఇంటర్‌ వరకూ చదువుకున్న ఆమె... మొదట్లో చిన్నచిన్న పనులు చేసి కొంతకాలం టీవీ యాంకర్‌గానూ పనిచేసింది. ఆ అనుభవంతో సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను ప్రారంభించింది. చిన్నప్పుడే నాన్న ప్రేమకు దూరం కావడంతో.. తండ్రి వయసున్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేక తోచిన #సాయం చేసేది.

 అలాగే ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడంతోపాటు కొత్త దుస్తులు ఇవ్వడం, ఆర్థిక సాయం చేయడం మొదలుపెట్టింది. కొన్నాళ్ల కిందట ఓ కుటుంబానికి శ్రీదేవి సాయం చేసినప్పుడు ఆ చుట్టుపక్కలవారూ తమ వంతుగా సహకారం అందించారు. దాంతో చేసే మంచి పని నలుగురికీ తెలిస్తే ఎక్కువమందికి సాయపడొచ్చనే ఆలోచన వచ్చింది శ్రీదేవికి. అప్పట్నుంచీ కష్టంలో ఉన్నవారికెవరికైనా సాయం చేసినప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతోంది. వాటిని చూసిన చాలామంది సాయం చేయడానికి ముందుకు రావడంతో అవసరమైన వారికి పెద్ద మొత్తంలో సాయం అందుతోంది.....

గుంటూరుకు చెందిన వృద్ధ దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. వీళ్లిద్దరూ ప్రైవేటు స్కూల్లో టీచర్లుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. దానివల్ల పెన్షనూ రాదు. వయోభారంతో వారి ఆరోగ్యమూ క్షీణించింది. వారికి పిల్లలూ లేరు. తినడానికి తిండి లేక గుడి నుంచి #అక్షింతలు తెచ్చుకుని శుభ్రంచేసి వాటితోనే అన్నం వండుకుంటున్నారని తెలుసుకుని చలించిపోయింది శ్రీదేవి. వెంటనే వారికి నిత్యావసర సరకులతోపాటు, ఆర్థిక సాయం అందించి ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘#మిస్‌_శ్రీదేవి’లో అప్‌లోడ్‌ చేసింది. దీన్ని ఆ ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్న విద్యార్థుల్లో చాలామంది సామాజిక మాధ్యమాల్లో చూసి స్పందించడంతో వారికి సాయం సమకూరింది. ఇప్పుడా దంపతులు శేష జీవితాన్ని నిశ్చింతగా గడుపుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిత్యం పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో ఆర్థిక సాయం అవసరమైన వారి వివరాలు తెలుసుకుంటుంది శ్రీదేవి. ఆ వెంటనే ఆ ప్రాంతానికి తన కారులో వెళ్తుంది. ఎత్తం అనే గ్రామంలోని ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో రెండేళ్లుగా ఇంటికే పరిమితమైతే భార్య అతడిని వదిలేసి చిన్నారితో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కథ తెలుసుకున్న శ్రీదేవి వెంటనే రూ.10వేలు అందించింది. ఆ తర్వాత భార్యతో మాట్లాడి, భర్త వద్దకు వచ్చేలా చేసింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైంది. మరోసారి వాళ్లను కలసి రూ.పదివేలు, మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలూ అందించింది.  అలాగే పెబ్బేరుకు చెందిన లలితా అనే ఎనిమిదేళ్ల అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెతోపాటు తన ఇద్దరి తమ్ముళ్లనూ ఆశ్రమంలో చేర్చించింది. వాళ్లకు తానున్నాననే భరోసాను కల్పిస్తూ తరచూ వెళ్లి వాళ్లను చూసి వస్తుంది శ్రీదేవి. ఇలా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందలకు పైగా కుటుంబాలకు ఈమె ద్వారా సాయం అందింది...........                   -                                                     -   🙏... వి. లక్ష్మి శేఖర్ ...  29.01.2021.

_*శ్రీ శివ మహాపురాణం - 72 వ అధ్యాయం*_


*దక్షయజ్ఞ ప్రారంభము*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*బ్రహ్మ ఇట్లు పలికెను -*

ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను. మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు , పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి.

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి. మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి. జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని. మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను.

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను. విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను. ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి. అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను. విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని.

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను. సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి. అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను. పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి.

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి. ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను. ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను.

దీక్షితుడై, రక్షాబంధనోత్సవమును నిర్వర్తించి, స్వస్తి పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో మిక్కిలి ప్రకాశించెను. శంభుడు కపాలధారి గనుక, ఆయనకు యజ్ఞార్హత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు. దోషదర్శియగు దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు. ఈ విధముగా దక్షయజ్ఞమహోత్సవము కొనసాగుచుండెను. యజ్ఞనియుక్తులైన వారందరు తమ తమ కార్యములయందు నిమగ్నులైరి. ఇంతలో శివభక్తుడగుదధీచుడు అచట శంకర ప్రభువు కానారాక పోవుటచే ఉద్వేగముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను.

*దధీచుడు ఇట్లు పలికెను -*

దేవ ప్రముఖులారా! ఋషి ప్రముఖులారా! మీరందరు నా మాటను ఆనందముతో వినుడు. ఈ యజ్ఞముహోత్సవమునందు శంభుడు ఏల రాలేదు? ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు కూడ వచ్చినారు గదా! కాని మహాత్ముడగు ఆ పినాకి లేనిదే ఈ యజ్ఞము అధికముగా శోభించుటలేదు. మంగళములన్నియు ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చెప్పెదరో, అట్టి ఆ పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంఠుడు అగు పరమేశ్వరుడు ఇచట కానరాలేదు.

ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేత్రములతో చూడగా మహానగరములైననూ వెంటనే మంగళమయములగును. కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలెను. లేదా, బ్రహ్మచే గాని, సర్వ సమర్థుడగు విష్ణువుచే గాని వెంటనే ఆహ్వానింపజేయుము. యజ్ఞసిద్ధికొరకై ఇప్పుడు ఇంద్రుడుగాని, లోకపాలురు గాని, విప్రులుగాని, సిద్ధులుగాని ఆ శంకరుని తప్పని సరిగా తోడ్కోని రావలెను. మహేశ్వర దేవుడు ఉన్న చోటికి మీరందరు వెళ్లుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని రండు.

దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు వచ్చినచో సర్వము పవిత్రమగును. శివుని స్మరించుటచే, నామమును ఉచ్చరించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము అగును. కాన సర్వ ప్రయత్నములను చేసి శివుని ఇచటకు తీసుకుని రండు. శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను సత్యమును పలుకుచున్నాను.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

మూఢబుధ్ది, క్రోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను. విష్ణువు దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు ప్రతిష్ఠితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?. ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము ప్రతిష్ఠితమైయున్నవో, అట్టి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు. లోకములకు పితామహుడగు బ్రహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, వివిధ శాస్త్రములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు.

మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు. యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు. మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని. హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము.

ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు. కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు.

*బ్రహ్మఇట్లు పలికెను -*

వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను.

*దధీచుడు ఇట్లు పలికెను -*

శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు. దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను. తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి. దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను.

*దక్షుడిట్లు పలికెను -*

శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి. ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను. వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు. మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు.

*బ్రహ్మ ఇట్లు పలికెను -*

వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి. ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము.

*శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది.*

--(())--

 Prathyusha: తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?


తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం..!!

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి...

మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.

ఇక మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.

మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే..

 భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు...

*అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం పాదోదకం పావనం శుభం!!*

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి...

తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. కాని అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

ముఖ్యంగా మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కలిపించండి..!

♥️♥️🌹

31-02-2021


 

UI UIIU UI UIUUii IU 


మట్టి ఆటలతో మోట్టికాయలొస్తాయని  భయం
కుమ్మె ఆటలతో కూల్చి బందిచేస్తారని భయం
రెప్ప మాటలతో పిల్చి కౌగిలిస్తారని భయం
వెల్గు ఆటలతో నీడలల్లుకొస్తాయని భయం

వట్టి మాటల తో గట్టి పోరు చేస్తారని భయం
గట్టి చేష్టల తో చెడ్డ మంచి చేస్తారని భయం
వెర్రి వేషము తో తప్పు ఒప్పు చేస్తారని భయం
తిక్క పల్కులతో మార్చ లేక చస్తారని భయం

నమ్మి ఆకలితో ఉండ లేక చూస్తారని భయం
చెప్పు చేతలతో ఉండ లేక మార్తారని భయం
తప్పు లెక్కలతో చూప లేక చస్తారని భయం
ఒప్పు మాటలతో చెప్ప లేక చూస్తారని భయం

తల్లి కోరికనే  తీర్చ గల్గలేమోనని  భయం  
తండ్రి గౌరవమే కాలమంత చూడాలని భయం  
దైవ సంపదయే రక్ష చేయ లేమొనని భయం  
నిత్య సేవికగా జీవితమ్ము మారేనని భయం   
 

 [30/01, 7:20 am] +91 94414 08564: 🌻  *మహా భారతం* 🌻


🩸 *భాగము 30* 🩸


💧 *వీడుకోలు* 💧


🍃🌺‘‘బలరామా’’ అన్న సంబోధనలోనే సాత్యకి అధిక్షేప ధోరణి తేటతెల్లమైంది. సాత్యకి కృష్ణుని వైపు చూశాడు. కృష్ణుడు చూపు తప్పించి, ధర్మజుని వంక చూశాడు. ధర్మజుడు తొట్రుపడి సాత్యకి వైపు దృష్టి సారించాడు. సాత్యకి బలరాముని సూటిగా నిగ్గదీస్తున్నాడు. ‘‘...యీ విధంగా నువ్వు మాట్లాడడం భావ్యమేనా? హద్దులతిక్రమించి నీవొక్కడివే యిట్లా మాట్లాడ గలవు. నిన్ను కాదు, నీ ప్రసంగాన్ని ఆలకించి తలలూపిన యీ సభాసదులందరినీ అనాలి. 


🍃🌺మిత్రద్యూతానికి పిలిచినపుడు ధర్మజుడు అంగీకరించాడు. అందులో త ప్పేమున్నది. దుష్టచతుష్టయం, ఆ మాయావుల కుయుక్తులు ధర్మమూర్తి రాజ్యాన్ని కబళించాయి... సరే, అయినదేమో అయినది. నియయం ప్రకారం అరణ్య అజ్ఞాతవాసములు పూర్తయినవి. ఇటువంటి సమయంలో వీరు దుర్యోధనుని వద్ద ప్రాధేయపడాల్సిన అగత్యమేమున్నది. 


🍃🌺తమ పాలు తాము తీసుకొనుటకు యాచించవలెనా? ఇది ఏ ధర్మశాస్త్రంలో వుంది. చేచాచి అర్థించుట క్షాత్రధర్మమా? సుక్షత్రియుడు రాజ్యలక్ష్మి కోసం యుద్ధరంగంలో నిలబడి తేల్చుకుంటాడు.


🍃🌺ఈ భూమండలంలో భీమార్జునులనెదుర్కొని నిలబడగ వారెవ్వరున్నారు? ఎందరు రాజులు పాండవపక్షము వహించి రణరంగమున కౌరవులనెదిరించి పోరాడుటకు సిద్ధంగా వున్నారో నాకు తెలుసు. పాంచాలాధీశ్వరులు, యుదుసింహులు, మత్స్యభూపతి వీరంతా ధర్మపక్షం వహించరా? ఇరుగో యీ ద్రుపద మహారాజు తోడు నిలిచిన సాధించలేనిది ఏమున్నది?- సాత్యకి మాటలకు అందరి మనసులు వేడెక్కినవి. 


🍃🌺తిరిగి అతడందుకుని, రాయబారిగా హస్తినాపురికి తగువారిని పంపడంలో తపలేదు. కాని దైన్యముగా అర్థించవలసిన అగత్యం లేదు. తమ రాజ్యభాగము తమకు యిమ్మన్నారని ధర్మజుని మాటగా చెబితే చాలు. దుర్యోధనుడు మన్నిస్తే సరే. అహంకరిస్తే దానికి తగిన ఫలితం అనుభవిస్తాడు’’ అని ముగించాడు. కాసేపు సభ నిశ్శబ్దంగా వుంది. ద్రుపదుడు సాత్యకి అభిప్రాయాలను మెచ్చుకున్నాడు. ‘‘బలదేవుడు సూచించిన సవినయ ప్రార్థన కంటే సాత్యకి చెప్పిన ధోరణే సముచితంగా ఉంది. 


🍃🌺దురహంకారి దుర్యోధనుడు అంత తేలికగా దారికి వస్తాడని అనుకోను. శక్తిహీనులై యాచనకు దిగివచ్చారని భావిస్తారే గాని, మన సౌమత్యను వారు గుర్తించరు. దుర్యోధనుడు కుటిల స్వభావియని తెలిసినా, భీష్మద్రోణాదులు వారి వారి కారణాల వల్ల అక్కడే అణగిమణిగి వుంటున్నారు. ఇక అంధభూపతి ధృతరాష్ట్రునికి కన్న కొడు కుపై మనసుకు మించిన ప్రేమ. కర్ణుని సంగతి సరేసరి. కన్నుమిన్ను కానక, వీరందరినీ చూసుకుని విర్రవీగే దుర్యోధనుడు దీనికి అంగీకరిస్తాడని అనుకోవద్దు.


🍃🌺పాండవులకు, ధార్తరాష్ట్రులకు సంధి పొసగడం కల్ల! విస్పష్టంగా ప్రకటించాడు ద్రుపదుడు. మరల ప్రారంభించి, ‘‘ఇది ఘోర సంగ్రా మానికి నాంది కాబోతున్నది. మనం అప్రమత్తమై అందుకు సిద్ధం కావాలి. చతురంగ బలాలను అపారంగా పెంపుచేసుకోవాలి. మనకు ఆప్తులు, మన హితాభిలాషులైన రాజన్యులను ఆహ్వానించి, సందర్భాన్ని వివరించాలి. రాజలోకంలో కొందరు తటస్థులుంటారు. 


🍃🌺మొట్టమొదట కోరిన వారి పక్షాన వారు నిలుస్తారు. శల్యుడు, కేకయాధీశుడు, దృష్టకేతువు, జరాసంధుని కుమారుడు మొదలైన వారి వద్దకు వార్తాహరులను పంపాలి. ఇపడు జరగవలసిన కార్యక్రమం గురించి పెద్దలు వివరించండి’’ అన్నాడు ద్రుపదుడు. ‘‘సంధి ప్రయత్నాలు చేయడమే...అంతేకదా’’ అన్నాడు కృష్ణుడు తొణకని చిరునవ్వుతో అన్న బలరాముణ్ణి, ధర్మరాజుని చూస్తూ. ధర్మజుడు ‘‘ఔను అదే’’ అన్నట్టు తలవూపాడు.


🍃🌺ద్రుపదుడు రెండవ వరుసలో కూర్చుని వున్న బ్రాహ్మణుని చూపించి, ‘‘ఆయన నా పురోహిత బృందానికి పెద్ద. మృదు మధుర సంభాషణా చతురుడు. పరేంగితం గ్రహించగల మేధావి. అన్నివిధాలా దక్షత గల విజ్ఞానగని. ఆ ధృతరాష్ట్ర మహీపతి వద్దకు పాండవదూతగా వెళ్లడానికి యోగ్యుడు. దుర్యోధనునితో, భీష్మద్రోణులతో ఎట్లా మాట్లాడాలో తెలిసిన కార్యసాధకుడు. పైగా, యీ సమస్యకు సంబంధించిన పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇక్కడి పెద్దలు ఆమోదిస్తే వారిని పంపుదాము’’ అన్నాడు.


🍃🌺సభలో కొద్దిసేపు గుసగుసలు వినిపించినవి. కృష్ణుడు చొరవ తీసుకుని, పాంచాలేశ్వరుని సూచన అందరికీ ఆమోదయోగ్యమేనని ప్రకటించాడు. సర్వజ్ఞులైన ద్రుపదుని పురోహితులు యీ పనిని చక్కదిద్దగలరనే ఆశిస్తున్నాను. చివరిగా ఒక్కమాట. నాకుగాని, నా సోదరులు బలరామదేవునికి గాని ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన అభిమానం లేదు. అందరూ శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలనేదే మా అభిమతం. ఉత్తరాభిమన్యుల వివాహానికి ధర్మనందనుడు ఆహ్వానిస్తే వచ్చాం. 


🍃🌺శుభకార్యం శోభస్కరంగా ముగిసింది. మమ్మల్ని సాదరంగా అతిథి మర్యాదలతో ముంచెత్తారు. సర్వదా కృతజ్ఞులం. ఇక మేము మా రాజధానికి బయలుదే రుతాం. అందుకు అనుమతించాలని మత్స్యాధీశుని, ధర్మనందనుని అర్థిస్తున్నాను’’ అన్నాడు కృష్ణుడు.

🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀



UU IU UU UI UU. ...13

ఆద్యం విశ్వ తేజం ధర్మ మార్గం
మార్గం జ్ణాన గమ్యం ధర్మ సాధ్యం
సాధ్యం సృష్టి కృత్యం నిత్య సత్యం
సత్యం విశ్వ వ్యాప్తం సర్వ కృత్యం

కృత్యం జాడ్య భావం విశ్వ జాప్యం
జాప్యం వెత్కు లాటే సర్వ గోప్యం
గోప్యం బత్కు లాటే జన్యు లౌక్యం
లౌక్యం జీవు లాటే కర్మ సౌఖ్యం

సౌఖ్యం కాలకృత్యం నిత్య కృత్యం
కృత్యం జీవ లోకం తత్వ నృత్యం
నృత్యం మన్షి మాయే లౌక్య జీవం
జీవం హాయి నిత్యం మాతృమర్మం

మర్మం చెప్ప లేకే చేయు కార్యం
కార్యం దేహ ధర్మం చేయు చోడ్యం
చోడ్యం చూసి తెల్పే మాయ మోడ్యం
మోడ్యం వల్ల వేసే వేష ధైర్యం
--(())--
 

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 78* 🕉


*మును నేఁ బుట్టిన పుట్టు లెన్ని గలవో మోహంబుచే నందుఁజే*

*సిన కర్మంబుల ప్రోవు లెన్ని గలవో చింతించినన్ గాన నీ*

*జననంబే యని యున్న వాడ నిదియే చాలింపవే నిన్నుఁ గొ*

*ల్చిన పుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 *_తాత్పర్యం:_* 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! 

నేనింతవరకు ఎంతయో కొంత సేవించియున్నాను కదా. ఆ సేవను తలచియైనా  నాయందు దయ చూపుటకు ఆసక్తుడవు కమ్ము. 


🌹నేను ఏమాత్రము శక్తి లేని దుర్బల మనస్కుడను. నేను ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టితినో తెలియదు. అజ్ఞానముచేత ఆ జన్మములలో చేసిన దుష్కర్మముల రాసులెన్ని కలవో భావన చేయలేను. 


🌹ఇన్ని ఆలోచించని నేను ఈ జన్మము గూర్చి మాత్రమే ఆలోచించుచున్నాను. ఈ జన్మములో కూడ అజ్ఞానముతో ఎన్నియో దుష్కర్మములు చేసియున్నాను. 


🌹జీవితమందు నాకు ఏవగింపు భయము కలుగుతున్నవి. నీవు కరుణతో ఈ జన్మము ఇంతలోనే ముగియునట్లు చేసి నాకు ముక్తి ప్రసాదించుము.

🙏 *ఓం నమః శివాయ* 🙏


+91 99858 31828: *మన కోరికలు ఎలా ఉండాలి*?


హరిద్వార్లో కొండగుహలో ఉండే స్వామీజీ వద్దకు ఇద్దరు స్త్రీలు వచ్చారు

స్వామిజికి నమస్కరించి ఇలా ప్రశ్నించారు

"స్వామిజీ! మామనసులో ఉంది ఎప్పుడూ నెరవేరదు! ఎప్పుడూ అశాంతితోనే ఉంటాము!! మా మనసులోని కోరిక నెరవేరి శాంతి కలిగే ఉపాయం చెప్పండి స్వామీ!!" అంటూ అడిగారు

"ఏమిటమ్మా! మీ మనసులో ఉన్న కోరిక?"ప్రశ్నించాడు స్వామిజీ

"నాకు ఎవరితో మాటపడవద్దని ఉంటుంది స్వామి! నన్నెవరూ తిట్టవద్దు!! అని కోరుకుంటాను. కానీ, ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళలా విమర్శిస్తూ వుంటే నా మనసంతా అశాంతిగా ఉంటుంది." చెప్పింది ఒక స్త్రీ

"నాకు దుఃఖాలు రావద్దని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక దుఖం వస్తూనే ఉంటుంది.. లేదా.. ఎవరో ఒకరు మాటలంటూ ఏడిపిస్తూనే ఉంటారు".. చెప్పింది రెండవ ఆమె కూడా!!

వాళ్ళ సమస్యలు విన్న స్వామీజీ ఒక పదినిమిషాలు ధ్యానముద్రలోకి వెళ్లి తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పసాగాడు.

"చూడండీ! మనం ఏది మననం చేస్తుంటామో అదే మంత్రంగా మారి ఫలితం ఇస్తుంది.. అంటే మన భావాలే మంత్రాలౌతాయి!!"

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే....

"కావాలా? వద్దా??...జరగాలా? వద్దా?? అన్న దానితో సంబంధం లేకుండా ఈ భావంలో ఉన్న విషయమే సంఘటనలుగా ముందరికి వస్తుంది."

"భావాన్ని బట్టే అలవాట్లు కూడా ఏర్పడుతుంటాయి"

"స్వామీజీ! భావాన్ని బట్టి అలవాట్లు అంటే?" ప్రశ్నించారు ఒకరు.

స్వామీజీ సమాధానమిస్తూ..

మనకోరికలు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి! నెగిటివ్ గా ఉండవద్దు!!

"శతమానం భవతి"..అంటూ వంద సంవత్సరాలు జీవించు!!..అంటూ దీవిస్తామే తప్ప.."నువ్వు నూరు సంవత్సరాల వరకు చచ్చిపోకు!!"..అంటూ దీవించము!!..అంటూ చెబుతూ

"అమ్మా! నువ్వు ఇతరుల్లో తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తావా? "ప్రశ్నించాడు స్వామి ఒకరిని

"అవును స్వామీ! నేను తప్పును ఓర్వనూ!! ఏదున్నా ముక్కుసూటిగా చెప్పేస్తాను!" అంది ఆమె

"నీ కష్టాలు దుఃఖం ఇతరులతో పంచుకుంటూ ఉంటావా? నువ్వు!! "అంటూ రెండవ ఆమెను ప్రశ్నించాడు స్వామిజీ

"అవును స్వామీ! కష్టాలు దుఃఖం చెప్పుకుంటేనే కదా మనసంతా తేలికపడుతుంది సమాధానమిచ్చింది!" రెండో ఆమె

"అలవాట్లంటే ఇవేనమ్మా! 

మన భావాలను బట్టే మన అలవాట్లు ఉంటాయి.

ఆ అలవాట్లను బట్టే సమాజానికి మనమిచ్చే దానాలుంటాయి!"

ఆ దానాలే తిరిగి మనకు ఎటువంటి ఫలితాలు రావాలో నిర్ణయిస్తాయి!

"మీరొకరికి జ్ఞానదానం చేశారు! అప్పుడు మీ జ్ఞానం పెరుగుతుందా?తగ్గుతుందా??" అడిగాడు స్వామిజీ

"పెరుగుతుంది స్వామి" చెప్పారిద్దరొకేసారి

"సరే! మరొకరికి ధైర్యం చెప్పారు! అప్పుడు ధైర్యం పెరుగుతుందా?తగ్గుతుందా??"

"పెరుగుతుంది స్వామి" చెప్పారు మళ్ళీ..

మీరు జ్ఞానాన్ని..ధైర్యాన్ని.. సంతోషాన్ని.. ఇలా ఏ భావాన్ని దానం చేస్తున్నారో ఆ భావం మీలో పెరిగినపుడు..

మీరు విమర్శలనూ..దుఃఖాన్ని దానం చేస్తూనే ఉండడం అలవాటుగా చేసుకున్నారు కాబట్టి, అవి కూడా పెరుగుతూ పోతాయి కదా!!

"స్వామిజీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? " అంటూ ప్రశ్నించారు

స్వామిజీ సమాధానమిస్తూ...

"అందుకే మనసులో ఎప్పుడూ నెగిటివ్ భావంతో కూడిన కోరికలు ఉంచుకోవద్దు!"

"నేను మాటలు పడవద్దు!

నన్నెవరూ తిట్టవద్దు!!

నాకు దుఃఖాలు రావద్దు!!!

నేను బిచ్చమెత్తుకోవద్దు!!!!"

......ఇలా!!

వద్దు!..కావాలా?..అనేది ముఖ్యం కాదు ..ఆ కోరికలో భావం ఎలా వ్యక్తమైందో అదే రకరకాల సంఘటనలుగా మారి మీ జీవితంలోకి వస్తుంది.. ఆ భావమే ఒక మంత్రంలా పనిచేస్తుంది!

కాబట్టి వాటినే ఇలా అనుకోవాలి!

నేను పొగడబడాలి!

నేను బాగా కీర్తించబడాలి!!

నేను ఆనందంగా ఉండాలి!!!

నేను ధనవంతురాలను కావాలి!!!!

...ఇలా పాజిటివ్ గా ఉండాలి!అప్పుడు మీ భావమే మంత్రమై వాస్తవంగా మారుతుంది.

మీ కోరికలు తీరాలంటే వాటినే పాజిటివ్ గా అనుకోండీ!

"అమ్మా! నీ అదే కోరికను "నన్ను అందరూ పొగడాలి!" గా మార్చుకుని దాన్నే మననం చెయ్యు!!" అంటూ మొదట ప్రశ్నించిన స్త్రీతో చెప్పి...

రెండవ ఆమె వైపు తిరిగి..

"నువ్వేమో 'నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి' అనుకో! దాన్నే మననం చెయ్యు!" అంటూ చెప్పాడు. "సరే !స్వామి!! ఈ క్షణంనుండే మీరు చెప్పినట్లు ప్రయత్నం చేస్తాము! 

ఇది తొందరగా నెరవేరేలా ఇంకేదైనా రెమిడి చెప్పండీ!" అంటూ అడిగారు.

"సరే అమ్మా ! అలవాట్లను బట్టే ఫలితాలు ఉంటాయన్నాను కదా!! ఇక నుంచి మీ అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి!...ఇంతకు ముందు మాదిరిగా నువ్వు ఇతరులను విమర్శించడం మానేసి రోజుకు కనీసం 5 గురినైనా పొగుడు! తర్వాత క్రమంగా ఆ సంఖ్యను పెంచుతూ వెళ్లు!!"

ఇక నువ్వేమో కష్టాలు,దుఃఖాలు,బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోరుకోవడం మానేసి ఆనందాలను..సంతోషాలను చెబుతూ నీ హ్యాపీ నెస్ ను పంచుతూ వెళ్లు! అలా చెప్పే వ్యక్తుల సంఖ్యను క్రమంగా పెంచుకో!!

అంటూ రెమిడి సూచించాడు స్వామిజీ!

"అద్భుతం స్వామి!! చాలా బాగా చెప్పారు!" అంది మొదటి స్త్రీ.

"కదా!! స్వామిజీ చెబుతుంటే మనసంతా ఎంత సంతోషమనిపించిందో!!!" అంది రెండవ ఆమె.

....ఆ క్షణమే రెమిడి ప్రారంభించిన ఆ ఇద్దరినీ చూసి స్వామిజీ తృప్తిగా నవ్వుతూ దీవించి పంపాడు!

ఎండుగడ్డి వంటి కోరికలను కాల్చేది ఆత్మజ్ఞానం. అది జ్ఞానాగ్ని. కాలిపోగా మిగిలే బూడిదే సమాధి. వాచామౌనం మౌనమూ కాదు, సమాధీ కాదు. దృశ్యమాన ప్రపంచాన్ని చైతన్యమయంగా చూడగలగటమే బ్రహ్మానందస్థితి. అన్నివేళలా ప్రశాంత, ప్రసన్న స్థితిలో నిలకడ చెందినవాడే యోగి. అతడికి కూడటం, వీడటం అంటూ ఉండదు. అతడిది ఏమీ అంటని ఆకాశం వంటి స్థితి!

ఉపనిషత్‌ భావనలో.. అంటే బ్రహ్మ భావనలో నిలకడ చెంది, నిధి ధ్యాసనంలో హృదయాన్ని బ్రహ్మమయం చేసుకున్న జీవన్ముక్తుడికి, సంసార దుఃఖం అంటదు. నిరంతర చింతన అహవినాశానికి దారితీసి శుద్ధాత్మను స్థిరం చేస్తుంది. అది అభినయం నుండి అనుభవం వైపు నడిపిస్తుంది.

వజ్రం లోపలి కాంతి లాగా జ్ఞాని హృదయం కూడా కాంతిమయంగానే ఉంటుంది. అది నిశ్చల దీపకళిక. నిద్రలో అణగిన మనసువలె, జ్ఞాని కార్యకలాపాలు ఆత్మనిష్ఠలోనే కుదురుకొని ఉంటాయి. యోగులు లోకసంబంధ కార్యాలను అద్వయ స్థితిలో ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిర్వర్తిస్తుంటారు.

కోరికలు లేనివాడు మేరు గంభీరుడు, ముల్లోకాలను గడ్డిపోచలో నిలుపుకోగల ధీమంతుడు. ఖాళీకుండ లోపల, వెలుపల ఎట్లా శూన్యమో, నీటమునిగిన కుండ వెలుపలా లోపలా ఎట్లా పూర్ణమో, జీవన్ముక్తుడూ అంతే. ఇష్టాయిష్టాలు ఎరుగని జ్ఞాని, ప్రపంచ వ్యవహారాలను సాక్షిగా నిర్వహిస్తాడు. ప్రపంచంలోనూ, దేహంలోనూ ఉన్నా జ్ఞాని జీవన్ముక్తుడే!

అహం వీడిన ధ్యానాతీతమైన స్థితే జీవన్ముక్తుడిది. ఆప్తమిత్ర బేధం లేక, దృష్టి బేధం లేక అంతటా అన్నిటా సమ్యక్‌ దృష్టితో ఆనందధామంగా ఎవరు జీవిస్తుంటారో వారే జీవన్ముక్తులు. బంధన కానీ ముక్తిగానీ ఎరుగనిది జీవన్ముక్త స్థితి.

ముక్తి లోకాతీతమూ, దేహాతీతమూ కాదు. అది (ముక్తి) ఇక్కడే ఉన్నది అనుకోవటంలోనే అంతా ఇమిడి ఉన్నది. కోరికలే బంధన. వాటిని వదులుకోవటమే ముక్తి. జీవాత్మ పరమాత్మకంటె భిన్నం కాదు. ఆ ఎరుకే జీవన్ముక్త స్థితి. తన కంటే వేరుగా మరొక వస్తువేదీ లేదనే నిశ్చలస్థితే, జీవన్ముక్తుడిది. మనసు తనను తానే బంధించుకుంటుంది. తనను తానే విడిపించుకున్నప్పుడు ముక్తిని అనుభవిస్తున్నది. అదే ఆనందతారక స్థితి.

[28/01, 6:25 am] +91 99858 31828: *చిలుక చెప్పిన రహస్యం*


అనగనగా ఒక చెట్టు మీద రెండు చిలుకలు కాపురం ఉంటున్నాయి. వాటికి ఓ బుజ్జి చిలుక పుట్టింది. నాన్న చిలుక ఆ వనంలోని చిలుకలకు రాజు. అక్కడి చిలుకలు తమ కష్ట సుఖాలను జ్ఞానియైన ఆ చిలుకరాజుతో పంచుకొనేవి. బుజ్జి చిలుక ను ఆ రెండు  చిలుకలు ఎంతో ప్రేమగా పెంచుతూ రోజూ ఆహారం తెచ్చి పెట్టేవి.  మెలమెల్లగా బుజ్జి చిలుకకు రెక్కలు రావడం మొదలయ్యే సరికి, అమ్మ చిలుక, దానికి ఎగరడం నేర్పింది. ఎగరడం నేర్చుకున్న బుజ్జి చిలుక తన ఆహారాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.

వేరే చిలుకతో జతకట్టి గూడు ఏర్పరుచుకుంది. అదే సమయంలో బుజ్జి చిలుక తల్లి కి జబ్బు చేసి చనిపోతుంది. దానికి ఎంతో బాధ కలుగుతుంది. నాన్న చిలుక మౌనంగా ఉండడంతో దగ్గరకు వెళ్లి "నాన్నా, అమ్మ వెళ్లి పోయి ఒంటరై పోయానని బాధపడుతున్నావా. వద్దు నాన్నా. నేనున్నాను మీకు." అంటుంది ఊరడిస్తున్నట్లుగా.

"పిచ్చి వాడా, ఈ ప్రపంచంలో అందరూ ఒంటరి వారే. ఒక్కరే వస్తారు. ఒక్కరే వెళ్తారు. ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత బాల్యం, యవ్వనం, ముసలితనం అనే దశలను అనుభవిస్తుంది. ఈశరీరం ఎప్పుడైతే జర్జరమై పనికిరానిదౌతుందో, అప్పుడు ఈ శరీరాన్ని వదిలి పెడుతుంది. దానినే మరణం అంటారు. ఆ శరీరం నుండి వేరైన ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి మరల జన్మిస్తుంది. అదే జననం అంటే." అని వివరించింది చిలుకరాజు.

"అయితే ఇది ఎవరికైనా తప్పదనమాట. మరైతే అమ్మ మళ్ళీ పుడుతుందా నాన్నా." ఆశగా అడిగింది బుజ్జి చిలుక.

"పుట్టవచ్చు. కోడలు కడుపుతో ఉన్నట్లుంది కదా. మళ్ళీ నీ మీద ప్రేమతో నీ బిడ్డగా పుట్టవచ్చు." అంది చిలుకరాజు నవ్వుతూ.

"నాన్నా, ఈ రోజు నాకెంతో ఉపయోగకరమైన విషయాలు తెలుసుకున్నాను నాన్నా." అంటూ తన గూటివైపు ఎగిరి పోయింది బుజ్జి చిలుక.


దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।


నీతి : దీనిని బట్టి తెలిసేదేమంటే ఏ జీవి అయినా పుట్టి, పెరిగి తన జీవితంలో అన్ని దశలూ అనుభవించి, చివరికి చనిపోక తప్పదు. చనిపోయింది శరీరం మాత్రమేనని, ప్రాణం మరో శరీరంలో ప్రవేశించి తిరిగి పుడుతుందని తెలుసుకున్నవారు, చావు గురించి బాధ పడరు.

✍🏻రామశేషు

May be an image of outdoors

సమ్మోహనాలు ..తాళం ప్రేమ (1161-1170)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఇంటికి తాళ ముండు
ముండును గుర్తు గుండు
గుర్తు దొంగిలించుట వీలుండు ఈశ్వరా

తాళంతో భందన
భందన తో శిక్షణ
శిక్షణ ప్రజా రక్షణలుగా ఈశ్వరా

బానిసకు సంకెళ్లు
సంకెళ్ళు తాలాళ్ళు
తాలాళ్ళు వేసి బంధిస్తారు ఈశ్వరా

తాళ మనేది శిక్ష
శిక్ష వేసిన రక్ష
రక్షతో దొంగల భయము పోవు ఈశ్వరా

విశ్వ సించు తాళము
తాళమే బంధనము
బంధనము ఎప్పటికి మారదును ఈశ్వరా

భావ రాగ తాళము
తాళము కరతాళము
తాళము మెదడులో ఉండు తాళము ఈశ్వరా

భజన కుండు తాళము
తాళము తో స్వరము
స్వరము హృదయములోన తాళము ఈశ్వరా

తాళముతోనూ చెవి
చెవి బిగింపు బావి
బావి ని చెవితో కదిలించుఁనే ఈశ్వరా

నోటి కుండు తాళము
తాళము యే శబ్దము
శబ్దము తగ్గియు పెంచు తాళము ఈశ్వరా

మనిషి మనిషి తాళము
తాళ వేళ కోళము
వేళ కోళముతొ తాళమువేయు ఈశ్వరా
 

[29/01, 7:10 am] +91 99858 31828: *కరవు* 

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

 

​సకాలంలో వర్షం  కురవక, పంటలు పండక, ప్రజలకు ఆహారం, నీటి కొరత ఏర్పడి అలమటించే కరవు కాలం లోకంలో కొన్నిసార్లు సంభవిస్తుంది. అలాంటప్పుడు  జనజీవనం అస్తవ్యస్తమగుతుంది.  ఆహారం, నీటిలభ్యత ఉన్న ప్రాంతాలకు జీవులు వలస వెళతాయి. ఆకలి, దాహం తట్టుకోలేక ప్రాణనష్టం విపరీతంగా జరుగుతుంది.    


కరవు కాటకాల్లాంటి కష్టాలకు మానవుల అధర్మ ప్రవర్తనే కారణమంటాయి ధర్మశాస్త్రాలు.  దుర్భిక్ష కాలంలో ఆకలికి ఓర్చుకోలేని  జనులంతా దోపిడీలు, దొంగతనాలకు ఒడిగడతారు. మానవుల్లో నైతిక ప్రవర్తన నశిస్తుంది. అధర్మాన్ని ఆశ్రయిస్తారు. క్షామకాలం దాటిపోతే  అధర్మాలు తగ్గవచ్చు  కానీ అధర్మం తగ్గందే క్షామమూ తగ్గదని శాస్త్రాలు బోధిస్తున్నాయి. 



దైవాజ్ఞానుసారమే సూర్యచంద్రులు భ్రమిస్తున్నారు. వాయువు వీస్తున్నది.  సకల భారాన్ని  భూమాత మోస్తోంది. గ్రహాలన్నీ  వాటి స్థానాల్లో ఉన్నాయి. సముద్రుడు తన హద్దులోనే ఉన్నాడు.  సమస్త ప్రకృతి సక్రమముగా ఉన్నప్పటికీ మేఘాలు వర్షించక పోవడం వల్లనే కరువు ఏర్పడుతుంది. 


చెరువులు, సరస్సులు, సముద్రాల్లోని  జలాన్ని సూర్యకిరణాలు ఆవిరి రూపములో ఆకర్షించడం వల్లనే  మేఘాలుగా మారి చల్లని వాయువు తాకినంతనే వర్షమై కురుస్తుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. కరువు కాలంలోనూ వాయువు వీస్తుంది. సూర్యుడు వెలుగులు పంచుతాడు. కనుక కరవుకు వాయు, సూర్యులు కారకులనలేం.   


 ‘లోకంలో సత్యం సన్నగిల్లినప్పుడు సూర్యాదుల కార్యాలు తారుమారవుతాయని’ ధర్మశాస్త్రాలు చెప్పినట్టుగా ,  మానవులు సత్యాన్ని ఆచరించనందువల్ల కలిగే ఫలితమే కరువు కాటకాలు.  

 

​“అపూజ్యా యాత్ర పూజ్యంతే /పూజ్యాయత్రావ మానితాః /తత్రత్రయం భవిష్యంతి /వ్యాధి దుర్భిక్ష తస్కరాః !!”  అంటున్నాయి శాస్త్రాలు. ‘అపూజ్యులు పూజింప బడినప్పుడు , పూజ్యులైనవారు అవమానింప బడినప్పుడు, అకాల మృత్యు కారకాలైన వ్యాధులు, జీవన భీతి కారకాలైన  దుర్భిక్షం, మానప్రాణ ధనాలను హరించే  చోర భయం కలుగుతాయని చెప్పినట్టుగానే కరువు, తుపాన్లు మొదలైనవి ఏర్పడి అనేక నష్టాలను కలిగిస్తాయి.  

  

     “దాతా దరిద్ర కృపణోధనాఢ్య / పాపీ చిరాయు సుక్రుతీ గతాయుః/ 

రాజా కులీనో నకులీనసేవ్య/ కలౌ యుగే షడ్గుణ మాశ్రయతి /”  అంటున్నాయి ధర్మ శాస్త్రాలు.  దాత దరిద్రుడై , లోభి ధనికుడై, పాపి చిరాయువై , పుణ్యుడు అల్పాయుష్కుడై , రాజు నీచకులుడై, నీచకులుడు సేవింపదగిన వాడవుతాడన్న ఆరు గుణాలు కలియుగంలో ఆవరించి ఉంటాయన్నది లోకంలో జరగడం జనవిదితమే. 


​‘సత్యం వద, ధర్మం చర’ అన్న ఉపనిషత్తుల బోధనలను ఆచరిస్తూ  ఆరాధ్య దైవాలను ఆర్తితో కొలిచినప్పుడు దైవం కటాక్షిస్తుంది. అననుకూల పరిస్థితులు తొలగిపోయి శుభప్రదం అవుతుంది.

 

మధురిమలు .. లడ్డు   ((293 --304 )

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అలుపెరుగని మానవీయత కలిగిన మహోన్నత వ్యక్తి  భారతదేశం ప్రజలందరినీ ఏకత్రాటిపై నడిపించిన భావోద్వేగం లేని సున్నిత స్వభావం కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు జీవితంలో కుటుంబ సర్వస్వాన్ని విడిచి 6మూరుల గావంచా, పై కండువా వేసుకొని ఒక చేతి కర్రతో దేశమంతా తిరిగిన అసమాన సాహసికుడు ఉప్పు సత్యాగ్రహంలో ప్రారంభమైన సత్యాగ్రహం ఆంగ్లేయులను గడగడలాడించిన బాపు దేశానికి స్వాతంత్రానికి తెచ్చి, విదేశీయులను నుండి  భరతమాత శృంఖలాలు తెంచిన యుగపురుషుడు. జనులు మహాత్మా అని పిలుపిచ్చారు .పూజ్య బాపూజీ వర్ధంతి ఈరోజున ఆయనను స్మరించుకొని హృదయాంజలి ఘటిద్దాము.*

 🌹  జై బాపూజీ జై జై బాపూజీ 🌹


గాంధీగారు సాధించిన రాజ్యం యే స్థితిలో ఉందొ ఒక్కసారి తెలుసుకోండి 


వక్ర తుండిని మహత్యము

వచ్చూ విధ్యాభ్యాసము

కొల్చిన వచ్చును మోక్షము

మనకందరకీ క్షేమము


నవరసాల కధ వలయము

నటరాజు రాజకీయ ము

చూపేటి అహంకారము

ఓట్లకు ఆశా వాదము


మానసికముతో జాడ్యము

మానవాళి లో మోనము

ప్రభోధాల ప్రభావము

మేధస్సుల తో రాజ్యము


కాగితమ్ము గ మారాము

పక్షిగ ఎకరక ఉన్నాము

మేము కాము గాలి పఠము

మాది రాజకీయ మతము


కాలాన్నీ బట్టి పోము

తృణీకరించనూ లేము

ఆడించిన ఆడుతాము

రాజకీయ పార్టీలము


విధ్వంసం చేయలేము

వద్దని వారించలేము

హక్కుని హరించలేము

నాయకత్వమోదలలేము


అల్లర్లను అదుపుంచము

బందు లతో అవకాశము

అదుపులేక అరాచకము

ఇదియేను ప్రజా సామ్యము


రాజకీయ చైతన్యము

జన శ్రేయస్సు లక్ష్యము

నాయకులు చేయు యుద్ధము

జన సేవకు ప్రయత్నము


ఇదేమి ప్రజాస్వామ్య ము

అధికారి ఏకగ్రీవము

రాజకీయుల నాటకము

ఇదీ  అవకాశ వాదము


నిప్పుకు కాంతి జ్వలనము

నిత్యమూ కాంతి కిరణము

జాలము కాంతి మెరుపు గుణము

ఓట్లకు ఆశల కిరణము


నీతిగా కిరణ గమనము

గాలి గా అంతా గమనము

దారిగా ప్రజా గమనము

నాయకులు ఓట్లకు గమనము


కాలము మారినంతటనె కాంచన పుష్పపు శాఖలన్నియున్

రాజము తారుమారగుట రాకసి బుధ్ధుల శాఖలన్నియున్

ఆశల ఆటపాటలతొ అర్ధపు రాజ్యపు శాఖలన్నియున్

మాటలు కోటదాటుటుతొ మాధ్యపు శాఖలన్నియున్


అంటూ ప్రస్తుత రాజకీయ నాయకులు అంటున్నారు గాంధీజీ తో ఈశ్వరా

--(())--


[31/01, 7:17 am] Prathyusha: ఎంత  అద్భుతమైన  పోస్టింగు  ఇది.


🍁MUST READ 

గొప్ప నీతి కథ..


అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒకతను ఉండేవాడు. అతనికొక సంకల్పం. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది. ఎవరిదా ఇల్లు అని అడిగితే, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది. అం దుకే అనుకున్నాడు, ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో తను కూడా చేరాలి అని.


దానికోసం యవ్వనం నుంచి కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్ళూ కష్టపడ్డాడు. సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు. నలభై ఏళ్ళ లోపే కోటీశ్వరుడయ్యాడు. ఒక కోటి తర్వాత మరో కోటి. అలాఅలా యాభై ఏళ్ళ లోపే ఎన్నో కోట్లు కూడ బెట్టాడు. ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాల్లాంటివి రెండుమూడు కట్టించాడు. అయినా తృప్తి కలగలేదు. ఇప్పుడున్న ఇళ్ళు కాకుండా నగరం మధ్యలో తన హోదాను చాటేలా, తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు. దానికోసం మరింత కష్ట పడ్డాడు.


అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి. నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం  కట్టించాడు. గృహ ప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు. ఒక్కో దేశం తాలూకు విశిష్టతలన్నీ ఒక్క చోటే పోగుపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి 'ఔరా' అని ఆశ్చర్యపోయారు అందరూ. శభాష్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు.

🍃🍃🍃

అతిథులంతా వెళ్ళిపోయాక తన పడకగదికి వెళ్ళి పడక మీద నడుము వాల్చాడు లక్ష్మీపతి. భార్యా పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఇంటి విశిష్టతలు, వచ్చిన అతిథుల కామెంట్లు, ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు. లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది.

నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా, *'నేను వెళ్తున్నా'* అంటూ చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు. కళ్ళు తెరచి చూస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉంది.

ఎవరది? అన్నాడు లక్ష్మీపతి. కానీ తన గొంతుకు ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది.

*నేను నీ ఆత్మను, నేను వెళ్తున్నా'* ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం.💓

అదేంటి! నువ్వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా! కంగారుగా అన్నాడు లక్ష్మీపతి.

అవును! ప్రతిధ్వనించింది ఆత్మ. టూ

వద్దు వెళ్ళకు! చూడు ఎంత అందంగా, గొప్పగా కట్టించానో ఈ భవంతిని. ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు. ఇవన్నీ నీ కోసమే కదా. నిన్ను సుఖపెట్టడానికే కదా. నీ తృప్తి కోసమే కదా. ఉండు. నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు' అన్నాడు లక్ష్మీపతి.

అనుభవించాలా? ఎలా? 

నీ శరీరానికి డయాబెటిస్ కాబట్టి  తీపి పదార్థం తినలేను, నీ శరీరానికి బీపీ సమస్య ఉంది కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను. 

ఇష్టమైనది ఏదీ తినలేను, ఎందుకంటే నీ శరీరం అరిగించుకోలేదు కాబట్టి. 

నీ శరీరం మొత్తం కళ్ళ నుండి కాళ్ళ వరకు మొత్తం ఒక రోగాల పుట్ట.

అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాస పడతావో మనిద్దరికీ తెలుసు. 

నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను? 

ఎక్కడికక్కడ శిధిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా? 

నువ్వు కట్టించుకున్న అందమైన ఇంటితో నాకేంటి సంబంధం? 

నేనుండేది నీ శరీరంలో. అదే నా నివాసస్థలం. 

నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకూ సమస్యలే. 

నాకు రక్షణ లేదు. సుఖం లేదు.

అన్నిటికన్నా నీకు ముందుగా వచ్చిన జబ్బు .. డబ్బు జబ్బు. నీకు అది వచ్చిన నాటి నుండి నన్నసలు నిద్ర పోనిచ్చావా? 

నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనిచ్చావా? 

ప్రతి క్షణం ఇంకొకడితో పోటీపడి నాలో అసూయ నింపావు. 

ఇంకొకడిని వెనక్కు తోయడానికి నాతో కుట్రలు చేయించావు. 

ఎన్నిసార్లు నన్ను పగతో రగిలిపోయేలా, ఈర్ష్యతో కుళ్ళిపోయేలా చేసావో గుర్తుకుతెచ్చుకో. 

రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా? 

ఇక నేనుండలేను వెళ్తున్నా!'

👪 ప్రతి మనిషికీ రేపటి గురించిన ఆందోళన ఎక్కువయ్యింది. 

దాంతో ఈ రోజు, ఈ క్షణాన్ని ఆనందించడం మరచిపోతున్నాడు. 

దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మరచి, మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి, అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. మన అవసరాలు తీర్చుకోడానికి కష్టపడాలి. ఆనందించడానికి కష్టపడాలి. మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి. అంతే కాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఉందా?🙇

[31/01, 7:20 am] Prathyusha: 🙏ఒక తాత తన మనవడితో ఇలా అన్నాడు 🙏


ఒరేయ్ మనవడా స్వర్గానికి వెళ్లాలంటే ఉచితం కానీ నరకానికి వెళ్లాలంటే ఖర్చు పెట్టాలి అన్నాడు 


ఈ మాట విన్న మనవడు ఆశ్చర్యంగా అదెలా తాతయ్య అన్నాడు 


మందు తాగాలంటే డబ్బులు పెట్టాలి 

సిగరెట్ తాగాలంటే డబ్బులు పెట్టాలి 

నువ్వు తప్పు చేయాలంటే డబ్బులు కావాలి 


అదే మంచి చేయాలంటే 


నువ్వు సేవ చేయాలి అంటే డబ్బు అవసరం లేదు 

దేవుడిని ధ్యానించ డబ్బు అవసరం లేదు 

నీ ప్రేమ నలుగురికి పంచడానికి డబ్బు అవసరం లేదు 

నువ్వు సాయం చేయడానికి డబ్బు అవసరం లేదు 

నీ సమయాన్ని ఇస్తే చాలు అక్కడ నీ డబ్బు అవసరం లేదు 


డబ్బు పెట్టి మరీ మనం నరకాన్ని కొంటున్నాం 

ఉచితంగా స్వర్గానికి వెళ్లడం లేదు అన్నాడు 


నిజమే అనిపిస్తుంది కదా 

వ్యసనాలని డబ్బు పెట్టి కొనుక్కుని బానిసలై నరకాన్ని చూస్తున్నాం 🙏🙏

[31/01, 7:24 am] Prathyusha: *🌞🌻మానవుని జీవితానికి ఆలంబనగా నిలిచే ముగ్గురు స్నేహితులు...🌻🌞*


 *👉మొదటిది సంపద.  అదృష్టం ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది.👆*

  *👉రెండవది బంధువులు..  స్మశానం వరకు తోడుగా ఉండి అక్కడ వదిలేస్తారు. మళ్లీ ఎప్పటికో కానీ తలవరు..🤘*

  *👉 ఇక మూడవది మనం చేసిన పుణ్యం...  స్మశానం దాటిన తర్వాత కూడా మనల్ని అనుసరిస్తుంది...🤟*

 

     *🌷సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి👍*

     *🌸మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైనప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది👆*

      *🌻సజ్జన సాంగత్యం వల్ల జీవన  ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది🤘*

     *🌷సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల దుకాణం లాంటిది... ఆ దుకాణం వద్దకు వెళితే చాలు మనం కొన్నా కొనకపోయినా సువాసన అంటుకునే తీరుతుంది🤟*

 

     *🌹అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి...👌*


*🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏*

[31/01, 7:29 am] Prathyusha: 🕉️☀️💥🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️💥☀️🕉️


  ☀️ *తులసి దళం-2*☀️

       *(బ్రహ్మర్షి పితామహ పత్రీజీ)


 *"అంతర్ జీవితం"* 


రెండు రకాల జీవితాలు ఉన్నాయి :

ఒకటి బాహ్య జీవితం.

రెండు అంతర్ జీవితం.

బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు - అలాగే అంతర్ జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు.

అయితే, వాస్తవానికి అంతర్ జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది.

అంతర్ జీవితమే బాహ్యజీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది.

అంతర్ జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం.

అంతర్ జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది.

అంతర్ జీవిత సహిత బాహ్యజీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం.

అంతర్ జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సువిదితం తెలియజేయగలిగేది.

అంతర్ జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం - ఆత్మానుభవ మయం.

బహిర్ జీవితం అందరికీ చూపించగలిగినది.అంతర్ జీవితం అందరికీ చూపించలేనిది.

అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్ధవంతమవుతుంది.తేజోవంతమౌతుంది. ధర్మార్ధ కామమోక్షదాయకం అవుతుంది.

అంతర్ జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటి సారిగా పరిచయం అవుతుంది.

తర్వాత నిరంతర ధ్యాన, స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షితమౌతుంది.

 

Thursday, 28 January 2021

30--01--2021



సమ్మోహనాలు .. గోవుప్రేమ  (1151-1160)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బిడ్డ ప్రేమ చూపు
చూపు ప్రేమ మలుపు
మలపు లెన్నైనున్నా మారదు ఈశ్వరా

గోవు పాలు త్రాగి
త్రాగిన బాబు ఆగి
ఆగి ముద్దు పెట్టి ముచ్చటించె ఈశ్వరా

సృష్టిలో అందరూ
అందరు బతికెదరూ
బతుకులో జంతువులను పెంచెను ఈశ్వరా

గోమాత ప్రేమయు
ప్రేమనే మరువదుయు
మరువలేని పాలు ఇచ్చుచుండు ఈశ్వరా

ప్రకృతి చూపును శక్తి
శక్తి పెంచును యుక్తి
యుక్తితో సమస్తజీవులు బతుకు ఈశ్వరా

తల్లి పిల్లకు ముద్దు 
ముద్దు వల్లే హద్దు 
హద్దు నిర్మల మనస్సుకు లేదు ఈశ్వరా 

మానవులలో ప్రేమ 
ప్రేమ జంతువు ప్రేమ 
ప్రేమ అపురూపమనిపించేను ఈశ్వరా 

మనిషి కున్నా జంతువు 
జంతువు లే కదలవు 
కదలి  ఆశించవు ప్రేమించును ఈశ్వరా 
 
అమ్మలాంటి ఆవు 
ఆవు మనిషి ఆయువు 
ఆయువుతొ  సమస్త జీవ రక్షా ఈశ్వరా 
 
నమ్మిన ప్రాణ మిచ్చు 
ఇచ్చి బంధము నిచ్చు 
నిచ్చి సహాయముచేయు చుండును ఈశ్వరా 
  
--(())--


*నవ నారసింహక్షేత్ర ఆలయం.....అహోబిలం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరం లోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరం లోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం


*స్థలపురాణం:—*


 ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.


ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం

వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.


రాజగోపుర దృశ్యం

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.


జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.


*ఆలయప్రత్యేకత :--*

*శ్రీ భార్గవ నరసింహ స్వామి :--*


దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే” భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామి;;- వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.


*శ్రీ ఛత్రవట నరసింహస్వామి ;;--*


ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .


*శ్రీ అహోబిల నరసింహస్వామి ;;--*


నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.


*శ్రీ వరాహ నరసింహస్వామి;;--*


 ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.


*శ్రీ మాలోల నరసింహస్వామి ;;---*


 ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.


శ్రీ మాలోల నరసింహ స్వామి

*శ్రీ జ్వాలా నరసింహస్వామి;;--*


ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు..హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి,చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే,సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందు లో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణి లోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱ గా ఉండిపోయింది.


*శ్రీ పావన నరసింహస్వామి::--*


 ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది.అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను,పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితం గా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదం గా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ పావన నరసింహస్వామి

*శ్రీ కరంజ నరసింహస్వామి ;;---*

 ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు.

శ్రీ కరంజ నరసింహస్వామి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;-- ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.

చారిత్రకప్రాధాన్యం .;;--- దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి . పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరి కనువిందు చేస్తాయి .

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

దిగువ అహోబిల రాజగోపురం

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.


ఉగ్ర నరసింహుని సుందర రూపం

*ఉగ్ర స్థంభం :--*

 ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు. 

“ उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं

नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!!

అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.


*ఉగ్ర స్థంభం*

*ప్రహ్లాదమెట్టు;;--*


ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.


*స్థంభ శిల్పం*నా

*అహోబిలమఠం.:--*

 ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.


చెంచులక్ష్మీ నరసింహుల స్థంభ శిల్పం

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

రంగమండపం లోని స్థంభ శిల్పం

*ప్రత్యేక ఉత్సవాలు::--*

 ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.

యోగానంద నరసింహ స్థంభ శిల్పం

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.

అహోబిల నరసింహ స్వామి లీలా ­శేషాల్లో ప్రధానమైనది మానసిక గందరగోళాన్ని దూరం చేయడంలో ఈయన చూపే మహిమలు. సమస్యలతో మనసు ­కలమైన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయట.

నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నా ఆయన లీలలకు లోటుందట. అలాంటి ఆ స్వా­మి తాను అవతరించిన ప్రదేశమైన అహోబిలంలో అంతకు మించిన రీతిలో భక్తులను దీవి­స్తున్నాడు. మహాశక్తివంత దైవ స్వరూపంగా పేరున్న ఈ స్వా­మి మీద భారం వేస్తే బాధాపీడితులకు ఏదో రూపంలో దారి చూపుతాడని పేరు. మహామహిమాకరుడైన నరసింహ స్వామి నవనారసింహుడుగా కొలువైన అహోబిల క్షేత్రం ప్రతి నిత్యం హరినామ ఘోషలతో అలరారుతూ ఉంటుంది. వైష్ణవ పూజా ­ధానంలో అత్యంత ప్రశస్తమైనదిగా చెప్పే పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అహోబిలంలో నిత్యపూజలు జరుగుతాయి.


అహోబిల నరసింహ స్వా­మికి ఉదయం సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ­విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ పిదప వరుసగా బాలభోగం, తలిగ ఆరాధన, తోమాల సేవ, పానకారాధన వంటి­ ఉంటాయి. రాత్రి ఉత్సవమూర్తికి శయనం చేసి పాలు, క్షీరాన్నం ఆరగింపు ఇస్తారు. దీంతో నిత్యపూజలు పరిసమాప్తం అవుతాయి.

నిత్యపూజలతో పాటు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వర్షోత్సవాలు వంటి­ నిర్వహిస్తారు. దీనితో పాటు ఫాల్గుణ శుక్ల చ­తి నుంచి పౌర్ణ­మి వరకు స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వివి­­ధ రూపాలు ధరించిన ప్రహ్లాద వరదస్వా­మి ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఉంటారు.


అహోబిలం చేరుకోవడానికి ­విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలోనూ అహోబిలం నెలవై ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఇక్కడికి వి­స్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నవనారసింహుడు కొలువైన అహోబిల క్షేత్రాన్ని దర్శించి ­మీరూ పునీతులు కండి


అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి.


తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు

లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.

దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చును.

సేకరణ..

[26/01, 10:04 am] +91 79810 02699: 🙏 *శుభోదయం*🙏

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*



          *ఓ మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది.*

  .      *లక్షలాది మందిలో కదలిక సమాజాన్ని మరియు దేశాన్ని కూడా కదిలిస్తుంది.*


*గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో*🙏🙏

*మీ*

*-- వరలేఖరి.నరసింహశర్మ.*

[27/01, 7:54 am] +916281264412: *శుభోదయం*

*కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,

     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*

              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*.

             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*

[27/01, 7:54 am] +916281264412: 🌳🌳🌳




*మనం గెలవడం అంటే మనుషులను కాదు* *మనస్సులను గెలవాలి. ముందుకు వెళ్లడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, నలుగురినీ కలుపుకుంటూ వెళ్లడమే నిజమైన విజయం*.



🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

[27/01, 7:54 am] +916281264412: 🌿🌹🌿



శారీరకంగా వచ్చే అందం ఈ రోజున వుంటే రేపు పోవచ్చు. 

*వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది.*



🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿

[28/01, 9:29 am] +916281264412: ఉదయం 11 గంటలు.

తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న జనం బయటకు వస్తున్నారు. గర్భాలయం బయట చుట్టూ తిరిగి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని ఇంక బయటకు వెళ్లిపోవడానికి వాకిలి దగ్గర గుమికూడారు. ఎప్పుడూ ఉండే విధంగానే అప్పుడూ రద్దీ ఉంది. సెక్యూరిటీ గార్డులు ఇద్దరూ, వలంటీర్లు ఇద్దరూ ఆ ద్వారం గుండా లోపలికొస్తున్న వాళ్లను ఆపి బయటకు వెళ్లటానికి వీళ్లని అనుమతిస్తున్నారు.

లాల్చీ పైజమాలతో ఉన్న యాభై ఏళ్ల ఆసామీ ఒకతను బయటికి వెళ్లబోతూ తన కుడిచేతి వేళ్లు తడుముకున్నాడు.

హఠాత్తుగా గట్టిగా, ‘దొంగ.. దొంగ, దొంగ..’ అని అరిచాడు. తన చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. ఎక్కువ మంది నడివయస్సు ఆడా మగా జనమే. వాళ్లు ఇతని వైపు విచిత్రంగా చూసి నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు.

ఈ ఆసామి మళ్లీ, ‘దొంగండీ.. దొంగ! ఎవరో నా ఉంగరం దొంగిలించారు.. ఎవరు? ఎవరు?’ అన్నాడు.

ద్వారంలో ఎదురుగా నుంచునున్న వలంటీరు గబగబా ఇతని వైపు వచ్చాడు. ‘మీతోబాటు వచ్చిన వాళ్లు బయటికి వెళ్లిపోయారు. మీ వెనకాల వచ్చిన వాళ్లని మీరు తప్పు పట్టలేరు గదా. ఇట్లా ఇవతలికి రండి’

ఆ ఆసామి అన్నాడు. ‘అంటే నా ఉంగరం దొంగిలించిన వాడిని వదిలెయ్యాలంటారా?’

‘మీరు ఆవేదన పడకండి. సెక్యూరిటీని పిలుస్తాను. అతన్తో చెప్పండి’ అంటూ సెక్యూరిటీ గార్డు వైపు చెయ్యి ఊపాడు. సెక్యూరిటీ గార్డు రాగానే వలంటీర్ అతన్తో ‘ఈయన ఉంగరాన్ని ఎవరో దొంగిలించారట’ అన్నాడు.

సెక్యూరిటీ తికమకగా, ‘దొంగిలించారా? స్వామి సన్నిధిలో దొంగతనమా? ఎన్నడూ ఎరగమే.. ఇంతకీ ఏం పోయింది?’

ఆ ఆసామి అన్నాడు. ‘నా ఎడమచేతి ఉంగరాలు రెండూ ఉన్నాయి. నా కుడిచేతి వేలి ఉంగరమే పోయింది’

‘మీ పేరేమిటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తూంటారు? రండి, ఈ పక్క మంటపం మీద మాట్లాడుకుందాం’

ముగ్గురూ పక్కనే ఉన్న అన్నమాచార్య గ్రంథాలయం మెట్ల మీద కెళ్లారు.

సెక్యూరిటీ గార్డు అన్నాడు, ‘మీ పేరేమిటి?’

ఆ ఆసామి అన్నాడు ‘నా పేరు అంబాలాల్. మాది సూళ్లూరుపేట. నేను రాత్రి వచ్చాను. ఒక్కణ్ణే వచ్చాను. స్పెషల్ గెస్ట్‌హౌస్ తీసుకున్నాను. నాకు స్పెషల్ దర్శనం టిక్కెట్టు ఉంది. కనుక ఇందాక పది గంటలకి శ్రీవారి దర్శనార్థం మహాద్వారంలో ప్రవేశించి బంగారు వాకిలి దాటి ధ్వజస్తంభం దాటి, వెండి వాకిలి ద్వారా జయవిజయుల పక్కనించి లోపలికి వస్తూనే నా స్వామికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను. నా మూడు ఉంగరాలూ స్వామికి చూపించాను. ఆయన ముచ్చట పడ్డాడనుకోండి. స్వామి దర్శనం తర్వాత రద్దీలో బయటకొచ్చి ప్రదక్షిణంగ చుట్టూ తిరిగాను. ఇప్పుడింక వెళ్లిపోతూ చూసుకుంటే కుడిచేతి ఉంగరం లేదు.’

‘ఎక్కడన్నా పడిపోయిందేమో గమనించారా?’

‘అహహ పడిపోలేదు. అట్లా పడిపోతే అరవను గదా!’

‘దర్శనంలో ఉండగా ఎవరైనా మీ వేలు పట్టుకున్నారా?’

‘లేదు.. కానీ ఒక వాలంటీరు అమ్మాయి మాత్రం నా ఉంగరం చూస్తూ ముచ్చటగా ‘మీ వస్తువులు జాగర్తండి’ అంది. అప్పుడు నా ఉంగరం నాకు కనిపిస్తూనే ఉంది’

‘సరే ప్రదక్షిణం చేస్తూ మీరు ఎక్కడెక్కడ తిరిగారు?’

‘నేను బయటికొచ్చి ముందర వకుళాదేవిని దర్శించుకున్నాను. స్వామి వారికిచ్చే ప్రత్యేక నైవేద్యాల పోటు చూసాను. మండపంలో తీర్థం పుచ్చుకున్నాను. ఆ తరువాత వెంకటేశ్వర స్వామి పెళ్లి శిల్పాలు, మండపంపై చిత్రించి ఉన్నవి, చూసుకుంటూ నడిచాను. స్వామి వారి హుండీ లెక్కించే స్థలం పరకామణిని చూసాను. నేను అలా చూస్తూండగా నా పక్కన నుంచుని చూస్తూ ఉన్న ఇద్దరు కుర్రాళ్లల్లో ఒకడు ఎర్రగళ్ల చొక్కావాడు నా దగ్గరకొచ్చి నా వేలును పట్టుకుని ‘చాలా బాగుంది సార్ ఉంగరం’ అన్నాడు. నేను పరకామణిని, అక్కడున్న మీ సెక్యూరిటీ వాళ్లని చూస్తూ నుంచుండిపోయాను. ఆ కుర్రాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత గంధం తీసేచోట కొంచెంసేపు నుంచున్నాను. ఆ తరువాత విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్నాను..’

‘మళ్లీ ఉంగరం చూసుకున్నారా?’

‘లేదు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం అది లేదు’

‘మీకు అనుమానం ఆ కుర్రాళ్ల మీదనా?’

‘అవునండి. ఆ ఎర్రగళ్ల చొక్కావాడి మీదనే- వాడే ఇప్పుడు నా ముందు నుంచి బయటకి వెళ్లిపోయాడు. ‘్భజనం చేసి వెడదాం రా’ అని రెండోవాడితో వాడు అనటం నేను విన్నాను.’

సెక్యూరిటీ వెంటనే వలంటీర్‌తో ‘బయటికెళ్లి చూడు. కనిపిస్తే పిలుచుకురా!’ అన్నాడు.

వలంటీర్ వేగంగా వెళ్లిపోయాడు.

సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ని అడిగాడు ‘మీరేం చేస్తుంటారు?’

‘ఏదో.. చిన్న బంగారం వ్యాపారం’

‘కుటుంబంతో వచ్చినట్లు లేదు కదూ!’

‘అవునండి. వాళ్లకి ఏర్పాట్లన్నీ చూడాలి. వెళ్లడం ఆలస్యమయితే నా వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని వాళ్లని తీసుకురాలేదు’

‘అది సరే. అసలు ఎందుకని అంతా మీ ఉంగరం వైపు పరిశీలించి చూశారు?’

‘అదీ అదీ.. వజ్రపు టుంగరం. వజ్రం అరంగుళం పొడుగు, పావు అంగుళం వెడల్పు. దానికి అన్నీ నగిషీలే. ఏ కొంచెం కాంతిలోనయినా అది అన్ని వైపులా చురుక్కు చురుక్కుమని అనేక రంగులు మెరుస్తూ ఉంటుంది. ఆ వజ్రం ఖరీదే ఏభై వేలు. బంగారమేమో కాసు. ఉంగరం మొత్తం లక్ష. కనక అందరినీ అది ఆకర్షిస్తూ ఉంటుంది’

బయటకెళ్లిన వలంటీర్ ఊడిపడ్డాడు. సెక్యూరిటీతో అన్నాడు ‘కుర్రాళ్లిద్దరూ కనిపించారు. ఎర్రగళ్ల చొక్కాతను ‘ఆ ఉంగరాన్ని నేను తియ్యలేదు. అసలు, ముట్టుకోలేద్సార్. ఎంత రోగ్ అయినా స్వామి వారి దగ్గర ఇలాంటి డర్టీ పని చేస్తాడా? అసలు నేను బ్యాంకు ఉద్యోగిని దాన్ని ఇచ్చినా పుచ్చుకోన్సార్?’ అన్నాడు. నేను డ్యూటీలో కెళతాను’ చెప్పి వలంటీర్ వెళ్లిపోయాడు.

సెక్యూరిటీ గార్డు అంబాలాల్‌ను గుచ్చిగుచ్చి చూసాడు.

‘తెలిసిందిగా. ఆ కుర్రాడు తియ్యలేదు. విమాన స్వామిని చూసాక మీరేం చేశారు?’ అని అడిగాడు.

‘ఆ ఏముందిలెండి. హుండీ దగ్గరికెళ్లి నా పాకెట్ పడేసాను. వెంటనే...’

‘ఆగండి.. ఆ పాకెట్‌లో ఏం వేశారు?’

‘డబ్బండి.. నేను వ్యాపారంలో బాగా నష్టపోయాను. కిందట ఏడాది ఇక్కడికొచ్చి నన్ను గట్టెక్కించి కాపాడమని స్వామిని ప్రార్థించాను. ‘నాకు వచ్చే లాభంలో టెన్ పర్సెంట్ నీకిస్తానయ్యా’ అని మొక్కుకున్నాను. ఈ ఏడాదిలో నాకు కోటి లాభం వచ్చింది.


కనుక అందులో టెన్ పర్సెంట్ తెచ్చి హుండీలో పడేసాను అంతే. ఆ తరువాత బయటికొచ్చి జనంలో కలిసిపోయాను. ఇప్పుడు మళ్లీ చూసుకుంటే ఉంగరం లేదు.’

‘మీరు హుండీలో పేకెట్ వేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని తోసారా?’

‘చిన్న తోపులాట జరిగిందండి’

ఒక్క నిమిషం ఆగి సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘సరే ఈ విషయం అంతా మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి చెబుతాను. ఆ తోపులాటలో హుండీలో పడిందేమో చూడమని కోరతాను’

‘హుండీలో ఇప్పుడు చూసేయొచ్చు గదా! నేను మళ్లీ ఈ సాయంత్రానికి మా ఊరు వెళ్లిపోవాలి’

‘అట్లా కుదరదండి. హుండీలన్నీ రాత్రి రెండు గంటలకి స్వామికి పవళింపు సేవ అయ్యాకే తీస్తారు. వాటిని పరకామణిలో పెట్టి పొద్దునే్న లెక్కిస్తారు. మీరు ఈ రాత్రికి ఆగిపొండి. రోజూ మేము యాత్రీకుల్లో పెద్ద మనుషులనుకున్న ముగ్గుర్ని సాక్షులుగా పరకామణి దగ్గరికి తీసుకెళ్లాలి. రేపు మిమ్మల్ని మూడోవారుగా తీసుకోమని విజిలెన్స్ ఆఫీసర్‌గారికి చెబుతాను. రేపు ఉదయం అయిదు గంటలకి వైకుంఠ ద్వారం దగ్గరికి మీరు రండి. నేను మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను. పరకామణి లెక్కించడం మీరు చూద్దురుగాని.

‘అన్నట్టు మీ ఉంగరం విషయం ఇదిగో ఈ కాగితం మీద మా విజిలెన్స్ ఆఫీసర్ గారికి రాసివ్వండి’ ఇట్లా అంటూ గార్డ్ కాగితం ఇచ్చాడు.

‘అంటే అసలు దొంగే లేడంటారా? నా లక్ష రూపాయల ఉంగరానికి ఇంతే సంగతులా!’

గార్డ్ కటువుగా అన్నాడు, ‘అది రాసిచ్చి రేపుదయం రండి. అంతే’

అంబాలాల్ రాసిచ్చాడు.

ఇద్దరూ చెదిరిపోయారు.

* * *

మర్నాడు ఉదయం అంబాలాల్ వైకుంఠ ద్వారం దగ్గరికి రాగానే అదే సెక్యూరిటీ గార్డు అక్కడున్నాడు. అంబాలాల్‌ను తీసుకుని లోపలికి చుట్టూ తీగ జల్లెడ కట్టి ఉన్న పరకామణి దగ్గరకొచ్చాడు. లోపల స్వామివారి హుండీలన్నీ కుమ్మరించబడ్డాయి. లెక్కించడం మొదలైంది. చుట్టూ ఉన్న తితిదే సిబ్బందీ, సాక్షులూ నిశితంగా గమనిస్తున్నారు.

హఠాత్తుగా ఎర్ర కాగితంతో చుట్టబడిన తొమ్మిది వెయ్యి రూపాయల కట్టలు బయటపడ్డాయి. అంబాలాల్ వెంటనే ‘అదిగో అదిగో నా కట్ట. తొమ్మిది లక్షల కట్ట’ అన్నాడు. మళ్లీ వెంటనే, ‘అదిగో ఆ దారానికి వేలాడుతున్నదే నా వజ్రపు ఉంగరం. నాదే, నాదే’

సెక్యూరిటీ గార్డు అన్నాడు. ‘మీ కోటి లాభంలో పది పర్సెంట్ అంటే, పది లక్షలు స్వామికి ఇస్తానని మొక్కుకున్నారు గదా. తొమ్మిది లక్షలే ఇచ్చారేం?’

‘ఆ ఏముంది, ఆ పదిలోంచే ఒక లక్ష నేను తీసుకుని ఉంగరం చేయించుకున్నానండి. మిగిలిన తొమ్మిదీ స్వామికిచ్చాను. ఇందులో పెద్ద పాయింటేముంది?’

‘అదే అసలు పాయింటు. స్వామికి ఇస్తానన్నది ఇవ్వకుండా మీరు తీసుకున్నారు. ఆయన ఊరుకుంటాడా! దారంతో గేలం వేసి మీ వేలు మీంచి ఊడ లాక్కున్నాడు. తనది తాను తీసుకున్నాడు. ఇస్తానన్నది ఇవ్వకపోవడం దొంగతనమా, తనది తాను తీసుకోవడం దొంగతనమా?.. అంటే దొంగ ఎవరో తెలుస్తోంది కదా! మీరు ఇంకెవర్నో దొంగ అంటారేమిటి?’

అంబాలాల్ మొహం మాడిపోయింది. ఉండుండి అన్నాడు, ‘పొరబాటయింది’

‘నిన్న మీరు హడావిడి చేశారు. కానీ ఇక్కడ స్ట్ఫా అందరికీ తెలుసు. స్వామి వార అనుగ్రహమేమిటో..

‘దొంగనోట్ల కట్టలు గోడల్లో దాచుకోవడం, తిరువనంతపురంలో రంగనాథుడి మీద కేసు వెయ్యడం - ఇవన్నీ స్వామి చేయించినవా? చేసుకున్న వాళ్లు అనుభవించారు. అనుభవించి తీరుతారు. ఎందుకంటే స్వామి తన త్రాసుతో కచ్చితంగా తూస్తాడు కనక!... ఒక ముస్లిం కుటుంబంలో మూడు తరాల వారు తిండి మానేసి స్వర్ణ కమలాలు చేయించి తెచ్చి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి త్రాసు ఏమిటో తెలుసా, అవి ఇప్పుడు భాండాగారంలో లేవు. ఆర్జిత సేవలో ప్రతి మంగళవారం ఉపయోగించబడుతున్నాయి. ఆ ఆర్జితసేవ కిప్పుడు విపరీతమైన డిమాండ్..! కనుక స్వామి విషయంలో మేం మాట జారం. పొల్లుపోనివ్వం.. అన్నట్టు, దొంగ దొరికాడని మీరు ఒక రిపోర్టు రాసివ్వండి.’

అంబాలాల్ చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ‘నన్ను వదిలెయ్యండి. వెళ్లిపోవాలి. ప్లీజ్?’ అంటూ విసవిసా బయటకు దారితీసాడు.


గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు..

 98857 98556

💦మంచి మాట


         *మనం చెప్పే మాటల కంటే కూడా*

                   *మనతో మనం*

      *చెప్పుకునే సందేశాత్మక సంభాషణకు*

                      *శక్తి ఎక్కువ,* 

                 *ప్రభావం ఎక్కువ* 

                    *ఏదో ఒక రోజు* 

        *జీవితం మొత్తం మనకళ్ళ ముందు* 

                  *కదలాడుతుంది..* 

                    *ఆ రోజున ....!*

           *చూసేందుకు మనకు నచ్చేలాగా* 

          *మన జీవితాన్ని* *మలుచుకోవాలి..!!*


[28/01, 3:15 pm] హనుమంతరావు: 🌹🌹 *నేడు శాకంభరీ దేవి జయంతి , శాకంభరీ దేవి పూర్ణిమ* 🌹🌹



     *శాకంభరీ దేవి అనగా దుర్గా  దేవి యొక్క మరో అవతారం. శాకంభరీ జయంతిని జనవరి మాసంలో జరుపుకుంటారు. దీనిని శాకంభరీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈ పండుగను భారతదేశం మొత్తం జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో దుర్గాదేవికి అధిక ప్రాధాన్యం ఇస్తారు*.


      *దుర్గాదేవి అనేక అవతారాలలో ముఖ్యమైన అవతారం శాకంభరీ దేవి. శాకంభరీ దేవి పూలు, పండ్లు, మరియు పచ్చదనమునకు  అధిదేవతగా భావిస్తారు. శాకంభరీ ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుపుతారు. ఆఖరి రోజు ముఖ్యమైన రోజు అనగా శాకంభరీ పూర్ణిమ. అదే పుష్య పూర్ణిమ*.


         *పూర్వం చాలా రోజులు భూమి మీద వర్షం లేకపోవడం వల్ల భూమి మీద మానవులు, పక్షులు , జంతువులూ ఇంకా అనేక జీవులు మరణించాయి . అప్పుడు మహా మునులు దుర్గాదేవిని వేడుకున్నారు . ఆమె అప్పుడు శాకంభరీ అవతారంలో వర్షం కురిపించి భూమి మీద కరువుని పారద్రోలింది. అప్పటి నుంచి భారతదేశంలో శాకంభరీ జయంతిని జరుపుతారు*.


                  *కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్  అనేక ప్రాంతాలలో ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి. చెన్నైలో ని శాకంభరీ పురంలోని శాకంభరీ ఆలయంలో ఉత్సవాలు తొమ్మిది రోజులు  జరుపుతారు*.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

[28/01, 3:41 pm] హనుమంతరావు: 🐊 *నాన్న* కూ *కన్నీళ్లు* ఉంటాయి👨‍👩‍👧‍👦


🐊 *నాన్న* మనకోసం ఏం చేశాడో*

ఏం *కోల్పో* యాడో  మనకు తెలియదు..!*


🐊 *జీవితాంతం* పిల్లల కోసం *తపిస్తూ, వారి అభివృద్ధి* కోసం పాటుపడే వ్యక్తి *తండ్రి* తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. *నాన్న* మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

🐊 ఎందుకంటే..  *నాన్న* ఎవరికీ చెప్పడు. *పిల్లలకి, భార్య* కి అసలు చెప్పడు. *అమ్మ* లా *ప్రేమ* ను బయటికి చూపించడం *నాన్న* కు రాదు. *నాన్న* ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

🐊 *ఎప్పుడూ పనేనా* ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. *పెళ్లై, పిల్లలు* పుట్టగానే *నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

🐊 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 

🐊 *వృద్ధాప్యం* ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న *డాక్టర్‌* ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

🐊 తన *పిల్ల* లు గొప్ప వాళ్లు అవుతారని *నాన్న* కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. *ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.* మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని *ఆశ.*

 

🐊 *ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా* చేస్తాడు. ఎక్కడ, ఎన్ని *సంతకాలు* పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు *అమ్మ* ఏడ్వడం చూశాం కానీ, *నాన్న ఏడ్వడం* ఎప్పుడైనా చూశారా? *నాన్న* కూడా *ఏడుస్తాడు*.😰 కానీ మీ ముందు *ఏడ్వడం* ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని *ఏడుస్తాడు.**

 

🐊 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. *నాన్న* అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే *పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం* మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, *నేను ఎవరి కోసం బతికాను*?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. *నా కోసం నేను* ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*

 

🐊 నిజానికి *నేను* అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో *నాన్న* ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 🐊 కొడుకు ఎంత మంచివాడు *ప్రయోజకుడైతే* తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా *తండ్రి* ని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ *నాన్న* స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ *నాన్న* పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.

 🐊 *,పిల్లల* కోసం తన *రిస్క్‌* తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన *కెరీర్‌* ను *నాశనం* చేసుకుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న *ఎనర్జీ* పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది 🐊 *నాన్న* లు జీవితంలో తమ *పిల్లల* కోసం *ఆర్డినరీ* గా మిగిలిపోయారో.....


ప్రతి *నాన్న* కు 

       🙏😌🙏

            🐊🐊🐊🐊🐊

[29/01, 7:34 pm] +916281264412: *ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా జనవరి నుండి పూర్తిగా యూనియన్ బ్యాంక్ లోకి మార్చడం జరిగింది.*

1. అకౌంట్ నంబర్ పాతదే ఉంటుంది.

2. కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది.

3. కొత్త పాస్ బుక్ యూనియన్ బ్యాంకు ముద్ర తో వస్తుంది.

4. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్ లో 31/03/2021తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి తరువాత పని చేయివు. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి.

5.ఆంధ్ర బ్యాంక్ ifsc కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త  కోడ్ మీ దగ్గరి లో యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రబ్యాంక్) తెలుసుకోవలెను.

ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కి1800 208 2244 ఫోన్ చేయగలరు.

6.మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు U-mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ Install చేసుకోవాలి పాత (App ab tej) పని చేయదు కాబట్టి.

 🙏 *శుభోదయం*🙏

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


  *"సమయం, ఆరోగ్యం, బంధం" వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటివిలువ తెలిసేది*

        *అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలపెట్టుకోవాలి*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*-- వరలేఖరి.నరసింహశర్మ.*

 *వాత రోగాలు ఎందుకు వస్తుంది??*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైైైైైై


   మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నాయి.


*కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :*

**********************


1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం.


2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం

3. అతి వేడిగా గానీ అతి చల్లగా గానీ భోజనం చేయడం.


4. ఎక్కువగా గాలికి తిరగటం, లేక నిరంతరం గాలిని విసిరే ఫ్యాన్ల కింద కూర్చోవటం, నిద్రించడం.


5. వరుసగా అనేక మాసాల పాటు రాత్రిళ్ళు మేల్కోవటం.


6. అనేక మాసాలపాటు విశ్రాంతి లేకుండా విపరీతమైన శారిరక శ్రమ చేయడం.


7. మంచు లోను, చల్లటి నీటిలోను, చల్లని గాలిలోను, ఏ.సి. గదులలో ఎక్కువ సమయం గడపడం.


8. ఆర్ధక ఇబ్బందుల వల్ల లేక పనుల వత్తిడి వల్ల వేళకు భోజనం చేయకపోవడం, వేళ కాని వేళల్లో అకాల భోజనం చేయడం.


9. మలము, మూత్రము, తుమ్ములు, ఆవలింతలు మొదలైన సహజవేగాలను, పనుల ఒత్తిడిలో పడి కొంత సమయం ఆపడం.


10. అలివి కాని పనులు చేయటానికి ప్రయత్నించి, విఫలమై అమితంగా దిగులు పడటం, అతిగా అలోచించడం, అతిగా భయపడటం.


11. వివిధ అనారోగ్య సమస్యల వల్ల శరీరంలో మాంసం క్షీణించటం.


12. జీర్ణ శక్తి గమనించకుండా కఠినమైన పదార్ధాలను సేవించడం, అవి జీర్ణంగాక మురిగిపోయి ఆమం ఏర్పడి వాయు సంచారానికి అడ్డుపడటం.


ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన మానసిక శారీరక చర్యల వల్ల 80 రకాల వాత వ్యాధులు పుట్టుకొస్తాయి.


*సేకరణ:*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰