మహాభారతం ఆదిపర్వం నాలుగవ భాగం
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
సమస్త గురువుల రూపంలో ప్రకాశిస్తున్న
మహనీయులగు నరనారాయణ ఋషులకు నమస్కారం
గ్రంధరూపంలో ప్రకాశిస్తున్న జ్ఞాన రూపిని యగు సరస్వతి మాత కు నమస్కారం
అపారమైన దయతో వేద విజ్ఞానాన్ని మహాభారత మనే కథ రూపంలో సమస్త మానవాళికి ప్రసాదించిన కృష్ణ ద్వైపాయనునికి నమస్కారం
🌼🌼🌼🙏🌼🌼🌼
మహాత్ముడగు
జనమేజయుడు ధర్మబద్ధముగా రాజ్యపాలన సాగిస్తున్న రోజులవి కానీ కలి ప్రభావం
వలన ఆయన రాజ్యంలో సామంతరాజులు అవిధేయులు గా మారి తిరుగుబాటు చేస్తున్నారు
అటువంటి తిరుగుబాటుదారులను సమూలంగా అణిచివేసి గెలుపు తాలూకు ఉత్సాహంతో
ఆనందంగా ఉన్నాడు జనమేజయుడు.
సరిగ్గా అదే సమయంలోనే ఉదంకుడు అనే
బ్రాహ్మణుడు ఆయన సభకు వచ్చాడు. అతడు పవిత్రమైన వేదమంత్రాలతో రాజును
ఆశీర్వదించి ,హే రాజన్ ! ప్రపంచ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరించ తగిన
మహారాజువయ్య నీవు ,కానీ నీవు చేయదగిన బృహత్కార్యం ఒకటి విస్మరించి ఉన్నారని
తెలియజేయడానికి చింతిస్తున్నాను అని పలికాడు ఉదంకుడు.
జనమేజయుడు
ఆశ్చర్యపోయి బ్రాహ్మణోత్తమా ! నా చేత విస్మరించబడిన విధి ఏమిటో వెంటనే
విశదపరచడు. అది ఎటువంటిదైనా సరే మీరు సంకోచించాల్సిన పని లేదు వేదమూర్తుల
ఆజ్ఞ తిరస్కరించనని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అందువల్ల మీరు నిర్భయంగా
ప్రసంగించవచ్చు అని తెలియజేశాడు రాజు.
జనమేజయుడు అలా అనగానే " రాజన్ !
ఇప్పుడు నేను చెప్పబోయే పని వల్ల నాకు ఒక వీసయెత్తు లాభం ఉన్న మాట నిజమే
అయినప్పటికీ అది నీ స్వకార్యం అని భావించి తక్షణమే మీరు సర్పయాగం చెయ్యండి.
ఎందుకంటావేమో... మీ తండ్రి అయిన పరీక్షిత్తును తక్షకుడు అనే నాగరాజు
చంపేశాడు. కేవలం ఒక బ్రాహ్మణ వాక్యం అడ్డుపెట్టుకొని ఆ సర్పరాజు ఆచరించిన
అకృత్యానికి తగిన గుణపాఠం చెప్పవలసి ఉంది. మీ పితృదేవుల హంతకుడి మీద పగ
తీర్చుకోవడం మీకు ఎంతైనా ముఖ్య కర్తవ్యం అని మర్చిపోకు "అని చెప్పాడు
ఉదంకుడు.
ఉదంకుని మాటలు విని రాజు " విప్రవోత్తమ ! ఇందులో మీకు ఏదో లాభం
ఉంది అన్నారు కదా అది ఏమిటి అని అడిగాడు. ఉదంకుడు తన కథనంతా చెప్పాడు.
ఆలనాడు తక్షకుడు చేసిన విఘ్నం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అందువల్ల
నా తపో అధ్యయనాదులు సక్రమంగా కొనసాగడం లేదు . మీరు గనక పాముల యాగం చేసి ఆ
తక్షకుడు ని వాడి జాతి వాళ్ళని మసి చేసినట్లయితే నేను కుదటపడ్డ మనసుతో
వర్ణాశ్రమ ధర్మాలు నిర్వర్తించు కోగలను. ఒక ముక్కలో చెప్పాలంటే నాకు విఘ్నం
కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాజు వైనం మీ పై ఉంది , అదే నాకు లాభం అని
తెలియజేశాడు.
జనమేజయుడు ఒకక్షణం ఆలోచించి మంత్రుల వంక తిరిగి ";మా
పితృదేవుల విషయమై ఈ బ్రాహ్మణుడు చెప్పినది సత్యమేన ?!. నిజమే అయితే ఆ
దుర్ఘటన గురించి నాకు పూర్తి వివరాలు తెలియజేయండి " అని ఆజ్ఞాపించాడు.
సభలో
ఉన్న కొందరు వృద్ద మంత్రులు పరీక్షిత్తు యొక్క మరణం ఘట్టంగురించి ఇలా
చెప్పారు " నరపాల ! నీ తండ్రి అయిన పరీక్షిత్తు ఒక పొద్దున వేటకు వెళ్లి
ఒక మృగాన్ని కొట్టాడు . దెబ్బతిన్న ఆ మృగం పారిపోయింది..దానిని తరుముతూ మీ
నాన్న గారు శమీక ముని ఆశ్రమం చేరాడు .మీ తండ్రి ధ్యానంలో ఉన్న శమీకుని
మంచినీళ్లు ఇవ్వమని కోరాడు. కానీ ఆయన ధ్యానంలో ఉన్న కారణంగా మౌనంగానే
వుండిపోయాడు .అందుకు అలిగిన మీ నాన్న చేరువలో కనిపించినా చచ్చిన పాము ని, ఆ
ఋషి మెడలో వేసి వచ్చేసాడు. రాజుగారు ఇటు వచ్చాడో లేదో ఆ మునీశ్వరుని
కొడుకైనా శృంగి అనేవాడు ఆశ్రమం చేరాడు .తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును
చూసాడు. దాని తీరుతెన్నులను బట్టి అది ఎవరో కావాలని చేసిన పని అని
గుర్తించాడు. తక్షణమే జలమును ఆచరించి " నా తండ్రి మెడలో పాము కళేబరము వేసి
అవమానించిన వాడు...... వాడు ఎవరైనా సరే నేటికి ఏడవ రోజున అతి ఘోరమైన
సర్పమగు తక్షకుని చే కాటుపడి మరణించు గాక "అని శపించాడు ఆవేశంగా ఆ ముని
కుమారుడు.
ధ్యానానంతరం కళ్ళు తెరిచిన శమీకుడు పుత్రుని ద్వారా పాము
సంగతి, అతని మిత్రుల ద్వారా శాపం సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. తన దివ్య
దృష్టితో దోషి ఎవరొ, ఎవరు కాదో తెలుసుకోవాలి కదా ! ఇలా ఎందుకు చేసావు
?!.నీ చేత శపించబడినవాడు ఈ దేశాన్ని ఏలే రాజు. రాజు ను శపించడం రాజ్యాన్ని
అరాచకం చేయడం మన లాంటి వారికి తగని పని . సరే గతం గతం.కాలాన్ని ఎవరు మరల్చ
లేరు అని నిట్టూర్చాడు శమీకుడు. పిదప గౌరముఖుడు అనే తన శిష్యుడి ద్వారా
శాపం సంగతి నీ తండ్రికి కబురు చేశాడు, రక్షణ మార్గాలు వెతుక్కోమన్నాడు.
శాపం గురించి తెలియ గానే మీ నాన్న కంగారు పడ్డాడు. ఒంటి స్తంభం మేడ లో గాలి
కైనా చొరరాని మందిరం లో ఉండి రాజ్యపాలన చేయసాగాడు.
ఇలా ఆరు రోజులు
గడిచాయి. ఏడవ రోజున శాప నిర్వహణార్థం తక్షకుడు హస్తినాపురానికి రాసాగాడు.
మార్గమధ్యంలో అతనికి కాశ్యపుడు అనే భూసురుడు కనిపించాడు. ఆ కాశ్యపుడు పాము
మంత్రం వేయడంలో వుద్దండుడని , తను చంపబోయే రాజు ను రక్షించేందుకు
వస్తున్నాడని గ్రహించి, అతనికి అడ్డం పడ్డాడు .తనని తాను
ఎరంగించుకున్నాడు. తాను కరచిన వాడిని బ్రతికించడం ఎవరి తరం కాదు అన్నాడు
సర్పరాజు. తను మంత్రానికి కూడా తిరుగులేదు అన్నాడు మహీసురుడు. ఆ విషయమై
పంతం పట్టిన ,పాపరాయుడు చేరువలో ఉన్న వృక్షాన్ని కాటేశాడు. తక్షణమే ఆ
వృక్షం బుగ్గి గా మారిపోయింది . ఆ చెట్టును సజీవం చేయి అని పలికాడు
అహిరాజు. కాశ్యపుడు వెంటనే మంత్రోచ్ఛారణ చేశాడు. వెంటనే ఆ చెట్టు సజీవమై
పూర్వ ప్రకారం శోభిల్ల సాగింది. ఆశ్చర్యపోయిన సర్పరాజు,, ఆ బ్రాహ్మణుడు
ధనార్థియ వస్తున్నాడని తెలిసి .....అతను ఆశించిన దాని కన్నా అధికమైన ధనం
ఇచ్చి హస్తినాపురం రాకుండా చేశాడు. అనంతరం తాను కరిపురం చేరి కొందరు
నాగులను మానవరూపంలో మీ తండ్రి వద్దకు పంపాడు ." కొన్ని ఫలాలు, దర్భలు రాజు
కియ్యండి " అని తన అనుచరులను ఆజ్ఞాపించి ఆ ఫలాల లోని ఒక పండు లో ఒక చిన్న
క్రిమి రూపములో ఒదిగి కూర్చున్నాడు . కామ రూపులైన నాగులు నీ తండ్రి వద్దకు
వచ్చి ఆ ఫలాలను ఇచ్చారు .నీ తండ్రి ఆ ఫలాలను భుజించే సమయానికి అందులో
ఉన్న భుజంగ నాయకుడు నిజరూపంలో బయటపడి నీ తండ్రిని కాటు వేసి చంపేశాడు.
మంత్రులు
అలా చెప్పగానే తిరిగి ఉదంకుడు అందుకున్నాడు., తన తండ్రికి జరిగిన
అవమానానికి శృంగి శపించాడే అనుకో ఆ ప్రకారం నీ తండ్రిని కాటు వేయడం
తక్షకుడి కర్తవ్యమే అనుకో కానీ రాజును బ్రతికించడానికి వచ్చే మంత్రవేత్తను
వెనుకకు పంపడంలో అతని ఉద్దేశం ఏమిటి ?!.ఇది ఎంత వరకు ధర్మము... ఆలోచించు
అంటే విధి నిర్వాహణ కన్నా పరీక్షిత్తుని చంపడమే ప్రధానమైన ట్లు బోధపడుతుంది
కదా ?!.
రాజా ! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ తక్షకుడు మహా
క్రూరుడు. మహా గర్విష్టి తన పరాక్రమానికి ఎదురు లేదని పాండవులు ఎవరు
బ్రతికి లేరు కనుక తనను ఎవరూ ఏమీ చేయలేరని ధర్మాత్ముడైన మీ తండ్రి గారిని
కావలసి చంపేశాడు. ఇటువంటి వాడిని చంపకపోతే మీ వంశానికి గొప్ప కళంకం
ఏర్పడుతుంది. నీ తండ్రిని చంపిన వాడిని వాడి జాతి మొత్తం తగలబెట్టు.... ఇక
తక్షణ కర్తవ్యం ఏదో మీరు ఆలోచించుకోండి అని చెప్పాడు ఉదంకుడు.
తక్షకుని నేరానికి సాక్ష్యము.
---------------------------------
ఉదంకుడు
అలా అనగానే మరల జనమేజయుడు అన్నాడు " ధరాసుర ! మీరు చెప్పినట్లుగా చూసిన
కాశ్యపుడని తక్షకుడు ప్రలోభ పెట్టడం సహించరాని వంచన అని భావిస్తున్నాను.
అయితే మంత్రులు కానీ మీరు కానీ అక్కడ ప్రాంతంలో లేరు కదా ?! మరి మీకు ఆ
విషయం ఎలా తెలిసింది సాక్ష్యం ఏదైనా ఉందా ?! అని అడిగాడు జనమేజయుడు . "
ఉంది ప్రభు" అంటూ మంత్రులు చెప్పసాగారు " ఆనాడు తక్షకుడు అడవిలో ఏ
చెట్టనయితే కరిచాడో, అప్పుడు ఆ చెట్టు మీద ఒక కట్టెలు కొట్టుకునే వాడు
ఉన్నాడు. చెట్టు తో పాటు వాడు కూడా కాళహలి చనిపోయి అనంతరం కశ్యపుని మంత్ర
బలం తో పునర్జీవితుడయ్యాడు. భుజంగభూసురుల సంభాషణ అంతా కూడా విన్నాడు. కానీ
ప్రాణభయంతో వాడు వాళ్ళు నిష్క్రమించే దాకా చెట్లు దిగలేదు. వాళ్ళు
ప్రయాణమైన తర్వాత వాడు పరుగుపరుగున వచ్చి ఈ వార్త తెలియజేసే లోపలే
జరగకూడనిది జరిగిపోయింది " అని మంత్రులు ఈ విధంగా సాక్షాధారాలు ప్రత్యక్ష
పరచడంతో జనమేజయుడు పాముల మీద పగపట్టాడు .సర్పయాగానికి తగిన సంభారాలు
సమకూర్చ వలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు.
మిత్రులందరికీ శుభోదయం
*వేడి పైనాపిల్ నీరు*
నేను నా బాధ్యతలో కొంత చేశాను, మీరు కూడా దీన్ని చేయగలరని ఆశిద్దాం ..ధన్యవాదాలు!
*వేడి పైనాపిల్ నీరు* మీకు జీవితకాలం ఆదా చేస్తుంది.
*వేడి పైనాపిల్ నీరు* cancer క్యాన్సర్ కణాలను చంపగలదు.
ఒక కప్పులో 2 నుండి 3 ముక్కలు పైనాపిల్ సన్నగా కట్ చేసి, వేడినీరు కలపండి, అది "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, ప్రతిరోజూ త్రాగాలి, ఇది ఎవరికైనా మంచిది.
వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, ఇది ఔషధం లో సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్సలో తాజా పురోగతి.
వేడి పైనాపిల్ పండు కాన్సర్ తిత్తులు మరియు కణితులను చంపే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అన్ని రకాల క్యాన్సర్లను రిపేర్ చేయడానికి నిరూపించబడింది.
వేడి పైనాపిల్ నీరు అలెర్జీ / అలెర్జీల ఫలితంగా శరీరం నుండి వచ్చే అన్ని జెర్మ్స్ మరియు టాక్సిన్స్ ను చంపగలదు
పైనాపిల్ సారంతో ఉన్న ఈ ఔషదం *కాన్సర్ కారక హింసాత్మక కణాలను* మాత్రమే నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.
అదనంగా, పైనాపిల్ రసంలోని అమైనో ఆమ్లాలు మరియు పైనాపిల్ పాలీఫెనాల్స్ అధిక రక్తపోటును నియంత్రించగలవు, లోపలి రక్త నాళాల అడ్డంకిని సమర్థవంతంగా నివారించగలవు, రక్త ప్రసరణను సర్దుబాటు చేస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి.
చదివిన తరువాత, ఇతరులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పండి, మీ స్వంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ..
Pls ఈ సందేశాన్ని దాచవద్దు ... దాన్ని విస్తరించండి. మరియు మీరు ప్రాణాలను కాపాడుతారు.
--//--
గంగోత్రి విశేషాలు !!!
చార్ ధామ్ యాత్రలో సులభతరంగా చేరగలిగిన ప్రదేశం గంగోత్రి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టానికి 3750 మీ ఎత్తున హిమాలయాల పర్వత శ్రేణులలో భగీరథీ నది ఒడ్డున ఉన్నది. ఢిల్లీ నుండి బస్సులో ఋషికేశ్ కి చేరుకోవాలి. అక్కడ నుండి దేవప్రయాగ, ధరసుల మీదుగా భాగీరథీ తీరం వెంట సుమారు 125 కి.మీ., దూరం ప్రయాణించి ఉత్తరకాశిని చేరుకోవాలి.
ఉత్తరకాశీ నుండి బస్సులో గంగోత్రిని చేరుకోవాలి. నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్చతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. ఈ నది విష్ణు భగవానుని పాదముల నుండి ఉద్భవించింది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.
గోముఖం నుంచి, ఈ గంగోత్రి వరకూ ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి ఈ గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందివల్ల రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి చేసే నిత్యాభిషేకం, ఈ గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే చేస్తారు. స్నానఘట్టాలకు పైన, అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధికి చివరగా, గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మించాడు.
ఆ తరువాత అది కొంత శిధిలమవ్వగా తిరిగి జైపూర్ కు చెందిన రాణా వంశస్థులు ప్రస్తుతం ఉన్న ఆలయం నిర్మింపజేశారు. వెన్నలాంటి తెల్ల చలువరాయితో ఈ ఆలయం నిర్మించబడింది. విశాలమైన ప్రాంగణంలో, పడమర వైపు ఈ ఆలయం ఉన్నది. ఆలయం లోపల, ముందు భాగంలో, ఒక మండపం, లోపల మూడు గర్భాలయాలు, మధ్య ఆలయంలో ప్రధానమైన గంగామాత విగ్రహమూర్తి, ప్రక్కనే ఉన్న మందిరాలలో యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.
ఆలయానికి ప్రక్కగా, కటకటాలతో మూసి ఉన్న గది లాంటి దానిలో ఒక చిన్న రాతి వేదేక ఉంది. దీనిని ‘భగీరథ శిల’ అంటారు. ఈ శిల మీద కూర్చునే భగీరథుడు, గంగను గూర్చి తపస్సు చేసాడని స్థలపురాణం తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుడు, వినాయకుడు, ఆంజనేయుడు, మొదలగు దేవతామూర్తులకు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతీరోజూ ఉదయం ఆరు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సాయంత్రం 7 గంటలకు గంగామాత హారతి ఇస్తారు. ఈ ఆలయం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకూ మాత్రమే మూసి ఉంటుంది. మిగతా సమయాలలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. యమునోత్రిలోలాగానే ఈ ఆలయాన్ని కూడా దీపావళి మర్నాడు మూసి, తిరిగి అక్షయతృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు తెరుస్తారు. గంగామాత దర్శనం పాపహరణం అని భక్తులు తలుస్తారు.
--(())--
🌻 ఆంజనేయుడు త్రినేత్రుడా.... 🌻
🍃🌺ఇంతకీ ఆ స్వామి ఇటువంటి అవతారాన్ని ఎందువల్ల, ఏ సందర్భంలో ధరించినట్లు? ఆయనకు ఆ అవతారా న్ని ధరించడానికి ప్రేరణ ఏమిటన్న విషయానికి వస్తే ఓ అద్భుతమయిన కథ ఉంది.రామరావణ యుద్ధం ముగిసింది. శ్రీరామచంద్రమూర్తికి సంతోషంగా ఉంది.
🍃🌺ప్రపంచమంతా పచ్చదనంతో కళకళలాడు తోంది. రాక్షసులంతా సంహరించబడటంవల్ల ఇకపెై భూమికి ఎటువంటి ప్రమాదమూ లేదు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని రామచంద్రుని మనోగతం. ప్రజల క్షేమమే కదా ఆ స్వామికి కావల్సింది. విభీషణుడు పుష్పక విమానాన్ని శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు.
🍃🌺అందరూ పుష్పక విమానంలో ఆసీనులయ్యారు. అలా తన పరివార సహితంగా శ్రీరాముడు అయోధ్యకు తిరు గు ప్రయాణమయ్యాడు. విమానంలో ఆత్మీయుల మధ్య కూర్చుని వెడుతూ, సంతోషంతో కబుర్లు చెప్పుకుంటూ పోతుండగా, ఈలోపు భరద్వాజ ముని ఆశ్రమం వచ్చింది.
🍃🌺నాడు పంచమి తిథి. అప్పటికి పధ్నాలుగు సంవత్సరాలయ్యాయి. రాముని అభిమతం ప్రకారం, అందరూ భరద్వాజ ఆశ్రమంలో విడిది చేశారు.
🍃🌺అందరూ భరద్వాజ మహర్షికి నమస్కారాలు చేయగా, భర ద్వాజ మహర్షి రామపరివారాన్ని సంతోషంగా ఆహ్వానించి కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు ఆ మునితో, ‘‘ఓ మహాత్ముడా! అయోధ్యా నగరం సుభిక్షంగా ఉందా? అందరూ ఆరోగ్య సౌభాగ్యాలతో ఉన్నారా? ఈ విషయం గురించి మీరు వింటున్నారా? భరతుడు చక్కగా రాజ్యపాలనం చేస్తున్నాడా? మా తల్లులందరూ క్షేమంగా ఉన్నారా?’ అని అడిగాడు.
🍃🌺రాముని ప్రశ్నలను విని సంతోషించిన భరద్వాజ మహర్షి రాము నికి వరాలను అనుగ్రహించాలనుకుంటున్నట్లు చెప్పాడు. అప్పుడు రాముడు, ‘నేను అయోధ్యా నగరానికి పోతున్నాను. నేను వెళ్ళే దారిలో వృక్షాలన్నీ ఫలప్రదంగా ఉండాలి. వివిధ ఫలాలు అమృతంవలె ఉండాలి’ అని కోరుకున్నాడు.
🍃🌺భర ద్వాజుడు తథాస్తు అన్నాడు. అనంతరం భరద్వాజుని కోరి క ప్రకారం ఆ ముని ఆతిథ్యానప్ని స్వీకరించాలనుకున్న రాము లవారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా ‘నారాయ ణా… నారాయణా..’ అనే శబ్ధం వినిపించింది.
🍃🌺నారదుడు!
‘శ్రీరామా! ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చించేందుకై నీ దగ్గరకు వచ్చాను’ అని అన్నాడా కలహభోజనుడు.
‘చెప్పండి నారదా!’
‘ఏమిటి రామయ్యా! చాలా సంతోషంగా ఉన్నట్లున్నావ్? రావణ సంహారం జరిగినందువల్ల సంతోషమా? రావణసంహారం జరిగినప్పటికీ, దుష్టసంహారం ఇంకా ముగియనప్పుడు ఈ సంతోషమేమిటి రామా?!’
శ్రీరాముడు విస్మయంతో నారదునివెైపు చూశాడు.
‘అవును రామయ్యా! నీ వింటికి ఇంకా పని కల్పించాల్సి ఉంది’.
‘వివరంగా చెప్పండి నారదా!’
🍃🌺‘రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసిందనుకుంటున్నావు. అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకారేచ్ఛతో, వారు ఊగిపోతున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడనే రాక్షసులు నిన్ను గెలిచేందుకై సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు.
🍃🌺వారు, శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే, ఆ రాక్షసులను అడ్డుకోవడం కనా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోనవ్వాల్సి ఉంటుంది.
🍃🌺అందుకే రామయ్యా! నువ్వు త్వరగా ఆ ముష్కరులను అంతం చేసే దిశగా ఆలోచించు’
🍃🌺‘రామా! రావణుని సంహరించినందువల్ల అంతా ముగిసింద నుకుంటున్నాశ్. అందులో సగం మాత్రమే నిజం. అసురులు ఇంకా ఇద్దరు ప్రాణంతోనే ఉన్నారు. జరిగినదానికి ప్రతీకా రేచ్ఛతో, వారు ఊగిపోతున్నారు. రక్తబిందువు, రక్తాక్షుడనే రాక్షసులు నిన్ను గెలిచేందుకై సముద్ర అడుగు భాగంలో ఉండి తీవ్రమైన తపస్సు చేస్తున్నారు.
🍃🌺వారు, శక్తివంతమైన వరాలతో బయటపడ్డారంటే, ఆ రాక్షసులను అడ్డుకోవడం కనా కష్టం. ఫలితంగా ప్రపంచం అనేక కష్టాలకు లోనవ్వాల్సి ఉంటుంది. అందుకే రామయ్యా! నువ్వు త్వరగా ఆ ముష్కరు లను అంతం చేసే దిశగా ఆలోచించు’ నారదుని మాటలను విన్న రాముడు ఒక నిముషం ఆలోచించాడు. రాముని దీర్ఘా లోచన నారదులకు ఏమీ అర్థం కాలేదు. ఈ స్వామి ఇంతసేపు ఆలోచిస్తున్నాడేమిటి? అదే విషయాన్ని స్వామి దగ్గర అడిగాడు.
🍃🌺‘అంత దీర్ఘాలోచన ఏమిటి రామా?!’ నారదుడు చిరునవ్వు నవ్వాడు.
‘నారదా! నేను ప్రస్తుతం అయోధ్యకు తిరుగు పయనమయ్యాను. మీకు తెలుసు కదా! నేను చెప్పిన సమయంలోపు అయోధ్యకు చేరుకోకపోతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఏం చేయాలి?
‘లక్ష్మణుని పంపవచ్చు కదా!’
‘తను నా నీడవంటి వాడు మహర్షీ! నన్ను వదలి ఉండనని శప థం చేసాడు కదా! ఆ సంగతి కూడా మీకు తెలుసు కదా’ అని మా ట్లాడుతున్న రాముని దృష్టి హనుమంతునిపెై పడింది.
🍃🌺రాముని వదనారవిందం ప్రకాశవంతమైంది.
‘ఆంజనేయా! ఇలా దగ్గరకు రావయ్యా’ అని పిలిచాడు.
‘స్వామి?!’
‘నా ప్రియమైన హనుమంతా! రాక్షస సంహారం నీ చేతుల మీదు గా జరుగనివ్వు’ అని ఆతతిచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. క్షణంలో ఆంజనేయునికి స్వామి ఆనతిచ్చిన విషయం ముల్లోకాలకు పాకింది.
🍃🌺అసురశక్తులను కూకటివ్రేళ్ళతో పెకిలించి వేయాల్సిన యుద్ధం కదా! అక్కడ ముక్కో టి దేవతలు గుమిగూడారు. ఆంజనేయుని విజయం కోసం దేవతలంతా ఆశీర్వదిం చారు. జయజయుధ్వానా లతో ఆ ప్రాంత మంతా ప్రతిధ్వనించింది.‘జయమగుగాక!’ అని ఆశీర్వదించిన విష్ణు భగవానుడు, తన శం ఖుచక్రాలను హనుమంతునికి ఇచ్చాడు.
🍃🌺ఆ శుభదృశ్యాన్ని చూసి న బ్రహ్మ దేవుడు, తన బ్రహ్మ కపాలాన్ని అనుగ్రహిం చాడు. ఇలా ఒక్కొక్క దెైవం తన శక్తియుక్తులను హనుమంతునికి అందించ సాగారు. అన్ని ఆయుధాల ను స్వీకరించిన ఆంజనేయు డు పది చేతులతో, ఆ చేతులలో పది ఆయుధాలతో గోచరించాడు.
🍃🌺ఆహా! ఆ దృశ్యం ఎంత అద్భుతం!!
🍃🌺అక్కడ శివపరమాత్మ అరుదెంచాడు. హనుమంతుని చూసాడాయన. పదిచేతులలో పదిరకాలెైన ఆయుధాలు! ఆ రూపంలో ఆంజనేయుడు అద్భుతంగా ఉన్నాడు. తను హనుమకు ఏదో ఒకటి బహుకరించాలి. ఇంతకీ తనేమివ్వాలి?! వెంటనే తన మూడవకన్నును ఆంజనేయునికి బహూకరించాడా భోళాశంకరుడు.ఈ ఆంజనేయస్వామి రూపాన్ని చూసినంత మాత్రంలోనే రాక్షసుల గుండెలు ఆగిపోవా?! గరుడభగవానుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి?హనుమంతునికి తన రెక్కలను బహూకరించాడు.
🍃🌺అలా రాక్షసులను అంతమొం దించేందుకై హనుమ బయలుదేరు తున్న సమయం. అక్కడ శివపరమా త్మ అరుదెంచాడు. హనుమంతుని చూసా డాయన. పదిచేతులలో పదిరకాలెైన ఆయుధాలు! ఆ రూపంలో ఆంజనేయుడు అద్భుతంగా ఉన్నాడు. తను హనుమకు ఏదో ఒకటి బహుకరించాలి. ఇంటకీ తనేమివ్వాలి?!
🍃🌺వెంటనే తన మూడవకన్నును ఆంజనేయునికి బహూకరించా డా బోళాశంకరుడు.
🍃🌺మూడుకళ్ళు, పదిచేతులతో, రెక్కలను విసురుకుంటూ హను మ రాక్షస సంహారానికి బయలుదేరాడు. త్రినేత్ర దశభుజ వీరాంజనేయస్వామి వస్తున్న శబ్దాన్ని విన్న రక్తబిందు, రక్తాక్ష రాక్షసుల గుండెలు అదిరాయి. భయంతో పరుగులు తీశారు.
🍃🌺హనుమంతుడు వదులతాడా ఏమిటి?
అదీ రామకార్యం కదా మరి!
మూడవకన్నును తెరిచాడు. పదిచేతుల్లోని ఆయుధాలను ప్రయోగించాడు. రాక్షస సంహారం జరిగింది. అయిన ఆంజనే యుని కోపం చల్లారలేదు. ఉగ్రరూపంతో తిరిగిరాసాగాడు. ఆయన కోపం చల్లారలేదు.
🍃🌺అలా వస్తుండగా, ఒకచోటుకి చేరుకునేసరికి ఆహ్లాదకరమైన ప్రకృతి ఆయన్ని ఆహ్వానించింది. ఆ ప్రశాంత వాతావరణం ఆయన కోపాన్ని చల్లబరిచింది. అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకున్నాడాయన. ఆయన ఆనందించిన ఆ ప్రదేశమే అనం తమంగళం. ప్రస్తుతం ఆస్వామి కొలువయిన పుణ్యస్థలం.
🍃🌺తమిళనాడులో చిదంబరం, కారెైక్కాల్ మధ్యన ఈస్ట్కోస్ట్ రోడ్డులో ఈ ఆలయాన్ని చూడగలం. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన శ్రీరాజగోపాలపెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో ఈ త్రినేత్ర దశముఖ ఆంజనేయస్వామి కొలు వయి ఉన్నారు. ప్రధాన ఆలయంలో ఉత్సవమూర్తిని దర్శించుకుంటాం.
🍃🌺రాజగోపాలపెరుమాళ్ ఆలయంలో కొలువయి ఉన్న అమ్మవారి పేరు పెన్బగపల్లీ అమ్మవారు. ఇంకా ఈ ఆల యప్రాంగణంలో శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు, ఆళ్వారులు, విష్వక్సేనుడు కొలువయి భక్తులను అలరిస్తు న్నారు. గర్భగుడిలో వాసుదేవుడు, ఉత్సవమూర్తి రాజగోపాలుడు ఉభయదేవరులతో దర్శనమిస్తున్నాడు.
🍃🌺విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయం లో మార్గశిరమాసంలో శ్రీవెైకుంఠ ఏకాదశి, కార్తీక మాసంలో దీపోత్సవం పండు గలు బ్రహ్మాండంగా జరుపబడు తుంటాయి. ఆషాఢ, పుష్యమాసాల లో ప్రతి శుక్రవారం అభిషేక ఆరాధన లు జరుగుతుంటాయి. నవరాత్రి ఉత్సవాలు చివరిరోజు విజయదశమితో కలసి బ్రహ్మాండంగా జరుపబడతాయి.
🍃🌺నెలలో అన్ని శనివారాలలో ఆంజనేయ స్వామికి అభిషేక ఉత్సవాలు జరుపబడుతుంటాయి. ఈ ఆల యంలో హనుమజ్జయంతి బ్రహ్మాండంగా జరుపబడుతుం టుంది. ఆ రోజున ప్రత్యేక అభిషేక పూజోత్సవాలతో పాటు, అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి గురువారం గరుడునికి ప్రత్యేక అభిషేక సేవ జరుపబడుతుంటుంది.
🍃🌺ఆలయం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరలా మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని పుష్కరిణిని హనుమాన్ తీర్థం అని పిలుస్తుంటారు.
🍃🌺ఈ ప్రాంత భక్తులు 48 రోజులపాటు హనుమాన్ దీక్షను తీసు కుని, కఠోరనియమాలతో దీక్షను సాగించి 48వ రోజున దీక్ష ను ముగిస్తారు. ఈ విధంగా దీక్ష చేయడం దల్ల అనుకున్న పనులతో విజయం లభిస్తుందని స్థానిక భక్తులు చెబుతుం టారు. ఈ క్షేత్రదర్శనం మనకు ఎన్నో శుభాలను చేకూర్చు తుంది. ఎందుకంటే ఆయన దగ్గర రామభక్తి అనే రసాయనం ఉంది. అందుకే ఆయన తనను ప్రార్థించిన భక్తులకు శుభా లను అందిస్తున్నాడు. వారు తలచిన కార్యాలను నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాడు. అంతా శుభకరంగా అనుగ్రహిస్తున్నాడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🙏 ఆంజనేయునికి తమలపాకుల మాల ఎందుకు? 🙏
🍃🌹సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు.
🍃🌹అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.
🍃🌹అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ… ఆకాశంలో పయనిస్తూ… గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు.
🍃🌹అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.
🍃🌹హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి.
🍃🌹అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
ఓం నమో భగవతే వాసుదేవాయ
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
శ్రీ భాగవతం - 102 వ భాగం
చదువుకుందాం భాగవతం
బాగుపడదాం మనం అందరం
దశమ స్కందము
శ్రీకృష్ణ లీలలు - 32
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
నరకాసుర వధ
కృష్ణ భగవానుడు తనంతతానుగా శక్తిమంతుడు. కృష్ణుడు లేని నాడు అష్టప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనంలోనే ఎందఱో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుడిని సంహరించడంలోకి వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు. తన ఎనమండుగురు భార్యలలో ఒక్క సత్యభామను తప్ప మిగిలినవారి నెవ్వరినీ తీసుకువెళ్ళలేదు.
ఇలా రామాయణంలో దశరథమహారాజుగారు కైకమ్మను తీసుకు వెడితే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధమునకు వెళ్ళడం వలన మనకు దీపావళి పండుగ వచ్చింది.
ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు, ఇంద్రుడు, దుర్వాసమహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి,
‘మహానుభావా కృష్ణా! నరకాసురుని ఆగడములు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలములను తస్కరించాడు. వరుణుడి ఛత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారము చేసే మణిపర్వతమును ఎత్తుకుపోయాడు. వాని ఆగడములు అన్నీ యిన్నీ కాదు. కృష్ణా, నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు.
అపుడు కృష్ణుడు, 'తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతల నందరిని సాంత్వన పరిచాడు. తరువాత తాను యుద్ధభూమికి బయలుదేరడం కోసమని రథమును ఎక్కుతున్నాడు.
సరిగ్గా అదే సమయమునకు సత్యభామ అక్కడికి వచ్చింది.
సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తయిన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. ‘నాథా, మీతో యుద్ధ భూమికి వద్దామనుకుంటున్నాను’ అంది. కృష్ణ పరమాత్మ అన్నారు – ‘సత్యభామా! యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావు. రోజూ నాతో ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల ఝుంకారములు వినపడవు. బ్రహ్మాండమయిన ఏనుగులు తొండములను ఎత్తి ఘీంకారములు చేస్తుంటాయి. అక్కడ పద్మములనుండి వచ్చే పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరుగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కలనుండి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచి పెట్టిన బాణపరంపరలు వచ్చి మీదపడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలయిన పక్షులతో కూడిన సరోవరములు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో భయంకరమయిన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు నాతో రావద్దు’ అన్నారు.
అపుడు సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా ఎంతో ప్రియముగా చక్కటి మాట చెప్పింది. "ఆయుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా అక్కడ దైత్య సమూహములే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను." అని ప్రార్ధన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధ రంగమునకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. ఇద్దరూ గరుత్మంతుని అధిరోహించి యుద్ధభూమిని వెళ్ళారు.
ప్రాగ్జ్యోతిషపురమునకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. పరమాత్మ ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారము చేస్తూ ఆ దుర్గములనన్నిటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యమును చేతిలో పట్టుకొని ప్రళయకాలంలో మేఘము ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యమును పూరించారు.
మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిషపురమును మురాపాశములతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు. మురాసురుడు పైకి వచ్చాడు. తన అయిదు తలలతో వాడు బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచ భూతములను మ్రింగివేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలోనుండి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదా ప్రహారముతో మురాసురుని శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు.
మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధమునకు వచ్చారు. ఆ ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ నిర్జించారు. ఈవార్త నరకాసురుడికి చేరి యుద్ధమునకు వచ్చాడు.
నరకాసురుడు ఆదివరాహ మూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు. వాడు పధ్నాలుగు భువనములను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడివేసింది. తను వేసుకున్న హారములు అవీ బయటకు వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడ భయం కనపడడం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వ్రేలాడకుండా బొడ్డులో దోపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి, ‘నాథా, ధనుస్సును ఇలా యివ్వండి’ అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి.
రాక్షసుల మస్తకమును ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనుస్సును ఎడమచేతితో పట్టుకుని వంచి వింటినారిని విప్పి వంగి కుడిచేతితో కట్టింది. ఈ దృశ్యమును చూసి కృష్ణ పరమాత్మలో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనుస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్దమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీరరసము, శృంగార రసము, భయ రసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రానురాను యుద్ధం పెరిగిపోతోంది. స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు.
మూడు లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది.
భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేసి ముంగురులన్నీ నుదుటికి అంటుకుపోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు ‘సత్యా! నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను. అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు.
అపుడు నరకాసురుడు అన్నాడు, ‘చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే యిప్పుడు యుద్ధమునకు రావలసింది’ అన్నాడు. ఈమాటలు విన్న కృష్ణుడు, నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను’ అని తన చేతిలో వున్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా దుళ్ళి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాదనే పరమ సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకములయందు దీపములను వెలిగించారు.
వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాము.
దీని వెనకాల ఉండే రహస్యమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి.
యథార్థమునకు నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు. నరకాసురుడు ఆదివరాహ మూర్తికి, భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాక్ – జ్యోతి అనగా మొదటి నుండి వున్న జ్యోతి – అనగా ఇక్కడే ఉన్న ఆత్మా వస్తువు. ఈ ఆత్మా వస్తువును తెలుసుకోవడానికే మనం ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురమునకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. మాహిష్మతీ పురమునకు వెళ్ళాడు. మాహిషి అనగా మహిష ప్రవృత్తి – దున్నపోతు లక్షణం. వాడు మురాసురుడు, నిశుంబుడు, హయగ్రీవుడు అనబడే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. సత్వరజస్తమో గుణములనే మూడు గుణములతో స్నేహమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ మూడు గుణములలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురమునుండి మాహిష్మతీ పురమునకు వచ్చేశాడు.
బ్రహ్మగారి గురించి తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై, ’నీకు ఏమి కావాలి’ అని అడిగారు. ఇది భాగవతం లోనిది కాదు. తనకు మరణం ఉండకూడదని అన్నాడు. ‘కుదరదు మరొకవరం కోరుకొనమ’ని చెప్పారు. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మగారు ‘అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం యిస్తాను, పుచ్చుకుంటావా’ అని అడిగారు. అంటే వాడు అనుకున్నాడు ‘అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా! కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్దనుండి వరమును పొందాడు. తాను అమ్మచేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడు. తెలుసుకోలేక అదితి కుండలములను అపహరించాడు. ఆకాశమునకు ప్రకాశించే రెండు కుండలములు సూర్య చంద్రులు. వాటిని దొంగిలించాడు, కాలము యొక్క ప్రసరణ తనమీద లేదన్నాడు. తనకు మరణం లేదన్నాడు.
మాయ అనగా ప్రకృతి. ప్రకృతి అంటే పధ్నాలుగు భువనములు. అవే చతుర్దశి. చతుర్దశీ కన్యను వివాహం చేసుకున్నాడు. అనగా 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగ భాగ్యములన్నీ శాశ్వతము అనుకున్నాడు. అనేకమంది రాజుల దగ్గరికి వెళ్లి వారిని చంపి ఆ పిల్లలను తీసుకువచ్చే వాడు. తాను తెచ్చిన ఏ స్త్రీనీ అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. నరకాసుర వధ అయిన తరువాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకానగరం పంపించి వేసి యింద్రుడి దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత ఈ 16 వేల మందికి 16 వేల అంతఃపురములను కట్టి ఏకముహూర్తము నందు ఒకే కృష్ణుడుగా కనపడుతూ 16 వేల రూపములతో వివాహం చేసుకున్నాడు. 16 వేలమందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని పదహారు కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడు తల్లి చేతిలోనే చచిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది.
సత్య అనగా మారనిది అని అర్థం. ఈ ప్రపంచంలో మారనిది పరమేశ్వరుడు మాత్రమే. మారని వాడు సత్యము అయితే ఆ సత్యము ‘భా’ – అనగా కాంతి – ‘మ’ అనగా సంపద – సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. భా – ఈశ్వరుడు ‘మ’ – సంపద. సత్యభామ – భూదేవి – ఐశ్వర్యం.
గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది ఈశ్వరుని సొత్తయిన భూసంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ.
సత్యభామాదేవి వృత్తాంతమును ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మ జ్ఞానము ఒక జన్మలోనయినా కలుగుతుంది. సత్య-భా-మ ఈశ్వరుడి కాంతి సంపద యుద్దమును వింటున్నారు. ఆ యుద్ధము అజ్ఞానము మీద ఉంటుంది. కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మనకోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు.
🙏 శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో....... 🙏
🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 53 🕉
అయవారై చరియింపవచ్చుఁ దన పాదాం(అ)భోజతీర్ధంబులన్ దయతోఁ గొమ్మనవచ్చు సేవకుని యర్ధప్రాణదేహాదులన్నియు నా సొమ్మనవచ్చుఁగాని సిరులన్నిందించి
నిన్నాత్మనిష్క్రియతం గానఁగరాదు పండితులకున్ శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా! లోకములో కేవలము శుష్కమగు పాండిత్యము కలవారు ’అయ్యవారు’ అయి తమ శిష్యుల దగ్గరకు సంచారార్ధమై పోవచ్చును, సేవలు చేయించుకోవచ్చును.
🌹తమ పాదోదకము వారితో త్రాగిం
చి అదియే వారియెడ తమ అనుగ్రహమని చెప్పవచ్చును.
🌹ఇట్టివే మరికొన్ని చేసినను సిరులు, ప్రాపంచిక భోగములందు వాస్తవిక వైరాగ్యము కలిగి ఆత్మనైష్కర్మయోగముతో అమనస్క యోగమున నిన్ను దర్శించుట మాత్రము వారికి శక్యము కాదు.
🙏 ఓం నమః శివాయ 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
🌻 మహా భారతం 🌻
🩸 భాగము 4 🩸
💧 కీలక వృత్తులలో 💧
🍃🌺పాండవులు, ద్రౌపది ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం విరాటరాజు కొలువులో చేరారు. మొదట కంకుభట్టారక పేరుతో విరటుని ముఖ్య సలహాదారునిగా, రాజుకి కుడిబుజమైనాడు. భీముడు కమ్మటి భోజనానికి లోటు లేకుండా వలలుడు పేరుతో వంటశాలను కైవసం చేసుకున్నాడు.
🍃🌺పాండవ మధ్యముడు బృహన్నలగా, ఆస్థాన నాట్యాచార్యునిగా గజ్జెకట్టాడు. అశ్వహృదయాలను పసికట్టగల చాతుర్యం వుందని నకులుడు దామగ్రంథి అనే మారుపేరుతో అశ్వశాలను ఆక్రమించాడు. గోశాలలో గోసేవకు సహదేవుడు తంత్రీపాలుడు అయ్యాడు. ద్రౌపది పట్టమహిషి సుధేష్ణకు సపర్యలు చేసే దాసిగా మాలిని పేరుతో అంతఃపురంలో స్థిరపడింది.
🍃🌺వారు ఆరుగురు విరాటకోటలో అలా చేరడంలో వ్యూహం వుంది. ఎల్లపుడూ రాజు సరసన వుండే కంకుభట్టారకునికి లోకవిషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తూ వుంటాయి. వృకోదరుని భోజన పరాక్రమం చూస్తే, ఎవరైనా భీమునిగా యిట్టే పసికట్టగలరు. ఇప్పుడు వండివార్చేదీ, పాకశాలలో తొలిగా రుచులు చూసేదీ తనే. కనుక సమస్యలేదు.
🍃🌺అర్జునుడు అంతఃపురానికి, ఉద్యానవనాలకు పరిమితమైనాడు. లోకవ్యవహారాలు మొదట అంతఃపురాలలోనే పొక్కుతాయి.
🍃🌺ద్రౌపది పట్టమహిషి సేవలోనే వుంటుంది కాబట్టి ఆమెకు తెలియని విశేషాలు వుండవు. అశ్వశాలకు తెలియకుండా రథం కదలదు. కనుక దేశంలో గాని, సరిహద్దుల్లో గాని ఏమాత్రం అలజడి అయినా మొదట తెలిసేది అశ్వశాలకే! అక్కడ నకులుడు వున్నాడు. ఆ రోజుల్లో రాజ్యసంపదలంటే భూమి, గోవులు మాత్రమే. గోధనం సహదేవుని పర్యవేక్షణలో వుంది.
🍃🌺అంటే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల చేతిలో ఆ రాజ్యపు ఆయువు పట్లు అన్నీ వున్నాయి. దుర్యోధనుడు తన అనుచరులతో వీరి అజ్ఞాతదీక్షను భగ్నం చేసి, మళ్లీ శిక్షను మొదటికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తూనే వుంటాడని వీరికి తెలుసు. విరటుడు చాలా చిన్నరాజు. కురు రాజు తలచుకుంటే విరటుడు ఎదురు నిలువలేడు.
🍃🌺కాని, ఇపుడు ప్రచ్ఛన్నులై పాండవులు ఆ రాజ్యంలో రాజు నీడలో తలదాచుకున్నారు. ప్రభువు తలలో నాల్కలై వారు నడుచుకుంటున్నారు. సుభిక్షంగా రోజులు గడుస్తున్నాయి.విరాటరాజు నిండుసభలో కొలువు తీరి వున్నాడు. భారీకాయంతో, తాబేళ్లవలె కదలుతున్న కండలతో వచ్చిన వ్యక్తి మహారాజుకి వినమ్రుడై నమస్కరించాడు.
🍃🌺‘‘మహారాజా, నన్ను జీమూతుడు అంటారు. మల్ల యోధుడను. నేల నాలుగు చెరగులా తిరిగి, నాతో తలపడగల వీరుడు దొరక్క విసిగి వేసారి పోయాను. చివరి ప్రయత్నంగా తమ సన్నిధికి వచ్చాను. తమ ఆస్థానంలో నాకు సరిజోడీగా నిలబడగల ధీరుడుంటే రప్పించండి.
🍃🌺నా బలప్రదర్శన ద్వారా తమకు వినోదం పంచుతాను. దానితోపాటు నా శక్తిసామర్థ్యాల నిరూపణకు మంచి అవకాశమూ వస్తుంది’’ అన్నాడు. ఆ యోధుని మాటలు విన్న మహారాజు కొలువును కలయ చూశాడు. ఆస్థాన మల్లులు తలలు వంచి తమ అసహాయతను మౌనభాషలో వెల్లడించారు. మహారాజు తలదించుకుని, ఆలోచనలో పడ్డాడు.
🍃🌺అంతా గమనిస్తున్న కంకుభట్టు ‘‘మహారాజా, మన పాక నిపుణుడు యితనికి దీటైన వాడుగా తోస్తోంది. అతన్ని రప్పించండి’’ అని సవినయంగా సూచించాడు. మరుక్షణం వలలుడు మల్లరంగంలో సిద్ధంగా నిలిచాడు. యోధులిద్దరూ జబ్బలు చరుచుకుంటూ పరస్పరం కలబడ్డారు. రకరకాల మల్లబంధాలతో చిత్రవిచిత్రగతులతో వలలుడు విజృంభించాడు.
🍃🌺జీమూతుడు తట్టుకోలేక మూల్గులతో నేలకొరిగాడు. విజయాన్ని వరించిన వలలుడు ఆతని మూపున మోకాలుంచి, గర్వంగా సభాసదులను పరికించాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రాజుగారికి, అన్నగారికి వినమ్రంగా నమస్కరించాడు. మహీపతి తన పరువును, రాజ్యప్రతిష్ట
ను నిలిపినందుకు వలలుని ఉచితరీతిన సత్కరించాడు. సమయానికి తగు సూచన చేసిన కంకుభట్టారకుని మనసా అభినందించాడు.
🍃🌺ఆనందం వొకవైపు, నిజరూపాలు బయట పడతాయనే భయం మరొకవైపు సోదరులను అనుక్షణం ఆవరిస్తున్నాయి. వారి వారి మారువేషాలలో, అద్భుతంగా పాత్రపోషణ చేస్తూ, అజ్ఞాతవాసంలో పదిపున్నములను వె ళ్లదీశారు. ఇక రెండు మాసాలు గడిస్తే, గడ్డుకాలం పూర్తవుతుంది- అని వారు వూరట చెందుతూ, రోజులను లెక్కలు కడుతూ వుండగా.....
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
మౌనం మహా భాగ్యం
రోజూ ఒక్క అరగంట లేదా కనీసం పది నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం మీ సొంతమవ్వటమే కాదు. మీ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరతాయి. ఇదెలా సాధ్యం అంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఎలా సాధ్యమో. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎంత సేపు మౌనంగా ఉంటాం?
మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోని కార్యక్రమాన్ని చూస్తూనో, కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం కాదు. మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం. ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా, మనసులో ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అంటే మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి.
అదే కళ్ళు మూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి. కనీసం ఓ పదినిమిషాలు చాలు. కళ్ళు తెరిచాక ఎంతో హాయిగా ఉంటుంది. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనమంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు అరుపులు అక్కడితో అయిపోతుందా, అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మౌనంగా ఉండటాన్ని ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామం ఏదైనా పిలవండి ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పె
ట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతే కాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి.
Thank u, good information
ReplyDelete