Friday, 22 January 2021

25--01--2021


 

 

మాతృశ్రీ వందనం
 
రక్షణాపేక్ష సతతము ప్రత్యక్షమమ్మా
శిక్షణాపేక్ష నియమిత ప్రభుత్వమమ్మా
కక్షసాధింపు మరచియు ప్రెమత్వమమ్మా
లక్షణం తిద్ది మనుగడ ప్రభావమమ్మా
 
పాలించు నట్టి సౌభాగ్య మూర్తివమ్మా
దీవించు నట్టి సౌలభ్య శక్తివమ్మా
శిక్షించు నట్టి నిర్మోహ దివ్వెవమ్మా
శాశించు నట్టి తల్లీవి నువ్వెనమ్మా
 
చల్లదనం బిచ్చు చతుర మూర్తివమ్మా
వెచ్చదనం పంచు మమత మూర్తివమ్మా
కమ్మదనం విందు తొ సమవర్తి వమ్మా
తియ్యదనం పొందె తెలుగుధాత్రి వమ్మా
 
కిన్నర గంధర్వ కింపురుషాదులే కొల్చితిరమ్మా
భవ్యత భందుత్వ భాద్యతవాదులే కొల్చితిరమ్మా
మన్నన మౌనత్వ మంధరదాసులే కొల్చితిరమ్మా
చిన్మయ రూపత్వ సుందరతల్లిగా కొల్చితిరమ్మా
 
--(())--

 

మధురిమలు ..చిందుల్ (254.. 261)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
 
మేఘ మందలి జలమ్ముల్
మంచు తుషార బిందువుల్
చింత కల్గిన భావనల్
చిత్త మందు జలపాతాల్
 
ముత్తెపు చిప్ప ముత్యముల్
మగని నవ్వు ముత్యముల్
మనసు మేలి ముత్యముల్
మగువ మనసున ముత్యముల్
 
అందరికి వందనీయుల్
సతి మాట వందనీయుల్
పతి మాట వందనీయుల్
పెద్దలకు వందనీయుల్
 
చిన్నారి చూపు నగవుల్
గురు ఆశీర్వచనల్
తల్లి హృదయ చిందుల్
తండ్రి కళ్ళ మెరుపుల్
\
కృషితో నాస్తి దుర్భిక్షమ్
శ్రమతో నాస్తి దరిద్రమ్
ధైర్యం తొ నాస్తి భయమ్
కాలంతొ నాస్తి మోసమ్
 
చూడాలి ప్రకృతి వింతల్
అనుభవం తీర్చు పంతాల్
అభినయనంతొ నృత్యముల్
అభిమానంతో ప్రశ్నల్
 
కాలమే మార్పు తెచ్చున్
చరితకు పునాది వేయున్
అనాది కథలు చెప్పితిన్
జగతి చూపును అందముల్
 
ఇంటింటా బంధమ్ముల్
కల్పు చుండే హృద్యముల్
అందరి సంతోషమ్ముల్
తొలగునే సర్వ చింతల్
 
--(())--
 

(1) 'పాట' వినబడితే చాలు…'బొమ్మ' పడాల్సిందే..!!
మన్నెం శారద గారి 'చిత్ర' కళా రచన‌....
తీరు తెన్నులు.!!
 
*సంగీత సాహిత్య సమలంకృతే .......
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి
హే భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసా నమామి
శ్రీ భారతి శిరసానమామి…"
 
అన్నీ పాట వినబడిందనుకోండి..ఆమె కుంచె వీణా చేతిలోవున్న సరస్వతీ దేవి చిత్రాన్ని చిత్రిస్తుంది.పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్య
మెంతో ....
 
గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలేవోఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశం లో కానరాని భాస్కరులెందరో.."
అన్న దాశరథి గారి గేయం చెవుల్లో పడిందో లేదో …
సముద్రం గర్భంలో దాగిన బడబాగ్ని దృశ్యం
చిత్రంగా ఆవిష్కరించబడుతుంది.
 
ఆ మనసులోనా ...ఆ చూపులోనా పరుగులెత్తే మృదుల భావనామాలికలఅర్థమేమిటో తెలుపుమా ...ఆశ యేమిటో చెప్పుమా *ఆ కులుకులోనా ....ఆ పలుకులోనా
పెనవేసుకొనియున్న ....వెలికిరాలేకున్న
 
తలపులేమిటో తెలుపుమా ....వలపులేమిటో చెప్పుమా …"!!
పల్లెటూరు సినిమా లో ఈ పాటవిని..ఎంతగానో నచ్చి వెంటనే చిత్రాన్ని గీసేశారు.
ఇక.."ఆందెల రవమిది పదములదా?
అంబరమంటిన హృదయముదా ..అంటే..
 
ఆమె కుంచెతో చూడాల్సిందే.
"నయన తేజమె న కారమై
మనో నిశ్చయం మ కారమై
శ్వాస చలనమె శి కారమై
వాంచితార్ధమె వా కారమై
యోచన సకలము యః కారమై
 
నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం
ఓం నమఃశివాయ.....".అన్నీ గీతాన్ని వింటూనే ..
ఆమె కుంచె కొండల్లో,కోనల్లో పురివిప్పి నర్తించే
ఓ నర్తకీమణిని చిత్రిస్తుంది..ఇదంతా అలవోకగా జరిగే ఓ చిత్రకళా ప్రక్రియ.నాదానికి, చిత్రానికి
మధ్య వున్న ఓ అసంకల్పిత చర్య.
 
ఆమె ఎవరో కాదు...కవి,కథ,నవలా రచయిత్రి,
చిత్రకారిణి,మన్నెం శారద.ఆమె తన వర్ణ చిత్రాల్ని
భావోద్వేగపు వర్ణమిశ్రమంలో ఇంత కన్నీటిని కలగలిపి చిత్రిస్తుంటూ వుంటుంది.‌అందుకే …
ఆ చిత్రాల్లో అన్ని భావోద్వేగాలూ కనిపిస్తూ….
వుంటాయి‌
 
"మమతలన్నీ మౌనగీతం ...
వాంఛలన్నీ వాయులీనం ...
వేణువైవచ్చాను ...భువనానికి
గాలినైపోతాను గగనానికి…"అన్నప్పుడు
పరవశించి పాడే పిల్లన గ్రోవి మన ముందు
నిలుస్తుంది..
 
*ఆకులో ఆకునై ....
పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై ....
నునులేతరెమ్మనై ....
ఈ అడవి దాగిపోనా ....
ఎటులైన ఇచటనే ఆగిపోనా ",
అంటూ ఓ ప్రకృతి ప్రియురాలి పారవశ్యాన్ని
కళ్ళారా చూపిస్తారు శారద గారు.
శ్రీమహాలక్ష్మియట సింగారాలకేమరుదు ...
 
కాముని తల్లియట చక్కదనాల కేమరుదు ...
సోముని తోబుట్టువుట సొంపు
కళల కేమరుదు .....
కోమలాంగి ఈ చూడికుడుత నాంచారి ...
చూడరమ్మ సతులాల
సోబాన పాడరమ్మ
కూడున్నది పతి ఈ చూడికుడుత నాంచారి ...
[అన్నమయ్య కీర్తన ]
ఆమె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ.నుదుట బొట్టు.
అందాల తల్లి..కామునికి జన్మనిచ్చింది.సోము
ఇంతటి వాడికి తోబుట్టువు.కళల కాణాచి.కోమలాంగి..ఓ చిత్రకారిణికి ఇన్ని
సలక్షణాలుంటే..ఇక బొమ్మ అదిరిపోదా..!
నిజంగానే అదిరిపోయే బొమ్మను గీశారు శారద
గారు..!!
 
వెన్నెలలోనే వేడియే లనో ...వేడిమిలో నె చల్లనేల
నో ఈ మాయయేమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలీ .....ఒక ధ్యానంలా ఏ వేళయినా ఇలా బొమ్మలు వేసుకునే అవకాశం తనకు దొరకడం నిజంగా ఒక అదృష్టం గా భావిస్తుంటారు శారద గారు.గగనాలదాకా అలసాగకుంటే మేఘాలరాగం ఇలాచేరుకోదా ..తరలిరాద తనెవసంతం తనదరికి
 
రాని వనాలకోసం ...అన్నట్టు ఏదైనా మంచి భావం
వినబడితే చాలు ...అంతే మంచి చిత్రం రూపు
దిద్దుకుంటుంది.
*అలా జరిగిపోయింది..అంతే..!!
 
నిజానికి శారద గారికి రచయిత్రి కావాలనో ,ఆర్టిస్ట్ కావాలనో ఆశయాలూ కోరికలేం లేవు. ఏదో సరదా గా డాన్స్ కూడా కాస్తంత తెలుసు. శాస్త్రబద్ధంగా ఏవీ రావంటారామె.. అయితే ఇవన్నీ అంటే పిచ్చి. ఇష్టం.రచనల విషయానికొస్తే .కేవలం ఆమెమనసు
లోంచి వచ్చిన ఆలోచనల్ని అలా రాసుకుంటూ….. పోయేవారు. .బొమ్మలు కూడా అంతే !!
*రచనలు..‌!!
 
అనుకోకుండా రచయిత్రి అయ్యాక ఆమె రచనల్ని అందరూ అభిమానిస్తున్నప్పుడు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు ,పేరు ప్రఖ్యాతులకోసం అవార్డ్స్ కోసం ప్రాకులాడలేదు ,ఇస్తే తీసుకున్నారు., ఇవ్వకపోతే పట్టించుకోలేదు ,అంతే !
ఒక్కోసారి సరైన సబ్జెక్ట్ దొరకక పోతే సంవత్సరాలు తరబడి రాసేవారు కాదు."గర్వం ,అబద్ధమూ అనుకోకపోతే నామనస్సు లోనుండి వస్తున్న భావాలకి అనుగుణంగా తగిన వేగం నా కలం అందుకోలేకపోయేది .". అంటారామె.
 
చిన్నతనం లో చాలా ప్రాంతాలు తిరిగారు.తనకు తెలియకుండానే ఆయాప్రాంతాల మాండలీకాలూ వాళ్ళ ప్రవర్తన అన్నీ గమనించేవారు. .అవి అలానే మస్తిష్కం లో నిక్షిప్తమవడం వలన ఆమె తడుము
కోకుండా ఆయాసన్నివేశాలలో ఆ పాత్రల స్వభావా
లు ,మాటలు రాసేసేవారు.
"పిలుపు నీ కోసమే 'నవల చదివి చాలా మంది ఆమెను పల్నాడుకి చెందినవారనుకొనుకుని ప్రేమతౌ ఉత్తరాలు ప్రేమతో రాశారు. ఆ విధంగానే ఆమె నిదురించేతోటలోని సరోజినీ మనకథ నిజం కాదా? "నవలలోని పాపాయమ్మ పాత్రలు ,పుట్టుకొచ్చాయి.
*చిత్రకళ…!!
మనసు అస్థిమితంగా ఉన్నప్పుడో ,ఆందోళనగా ఉన్నప్పుడో ఇలాంటి పెయింటింగ్ వేస్తుంటే ఏటో వెళ్ళిపోతాం .కారణం దానికి వేసే షేడింగ్స్ ! ఎంత వేసినా ఇంకా వెయ్యాల్సింది మిగిలి పోయినట్లే ఉంటుంది .అసలు చిత్రకళే అంత !ఒక గంటలో ముగించవచ్చు ,ఒక సంవత్సరం మెరుగులుదిద్దు
తూ కూర్చోవచ్చు .బాలూ గారికి బాగోలేదన్నారు ,
కోలుకుంటున్నారనగానే ఆనందపడ్డాం .మళ్ళీ ఇలా .బాధ కదా !చెదిరిపోయిన హృదయాన్ని చిక్కబట్టు
కోవడానికే ఈ చిక్కని రంగులు !"అంటారు శారద గారు.
*తనివి తీరని దృశ్యాలు..
"తనివి తీరలేదే ...నా మనసు నిండలేదే ."అని
ఓ సినీ కవి అన్నట్లు..మంచుతెరల్లో దాక్కున్న ప్రాతఃకాల సౌందర్యం ఎంత చూసినా ,ఎంత వర్ణించినా తనివి తీరనిదే !అసలు మార్గశిరమే అంత!హేమంతఋతువులోని ఈ మొదటిమాసం మహత్తరమైనది .బంతీ చామంతులతో బయళ్లన్నీ కన్నులపండుగ చేస్తుంటాయి బలంగా వీచేచలిగాలు
లమధ్య పచ్చటి నేలపై అతివలు దిద్దిన రంగవల్లు
ల అందాలు వర్ణించ ఎవరి తరమూ కాదు .
నిజంగా స్త్రీలంతా అద్భుతమైన చిత్రకారిణులే కదా ఈ శీతాకాలం వాకిళ్ళన్నీ వాళ్ళ కాన్వాసులే !
ఇంత చలిలోనూ తలస్నానాలు చేసి పూల సెజ్జలతో పట్టుచీరలు ధరించి గుడులకి సాగే అతివలు , దూరంగా ఆలయాలనుండి మంద్రంగా వినవచ్చే గంటల సవ్వడులూతెలతెలవారుతుండ
గా చెట్లమీద రాత్రి కురిసిన మంచు బిందువులపై మెరిసే లేలేత సూర్యకిరణాల సొగసులూ ...ఓహ్ ఎంతచూసిన తరగని అందాన్ని ఆనందాన్ని మరీ మరీ చిత్రించకుండా ఉండలేక మన కోసం శారద
గారు గీసిన బొమ్మలు .. అద్భుతః.!!
*హిందీ పాటలు కూడా..!!
భాష ఏదైతేనేం?.భావం ముఖ్యం...కళాకారులకు
భాషాభేదాలుండవు.అందుకే శారద గారు హిందీ
పాటలకు కూడా అందమైన రంగులద్దారు
"యే మేరా ప్రేమపత్ర్ పడకర్ ....
కె తుమ్ నారాజ్ న హోనా ....
కె తుమ్ మేరీ జిందగీ హో...
కె తుమ్ మేరీ బందగీ హోం …"!!
*హే నీలే గగన్ కె తలే ....ధర్తీ కా ప్యార్ పలె
ఐసే హి జగ్ మె ..ఆతి హై శుభ్ మే .......ఐసీ హి శామ్ డలే "[ఈ సంవత్సరానికి ఇది ఆమెఆఖరి రంగుల బొమ్మ ] వంటి పాటలకు అర్ధాలను శారద
గారి చిత్రాల్లో వెదుక్కోవడం ఓ ప్రివిలేజ్.!!
"ఇక.. సంక్రాంతి పండుగ సంబరాలు..
"పాడిచ్చే గోవులకు పసుపు కుంకం
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
కష్ఠించే రైతులకు కలకాలం సౌఖ్యం ...
కలకాలం సౌఖ్యం ..
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి రావమ్మా"!!
*కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి...
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్లు
రావమ్మా మహాలక్ష్మి ...రావమ్మా
"గోగులు పూచే గోగులు
కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే
వారెవరమ్మ ఓ లచ్చ
గుమ్మాడి.....
పొద్దు పొడిచే పొద్దు
పొడిచే.ఓ లచ్చా
గుమ్మాడి
పుత్తడి వెలుగులు
కొత్తగా మెరిసే.ఓ లచ్చా
గుమ్మాడి..........."!!
వంటి అచ్చ తెలుగు పాటలకు ఆమె చిత్రాలు
అచ్చుబోసినట్లుంటాయి.
దూరాన నీలిమేఘాలు
నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు
తొంగి చూసేను కన్నె సరదాలు......
*కవితా చిత్రాలు…!!
కేవలం సినీ పాటల చిత్రాలే కాదు..తన కవిత్వానికీ
అందమైన.భావయుక్తమైన చిత్రాలను గీస్తారు శారద
గారు..
"మనసుకొక గాయం చాలు ....
గట్టిపడి స్పందన కోల్పోయిన గుండెని
కదిలించి కుదపడానికి
ఎక్కడో ఓ మూల గుడికట్టిన మేఘాలు చీకటిని పంచుతుంటాయి
ఓదార్చవచ్చిన చల్లగాలుల్ని చుట్టుకుని
ఆకాశం భోరున వర్షిస్తుంది
ఇప్పుడు ..ఈ క్షణం నిన్ను కలవాలని
నీతో ఊసులు చెప్పాలని తొందరపడుతుంది మనసు !
దారులు దొలఁచి రైలుకన్నా వేగం గా వస్తానా
నువ్వప్పుడు దొరకనే దొరకవు !
ఈ అడవిదారిలో అకస్మాత్తుగా ఒంటరినయిపోతాను నేను !
ఏదో పొగమంచులా మనసుని చుట్టుకున్న నిస్సహాయత !
చాలా రోజులతర్వాత రాస్తున్న నా కధలో
నేనే ఒక పాత్రనయి చిత్రంగా ఒదిగి పోతాను
వానచినుకులు కొన్ని ......తోడయి
నా కన్నీటినికూడా కలుపుకుని క్రిందకి జారిపోతాయి
పాతదేకానీ మరోసారి ...
మనిషితో మొలక అన్నదీ ......"!!
... మన్నెం శారద..!!
*నువ్వు పదే పదే సమూహం లో చేరి
దయవీడి ... రాక్షసుడవై ...
 
మొలకెత్తిన ప్రతీసారి నిర్దయతో నన్ను మొదలంటా చిదిమే స్తూనే ఉంటావు
నేను నిలువెల్లా ఆకు పచ్చని ప్రేమ [ప్రాణ ] 
వాయువునై నీపై దయతో తిరిగి తిరిగి మొలకెత్తి చిగురిస్తూనే వుంటాను'!!
‌ .. మన్నెం శారద..!!
 
"బాలుడతడు ....
పుట్టీ పుట్టగానే ఆకాశ కాన్వాసు మీద రంగులద్దాలని ఆశపడ్డాడేమో అమ్మకి చెప్పకుండ ఏడురంగులపెట్టె ఎత్తుకొచ్చాడు
దారిలో జారవిడుచుకున్నాడేమో ,,, 
 
ఏమో నింగి అంతా రంగుల మయం లోకమంతా వెలుగులమయం అవును ...బాలుడతడు
లోకబాంధవుడతడు…"!!
 
వంటి కవితలకు శారద గారి బొమ్మలు ఎంతోసహజంగా నప్పాయంటే...అతిశయోక్తి కాదు..
శారద గారు‌..పెన్సిల్వానియా మీదుగా సోదరుడువంశీ పనిచేసిన లెటెరోప్ వెళ్తూ ఇలాంటి అద్భుత దృశ్యాలు గంటలతరబడి చూసారు. అప్పుడామెమనసు పారవశ్యంతో నిండిపోయింది .
 
"రాలిపోతూ కూడా ఆకుపచ్చని ఆకులు రంగులు మార్చుకుని మనల్ని సమ్మోహన పరుస్తూ చివరకి మ్రోడులవుతాయి .దాదాపు ఆరునెలలు ఎడతెగని చలిలో ,మంచులో అలానే నిలబడి ...స్ప్రింగ్ రాగానే చిగురులు వేస్తాయి . ఎంత అద్భుతం ?
ఎంత ఆదర్శం ! మాటలు ,నీతులు ,ధర్మాలు ఏమీ వల్లె వేయకుండా కేవలం తన ధర్మాన్ని ,త్యాగం ద్వారా మనకు తెలియబరిచే చెట్టుని చూస్తే కళ్ళు చెమర్చడం కాదు ...ధారాపాతంగానే కన్నీళ్లు కారతాయి . నా పక్కనే కూర్చుని డ్రైవ్ చేస్తున్న వంశీ నాకివన్నీ చూపించడంతో చెప్పలేని ఆనందపడుతూ ...నా కళ్లనీళ్లు చూసి కంగారు పడుతూ 'అమ్మా ..'అనేవాడు కంగారుగా .
నేను కళ్ళుతుడుచుకుని నవ్వేదాన్ని . ఏం లేదురా ఏంలేదు "అనేదాన్ని నవ్వుతూ .ప్రకృతి మనకి
ఎంత ఆహ్లాదాన్ని , ఇస్థుందోకదా ....తిరిగి ఏమీ చెయ్యలేని ఈ మానవజన్మలో కేవలం కృతజ్ఞత
తో బొమ్మ లు వేసుకుంటున్నా‌నంటున్నారు ..
 
శారద గారు.
*ఖిల్ తె హై గుల్ యహా ....
ఖిల్ కె బిఖర్ నెకో
మిల్ తె హై దిల్ యహా ...
మిల్ కె భిఛడ్ నెకో ...."!!
అడవిదారులలో శారద గారి ప్రయాణం .!!

ఎందుకో ఏమోగానీ అడవులంటే శారద గారికి చిన్ననాటినుండి తెగ మోజు .తీర్చిదిద్దబడిన ఎంతటి ఉద్యానవనమైనా అడవిముందు తీసికట్టే
అంటారామె.
 
"నా ఇష్టానికి అభీష్టానికి తగినట్లే కొంతమేరఅడవు
లు సందర్శించే భాగ్యం నాకు సమకూరింది . మా పెదనాన్న కొమ్మిరెడ్డి కేశవరావు గారు పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా మమ్మల్ని ఒక కానిస్టేబుల్ ని పంపి తనదగ్గరకి పిలిపించుకునేవారు .
 
అలా మేము నర్సి పట్నం ,చింతపల్లి .అనంతగిరి తదితర ప్రాంతాల అడవుల్ని చూసాం .ముఖ్యం గా నన్ను చాలా మురిపించి మరపించినసహజసిద్ధమైన సెలయేళ్ళు ,జలపాతాలూ మూసుకుపోయి చీకట్లు పంచుతున్న గుబురు చెట్లూ ,.ఆ గుబురుల్లోంచి తనకిరణాల్ని చొప్పించాలని విశ్వప్రయత్నం చేసే సూర్య భగవానుడూ ....
 
ఎక్కడో చింపి పారేసిన కాగితం ముక్కల్లాంటి ఆకాశం ! మళ్ళీ .. మళ్ళీచూడాలనిపించే ఆ దృశ్యాలకోసం ఎవరికీ చెప్పాపెట్టకుండా అడవిలోకి పారిపోతుండేదాన్ని 'అంటారామె.శారద గారిది బొత్తిగా రసహృదయం.
 
అడవుల్ని చూస్తేచాలు‌అక్కడ ఆకుపచ్చని రాగమేదో ఆలాపన అందుకుంటుంది.అబ్రకపు పొడి అద్దుకున్న
ట్లుమెరిసే ఆకాశం లో చిరుమబ్బులు సయ్యాట
లాడుతుంటాయట..అల్లనేరేడు చెట్టు ఆకులమీద నిలచివున్న కురిసిన వానచినుకులు జారినప్రతిసారీ
ఏ రుపులకింతలతో గిరికీలు కొడుతుంటుంది..
చూడ్డానికీ ఈ జన్మ చాలదంటారు " శారద గారు.!!
 
అడవుల్ని చూసి ఇంటికొచ్చాక.. కాగితంపై అడవు
లో చిత్రాలు మొలవాల్సిందే…
ఎక్కడవీ రాగాలూ ,చిక్కని ఈ అరుణరాగాలూ ...
అందీ అందని సత్యాలా ...వర్ణ చిత్రాలా?
సుందర మధుర స్వప్నాలా ...చీకటివెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలూ...శారద గారి
 
చిత్రాలు..!!
శారద గారి చిత్రకళ.సహజమైంది.భావ యుక్తమైంది.
అందుకే……శారద గారి చిత్రకళ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఆమె చిత్రాలన్నీ ఓ పుస్తకంగా
భద్రపరిస్తే బాగుంటుంది.!!
*ఎ.రజాహుస్సేన్.‌!!
--(())--
 వివేక చూడామణి - 1 / Viveka Chudamani - 1 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 2. మానవ జన్మ  - 1 🌻

1. మొదటి శ్లోకములో శ్రీ శంకరాచార్యులవారు ''గురువే ప్రత్యక్ష దైవ'' మన్నట్లు తన గురువైన గోవిందా చార్యుల వారిని దైవముగా స్తుతించినారు.

2. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. మానవులలో పురుషజన్మ ఉన్నతమైనది. అందులోనూ వైదిక మతములో బ్రహ్మ జ్ఞానము గొప్పది. బ్రహ్మ జ్ఞానము ద్వారా ఆత్మ అనాత్మల భేదమును గ్రహించుట, బ్రహ్మమును తెలుసుకొనుట అరుదైన విషయము. అట్లాంటి మానవుడు ముక్తిని పొందాలంటే 100 కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది.

3. భగవంతుని కృపతో మానవునిగా జన్మించుట, జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయుట మరియు అందుకు సద్గురువు యొక్క రక్షణ అను మూడు ముఖ్య విషయములు అవసరము.
 
4. పురుషునిగా లభించిన మానవ జన్మ ద్వారా వేదవిజ్ఞానమును పొందిన మనిషి జన్మ రాహిత్యానికి కృషి చేయకుండా, ఆత్మహత్య సదృశమైన లౌకికానందములో చిక్కుకొనుట అనుచితము.
 
5. మనిషి తనకు లభించిన పురుష మానవ జన్మను జన్మ పరంపర నుండి విముక్తికై కృషి చేయకుండుట ఎంత తెలివి తక్కువ తనము.

6. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అను సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచమున్నంత కాలము 432 మిలియన్ల సంవత్సరములు యగ్నయాగాదులు చేసి, దేవతలను తృప్తి పరచినను జన్మ రాహిత్య స్థితి లభించదు.

7. సంపదలు, వేదాల పఠనము, యగ్నయాగాదులు మొదలగు వాటి వలన పరమాత్మను పొందలేము. జన్మ రాహిత్యము లభించదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹VIVEKA CHUDAMANI - 1 🌹
✍️ Swami Madhavananda

1. I bow to Govinda, whose nature is Bliss Supreme, who is the Sadguru, who can beknown only from the import of all Vedanta, and who is beyond the reach of speech and mind.

2. For all beings a human birth is difficult to obtain, more so is a male body; rarer thanthat is Brahmanahood; rarer still is the attachment to the path of Vedic religion; higher than this is erudition in the scriptures; discrimination between the Self and not-Self, Realisation, and continuing in a state of identity with Brahman – these come next in order. (This kind of) Mukti (Liberation) is not to be attained except through the wellearned merits of a hundred crore of births.

3. These are three things which are rare indeed and are due to the grace of God – namely, a human birth, the longing for Liberation, and the protecting care of a perfected sage.

4. The man who, having by some means obtained a human birth, with a male body and mastery of the Vedas to boot, is foolish enough not to exert himself for self-liberation, verily commits suicide, for he kills himself by clinging to things unreal.

5. What greater fool is there than the man who having obtained a rare human body, and a masculine body too, neglects to achieve the real end of this life ?

6. Let people quote the Scriptures and sacrifice to the gods, let them perform rituals andworship the deities, but there is no Liberation without the realisation of one’s identity with the Atman, no, not even in the lifetime of a hundred Brahmas put together.

7. There is no hope of immortality by means of riches – such indeed is the declaration of the Vedas. Hence it is clear that works cannot be the cause of Liberation
.Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🙏 *జయ-విజయులు ఎవరు?* 🙏

🍃🌺జయ-విజయులు, శ్రీ మహావిష్ణువు వైకుంఠధామంలో మందిరానికి కావలివారు. ఒకనాడు బ్రహ్మమానసపుత్రులు ఐదేండ్ల బాలికలైన సనక, సునంద, సనత్క్ మార, సనత్సుజాతులు శ్రీహరిని దర్శించడానికి వైకుంఠం వచ్చారు. 

🍃🌺ద్వారపాలకులైన జయవిజయలు వారిని లోపలి పంపడానికి నిరాకరించారు. బ్రహ్మజ్ఞానులైన తమను లోనికి వెళ్ళడానికి అడ్డగించడం సరికాదని చెప్పారు. అయినా జయవిజయులు వినలేదు. మునులు వారిని భూలోకంలో రాక్షసులై జన్మించమని శపించారు. 

🍃🌺విషయం తెలుసుకున్న శ్రీహరి సనకాదులను సాదరంగా లోనికి తీసుకువెళ్ళారు. తరువాత ద్వారపాలకులైన జయవిజయులు మహావిష్ణువుకు నమస్కరించి నిలబడ్డారు.

🍃🌺అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. 

🍃🌺అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు. దాని ప్రకారమే వారు వారే మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రెండో జన్మలో రావణ, కుంభకర్ణులు, మూడో జన్మలో శిశుపాల, దంతవక్త్రలుగా జన్మించారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. 

🍃🌺కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు.

--(())--

 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 71* 🕉

*సులభుల్మూర్ఖులనుత్తమోత్తముల రాజుల్గల్గియేవేళ* *నన్నలంతలబెట్టిన నీ పదాబ్ధములఁ బాయంజాల నేమిచ్చినం*

*గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గాపుండు టబ్జంబు పైఁ*

*జెలువొప్పున్ సుఖియింపఁ గాంచుట సుమీ 

శ్రీ కాళహస్తీశ్వరా!*

📍 _*తాత్పర్యం:_* 📍

🌹శ్రీ కాళహస్తీశ్వరా! లోకమునందలి రాజులు సులభులు. వారి సేవ అశ్రమముగనే లభించును. వీరు మూర్ఖులు, జ్ఞానహీనులు, అహంకారాది దోషములు కలవారు, అనుత్తమోత్తములు, నీచులందరిలోను గొప్పవారు, పరమనీచులు. 

🌹అట్టివారిని నేను సేవించను. ఆ కోపముతో వారు నన్ను ఎన్ని బాధలు పెట్టినను లెక్కపెట్టను. 

🌹విశిష్ట లక్షణములతో దుర్లభుడవు, సర్వజ్ఞుడవు, అహంకారాది దోషములు లేనివాడవు అగు నీ పాదపద్మములను వదలను. వారు ఏమిచ్చినను నాకు దానితో పని లేదు. 

🌹నీవు ఏమి ఇచ్చినను దానిని నేను వెండికొండను పాలించుటగా, అంబునిధిలో కాపురముండుటగా మరియు పద్మమునందు చక్కగా సుఖించుచుండుటగా భావించి  ఆనందింతును.

🕉️ *ఓం నమః శివాయ* 🕉️

సామ,దాన,భేద,దండోపాయాలు.

ప్రతి మనిషికి కోరికలుంటాయి. కొందరికీ కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి. సహజ వాంఛలుంటాయి. అవసరాలు ఉంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి!

కొందరు కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఊహాలోకంలో తేలియాడుతూ ఉంటారు. తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే.

దేవకన్య కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి. నేనేది కోరుకుంటే అదే జరగాలి! నియంతను కావాలి! ప్రపంచం నా పాదాక్రాంతం కావాలి! అని ఆశిస్తే మాత్రం, దురాశ, అత్యాశ, వెకిలి తనం, వెర్రితనం అవుతుంది.

వాంఛ చైతన్యానికి చిహ్నం. తాను ఆశించింది పొందడానికి మనిషి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తాడు.

ధనం కావాలి - ప్రేమ కావాలి - మనిషికి అధికార బలం కావాలి. తనను సమర్దించేవారు కావాలి - తలచినది కావాలి.

సామం: కొన్ని పనులను చక్కగా పరిస్థితులను స్వయంగా వివరించి చెప్పడం వలన గాని, తగిన వారితో చెప్పించడం వలన గాని చక్కబెట్టుకోవచ్చును. దీనినే "సామోపాయం" అంటారు.

దానం: అప్పటికీ నెరవేరని కార్యాలను బహుమతులు, ధనాన్ని ఇచ్చి కాని, ఇతరత్రా ప్రలోభాలకు వారిని ఎరవేసి వారి కోరికలు నెరవేర్చడం వలన సాధించ వచ్చును. దీనిని 

"దానోపాయం" అంటారు.
భేదం: బుద్ధి బలం ఉపయోగించి వారి సన్నితుల మధ్య అపార్థాలు కల్పించుట, అంతఃకలహాలు సృష్టించుట, వలన గాని, ఈ విధంగా విధిలేని పరిస్థితులు కల్పించుట వలన గాని అనుకున్న కార్యాన్ని సులభంగా సాధించవచ్చును. దీనిని "భేదోపాయం" అంటారు.

దండన: తప్పని పరిస్థితుల్లో కొన్నింటిని బలప్రయోగం చేయడం ద్వారానే సాధించాల్సి ఉంటుంది. దీనిని "దండోపాయం" అంటారు.
అన్ని చోట్ల ఏ ఒక్కటి మాత్రమే పనిచేయదు. కొన్ని విషయాలలో అంచెలంచెలుగా వాటిని ప్రయోగిస్తూ కార్యసిద్దిని పొందాలి. ఈ విషయంలో సమయం, సందర్భం చూసుకోవాలి. సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. దానికి తోడు మనోబలం కావాలి.
కొన్నింటిని సాధించేందుకు కొందరికీ అర్హత ఉండదు. అర్హత లేకున్నా ప్రయత్నిస్తే ఉపయోగమేముంటుంది?

భారతంలో చెప్ప బడిన రాజ నీతి, యుద్ద నీతిలో చెప్పబడిన చతుర్విదోపాయాలు.
ఈ చతుర్విద ఉపాయాల గురించి మహా బారతంలోని శాంతి పర్వం, ద్వితీయాశ్వాసంలో ఈ విధంగా వివరించబడింది.

రాజు తన ప్రధాన మూల బలం సైన్యంగా గుర్రించాలి. శత్రు శేషం లేకుండా చేసుకోవాలంటే తన సైన్యాన్ని ( చతురంగ బలాలను) ప్రేమగా చూడాలి.
శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించినప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం. యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! దీని వలన వచ్చే రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి.

అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన "సామోపాయం"తో ప్రవర్తించాలి.
‌‌ఒక్కోసారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు.
శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి "దానోపాయం" అవలంభించి తగినంత ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా "సామ దాన దండోపాయాలు" అనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు, శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి "భేదోపాయం" ప్రయోగించడానికి ప్రయత్నించాలి.
శుక్రాచార్యుడి ఉపేక్షాభావం: శుక్రాచార్యుడి అభిమతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావం మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి.

కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.
ఈ ఆదునిక కాలంలో మానవులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు తమ కార్యసాధనలో సామ, దాన, భేద, దండోపాయాలను రకరకాల పద్ధతుల్లో ప్రయోగించి ఫలితాలను పొందు చున్నారు.

1 comment:

  1. వివేక చూడామని.కవితలు.అబ్దుల్ గారి విశ్లేషణా అద్భుతం ఉన్నాయి

    ReplyDelete