ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను నేను 2012 నుండి కధలు కవితలు అనేకమైన విశ్లేషకులు వాట్సాప్ వచ్చాక గౄపులు ద్వారా అంతర్జాల ము ద్వారా సేకరించినవి ఇందు పొందు పరుస్తున్నాను. ఇది ఉచితం ఆన్లైను అంతర్జాల పత్రిక ఇది "ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం " మాత్రమే
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో ఛందస్సు ప్రకారంగా వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు
న న న న న న న న గ 25 /14 .... (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కవత కధల కరుణ మనుసు
సకల సమత సరళ సుమధురన్
వినయ విపుల వివరణమును
కవి కలము కదలిక కరుణయున్
తరుణి కిరణముల తలపులు
పతి హృదయము సరసత మెరయున్
విరిసిన కమల కనుగవ వలపు
నలుపు దొర విదిత విరిసెన్
కరకమలములను గదలవలి
కినుకు లయ మురళి మధురమున్
సరసత బలుకుచు నమృతమును
సలిపెడి చెలువపు వలపులన్
అణువణువు అణకువ పదిలముగ
సహనపు పలుకులు సమమున్
చిరునగవు చరిత కధలు తలచి
మది పలకల హొయలు కలుగున్
మద యువతుల రతి కలహపు
సుమ లయల హొయల మది విరిసెన్
మదముల జయమును కను గొనిన
మురహరుడు చిరునగ వెపుడున్
వదన సుమ దళముల పిలుపు
నవ తలపుల మలుపులు మదిలోన్
హృదయము సతతము కరుణయు
సహనము తెలుపు తరుణమగున్
కుసుమ శర శరసమరముల
మకుటములు చలి గిలియు యనుచున్
బిస రహ నయనముల పడచుల
బిడియ కులుకుల చిరునగవుల్
మిసిమిగల చనుల ఎరుపులు
అమితముగ కదలిక పిలుపులన్
పస యురమున గలుగుదొరను
ఉపకరములు వయసు బిగువుకున్
--(())--
[26/09/2020,
మధురిమలు .. జీవి
(జీవి అనేకవిధాల్లో అబతికి బతికించు మార్గాలతో ఈశ్వరా)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మల్లెలు ప్రతికలవుతూ
పుష్పాలు ప్రతిభలవుతూ
గాలులు ప్రగతి లవుతూ
మాటలు ప్రతిజ్ఞ లవుతూ
విజ్ఞాన విస్తరణతో
దాహపు అజ్ఞానం తో
తెలిసేటి కోపమ్ముతో
మర్యాదను మన్నన తో
విలువను పెంచు ఆశతో
మనసును పంచు నీడతో
కాల ప్రకృతి సేవతో
నిజ సద్విని యోగంతో
నిత్య జరుపు కార్యముతో
ధర్మ చరిత బోధలతో
కుటుంబనిర్వహణతో
మనిషి తరుణ బత్కులతో
వినయము వివేకములతో
ఉష్ణ శీతల మనసుతో
వెలుగునీడ కలయికతో
మంచీ చెడు ఘర్షణతో
కార్యా నిర్వాహణలతో
విశ్వ విజయ భావముతో
విజయమే లక్ష్యమ్ముతో
సత్య బుద్ధి కరుణ లతో
సమగ్ర శిక్షణాలతో
ప్రతిభా పాఠవములతో
ప్రగతి ప్రబోధాలతో
ప్రజ్ఞ చాతుర్యములతో
జీవి మనసుల నడకతో
జీవి సత్య వాదముతో
జీవి భక్తి భావముతో
జీవి బతికించు దిశతో
--(())--
Prathyusha: *పెరటిమొక్క -- చందమామ కథలు*
*వల్లభశ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు. నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతినిండా పనీ, ఇనప్పెట్టె నిండా కాసులూ ఉంటూండేవి. అతనికి రామదేవుడు, వాసుదేవుడు కవల పిల్లలు. లేక లేక పుట్టిన వారవడంతో అతిగారాబం చేసింది తల్లి. దాంతో ఇద్దరికీ చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది. తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది.*
*వల్లభశ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించ సాగింది. ‘‘వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతా రహితంగా తయారు కావడానికి నీ అతిగారాబమే కారణం. మనం వెళ్ళిపోయాక, వీళ్ళెలా బతుకుతారు?'' అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో.*
*‘‘నాలుగుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిమనది. అల్లారుముద్దుగా పెరిగిన పిల్లలు. కష్టపడి పని చేసి సంపాదించవలసిన అవసరం ఏముంది?'' అని ఎదురు ప్రశ్నవేసింది ఆయన భార్య. ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు.*
*రెండు రోజుల తరవాత శ్రేష్ఠి కొడుకులను చేరపిలిచి, ‘‘విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చిరావాలి. ఆ పని చాలా గోప్యంగా జరగాలి. అందుకే మీ ఇద్దరినీ పంపాలనుకుంటున్నాను. ఈ లేఖను తీసుకు వెళ్ళి ఆయన చేతికివ్వండి. విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం. అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా తిరిగిరండి,'' అన్నాడు. అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి, అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు. లేఖ అందుకుని చదివిన వరదయ్య, మౌనంగా తలపంకించాడు.*
*ఆ తరవాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యమిచ్చి, నగరంలోని వింతలూ, విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు. వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది. వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ట, శ్వేత చూడ చక్కనివారు. మంచి గుణవంతులు. వాసుదేవ, రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది. వారం రోజుల తరవాత, వల్లభశ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు.*
*‘‘నాయనలారా, అనుకోని ప్రమాదం వచ్చిపడింది. నాలుగు రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది. రాత్రికిరాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలయింది. ఊళ్ళో వాళ్ళు కుదువ పెట్టిన బంగారం కూడా పోవడంతో, ఇవ్వమని నిర్బంధిస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అవమానం భరించలేని నేను, మీ అమ్మ ఊరొదిలి వెళుతున్నాం. రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం.''*
*ఉత్తరం చదివిన కొడుకులిద్దరికీ గుండె జారినంత పనయింది. భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది. సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ‘‘ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీనాన్నలాంటి కోటీశ్వరుణ్ణి కాను. ఇక మీ దారి మీరు చూసుకోండి,'' అన్నాడు అన్నదమ్ములతో.*
*ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుంచించుకు పోయారు. అయినా, ఏపనీ చేతగాని తమకు భుక్తి గడవడం ఎలా? అందువల్ల అభిమానం చంపుకుని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములు. సరేనని వరదయ్య, రామదేవుడికి బట్టలకొట్టులో లెక్కలు రాసే పనినీ, వాసుదేవుడికి తనతోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని వచ్చే పనినీ అప్పగించాడు. మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పనిచెయ్యలేక చాలా అవస్థపడ్డారు.*
*‘‘చూశావా, తమ్ముడూ, ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో! నిన్న లెక్కల్లో పదిరూపాయలు తక్కువయిందని నాకు తిండి కూడా పెట్టలేదు,'' బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో. ‘‘అవునన్నయ్యా! గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప, ఒక్క బండి కూడా కట్టించడు. రోజూ నాలుగు కోసుల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు,'' అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు.*
*‘‘పోనీలే. నాన్నగారన్నట్టు కష్టపడ్డవాడికెప్పుడూ ఫలితం దక్కకుండా పోదు. మనకూ మంచి రోజులు వస్తాయి,'' అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు. రోజులు గడుస్తున్న కొద్దీ, అన్నదమ్ములిద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది. వ్యాపారంలోని మెలుకువలు అర్థం కాసాగాయి. వరదయ్య కూతుళ్ళు శ్రేష్ట రామదేవుణ్ణీ, శ్వేత వాసుదేవుణ్ణీ అభిమానంగా చూసుకోసాగారు. వరదయ్య నెలజీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు.*
*ఆరు నెలల తరవాత వల్లభశ్రేష్ఠి, భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు. తల్లిదండ్రుల్ని చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు. ‘‘మిత్రమా! పోయిన సొమ్ము దొరికింది. కష్టార్జితం ఎక్కడికీ పోదని అర్థమయింది. ఇక మా ఊరెళతాం. నీకు వేనవేల కృతజ్ఞతలు,'' అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో నర్మగర్భంగా.*
*‘‘మీ కొడుకులతో పాటు కోడళ్ళను కూడా తీసుకు వెళ్ళు, మిత్రమా! నా కూతుళ్ళకు ప్రయోజకులైన భర్తలు దొరికారు,'' అన్నాడు వరదయ్య నవ్వుతూ. శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు. పెళ్ళి జరిగిన మరునాడు, ‘‘నా బట్టల వ్యాపారం కన్నా, నీ బంగారం వ్యాపారం విలువైనది కదా? నా కన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి. నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చుకదా? దొంగతనం జరిగిందన్న నెపం మీద, నా దగ్గర పనివాళ్ళను చేశావెందుకు?'' అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా.*
*‘‘పెరటిమొక్క వైద్యానికి పనికిరాదంటారు కదా! నా దగ్గరున్నంత వరకు నా బిడ్డలకు కష్టించేతత్వం రాదని అర్థమయింది. అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏపనికీ లొంగరని తెలిసింది. అందుకే ఈ యుక్తిని అమలు చేశాను,'' అన్నాడు వల్లభశ్రేష్ఠి. తండ్రికి తగ్గ తనయులుగా, అనతికాలంలోనే రామదేవ, వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు.*
[28/09/2020, 9:41 pm] Prathyusha: వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...
రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...
సిటీకి కొత్తగా రావడం వలన
ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...
హడావుడిగా పరుగులు తీసే జనాలు
ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.
సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.
బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ
వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు...
ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...
బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.
"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.
ఆమె రేటు చెప్పింది...
సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.
ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.
సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.
సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.
ఆరోజు మొదలు ప్రతీరోజూ
ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.
ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...
ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.
ఇంటికి వెళ్లాక
"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.
వెంకట్ చిరునవ్వు నవ్వి
"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...
వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే
వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి
" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.
వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది
"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.
నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.
ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.
అన్నీ ఉన్నా కూడా
ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ... 😍💕
Prathyusha: పాలు చేసిన తపస్సు
(ఒక చిన్న కథ)
ఒకసారి "పాలు" తపస్సు చేసిందట - దేవుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అన్నాడట -
అప్పుడు "పాలు" ఇలా చెప్పిందట. దేవుడా నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగానే ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు.
అప్పుడు దేవుడు ఓ నవ్వు నవ్వి "ఓ పాలు" ఇది విను నీవు "పాలలా" జీవించాలి అని ఆశ పడే ముందు ఈ మాటలు విను నీవు
పాలలాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు
పాలకు పెరుగు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు
పెరుగుని చిలికితే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు
మజ్జిగ లోంచి వచ్చిన వెన్న అయితే వారాలు వారాలు అయినా ఏమీ కాదు.
వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో చాలా రోజులు ఉంటావు. అలాగే మందులకు వాడుతారు,
ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు....
ఇప్పుడు చెప్పు
ఒకరోజు పాలగా ఉండి "పాలలాగానే" చస్తావా లేక
క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా అని దేవుడు ప్రశ్నించాడు....
దేవుని మాటకి "పాలు" మూగవోయింది, దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. దేవుని ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది..
ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు. యజమాని దూరంగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు. పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు. అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నాన్నా ఎందుకు ఏడుస్తున్నావ్.. నీకు తెలీదా నాన్నా? మూడు రెట్ల ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు. చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు. ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!
అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్మెంట్ పోయింది. ఇప్పుడు నిజం
చెప్పాలంటే, కాస్త ఆనందిస్తున్నాడు కూడా. ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది. కళ్లల్లో నీళ్లు ఎగజిమ్మాయి. అక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "నాన్నా.. ఇల్లు కొన్న వ్యక్తి మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.
‘ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది. నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం. అప్పుడు దుఃఖం మిమ్మల్ని వదిలేస్తున్నందుకు దుఃఖిస్తుంది.
.--(())--
కొడుకు నేర్పిన గుణపాఠం kadha
కుటుంబ బంధాల నుంచి వేరు పడిన సన్యాసులు కూడా వృద్ధ తల్లితండ్రుల ఆలనా పాలనా చూడడం తప్పు కాదని ధర్మ శాస్త్రం చెబుతుంది. అలాంటిది ఋణం తీర్చుకోవలసిన కుమారులే తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పుట్టనేమి వాడు గిట్టనేమి అంటాడు సుమతీకారుడు.
వయోధికులైన తల్లితండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తికి అతని కొడుకు ఎలా బుద్ధి చెప్పాడో తెలియజేసే తక్కళ జాతక కథ ఇది.
సమాజంలో మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, పెద్దల పట్ల ప్రేమానురాగాలు, వారి పట్ల చూపాల్సిన బాధ్యతలు ఎంత ఆరోగ్యకరంగా, ఉన్నతంగా ఉండాలో మన సంస్కృతి పదే పదే చెబుతూనే ఉంటుంది.
పూర్వం కాశీ నగరంలో సుదత్తుడు అనే రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు పేరు వశిష్ఠకుడు. వశిష్ఠకుని చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది. అప్పటి నుంచి అతణ్ణి సుదత్తుడే తల్లిలా సాకి పెద్ద చేశాడు. కొడుక్కి యుక్తవయసు రాగానే ‘‘నాయనా! నీవు పెళ్ళి చేసుకో’’ అని అడిగాడు తండ్రి.
‘‘వద్దు నాయనా! ఆ వచ్చిన కోడలు నిన్ను సరిగ్గా చూస్తుందో, లేదో?’’ అన్నాడు వశిష్ఠకుడు.
అయినా ఆ తండ్రి అనేక చోట్ల తిరిగి, ఉత్తమురాలు అనిపించిన ఒక యువతితో వశిష్ఠకుడికి వివాహం జరిపించాడు. వారికి ఒక మగ సంతానం కలిగింది. ఆ బిడ్డకు సుజాతుడు అని పేరు పెట్టారు.
సుజాతుడు పెరిగి పెద్దవాడవుతూ ఉండగా, సుదత్తుడు మంచం పట్టాడు. ఇక, సేవలు చేయడం వ్యర్థం అని అతని కోడలికి అనిపించింది. ఆయన ఒకటి చేయమంటే మరొకటి చేసేది. మామా కోడళ్ళ తగవులు పెరిగిపోయాయి. చివరకు వశిష్ఠకుడు కూడా భార్య చెప్పుడు మాటలు విని... తండ్రిని దూషించడం మొదలుపెట్టాడు. కానీ సుజాతుడు మాత్రం తాత పట్ల ప్రేమతో ఉండేవాడు మనవణ్ణి చూసుకొని కొడుకు కోడళ్ళ తిట్లను సుదత్తుడు భరించేవాడు.
అతని కోడలు ఒక రోజున భర్తతో ‘‘మీ నాన్నగారి పీడను వదిలించుకోవాలి’’ అని చెప్పింది.
‘‘ఎలా?’’ అని అడిగాడు వశిష్ఠకుడు.
‘‘మీ నాన్నను ఏదో పని మీద పొరుగు ఊరికి తీసుకువెళ్ళండి. దారిలో అడవి సమీపంలోని శ్మశానానికి రాగానే ‘దొంగలు దొంగలు’ అని అరచి, రాతితో మీ నాన్న తలపై కొట్టండి. ఆ శ్మశానంలోనే పాతేసి వచ్చేయండి’’ అని తన పథకం చెప్పింది. ధైర్యం నూరి పోసింది.
భార్య చెప్పినట్టే వశిష్ఠకుడు మర్నాడు తెల్లవారకముందే బండి కట్టి, తండ్రిని తీసుకుపోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో సుజాతుడు కూడా లేచి వచ్చి బండి ఎక్కాడు. ‘నేనూ వస్తా’నని మారాం చేశాడు. చేసేది లేక సుజాతకుణ్ణి కూడా వెంట తీసుకొని, బండి ముందున్న తొట్టెలో పడుకోబెట్టాడు. బండి ప్రయాణం సాగించి, శ్మశానం దగ్గరకు చేరింది. బండి వెనుక గూడులో తండ్రి, బండి ముందున్న తొట్టెలో కొడుకూ నిద్రపోతున్నట్టు గ్రహించిన వశిష్ఠకుడు బండి దిగాడు. పలుగూ, పారా తీసుకొని శ్మశానంలో గొయ్యి తీయడం మొదలుపెట్టాడు.
ముందు రోజు రాత్రి తన తల్లితండ్రులు మాట్లాడుకున్న మాటలన్నీ సుజాతుడు విన్నాడు. అతను లేచి తండ్రి దగ్గరకు వచ్చి - ‘‘అయ్యా! అయ్యా! ఎందుకు ఈ గొయ్యి? ఇక్కడ కంద దుంపలు లేవు కదా! తేగలు లేవు కదా! ఆలు గడ్డలు లేవు కదా! ఎందుకు గొయ్యి తవ్వుతున్నావు?’’ అని అడిగాడు.
‘‘నాయనా! మీ తాత నాకు పీడగా తయారయ్యాడు. రోగిష్టివాడయ్యాడు. కాబట్టి మీ తాతను చంపి పాతెయ్యడానికే ఈ గొయ్యి’’ అన్నాడు వశిష్ఠకుడు.
వెంటనే ఆ పిల్లవాడు ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకొని తానూ గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. అది చూసి వశిష్ఠకుడు- ‘‘బాబూ! నీకెందుకు ఈ గొయ్యి?’’ అని అడిగాడు.
‘‘నాన్నా! నేను మన వంశాచారం పాటించాలి కదా! కులగౌరవాన్ని కాపాడాలి కదా! ఈరోజు నువ్వు నీ తండ్రికి చేసే మర్యాద రేపు నీకు నేను చేయాలి కదా!’’ అన్నాడు సుజాతుడు.
ఆ మాటలు ఆ తండ్రి హృదయాన్ని తాకాయి. అతను వలవలా ఏడ్చాడు. తాను చేస్తున్న తప్పు తెలుసుకున్నాడు. బిడ్డను క్షమాపణ కోరాడు. తండ్రిని తీసుకొని క్షేమంగా ఇంటికి చేరాడు. భార్యను మందలించి, బుద్ధి చెప్పాడు. తండ్రిని బిడ్డలా చూసుకున్నాడు.
తాతా మనవళ్ళు ఎంతో హాయిగా కాలం గడిపారు. తాత తన అనుభవాల్ని మనవడికి అందించి, చివరకు సుఖంగా కాలం చేశాడు.
--(())--
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా? 🙏
🍃🌺హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే కొందరు భక్తులు బస్సుల్లోనూ,టాక్సీలలోనూ, నడుచుకుంటూ వెళ్తుంటారు.
🍃🌺అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి. కాని ఎంతమందికి తెలుసు తిరుమల చేరుకోవాలంటే ఇంకా కొన్ని దారులు ఉన్నాయని? మనం ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. తిరుమల ఆలయానికి ఏడుకొండలు నలువైపులనుండి ఏడు నడకదారులు ఉన్నాయి.
🍃🌺తాళ్ళపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు.
🍃🌺క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు.
🍃🌺మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడి మల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది.
🍃🌺ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాహరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది. నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి. అయితే అవి నేడు కనుమరుగైపోయాయి. మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది.
🍃🌺అయితే ఈ దారికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే. శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి. అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది.
🍃🌺ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.
🍃🌺అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు.
🍃🌺అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ, 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది.
🍃🌺పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది.
🍃🌺అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ,..1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజు స్వామి, అలిమేలు మంగమ్మ గుళ్ళు గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.
🍃🌺గాలి గోపురంలోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు.
🍃🌺అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది. మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది.
🍃🌺అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.
🍃🌺చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు.
🍃🌺అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు. ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు.
🍃🌺పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది. ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రేనాడు వారు ఈ దారి మీదుగానే తురుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు.
🍃🌺మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది.
🍃🌺ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంతదూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది. 1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు.
🍃🌺తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వేపుకు వెళ్ళే మదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు.
🍃🌺ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు. తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక దారిలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళినా మామండూరు చేరుకోవచ్చు.
🍃🌺తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాంకి అవతలి వైపున్న కొండను ఆనుకొని శ్యామల కోన ఉంది. ఇక్కడి నుండి వెళ్ళే నడకదారికి శ్యామలకోన దారి అనే పేరుంది. అదే కాకుండా దీనికి అనుంకోన దారి అనే పేరు కూడా ఉంది. కల్యాణి డ్యాం నుండి ఈ దారి గుండా తిరుమల వెళ్ళాలంటే సుమారు పదిహేను కిలోమీటర్లు నడవాలి.
🍃🌺కల్యాణి డ్యాం నుండి పులి బోను వరకు ఉండే నడక దారిలో అటవీశాఖ వారు తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఈ రోడ్డులో సుమారు మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే అనుంకోన మలుపు వస్తుంది. ఈ మలుపు నుండి తూర్పు వైపు తిరుమలకు వెళ్ళే దారి వస్తుంది. అనుంకోన మలుపు నుండి కొంత దూరం వెళితే తొలివంక తరువాక మలివంక వస్తాయి.
🍃🌺ఆపైన ఉడ్డల చింతల మాను వస్తుంది. అటు తర్వాత వెడల్పుగా ఉండే గెద్దలబండ వస్తుంది. ఆ తరువాత చిట్టికోన వంపు వస్తుంది. అక్కడినుండి సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు వెళితే తిరుమలలోని ఎత్తైన నారాయణ గిరి వస్తుంది. రంగంపేట, భీమవరం నుండి భక్తులు ఈ దారి నుండే తిరుమలకు వెళుతుంటారు.
🍃🌺కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడినుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు.
🍃🌺తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది. పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అవ్వాచారి కొండ నుండి కూడా ఒక దారి ఉంది. దీన్నే అవ్వాచారి కోనదారి అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది.
🍃🌺రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది.
🍃🌺ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు.
🍃🌺కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది.
🍃🌺నెరభైలు, ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు. ఇప్పటివరకూ మనం చాలా సార్లు తిరుమలకు వెళ్ళి ఉంటాము. కానీ చూశారా మీలో ఎవరికైనా ఈ నడక దారుల గురించి తెలుసా?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[
+91 94414 08564: 🌻 మహా భారతం 🌻
🩸 భాగము 27 🩸
💧 ఉపప్లావ్యం 💧
🍃🌺విరాటనగరం కల్యాణ శోభలు సంతరించుకుంటూ వుండగా, దెబ్బతిన్న అభిమానధనుడు మార్గమధ్యంలో మజిలీ చేశాడు. పడగ నలిగిన త్రాచువలె దుర్యోధనుడు ఆక్రోశిస్తున్నాడు. కర్ణ, దుశ్శాసన, శకుని ప్రభృతులు రారాజును ఊరడింపులో భాగంగా దుస్తంత్రాలుపదేశించ సాగారు. అసలు గోగ్రహణ సమయానికి పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తికాలేదని నొక్కివక్కాణించారు.
🍃🌺భీష్ముడు పాండవ పక్షపాతియని సుయోధనునికి ఎపడూ సందేహమే. ఈ విషయంలో కూడా మొగ్గు చూపాడని సుయోధనుని నమ్మకం. అయితే, ధర్మజుడు అసత్యానికి వొడికట్టడని కూడా ప్రగాఢంగా నమ్ముతాడు. ఇదంతా అనవసరపు చర్చ అనుకున్నాడు రారాజు. వార్తాహరుని రప్పించి, తక్షణమే విరాటనగరికి పోయి, జరిగినంతా యుధిష్ఠిరునికి తెల్పి అనంతర కర్తవ్యం బోధపరచమని పంపాడు.
🍃🌺ఈ సంగతులేవీ భీష్మవర్గానికి తెలియనీయలేదు. కౌరవదూత విరాటనగిరికి వెళ్…
[] +91 94414 08564: 🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 75 🕉
పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా యన్న లే
లేలెమ్మన్న నరంటిపండ్లుఁ గొని తేలేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులపు డట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీలీలావచనంబులం గుడుపరా శ్రీ కాళహస్తీశ్వరా!
📍 తాత్పర్యం: 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాపా! పాపడా నీకు పాలను అన్నమును పెట్టెదను తినుము.
🌹లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలు గారాబము పోవుచు ’నాకు అరటి పండ్లు కూడ కావలె’ నన్న వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్య విశేషములతో అరటి పండ్లు తెచ్చి యిచ్చెదరు లేదా మరియొక విధముగ సముదాయించి బువ్వ తినిపించెదరు.
🌹అట్లే నీవును వాత్సల్యలక్ష్మీ లీలా విలాసములను నాయందు ప్రసరింపచేసి నాకును ఇహపర సుఖములని అనుభవింపజేయుమా....
🙏 ఓం నమః శివాయ 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
ఈ 15 దోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.
*(1) అధముడు (2) విషముడు (3) పశువు (4) పిశునుడు (5) కృపణుడు (6) పాపిష్టుడు (7) నష్టుడు (8) రుషుడు (9) దుష్టుడు (10) పుష్టుడు (11) హృష్టుడు (12) కాణుడు (13) అంధుడు (14) ఖండుడు (15) చండుడు (16) కుష్టు (17) దత్తాపహారకుడు (18) వక్త (19) కదర్యుడు (20) దండుడు (21) నీచుడు (22) ఖలుడు (23) వాచాలుడు (24)చపలుడు (25)మలీమసడు (26)స్తేయి.*
*(ఈ దోషాలు స్త్రీలకున్నా దోషాలే... )*
*ఈ ఇరవై ఆరుదోషాల్లోనే మళ్ళా భేద, ప్రభేదాలు చెప్పబడ్డాయి.*
*అందుకే వాటిని ఒక్కొక్కటిగా సంగ్రాహంగానైనా వివరించి చెప్పవలసి వుంది. ఇలా :*
*(1) గురువుల వద్దకూ దైవసన్నిధికి చెప్పులు విడవకుండానే, గొడుగును ముడవకుండానే పోవుట, గురువుగారి ఎదురుగానే ఉన్నతాసనంపై కూర్చుని యుండుట, పల్లకిలో కూర్చొని తీర్థయాత్రలు చేయుట, తీర్థాలలో గ్రామ్యధర్మాచరణను చేయుట- ఇవన్నీ అథమసంజ్ఞక దోషాలు.*
*(2) పైకి ప్రియంగా మధురంగా మాట్లాడుతూ హృదయంలో మాత్రం హాలాహలాన్ని కలిగియుండి చెప్పేదొకటిగా చేసేదొకటిగా జీవించేవాడు విషముడు.*
*(3) మోక్షమును గురించి అసలు ఆలోచించకుండా, ప్రాపంచిక విషయవాంఛలలోనే మునిగితేలుతూ, హరి సేవ వూసే తలపక, ప్రయాగలో వుంటూ ఇంకెక్కడో స్నానం చేస్తూ, ప్రత్యక్ష దైవాలను విస్మరించి అదృష్టభాగ్యాన్ని వెతుకుతూ, శాస్త్రసారాన్ని బొత్తిగా పట్టించుకోకుండా వుండేవాడు పశువు.*
*(4) బలంతోగాని, వేషంతోనో మోసంతోనో గాని, మిథ్యా ప్రేమను ప్రదర్శించి గాని మనుష్యులను తన లాభం కోసం ఆపదలలో ముంచేసేవాడు పిశునుడు.*
*(5) దేవ, పితృ కార్యాలలో మంచి అన్నం పెట్టే స్తోమతు వుండీ కూడా మ్లానమై అశుభ్రమైన అన్నాన్ని భోజనాలలో వడ్డించే దుర్బుద్ధియైన మానవుడు కృపణుడు. వానికి స్వర్గమూ దొరకదు; మోక్షమూ లభింపదు.*
*అప్రసన్నమైన మనసుతో కుత్సిత వస్తువులతో దాన కర్మలను గావిస్తూ కోపంగా మొహం మాడ్చుకొని పూజలను చేసేవాడూ కృపణుడే. శరీర విక్రయదారులు కూడా కృపణులే.*
*(6) మాతాపితలను, గురువులను వారి కర్మకు వారిని వదలివేసి హోమ-యజ్ఞాల నిర్వహణలో కూడా లోపం చేసేవారు పాపిష్టులు.*
*(7) సాధనాచరణను పరిత్యజించి, అసత్యపు సేవాప్రదర్శన చేయువాడు, వేశ్యాగామి, దేవధనం ద్వారా స్వంత పబ్బం గడుపుకొనేవాడు, భార్యచేత వ్యభిచారం చేయించి బతుకు నిలుపుకొనేవాడు, కన్యలను తెచ్చి అమ్ముకొనో మరే విధంగానో మొత్తానికి స్త్రీధనం ద్వారానే అపసవ్యంగా అక్రమంగా బతికేసేవాడు పురాణ పరిభాషలో నష్టుడన బడతాడు.*
*(8) మనసులో ఎప్పుడూ క్రోధమే తప్ప మరో మనోవికారమూ, సరాగమూ వుండనివాడు, తన హీనతను తానే తలచుకొని మరీ కోపం తెచ్చేసుకుని చల్లటి వాతావరణాన్ని మంట సెగలపాలు చేసేవాడు (ఉడుకుమోతువాని ముఖాన కునుబొమలు శాశ్వతంగా ముడివడే ఉంటాయి. చిరునవ్వన్నది వుండదు ) - ఇలాంటి వాడు రుష్ఠుడు*
*(9) అకార్య లేదా నిందిత ఆచరణ ద్వారానే జీవించే వాడు. ధర్మకార్యమేదీ పూర్తిగా చేయని వాడు.*
*నిద్రాళువు, దుర్వ్యసనాలపై ఆసక్తిగలవాడు, మదిరాలోలోడు, స్త్రీలను సేవిస్తుండేవాడు, ఎల్లపుడూ దుష్టులుగా జగత్రసిద్ధులైన వారి సాంగత్యంలోనే తిరుగుతుండేవాడు దుష్టుడనబడతాడు.*
*(10) మధుర, మృష్టాన్న భోజనాన్ని తానొక్కడే తినేవాడు, వంచకుడు, సజ్జనులను నిందించేవాడు, శుకర (మద్యశాల వంటి వాటిని శుభ్రపరచుట)తో సమానమైన వృత్తి చేసేవాడు పుష్టుడు.*
*(11) నిగమాగమాలను అంటే వేదతంత్రాలను అధ్యయనం చేయకపోగా, వినడానికి కూడా రానివాడు హృష్టుడు*
*(12, 13) శ్రుతులు, స్మృతులు బ్రాహ్మణ్యానికి రెండు కళ్ళు. ఒకటి లేనివాడు కాణుడు, రెండూలేనివాడు అంధుడు.*
*(14) అన్నదమ్ములతో కయ్యమాడేవాడు, మాతాపితలను అప్రియవచనాలతో బాధించువాడు ఖండుడవుతాడు.*
*(15) శాస్త్రనింద జేయువాడు, చాటున కొండెములు చెప్పేవాడు, రాజ్ మాగీ, శూద్రసేవకుడు, శూద్రపత్నులతో అనాచర చేసేవాడు, శూద్రగృహంలో వండబడిన అన్నాన్ని ఒకమారు తిన్నా, శూద్రగృహంలో అయిదు రోజులు నివసించినా... వాడు చండుడనబడతాడు.*
*Continues.....*
🌹 🌹 🌹 🌹 🌹
om
ReplyDelete